Connect with us

Featured

గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్న ఆహుతి ప్రసాద్ కోట్లు ఎలా పోగొట్టున్నాడో తెలుసా..?

Published

on

గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్న ఆహుతి ప్రసాద్ కోట్లు ఎలా పోగొట్టున్నాడో తెలిస్తే షాకవుతారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, మంచి కమెడియన్‌గా పాపులారిటీని సంపాదించుకొని 300 పైగా సూపర్ హిట్ సినిమాల్లో నటించారు ఆహుతి ప్రసాద్. సినిమా ఇండస్ట్రీ మీద ఆసక్తితో మధు ఫిల్మ్ ఇన్సిట్యూట్‌లో యాక్టింగ్ కోర్స్ నేర్చుకున్న ఆయన విక్రమ్ సినిమాతో నటుడిగా ఇండస్ట్రీకి   పరిచయమయ్యాడు. ఆ తర్వాత కొన్ని సినిమాలు సీరియల్స్‌లో నటించాడు. వీటితో రాని గుర్తింపు రాజశేఖర్ హీరోగా నటించిన ఆహుతి సినిమాతో వచ్చింది.

Advertisement

దాంతో అప్పటి నుంచి ఆహుతి ప్రసాద్‌గా సినిమా ఇండస్ట్రీలో పాపులర్ అయ్యాడు. ఆయనకు కెరీర్ ప్రారంభంలో ఎక్కువగా వచ్చింది పోలీస్, రాజకీయ నాయకుడి పాత్రలే. ఆ పాత్రలోనూ ఎక్కువగా నెగిటివ్ రోల్స్ చేసే అవకాశాలు దక్కాయి. వచ్చిన ప్రతీ పాత్రలో మంచి విలనిజాన్ని ప్రదర్శించి క్రేజ్ పెంచుకుంటూ వచ్చారు. నటుడిగా అవకాశాలు రాకముందు కొన్నాళ్ళు ఆయన యాక్టింగ్ నేర్చుకున్న మధు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ నిర్వాహ బాధ్యతలు నిర్వహించారు. అంతేకాదు ప్రముఖ నిర్మాణ సంస్థ ఉషా కిరణ్ మూవీస్ నిర్మించిన మల్లె మొగ్గలు సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు.

ఇలా సినిమా ఇండస్ట్రీలో ఉంటూ అందివచ్చిన అవకాశాన్ని చేసుకుంటూ సినిమాలో నటుడిగా అవకాశం అందుకున్నారు. నటన పరంగా చేసిన పాత్రతో మెప్పిస్తూ దర్శక నిర్మాతల దృష్ఠిని బాగా ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో ఏమాత్రం ఖాళీ లేకుండా సినిమాలు చేసే అవకాశాలు దక్కించుకున్నారు. అలా వచ్చిన అవకాశాలతోనే మంచి రెమ్యునరేషన్ అందుకున్నారు. ఇలా వచ్చిన అవకాశం పోలీస్ భార్య సినిమా. ఈ సినిమాలో ఆహుతి ప్రసాద్ నటనకు మంచి పేరొచ్చింది. అంతేకాదు ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో నిర్మాతగా మారాలని నిర్ణయించుకున్నారు.

అలా తెలుగులో సూపర్ హిట్ అయిన పోలీస్ భార్య సినిమా రైట్స్ కొని కన్నడలో నిర్మించారు. కన్నడలో కూడా పోలీస్ భార్య సినిమా సూపర్ హిట్ అయింది. దాంతో ఇదే క్రమంలో మరో రెండు సినిమాలను రైట్స్ కొని నిర్మించారు. కానీ ఆ సినిమాలు అట్టర్ ఫ్లాపవడంతో నిర్మాతగా తీవ్ర నష్టాలను చూశారు. ఆ సమయంలో ఆయనకు కొట్లలో నష్టం వాటిల్లింది. అప్పటి నుంచి నిర్మాణ రంగానికి దూరంగా ఉంటూ కేవలం నటన మీదే దృష్టిపెట్టారు. అలా ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించిన ఆహుతి ప్రసాద్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వం వహించిన చందమామ సినిమాతో కమెడియన్‌గా మారాడు.

ఇది నిజంగా ఆహుతి ప్రసాద్‌కు అద్భుతమైన అవకాశం. కృష్ణవంశీ ఇలాంటి పాత్రను ఆహుతి ప్రసాద్‌తో చేయించాలనుకోవడం కూడా పెద్ద సాహసం. కృష్ణవంశీ డిజైన్ చేసుకున్న క్యారెక్టర్‌ను పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టారు ఆహుతి ప్రసాద్. ఇందులో ఆయన భాష – డైలాగ్స్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. ఈ సినిమా నుంచి విలన్ రోల్స్ పక్కన పెట్టి పూర్తి స్థాయి కమెడియన్ రోల్స్ చేసేందుకు ఆసక్తి చూపించి ఆ పాత్రల్లోనూ సక్సెస్ అయ్యారు. మాడ్యులేషన్ ఏదైనా తన బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా పర్ఫార్మ్ చేసి మంచి సక్సెస్, పేరు తెచ్చుకున్నారు ఆహుతి ప్రసాద్. నిర్మాతగా గనక సినిమాలు చేయకపోయి ఉంటే మరిన్ని మంచి సినిమాలతో సక్సెస్ చూసేవారు. ఒకదశలో ఆయనను కుదిపేసింది సినిమా నిర్మాణమే. కానీ, త్వరగా అందులో నుంచి బయటడం మనోవేదనకు గురి కాకుండా నటన మీద ఆసక్తి పెట్టడం గొప్ప విషయం.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Star Heroin: స్టార్ హీరోతో ప్రేమ,పెళ్లి విడాకులు..12 మందితో ఎఫైర్ పెట్టుకున్న హీరోయిన్… ఎవరంటే?

Published

on

Star Heroin: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో సీనియర్ నటి మనీషా కొయిరాల ఒకరు. ఈమె సౌత్ లో కంటే నార్త్ లోనే ఎక్కువ సినిమాలలో నటించి ఒకానొక సమయంలో బాలీవుడ్ చిత్ర పరిశ్రమను ఓ ఊపు ఊపారు. ఇక ఈమె స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలో తన వ్యక్తిగత విషయాలలో కూడా వార్తలలో నిలిచారు.

Advertisement

ఈమె ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూనే మరోవైపు పలువురు హీరోలతో ఎఫైర్ పెట్టుకుంది అంటూ వార్తలు వచ్చాయి. ఒక స్టార్ హీరోతో పీకల్లోతు ప్రేమలో పడినప్పటికీ ఆయనని పెళ్లి చేసుకోలేదు. ఇక ఈమె సామ్రాట్ దహాల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పటికీ రెండేళ్లకే తనతో విడాకులు తీసుకొని విడిపోయి పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు.

ఇలా డిప్రెషన్ లోకి వెళ్లిన మనీషా కోయిరాల మందుకు అలవాటు పడ్డారు.పెళ్లికి ముందే మనీషా కోయిరాలా ఏకంగా 12 మందితో డేటింగ్ చేసిందట. ఆమె డేటింగ్ చేసినవాళ్ల లిస్ట్ లో నటులు, వ్యాపారవేత్తలు,అంబాసిడర్ కూడా ఉన్నారు. వివేక్ ముశ్రన్‌, నానా పటేకర్‌, DJ హుస్సేన్‌, లండన్‌కు చెందిన నైజీరియన్ వ్యాపారవేత్త సెసిల్ ఆంథోనీ, ఆర్యన్ వైద్‌ వంటి ప్రముఖులతో ఈమె డేటింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది.

12 మందితో డేటింగ్..
ఇలా తరచూ డేటింగ్ ల ద్వారా కూడా ఈమె వార్తల్లో నిలిచారు. ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో బిజీగా గడిపారు. పలువురు దర్శక నిర్మాతలు సైతం ఈమె డేట్స్ కోసం ఎంతగానో ఎదురు చూసేవారు. ఇలా సినిమా ఇండస్ట్రీని ఓ ఊపిన ఈమె మధ్యలో ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్ లతో బిజీగా గడుపుతున్నారు.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: విష్ణు ప్రియకు షాక్ ఇచ్చిన నిఖిల్… కన్నీళ్లు పెట్టుకున్న నిఖిల్.. అసలు ఆట ఆరంభం!

Published

on

Bigg Boss 8: తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమం ప్రారంభం అయ్యి 5 రోజులు పూర్తయింది. ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయింది అయితే హౌస్ లో ఉన్నటువంటి 14 మంది కంటెస్టెంట్లను బిగ్ బాస్ మూడు గ్రూపులుగా విడదీశారు. అయితే ఈ గ్రూపులోకి ఎవరెవరు సభ్యులను తీసుకోవాలనేది చీఫ్ ఎన్నుకోవాల్సి ఉంటుంది.

Advertisement

ఈ క్రమంలోనే కంటెస్టెంట్ విష్ణు ప్రియ కచ్చితంగా తనని నిఖిల్ తన గ్రూపులోకి తీసుకుంటారని ఆమె భావించింది. కానీ నిఖిల్ మాత్రం ఆమెకు షాక్ ఇచ్చారు. దీంతో విష్ణు ప్రియను నైనిక తన టీమ్ లోకి తీసుకున్నారు. అయితే ఈ విషయం గురించి నిఖిల్ విష్ణుప్రియ మధ్య పెద్ద ఎత్తున చర్చ జరిగింది. వీరిద్దరికి ముందే మంచి పరిచయమున్న నేపథ్యంలో తప్పకుండా నిఖిల్ తన టీమ్ లోకి తీసుకుంటారని విష్ణు ప్రియ భావించింది కానీ అది జరగలేదు.

ఇలా ఇద్దరి మధ్య ఉన్న పరిచయం కారణంగా విష్ణు ప్రియ సరదాగా నిఖిల్ ను ఓ ఆట ఆడుకుంది. దీంతో నిఖిల్ ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలా ఇప్పటివరకు ఎంతో సరదాగా గడిపిన కంటెస్టెంట్లను మూడు గ్రూపులుగా విడదీయడంతో అసలైన ఆట మొదలైంది.

టాస్కులపై ఫోకస్..
కంటెస్టెంట్లను టీమ్స్ గా విడదీసి బిగ్ బాస్ టాస్కులను ఇవ్వడం మొదలుపెట్టారు. ఇలా ఇచ్చిన మొదటి టాస్కోలో భాగంగా ఇప్పటివరకు హౌస్ లో సైలెంట్ గా కూర్చున్న పృథ్విరాజ్ తన ఆట తీరును కనబరుస్తూ యష్మీ టీమ్ ను గెలిపించారు. దీంతో ముందు ముందు ఏ ఏ కంటెస్టెంట్ ఎలా తన ఆట తీరుతో ప్రేక్షకులను మెప్పిస్తారో తెలియాల్సి ఉంది.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు వచ్చారు బ్రో…. ఆ కంటెస్టెంట్లను ఆడేసుకుంటున్న ట్రోలర్స్!

Published

on

Bigg Boss 8: బిగ్ బాస్ కార్యక్రమానికి తెలుగులో కూడా ఎంతో మంచి ఆదరణ ఉంది. ఈ కార్యక్రమం తెలుగులో ఇప్పటికి ఏడు సీజన్లను పూర్తి చేసుకుని ఎనిమిదవ సీజన్ కూడా గత ఆదివారం ఎంతో ఘనంగా ప్రారంభమైంది. మొదట 14 మంది కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపించారు. మిగిలిన వారిని ఐదవ వారం వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి పంపించబోతున్నారని సమాచారం.

Advertisement

ఇక హౌస్ లోకి వెళ్లిన తర్వాత మొదటి రోజు నుంచే కంటెస్టెంట్లు పెద్ద ఎత్తున గొడవలు పడుతూ పోట్లాడుతూ ప్రేక్షకులకు కావాల్సినంత కంటెంట్ ఇస్తున్నారు. అయితే కొంతమంది మాత్రమే బాగా ఎక్స్పోజ్ అవుతున్నారు. మిగిలిన వారు మాత్రం అసలు హౌస్ లో ఉన్నారా లేదా అన్నా సందేహాలు వస్తున్నాయి. హౌస్ లోకి వెళ్ళేటప్పుడు ఎంతో యాక్టివ్ గా వెళ్లిన కంటెస్టెంట్లు లోపల మాత్రం అనుకున్న స్థాయిలో కంటెంట్ ఇవ్వలేకపోతున్నారనే చెప్పాలి.

ముఖ్యంగా హీరో ఆదిత్య ఓం అయితే హౌస్ లో ఉన్నాడా లేదా అన్న సందేహం మాత్రం అందరికీ కలుగుతుంది. ఈయన ఉంటే ఒంటరిగా ఉంటారు లేకపోతే నిద్రపోతూ ఉంటారు. పెద్దగా ఫేమస్ అయిన కంటెంట్ మాత్రం ఈయన ఇవ్వలేకపోతున్నారు. దీంతో పలువురు ట్రోలర్స్ బ్రో అసలు ఎందుకొచ్చావు బ్రో బిగ్ బాస్ హౌస్ కి అంటూ భారీగా విమర్శలు చేస్తున్నారు.

ఈయనతో పాటు బెజవాడ బేబక్క కూడా విమర్శలను ఎదుర్కొంటుంది. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా కనిపించే ఈమె హౌస్ లో మాత్రం ఎక్కువగా కిచెన్ లోనే ఉంటుంది. కానీ సరైన కంటెంట్ మాత్రం ఇవ్వలేకపోతున్నారు.అఫ్రిదీ కూడా డల్‌గానే ఉన్నాడనే టాక్‌ వస్తుంది. పృధ్విరాజ్, అభయ్ నవీన్ వంటి వారందరూ కూడా హౌస్ లో డల్ గా కనిపిస్తున్న తరుణంలో పలువురు మీరంతా హౌస్ లోకి ఎందుకు వచ్చారో ఏమో అంటూ వీరిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు అలాగే మరి కొంతమందిని బాగా హైలైట్ చేస్తూ కూడా కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

ఎలిమినేషన్ ఉంటుందా…
ఇక ఈ వారం నామినేషన్స్ లో భాగంగా బెజవాడ బేబక్క, విష్ణు ప్రియ, శేఖర్ భాష, నాగ మణికంఠ సోనియా ఆకుల ప్రేరణ వంటి వారు నామినేషన్ లో ఉన్నారు. అయితే గత సీజన్లో మాదిరిగా ఈ సీజన్లో కూడా మొదటి వారం ఎలిమినేషన్ ఉండకపోవచ్చని తెలుస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!