Heroines in prostitution : సినిమా ప్రపంచంలో పైకి కనిపించేది ఒకటి లోపల జరిగేది ఒకటి. పైకి కనిపించినంత అందంగా ఏం ఉండదు గ్లామర్ దునియా. ఇక హీరోయిన్లవుదామని వచ్చిన వాళ్ళ సంగతి చెప్పక్కర్లేదు. క్యాస్టింగ్ కౌచ్ అంటూ వేధింపులు ఉంటాయి. ఎన్నో కలలతో సినిమా రంగంలో స్థిరపడాలనుకుని తప్పుడు మార్గాల్లోకి వెళ్ళిపోయి జీవితాన్ని నాశనం చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. చేతులారా అవకాశాల కోసం తప్పుడు మార్గాల్లోకి వెళ్లి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకునే వాళ్ళు ఎక్కువే.
వ్యభిచారం కేసులో దొరికి పోయిన హీరోయిన్లు…
సినిమా అవకాశాలు మెండుగా ఉండి కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుబడ్డ హీరోయిన్స్ లో యమున, భువనేశ్వరి, వినీత, శ్వేతా బసు ప్రసాద్, సుకన్య, కిన్నెర వంటి ప్రముఖ హీరోయిన్లు ఉన్నారు. యమున ఒక హోటల్ లో వ్యభిచారం చేస్తూ పోలీసులకు దొరికిందని అప్పట్లో బాగా వార్తలు వచ్చాయి, ఆ సమయంలో ఆమె సినిమాల్లో హీరోయిన్ గా బాగా బిజీగా ఉంది. ఈ వార్తల వల్ల ఆమె కెరీర్ నాశనమవ్వడమే కాక ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకుందట. ఇక భువనేశ్వరి చెన్నై దగ్గర్లో వ్యభిచారం చేస్తూ పట్టుబడింది. మలయాళం, తమిళం, తెలుగులో ఒక ఊపు ఊపిన భువనేశ్వరి ఇలా బ్రోతల్ కేసు లో ఇరుక్కుని కెరీర్ పోగొట్టుకుంది. అది కాక ఆమె రెండు సార్లు బ్రోతల్ కేసు లో దొరకడం గమనార్హం. ఇక సీనియర్ నటి కిన్నెర కూడా సినిమాల్లో మంచి అవకాశలు ఉన్న సమయంలోనే బ్రోతల్ కేసు లో దొరికింది ఈమె మీద కేసులు కూడా ఉన్నాయి. అది కాక అవకాశలు ఇప్పిస్తామని అమ్మాయిలను వ్యభిచారం లోకి దించుతోందనే అభియోగాలు కూడా ఉన్నాయి.
Advertisement
ఇక హీరోయిన్ సుకన్య కూడా వ్యభిచారం కేసులో దొరికిందనే వార్తలు వచ్చినా ఆమె వేరే హీరోయిన్ అని తను కాదని చెప్తోంది సుకన్య, ఏదేమైనా ఆమె కెరీర్ పోయింది. కానీ ఇప్పుడు మళ్ళీ బిజీ ఆర్టిస్ట్ అవుతోంది సుకన్య. ఇక ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు హీరోయిన్ వినీత కూడా వ్యభిచారం చేస్తూ చెన్నై లో పట్టుబడి ఆమెపై పోలీస్ కేసు కూడా నడిచింది. ఆ సమయంలో మతిస్థిమితంలేదని ఆధారాలు చూపించి కేసు నుండి బయటపడింది. ఇక వర్ధమాన నటి శ్వేతా బసు ప్రసాద్ కూడా బ్రోతల్ కేసు లో దొరికి కెరీర్ పోగొట్టుకుంది. కొత్త బంగారు లోకం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది శ్వేతా బసు ప్రసాద్.
RRR Movie: దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ నటించిన సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎలాంటి సంచలనాలను అందుకుందో మనకు తెలిసిందే. ఈ సినిమాకు తెలుగు చిత్ర పరిశ్రమలో మాత్రమే కాకుండా ఏకంగా ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. ఈ సినిమాకు ఎంతో ప్రతిష్టాత్మకమైన అవార్డులు రావడంతో ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో మారుమోగిపోయింది.
ఇక ఈ సినిమా విడుదలై దాదాపు మూడు సంవత్సరాలు అవుతున్న ఇంకా ఈ సినిమాకు మాత్రం అవార్డులు రావడం ఆగలేదని చెప్పాలి. తాజాగా 2023వ సంవత్సరానికి గాను ఫిలింఫేర్ సౌత్ అవార్డులను ప్రకటించారు. ఈ అవార్డులలో భాగంగా పలు తెలుగు సినిమాలకు భారీ స్థాయిలో అవార్డులు రావటం విశేషం.
ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ సినిమాకు ఏకంగా ఏడో ఫిలింఫేర్ అవార్డులు రావడం విశేషం. మరి ఫిలింఫేర్ అవార్డులలో భాగంగా ఈ ఏడు అవార్డులు ఏ ఏ విభాగానికి వచ్చాయి ఎవరు అందుకోబోతున్నారు అనే విషయానికి వస్తే.. ఉత్తమ చిత్రంగా ఆర్ఆర్ఆర్, ఉత్తమ డైరెక్టర్ గా రాజమౌళి, ఉత్తమ నటులుగా ఎన్టీఆర్, రామ్ చరణ్. ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్, గా కీరవాణి ఈ అవార్డులను అందుకోబోతున్నారు.
Advertisement
ఏడు విభాగాలలో అవార్డులు.. వీరితోపాటు ఉత్తమ కొరియోగ్రాఫర్ గా ప్రేమ్ రక్షిత్, ఉత్తమ ప్రొడక్షన్ డివైన్ విభాగంలో సాబు సిరిల్, ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ గా కొమరం భీముడు సింగర్ కాలభైరవ ఈ అవార్డును అందుకోబోతున్నారు. ఇలా ఫిలింఫేర్ అవార్డులలో ఏకంగా ఏడు విభాగాలలో ఈ అవార్డులు ఈ సినిమాకు రావడంతో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Ananth Ambani: ప్రస్తుతం దేశవ్యాప్తంగా అనంత్ అంబానీ రాధిక మర్చంట్ వివాహ వేడుకలకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. భారతదేశంలోనే అత్యంత కుబేరుడుగా సంపన్నుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ముఖేష్ అంబానీ వారసుడిగా అనంత్ అంబానీ అందరికీ పరిచయమే. అయితే తాజాగా అనంత్ అంబానీ రాధిక మర్చంట్ వివాహపు వేడుకలు కన్నుల పండుగగా జరుపుతున్నాయి.
ఇక వీరి వివాహం నేడు జరుగుతుండగా వివాహ వేడుకలు గత 15 రోజుల నుంచి అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇదివరకే వీరు జాంనగర్లో ఘనంగా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే దాదాపు వారం రోజులపాటు ఈ వేడుకలు జరిగాయి. తాజాగా జియో వరల్డ్ లో వీరి వివాహ వేడుకలు జరుగుతున్నాయి.
ఈ వివాహానికి ఎంతోమంది సినీ రాజకీయ ప్రముఖులతో పాటు వ్యాపారవేత్తలు కూడా హాజరై సందడి చేస్తున్నారు. దాదాపు 15 రోజుల నుంచి వీరి వివాహ వేడుకలు జరుగుతున్న నేపథ్యంలో ఎంతోమంది సినిమా సెలబ్రిటీలు కూడా పాల్గొని సందడి చేశారు. అయితే తాజాగా ఈయన పెళ్లి వేడుకలకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Advertisement
5000 కోట్లు.. అనంత్ అంబానీ రాధిక మర్చంట్ వివాహపు వేడుకలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ వివాహాన్ని చేయడం కోసం ఎంతవరకు ఖర్చు జరిగిందనే విషయంపై ఒక వార్త సంచలనంగా మారింది అనంత్ అంబానీ ఈ పెళ్లి వేడుకకు మాత్రమే సుమారు 5000 కోట్ల రూపాయల ఖర్చు అయిందని తెలుస్తోంది. ఒక పెళ్లి వేడుకకు 5000 కోట్లు అంటే సాధారణమైన విషయం కాదనే చెప్పాలి. అయితే ఈ ఖర్చు ముఖేష్ అంబానీ నికర ఆస్తులలో కేవలం 0.5% అని ఫోర్బ్స్ అంచనా వేసింది. ఇక మన టాలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి రామ్ చరణ్ దంపతులు మాత్రమే ఈ వివాహా వేడుకలో పాల్గొన్నారు.
Lavanya: లావణ్య ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున మీడియా వార్తలలో నిలుస్తున్నారు. సినీ నటుడు రాజ్ తరుణ్ తనని మోసం చేశారని 11 సంవత్సరాల పాటు తనతో కలిసి ఉండి ఇప్పుడు తనని వదిలించుకుంటున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఈమె నర్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడమే కాకుండా ఆయనపై ఎన్నో ఆరోపణలు చేశారు.
రాజ్ తరుణ్ నన్ను పెళ్లి చేసుకొని ఆ పెళ్లి విషయాని రహస్యంగా ఉంచారు పలుసార్లు అబార్షన్ కూడా చేయించారని ఈమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈయనకు వేరే వారితో ఎఫైర్ ఉండటంవల్లే నన్ను వదిలించుకోవాలని చూస్తున్నారా అంటూ ఎన్నో విమర్శలు చేశారు అయితే తాజాగా నాకు న్యాయం జరగాలని న్యాయం కోసం తాను పవన్ కళ్యాణ్ వద్దకే వెళ్తానని ఈమె తెలిపారు.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా మాత్రమే కాకుండా ఇతర శాఖల మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తూ ఎంతో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే తనకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టమని అందుకే తనకు న్యాయం జరగాలని తన వద్దకే వెళ్లి న్యాయం కోరుతానని తెలిపారు.
Advertisement
పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు.. ఇకపోతే పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి కూడా ఈమె సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికీ రెండు పెళ్లిళ్లు చేసుకొని ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చారు. ప్రస్తుతం మూడో వివాహం కూడా చేసుకున్నారు.అయితే ఈయన తన మాజీ ఇద్దరు భార్యలతో ఉన్నప్పుడు వారిని చాలా ప్రేమగా చూసుకున్నారు కానీ రాజ్ తరుణ్ అలా కాదని నాకు తినడానికి కూడా డబ్బులు ఇచ్చేవాడు కాదు అంటూ ఈమె ఆవేదన వ్యక్తం చేస్తూ చేసిన ఈ కామెంట్స్ సంచలనంగా మారాయి.