Connect with us

Featured

C. Kalyan : ఆ ఒక్క సినిమా వల్ల ఏడు కోట్లు నష్టపోయాను… నందమూరి ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి తేడా అదే…: సి. కళ్యాణ్

Published

on

C. Kalyan : తెలుగు సినిమా పరిశ్రమలో నిర్మాతగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న సి కళ్యాణ్, సికే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద పలు సినిమాలను నిర్మించారు. ఫిల్మ్ ఛాంబర్ రాజకీయాల్లోను ఉండే కళ్యాణ్ పూరీ జగన్నాథ్ తో ఎక్కువగా ట్రావెల్ అయ్యారు. మెగా కుటుంబంతో సినిమా చేసిన కళ్యాణ్ ఇటు నందమూరి హీరోలతోను సినిమాలు చేసారు. పూరీ కాంబినేషన్ లో జ్యోతి లక్ష్మి సినిమా తో మొదలు పెట్టి ఆ తరువాత లోఫర్ సినిమా కూడా చేసాడు. ఇక పలు ఇంటర్వ్యూ ల్లో సినిమా ఇండస్ట్రీ గురించి కామెంట్స్ చేసే కళ్యాణ్ మెగా ఫ్యామిలీ కి నందమూరి కుటుంబానికి ఉన్న తేడా గురించి చెప్పారు.

బాలయ్య బాబు ముక్కుసూటి మనిషి….

జ్యోతి లక్ష్మి సినిమాను నిర్మించిన కళ్యాణ్ ఆ తరువాత లోఫర్ సినిమాను మెగా కాంపౌండ్ హీరో వరుణ్ తేజ్ తో తీశారు. ఆ తరువాత బాలకృష్ణ తో జై సింహ సినిమాను కే ఎస్ రవికుమార్ దర్శకత్వంలో నిర్మించారు. ఇక వినాయక్ దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా ‘ఇంటెలిజెంట్’ సినిమాను నిర్మించారు. అయితే ఈ సినిమా వల్ల నష్టపోయానంటూ కళ్యాణ్ చెప్పారు. నాగబాబు తో ఉన్న సాన్నిహిత్యం వల్ల వరుణ్ తేజ్ ను నా కొడుకు అన్నట్లు గా భావించాను. తనకు అప్పటి వరకు తీసుకున్న రెమ్యూనరేషన్ కన్నా ఎక్కువ ఇచ్చాను లోఫర్ సినిమా ప్లాప్ అయి నష్టమోచ్చిన మెగా కుటుంబం నుండి స్పందన లేదు. ఇక వినాయక్ తో ఎప్పటినుండో సినిమా తీయాలనీ అనుకున్నాను. వినాయక్ నాకు చాలా ఆప్తుడు అందుకే ఒక ప్రాజెక్ట్ అనుకున్న అప్పుడు కుదరలేదు మళ్ళీ ‘ఇంటెలిజెంట్’ సినిమాను సాయి ధరమ్ తేజ్ తో వినాయక్ కాంబినేషన్ లో తీసాము వినాయక్ మీద అభిమానం, నమ్మకం తో ఎక్కువ బడ్జెట్ పెట్టాము అయితే బాగా నష్టమొచ్చింది అప్పుడు కూడా మెగా కుటుంబం స్పందించలేదు. ఇక చిరంజీవి గారితో నాకు పెద్ద పరిచయాలు లేవు .

Advertisement

ఇక చరణ్ చాలా మంచి అబ్బాయి అంటూ చెప్పారు కళ్యాణ్. మెగా ఫ్యామిలీ తో విబేధాలు లేవు కానీ ఆ రెండు సినిమాల వల్ల కొంత దూరంగా ఉన్నాను అంటూ చెప్పారు. ఇక బాలకృష్ణ గురించి మాట్లాడుతూ బాలకృష్ణ చాలా ముక్కుసూటి మనిషి అంటూ చెప్పారు. ఏదైనా సినిమా ఇండస్ట్రీ కి సంబంధించిన విషయాలు అయన దగ్గరకు తీసుకెళ్లాడానికి చాలా మంది భయపడతారు కానీ నాకు అయన దగ్గర ఆ చనువు ఉంది వెళ్లి ఆయనతో సమస్య చెప్పగలను అలాగే ఏదైనా ఇండస్ట్రీకి సహాయం లేదా ఎవరైనా వ్యక్తులకు సహాయం చేయాలన్న అయన దగ్గరికి వెళితే స్పందిస్తారు. ఇక ఆయనకు నచ్చకపోతే ఖచ్చితంగా అప్పుడే నచ్చలేదని చెప్పేస్తారు చాలా మంచి వ్యక్తి ఆయన వద్ద కి వెళ్లాలంటే భజన చేయాల్సిన పనిలేదు అంటూ చెప్పారు.

Continue Reading
Advertisement

Featured

Niharika: యుద్ధం గెలిచిన రాముడు అయోధ్యకు వచ్చినట్టు ఉంది… బాబాయ్ పై నిహారిక కామెంట్స్!

Published

on

Niharika: నిహారిక కొణిదెల పరిచయం అవసరం లేని పేరు. ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీలో నిర్మాతగా నటిగా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు. తన భర్త నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన నిహారిక తిరిగి కెరియర్ పై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే నిర్మాతగా కూడా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇక నిహారిక నిర్మాణంలో తెరకెక్కిన కమిటీ కుర్రోళ్ళు సినిమా ఆగస్టు 9వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈమె ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆహాలో ప్రసారమవుతున్న సర్కార్ సక్సెస్ సెలబ్రేషన్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.

ఇక ఈ ప్రోమోలో భాగంగా నిహారిక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ నేను వచ్చేది ఎప్పుడు నెక్స్ట్ సీజనా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సుడిగాలి సుదీర్ రెస్పాండ్ అవుతూ మీకేంటండి మీరు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలూకా అంటూ మాట్లాడారు. అనంతరం పవన్ కళ్యాణ్ విజయం సాధించిన తర్వాత చిరంజీవి ఇంటికి వచ్చి ఆశీర్వాదం తీసుకున్న వీడియో ఎంతలా వైరల్ అయిందో మనకు తెలిసిందే .ఇక ఈ వీడియోని ప్లే చేశారు.

Advertisement

యుద్ధం గెలిచిన రాముడు…
ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది అంటూ నిహారికను ప్రశ్నించారు. ఇక నిహారిక ఈ వీడియో గురించి మాట్లాడుతూ యుద్ధం గెలిచిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకు వచ్చినప్పుడు కూడా ఇలాగే ఉండేదేమో అనిపించింది అంటూ తన బాబాయ్ విజయం గురించి నిహారిక మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Anasuya: ఇకపై రంగమ్మత్త లాంటి పాత్రలు అసలు చేయను.. గ్లామర్ పాత్రలకు సై అంటున్న అనసూయ?

Published

on

Anasuya: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు. ఈమె జబర్దస్త్ యాంకర్ గా బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ అందుకొని అనంతరం వెండి తెరపై సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా వెండితెరపై వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న అనసూయ తిరిగి బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈమె స్టార్ మా లో ప్రసారమవుతున్న కిరాక్ బాయ్స్ కిలాడి లేడీస్ అనే కార్యక్రమంలో సందడి చేస్తున్నారు. ఇలా ఒక వైపు బుల్లితెర కార్యక్రమాలు మరోవైపు వెండితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్న అనసూయ త్వరలోనే సింబా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ఈమె మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఇటీవల కాలంలో మీరు చాలా సినిమాలను రిజెక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది కారణం ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ తాను సినిమాలు రిజెక్ట్ చేస్తున్న మాట నిజమేనని తెలిపారు. నేను ఒక సినిమాలో నటించిన పాత్ర హిట్ అవడంతో తదుపరి సినిమాలలో కూడా అలాంటి పాత్రలలో నటించే అవకాశం వస్తుందని తెలిపారు.

Advertisement

రంగమ్మత్త..
ఇలా ఒక పాత్రలో నటించిన తర్వాత తిరిగి అలాంటి పాత్రలలో నటించిన ప్రేక్షకులు పెద్దగా తీసుకోలేరు ఉదాహరణకు రంగమ్మత్త పాత్ర చాలా హైలెట్ అయింది. తదుపరి అలాంటి పాత్రలు వస్తే నేను చెయ్యను నేను అన్ని చాలా డిఫరెంట్ గా ఉండేలా చేయాలని భావిస్తున్నాను. ఇక ఎక్కువగా తాను గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా అనసూయ గ్లామర్ రోల్ చేయడానికి సై అంటూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Mahesh Babu: మహేష్ రాజమౌళి సినిమా టైటిల్ లీక్… సినిమా పేరు ఏంటో తెలుసా?

Published

on

Mahesh Babu: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా జరుగబోతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన కూడా తెలియజేయబోతున్నారు.

ఇక ఈ సినిమాలో మహేష్ బాబు చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు మొదటిసారి వర్క్ షాప్ లో కూడా పాల్గొనబోతున్నారని సమాచారం.

ఇప్పటివరకు మహేష్ బాబు ఏ సినిమా కోసం ఇలా వర్క్ షాప్ లో పాల్గొనలేదు మొదటిసారి రాజమౌళి సినిమా కోసం పాల్గొనబోతున్న నేపథ్యంలో ఈయన కూడా ఈ సినిమా విషయంలో చాలా ఆతృత కనబరుస్తున్నారు. ఇకపోతే తాజాగా మహేష్ బాబు రాజమౌళి సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

గోల్డ్..
తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమాకు సంబంధించి ఓ టైటిల్ సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమా టైటిల్ కూడా అందుకు అనుగుణంగానే ఉండాలి. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం గోల్డ్ అనే టైటిల్ పెట్టబోతున్నారంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఈ సినిమా టైటిల్ గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం వైరల్ అవుతుంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!