Connect with us

Featured

31 ఏళ్ల ‘కర్తవ్యం’ ఎన్ని రికార్డులు సాధించిందో తెలుసా?

Published

on

పరుచూరి బ్రదర్స్ రాసిన కథతో వచ్చిన ప్రతిధ్వని బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. ఊర్వశి శారద ప్రధాన పాత్రలో, యాక్షన్ కింగ్ అర్జున్ సపోర్టింగ్ రోల్ లో ప్రతిధ్వని సినిమాను ప్రేక్షకులు ఆదరించడంతో.. అప్పటికే సూర్య మూవీస్ అధినేత ఎ.ఏం.రత్నం విజయశాంతికి పర్సనల్ మేకప్ మేన్ గా పనిచేస్తుండేవాడు. ఆ క్రమంలో పరుచూరి బ్రదర్స్ కనబడినప్పుడు మా మేడం విజయశాంతి కూడా అలాంటి లేడీ ఓరియెంటెడ్ పాత్రతో కూడిన ఒక భిన్నమైన కథని రాయవలసిందిగా ఆయన కోరడం జరిగింది. అలా నాలుగు సంవత్సరాల తర్వాత పరుచూరి బ్రదర్స్ ను ఏ.ఎమ్.రత్నం మరొకసారి కలిసినప్పుడు మా మేడం కథ ఏమైందని అడగగా సరే ఒక కథ రాస్తామని ఎ.ఎం రత్నంతో చెప్పడం జరిగింది.

Advertisement

అప్పుడు ఎ.ఏం రత్నం తన స్నేహితుడైన మోహన్ గాంధీ కి విషయం చెప్పగా ఆయన పరుచూరి బ్రదర్స్ రాసిన కథతో సినిమా తీస్తానని చెప్పడం జరిగింది. సినీ ప్రముఖులు శ్రేయోభిలాషులు లేడి ఓరియెంటెడ్ కథతో సినిమా తీస్తే ఆడుతుందా అని సందేహించారు. అయినా కూడా ఎ.ఎం రత్నం ఎవరి మాటలు లెక్కచేయకుండా విజయశాంతి మీద ఉన్న నమ్మకంతో పరుచూరి బ్రదర్స్ రాసిన కథను ఆమెకు వినిపించారు. మరి కొంతమంది సినీ ప్రముఖులు కథ బాగుంది విజయ శాంతి కాకుండా ఒక స్టార్ హీరోని పెట్టుకొని కర్తవ్యం సినిమా తీయమని సలహా ఇచ్చారు. అయినా ఏ.ఎం రత్నం పట్టు వదలని విక్రమార్కుడిలా విజయశాంతిని ప్రధాన పాత్రలో పెట్టి సినిమా తీయడానికి ముందుకు వచ్చారు. అలా1989 చివరి మాసంలో మద్రాసులో ముహూర్తపు షాట్ ను తీశారు. దీనికి అప్పటి ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ క్లాప్ కొట్టారు.

అలా దర్శకుడు మోహన్ గాంధీ దాదాపు యాభై రెండు రోజుల్లో సినిమాను పూర్తి చేయడం జరిగింది. కర్తవ్యం సినిమా లో విజయశాంతితో పాటు ఒక సపోర్టింగ్ రోల్ లో ఒక హీరో ని పెట్టాలనుకున్నారు. కానీ ఇప్పుడున్న హీరోల్లో సపోర్టింగ్ రోల్ అంటే ఎవరు ముందుకు రాలేదు. ఆ క్రమంలో కొన్ని చిత్రాల్లో హీరోగా చేస్తున్న వినోద్ కుమార్ కర్తవ్యం సినిమాలో సపోర్టింగ్ రోల్ చేయడానికి ఒప్పుకోవడం జరిగింది. అయితే కర్తవ్యం విడుదలయ్యే సమయానికి మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి హీరోహీరోయిన్లుగా వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా విడుదలై 50 రోజులు పూర్తి చేసుకుంది. ఆ క్రమంలో కర్తవ్యం సినిమాను కొనడానికి బయ్యర్లు అంతగా ఆసక్తి చూపలేదు.

అలా మెల్లిగా కథ బాగుండడంతో ప్రేక్షకులతో సినిమా థియేటర్లు నిండిపోయాయి. విజయశాంతి రెమ్యూనరేషన్ కాకుండా దాదాపు 50 లక్షలతో కర్తవ్యం సినిమా పూర్తి చేశారు. ఆ తర్వాత సినిమాకి మూడు కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. కర్తవ్యం సినిమా 100 రోజుల ఫంక్షన్ ని మద్రాసులోని విజయ మహల్ లో నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఐపీఎస్ ఆఫీసర్ కిరణ్ బేడీ,బాలక్రిష్ణ లాంటి వారు హాజరయ్యారు. చిరంజీవితో గ్యాంగ్ లీడర్ లోని “భద్రాచలం కొండ సీతమ్మ వారి అండ.. అనే పాట షూటింగ్ జరుగుతున్నప్పుడు.. కర్తవ్యం సినిమాలో విజయశాంతి ఉత్తమ నటనకు జాతీయ అవార్డు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ సినిమా తర్వాత విజయశాంతికి ఇండియన్ లేడీ సూపర్ స్టార్, లేడీ అమితాబ్ అనే బిరుదులు రావడం జరిగింది. ఈ సినిమా చూసిన ఆడవాళ్ళు ఎంతోమంది పోలీస్ ఆఫీసర్లు కావాలని నిర్ణయించుకున్నారు. మరో విశేషం ఏమిటంటే.. ‘కర్తవ్యం’ సినిమా వచ్చినిన్నటికి 31 ఏళ్ళు పూర్తయింది. 1990 వ సంవత్సరం జూన్ 29న ‘కర్తవ్యం’ విడుదలైంది.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Star Heroin: స్టార్ హీరోతో ప్రేమ,పెళ్లి విడాకులు..12 మందితో ఎఫైర్ పెట్టుకున్న హీరోయిన్… ఎవరంటే?

Published

on

Star Heroin: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో సీనియర్ నటి మనీషా కొయిరాల ఒకరు. ఈమె సౌత్ లో కంటే నార్త్ లోనే ఎక్కువ సినిమాలలో నటించి ఒకానొక సమయంలో బాలీవుడ్ చిత్ర పరిశ్రమను ఓ ఊపు ఊపారు. ఇక ఈమె స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలో తన వ్యక్తిగత విషయాలలో కూడా వార్తలలో నిలిచారు.

Advertisement

ఈమె ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూనే మరోవైపు పలువురు హీరోలతో ఎఫైర్ పెట్టుకుంది అంటూ వార్తలు వచ్చాయి. ఒక స్టార్ హీరోతో పీకల్లోతు ప్రేమలో పడినప్పటికీ ఆయనని పెళ్లి చేసుకోలేదు. ఇక ఈమె సామ్రాట్ దహాల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పటికీ రెండేళ్లకే తనతో విడాకులు తీసుకొని విడిపోయి పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు.

ఇలా డిప్రెషన్ లోకి వెళ్లిన మనీషా కోయిరాల మందుకు అలవాటు పడ్డారు.పెళ్లికి ముందే మనీషా కోయిరాలా ఏకంగా 12 మందితో డేటింగ్ చేసిందట. ఆమె డేటింగ్ చేసినవాళ్ల లిస్ట్ లో నటులు, వ్యాపారవేత్తలు,అంబాసిడర్ కూడా ఉన్నారు. వివేక్ ముశ్రన్‌, నానా పటేకర్‌, DJ హుస్సేన్‌, లండన్‌కు చెందిన నైజీరియన్ వ్యాపారవేత్త సెసిల్ ఆంథోనీ, ఆర్యన్ వైద్‌ వంటి ప్రముఖులతో ఈమె డేటింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది.

12 మందితో డేటింగ్..
ఇలా తరచూ డేటింగ్ ల ద్వారా కూడా ఈమె వార్తల్లో నిలిచారు. ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో బిజీగా గడిపారు. పలువురు దర్శక నిర్మాతలు సైతం ఈమె డేట్స్ కోసం ఎంతగానో ఎదురు చూసేవారు. ఇలా సినిమా ఇండస్ట్రీని ఓ ఊపిన ఈమె మధ్యలో ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్ లతో బిజీగా గడుపుతున్నారు.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: విష్ణు ప్రియకు షాక్ ఇచ్చిన నిఖిల్… కన్నీళ్లు పెట్టుకున్న నిఖిల్.. అసలు ఆట ఆరంభం!

Published

on

Bigg Boss 8: తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమం ప్రారంభం అయ్యి 5 రోజులు పూర్తయింది. ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయింది అయితే హౌస్ లో ఉన్నటువంటి 14 మంది కంటెస్టెంట్లను బిగ్ బాస్ మూడు గ్రూపులుగా విడదీశారు. అయితే ఈ గ్రూపులోకి ఎవరెవరు సభ్యులను తీసుకోవాలనేది చీఫ్ ఎన్నుకోవాల్సి ఉంటుంది.

Advertisement

ఈ క్రమంలోనే కంటెస్టెంట్ విష్ణు ప్రియ కచ్చితంగా తనని నిఖిల్ తన గ్రూపులోకి తీసుకుంటారని ఆమె భావించింది. కానీ నిఖిల్ మాత్రం ఆమెకు షాక్ ఇచ్చారు. దీంతో విష్ణు ప్రియను నైనిక తన టీమ్ లోకి తీసుకున్నారు. అయితే ఈ విషయం గురించి నిఖిల్ విష్ణుప్రియ మధ్య పెద్ద ఎత్తున చర్చ జరిగింది. వీరిద్దరికి ముందే మంచి పరిచయమున్న నేపథ్యంలో తప్పకుండా నిఖిల్ తన టీమ్ లోకి తీసుకుంటారని విష్ణు ప్రియ భావించింది కానీ అది జరగలేదు.

ఇలా ఇద్దరి మధ్య ఉన్న పరిచయం కారణంగా విష్ణు ప్రియ సరదాగా నిఖిల్ ను ఓ ఆట ఆడుకుంది. దీంతో నిఖిల్ ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలా ఇప్పటివరకు ఎంతో సరదాగా గడిపిన కంటెస్టెంట్లను మూడు గ్రూపులుగా విడదీయడంతో అసలైన ఆట మొదలైంది.

టాస్కులపై ఫోకస్..
కంటెస్టెంట్లను టీమ్స్ గా విడదీసి బిగ్ బాస్ టాస్కులను ఇవ్వడం మొదలుపెట్టారు. ఇలా ఇచ్చిన మొదటి టాస్కోలో భాగంగా ఇప్పటివరకు హౌస్ లో సైలెంట్ గా కూర్చున్న పృథ్విరాజ్ తన ఆట తీరును కనబరుస్తూ యష్మీ టీమ్ ను గెలిపించారు. దీంతో ముందు ముందు ఏ ఏ కంటెస్టెంట్ ఎలా తన ఆట తీరుతో ప్రేక్షకులను మెప్పిస్తారో తెలియాల్సి ఉంది.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు వచ్చారు బ్రో…. ఆ కంటెస్టెంట్లను ఆడేసుకుంటున్న ట్రోలర్స్!

Published

on

Bigg Boss 8: బిగ్ బాస్ కార్యక్రమానికి తెలుగులో కూడా ఎంతో మంచి ఆదరణ ఉంది. ఈ కార్యక్రమం తెలుగులో ఇప్పటికి ఏడు సీజన్లను పూర్తి చేసుకుని ఎనిమిదవ సీజన్ కూడా గత ఆదివారం ఎంతో ఘనంగా ప్రారంభమైంది. మొదట 14 మంది కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపించారు. మిగిలిన వారిని ఐదవ వారం వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి పంపించబోతున్నారని సమాచారం.

Advertisement

ఇక హౌస్ లోకి వెళ్లిన తర్వాత మొదటి రోజు నుంచే కంటెస్టెంట్లు పెద్ద ఎత్తున గొడవలు పడుతూ పోట్లాడుతూ ప్రేక్షకులకు కావాల్సినంత కంటెంట్ ఇస్తున్నారు. అయితే కొంతమంది మాత్రమే బాగా ఎక్స్పోజ్ అవుతున్నారు. మిగిలిన వారు మాత్రం అసలు హౌస్ లో ఉన్నారా లేదా అన్నా సందేహాలు వస్తున్నాయి. హౌస్ లోకి వెళ్ళేటప్పుడు ఎంతో యాక్టివ్ గా వెళ్లిన కంటెస్టెంట్లు లోపల మాత్రం అనుకున్న స్థాయిలో కంటెంట్ ఇవ్వలేకపోతున్నారనే చెప్పాలి.

ముఖ్యంగా హీరో ఆదిత్య ఓం అయితే హౌస్ లో ఉన్నాడా లేదా అన్న సందేహం మాత్రం అందరికీ కలుగుతుంది. ఈయన ఉంటే ఒంటరిగా ఉంటారు లేకపోతే నిద్రపోతూ ఉంటారు. పెద్దగా ఫేమస్ అయిన కంటెంట్ మాత్రం ఈయన ఇవ్వలేకపోతున్నారు. దీంతో పలువురు ట్రోలర్స్ బ్రో అసలు ఎందుకొచ్చావు బ్రో బిగ్ బాస్ హౌస్ కి అంటూ భారీగా విమర్శలు చేస్తున్నారు.

ఈయనతో పాటు బెజవాడ బేబక్క కూడా విమర్శలను ఎదుర్కొంటుంది. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా కనిపించే ఈమె హౌస్ లో మాత్రం ఎక్కువగా కిచెన్ లోనే ఉంటుంది. కానీ సరైన కంటెంట్ మాత్రం ఇవ్వలేకపోతున్నారు.అఫ్రిదీ కూడా డల్‌గానే ఉన్నాడనే టాక్‌ వస్తుంది. పృధ్విరాజ్, అభయ్ నవీన్ వంటి వారందరూ కూడా హౌస్ లో డల్ గా కనిపిస్తున్న తరుణంలో పలువురు మీరంతా హౌస్ లోకి ఎందుకు వచ్చారో ఏమో అంటూ వీరిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు అలాగే మరి కొంతమందిని బాగా హైలైట్ చేస్తూ కూడా కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

ఎలిమినేషన్ ఉంటుందా…
ఇక ఈ వారం నామినేషన్స్ లో భాగంగా బెజవాడ బేబక్క, విష్ణు ప్రియ, శేఖర్ భాష, నాగ మణికంఠ సోనియా ఆకుల ప్రేరణ వంటి వారు నామినేషన్ లో ఉన్నారు. అయితే గత సీజన్లో మాదిరిగా ఈ సీజన్లో కూడా మొదటి వారం ఎలిమినేషన్ ఉండకపోవచ్చని తెలుస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!