Connect with us

Featured

కర్ఫ్యూలో అర్ధరాత్రి చార్మినార్ వద్ద షూటింగ్ చేసిన ఈ దర్శకుడి గట్స్ కి సెల్యూట్ కొట్టాల్సిందే.!!

Published

on

గోదావరి జిల్లాలో నాటకాలు వేస్తూ చదువును పక్కన పెట్టిన తన కొడుకుని.. మన వంశంలో డిగ్రీ వరకు చదివిన వారు లేరు. కనీసం నువ్వు డిగ్రీ చదివి నీకు ఇష్టమైన రంగంలో కి వెళ్ళు అని తండ్రి చెప్పడంతో.. ఇక అప్పటి నుండి కోడి రామకృష్ణ నాటకాలు వేయడం పక్కన పెట్టారు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత దాసరి దర్శకత్వంలో ‘తాతా మనవడు’ చిత్రం విడుదల అయ్యింది. విజయవంతంగా ఆ సినిమా ప్రదర్శించబడటంతో ఎలాగైనా దాసరి నారాయణరావు దగ్గర దర్శకత్వ శాఖలో పని చేయాలని కోడిరామకృష్ణ నిర్ణయించుకున్నారు.

Advertisement

ఆ సినిమా అర్ద శతదినోత్సవ వేడుక పాలకొల్లు లోని ఒక థియేటర్ లో జరుగుతుండగా కోడి రామకృష్ణ వెళ్లి దాసరి గారిని.. మీ దగ్గర నేను దర్శకత్వ శాఖలో పని చేస్తానని చెప్పారు. అలా దాసరి మద్రాస్ వెళ్లి కబురు చేయడంతో కోడి రామకృష్ణ మద్రాస్ వెళ్లడం జరిగింది. దాసరిని దర్శకుడిగా పరిచయం చేసిన రాఘవతో పరిచయం పెంచుకోవడంతో.. ఆయన నిర్మిస్తున్న ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశాన్ని కోడి రామకృష్ణకు ఇవ్వడం జరిగింది. అలా ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాతో ప్రారంభమైన ఆయన సినీ జీవితం.. తరంగిణి, ఆలయ శిఖరం, ముక్కుపుడక, మంగమ్మగారి మనవడు, గూడచారి నెంబర్ వన్, ముద్దులమామయ్య, 20వ శతాబ్దం, అంకుశం, అమ్మోరు, అరుంధతి లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు.

కోడి రామకృష్ణ.. బాలకృష్ణ, చిరంజీవిలతో ఎక్కువ సినిమాలు రూపొందించారు. ఈయన కుటుంబపరమైన కథలతో కూడిన సినిమాలను ఎక్కువగా రూపొందించారు. 1989లో రాజశేఖర్ జీవిత హీరోహీరోయిన్లుగా రాజకీయ నేపథ్యం గల కథతో అంకుశం చిత్రాన్ని రూపొందించారు. ఇది యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ ఇమేజ్ కి ఎంతగానో దోహదపడింది. ఆ తర్వాత మరో రాజకీయ నేపథ్యంలో కథతో ఓ సినిమా రూపొందించాలనుకున్నారు. కోడి రామకృష్ణ తాను ఎంచుకున్న పొలిటికల్ స్టోరీ.. చిత్రరూపం దాల్చడానికి కొన్ని అవాంతరాలు ఉంటాయని ఆ క్రమంలో నిర్మాతకు తనకు అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉన్నందున ఆ‌ ఉద్దేశంతో.. ఆయనే సొంతంగా భారత్ బంద్ చిత్రాన్ని నిర్మించాలనుకున్నారు.

ఆ క్రమంలో వినోద్ కుమార్, రెహమాన్, అర్చన హీరోహీరోయిన్లుగా.. కాస్ట్యూమ్స్ కృష్ణ విలన్ గా ‘భారత్ బంద్’ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం.. అవుట్ డోర్ లో జరిగింది. పబ్లిక్ ప్లేస్ లో షూటింగ్ జరపడం అంటే ప్రభుత్వ అనుమతులు ఇతరాత్ర ఉంటాయి. ఈ సినిమాలోని ఓ సీన్ డిమాండ్ చేయడంతో.. కర్ఫ్యూలో అర్ధరాత్రి చార్మినార్ వద్ద షూటింగ్ చేశారు. ఇలా పబ్లిక్ స్థలాల్లో ప్రభుత్వ అనుమతులు తీసుకుంటూ మిగతా సినిమా సన్నివేశాలను దర్శకుడు కోడి రామకృష్ణ చిత్రీకరించారు. నిజంగా కోడి రామకృష్ణ గట్స్ కి సెల్యూట్ కొట్టాలిసిందే.. 1991లో విడుదలైన ఈ చిత్రం ఘన విజయాన్ని సాధించింది.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Star Heroin: స్టార్ హీరోతో ప్రేమ,పెళ్లి విడాకులు..12 మందితో ఎఫైర్ పెట్టుకున్న హీరోయిన్… ఎవరంటే?

Published

on

Star Heroin: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో సీనియర్ నటి మనీషా కొయిరాల ఒకరు. ఈమె సౌత్ లో కంటే నార్త్ లోనే ఎక్కువ సినిమాలలో నటించి ఒకానొక సమయంలో బాలీవుడ్ చిత్ర పరిశ్రమను ఓ ఊపు ఊపారు. ఇక ఈమె స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలో తన వ్యక్తిగత విషయాలలో కూడా వార్తలలో నిలిచారు.

Advertisement

ఈమె ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూనే మరోవైపు పలువురు హీరోలతో ఎఫైర్ పెట్టుకుంది అంటూ వార్తలు వచ్చాయి. ఒక స్టార్ హీరోతో పీకల్లోతు ప్రేమలో పడినప్పటికీ ఆయనని పెళ్లి చేసుకోలేదు. ఇక ఈమె సామ్రాట్ దహాల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పటికీ రెండేళ్లకే తనతో విడాకులు తీసుకొని విడిపోయి పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు.

ఇలా డిప్రెషన్ లోకి వెళ్లిన మనీషా కోయిరాల మందుకు అలవాటు పడ్డారు.పెళ్లికి ముందే మనీషా కోయిరాలా ఏకంగా 12 మందితో డేటింగ్ చేసిందట. ఆమె డేటింగ్ చేసినవాళ్ల లిస్ట్ లో నటులు, వ్యాపారవేత్తలు,అంబాసిడర్ కూడా ఉన్నారు. వివేక్ ముశ్రన్‌, నానా పటేకర్‌, DJ హుస్సేన్‌, లండన్‌కు చెందిన నైజీరియన్ వ్యాపారవేత్త సెసిల్ ఆంథోనీ, ఆర్యన్ వైద్‌ వంటి ప్రముఖులతో ఈమె డేటింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది.

12 మందితో డేటింగ్..
ఇలా తరచూ డేటింగ్ ల ద్వారా కూడా ఈమె వార్తల్లో నిలిచారు. ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో బిజీగా గడిపారు. పలువురు దర్శక నిర్మాతలు సైతం ఈమె డేట్స్ కోసం ఎంతగానో ఎదురు చూసేవారు. ఇలా సినిమా ఇండస్ట్రీని ఓ ఊపిన ఈమె మధ్యలో ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్ లతో బిజీగా గడుపుతున్నారు.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: విష్ణు ప్రియకు షాక్ ఇచ్చిన నిఖిల్… కన్నీళ్లు పెట్టుకున్న నిఖిల్.. అసలు ఆట ఆరంభం!

Published

on

Bigg Boss 8: తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమం ప్రారంభం అయ్యి 5 రోజులు పూర్తయింది. ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయింది అయితే హౌస్ లో ఉన్నటువంటి 14 మంది కంటెస్టెంట్లను బిగ్ బాస్ మూడు గ్రూపులుగా విడదీశారు. అయితే ఈ గ్రూపులోకి ఎవరెవరు సభ్యులను తీసుకోవాలనేది చీఫ్ ఎన్నుకోవాల్సి ఉంటుంది.

Advertisement

ఈ క్రమంలోనే కంటెస్టెంట్ విష్ణు ప్రియ కచ్చితంగా తనని నిఖిల్ తన గ్రూపులోకి తీసుకుంటారని ఆమె భావించింది. కానీ నిఖిల్ మాత్రం ఆమెకు షాక్ ఇచ్చారు. దీంతో విష్ణు ప్రియను నైనిక తన టీమ్ లోకి తీసుకున్నారు. అయితే ఈ విషయం గురించి నిఖిల్ విష్ణుప్రియ మధ్య పెద్ద ఎత్తున చర్చ జరిగింది. వీరిద్దరికి ముందే మంచి పరిచయమున్న నేపథ్యంలో తప్పకుండా నిఖిల్ తన టీమ్ లోకి తీసుకుంటారని విష్ణు ప్రియ భావించింది కానీ అది జరగలేదు.

ఇలా ఇద్దరి మధ్య ఉన్న పరిచయం కారణంగా విష్ణు ప్రియ సరదాగా నిఖిల్ ను ఓ ఆట ఆడుకుంది. దీంతో నిఖిల్ ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలా ఇప్పటివరకు ఎంతో సరదాగా గడిపిన కంటెస్టెంట్లను మూడు గ్రూపులుగా విడదీయడంతో అసలైన ఆట మొదలైంది.

టాస్కులపై ఫోకస్..
కంటెస్టెంట్లను టీమ్స్ గా విడదీసి బిగ్ బాస్ టాస్కులను ఇవ్వడం మొదలుపెట్టారు. ఇలా ఇచ్చిన మొదటి టాస్కోలో భాగంగా ఇప్పటివరకు హౌస్ లో సైలెంట్ గా కూర్చున్న పృథ్విరాజ్ తన ఆట తీరును కనబరుస్తూ యష్మీ టీమ్ ను గెలిపించారు. దీంతో ముందు ముందు ఏ ఏ కంటెస్టెంట్ ఎలా తన ఆట తీరుతో ప్రేక్షకులను మెప్పిస్తారో తెలియాల్సి ఉంది.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు వచ్చారు బ్రో…. ఆ కంటెస్టెంట్లను ఆడేసుకుంటున్న ట్రోలర్స్!

Published

on

Bigg Boss 8: బిగ్ బాస్ కార్యక్రమానికి తెలుగులో కూడా ఎంతో మంచి ఆదరణ ఉంది. ఈ కార్యక్రమం తెలుగులో ఇప్పటికి ఏడు సీజన్లను పూర్తి చేసుకుని ఎనిమిదవ సీజన్ కూడా గత ఆదివారం ఎంతో ఘనంగా ప్రారంభమైంది. మొదట 14 మంది కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపించారు. మిగిలిన వారిని ఐదవ వారం వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి పంపించబోతున్నారని సమాచారం.

Advertisement

ఇక హౌస్ లోకి వెళ్లిన తర్వాత మొదటి రోజు నుంచే కంటెస్టెంట్లు పెద్ద ఎత్తున గొడవలు పడుతూ పోట్లాడుతూ ప్రేక్షకులకు కావాల్సినంత కంటెంట్ ఇస్తున్నారు. అయితే కొంతమంది మాత్రమే బాగా ఎక్స్పోజ్ అవుతున్నారు. మిగిలిన వారు మాత్రం అసలు హౌస్ లో ఉన్నారా లేదా అన్నా సందేహాలు వస్తున్నాయి. హౌస్ లోకి వెళ్ళేటప్పుడు ఎంతో యాక్టివ్ గా వెళ్లిన కంటెస్టెంట్లు లోపల మాత్రం అనుకున్న స్థాయిలో కంటెంట్ ఇవ్వలేకపోతున్నారనే చెప్పాలి.

ముఖ్యంగా హీరో ఆదిత్య ఓం అయితే హౌస్ లో ఉన్నాడా లేదా అన్న సందేహం మాత్రం అందరికీ కలుగుతుంది. ఈయన ఉంటే ఒంటరిగా ఉంటారు లేకపోతే నిద్రపోతూ ఉంటారు. పెద్దగా ఫేమస్ అయిన కంటెంట్ మాత్రం ఈయన ఇవ్వలేకపోతున్నారు. దీంతో పలువురు ట్రోలర్స్ బ్రో అసలు ఎందుకొచ్చావు బ్రో బిగ్ బాస్ హౌస్ కి అంటూ భారీగా విమర్శలు చేస్తున్నారు.

ఈయనతో పాటు బెజవాడ బేబక్క కూడా విమర్శలను ఎదుర్కొంటుంది. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా కనిపించే ఈమె హౌస్ లో మాత్రం ఎక్కువగా కిచెన్ లోనే ఉంటుంది. కానీ సరైన కంటెంట్ మాత్రం ఇవ్వలేకపోతున్నారు.అఫ్రిదీ కూడా డల్‌గానే ఉన్నాడనే టాక్‌ వస్తుంది. పృధ్విరాజ్, అభయ్ నవీన్ వంటి వారందరూ కూడా హౌస్ లో డల్ గా కనిపిస్తున్న తరుణంలో పలువురు మీరంతా హౌస్ లోకి ఎందుకు వచ్చారో ఏమో అంటూ వీరిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు అలాగే మరి కొంతమందిని బాగా హైలైట్ చేస్తూ కూడా కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

ఎలిమినేషన్ ఉంటుందా…
ఇక ఈ వారం నామినేషన్స్ లో భాగంగా బెజవాడ బేబక్క, విష్ణు ప్రియ, శేఖర్ భాష, నాగ మణికంఠ సోనియా ఆకుల ప్రేరణ వంటి వారు నామినేషన్ లో ఉన్నారు. అయితే గత సీజన్లో మాదిరిగా ఈ సీజన్లో కూడా మొదటి వారం ఎలిమినేషన్ ఉండకపోవచ్చని తెలుస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!