Connect with us

Featured

ఆ సంఘటన తర్వాత సుమన్ ని తిరిగి హీరోగా నిలబెట్టిన చిత్రం.!!

Published

on

సుమన్ నాన్నగారు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో ఒక ఉద్యోగి, తల్లి ఓ కళాశాలకు ప్రిన్సిపాల్. వారింట్లో కనీసం ఒక సినిమా మ్యాగజిన్ చదివిన, కనబడిన సందర్భాలు లేవు.అసలు సినిమాల గురించి ఎటువంటి ప్రస్తావన కూడా ఆ ఇంట్లో ఉండదు. ఒక విధంగా చెప్పాలంటే సినిమా ఫ్యామిలీకి ఒక భిన్నమైనది వారి కుటుంబం.

Advertisement

అటువంటి వాతావరణంలో పెరిగిన సుమన్ సినిమాల్లోకి అడుగు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. నటించడం పక్కనపెడితే అసలు డైలాగ్ చెప్పడం కూడా తనకు రాదని సుమన్ చెప్పేవారు. కానీ దర్శక, నిర్మాతలు వినక సినిమాలలోకి రండి ఆ తర్వాత నటన దానంతటదే వస్తుందని బలవంతంగా ఆయన చేత తమిళ చిత్రాల్లో అవకాశాలు ఇచ్చారు. సుమన్ అమ్మ చాలా స్ట్రిక్ట్ ప్రిన్సిపాల్ అయినప్పటికీ.. ఏదో దైవ కృప లేకపోతే ఎంతోమంది మహామహులు ఎంతో కష్టపడితే గానీ సినీ పరిశ్రమలోకి రాలేకపోయారు. అలాంటిది దర్శక నిర్మాతలే నీ దగ్గరికి వచ్చి సినిమాల్లోకి రమ్మనడం నిజంగా దైవజ్ఞ గా భావిస్తున్నానని సుమన్ తల్లి అనడంతో సుమన్ తమిళ చిత్రాల్లో మొదటగా సినీ రంగ ప్రవేశం చేశారు.

అయితే షూటింగ్ ఫస్ట్ డే ఫస్ట్ షాట్ సుమన్ మీదే తీయడంతో కొంత నటన, సంభాషణ విషయంలో తటపటాయించాడం జరిగింది. ఆ తర్వాత యాక్షన్ సన్నివేశాలు తీయడంతో సుమన్ కి సినిమా బెరుకుపోవడంతో మెల్లిగా నటించడం మొదలు పెట్టాడు. భానుచందర్ పరిచయం అనంతరం ఆయన సలహా మేరకు తెలుగు తనకు రాదన్న కూడా బలవంతంగా తమ్మారెడ్డి భరద్వాజ నిర్మాణ సారథ్యం, రేలంగి నరసింహారావు దర్శకత్వంలో “ఇద్దరు కిలాడీలు” చిత్రంలో నటించారు. ఆ తరువాత తరంగిణి, నేటి భారతం, పండంటి కాపురానికి పన్నెండు సూత్రాలు, హిమబిందు, సితార లాంటి చిత్రాల్లో నటిస్తుండగా.. విధివెక్కిరించిందో ఏమో తెలియదు గాని, సుమన్ అనుకోకుండా ఒక కేసులో ఇరుక్కోవలిసివచ్చింది.

కొన్ని నెలల జైలు జీవితం అనంతరం తిరిగి సినిమాల్లో నటించడం మొదలు పెట్టారు. 1988 అన్నపూర్ణ సినీ చిత్ర బ్యానర్ లో టి.ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వంలో విడుదలైన “బందిపోటు” చిత్రంలో సుమన్, పూర్ణిమ, కల్పన హీరో హీరోయిన్లుగా నటించారు. అభిమానులు తనపట్ల ఎలా ఉన్నారనే సందిగ్ధంలో ఉన్న సుమన్ కి ఈ సినిమా ఘన విజయం సాధించడంతో అటువంటి అనుమానాలు మొత్తం తేటతెల్లం అయ్యాయి.

ఆ తర్వాత 20వ శతాబ్దం, కొండపల్లి రాజా, చిన్నల్లుడు, దొంగల్లుడు, ఖైదీ ఇన్స్పెక్టర్, నాయుడుగారి కుటుంబం, బావ బావమరిది లాంటి హిట్ చిత్రాల్లో నటించి తిరిగి తన కెరీర్ కి సుమన్ పూలబాట వేసుకున్నారు. ఆ సంఘటన జరిగిన తర్వాత కూడా సుమన్ ఇంకా తన సినీ జీవిత యాత్ర కొనసాగిస్తూనే ఉన్నారు. ఆయన సినిమాల్లోకి అడుగుపెట్టి 42 సంవత్సరాలు పూర్తి కావడం గమనార్హం. తనకు దేవుడి అనుగ్రహం ఉండడం వల్లనే సినిమాల్లోకి రావడం జరిగిందని ఆయన తరచూ చెబుతుంటారు.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Star Heroin: స్టార్ హీరోతో ప్రేమ,పెళ్లి విడాకులు..12 మందితో ఎఫైర్ పెట్టుకున్న హీరోయిన్… ఎవరంటే?

Published

on

Star Heroin: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో సీనియర్ నటి మనీషా కొయిరాల ఒకరు. ఈమె సౌత్ లో కంటే నార్త్ లోనే ఎక్కువ సినిమాలలో నటించి ఒకానొక సమయంలో బాలీవుడ్ చిత్ర పరిశ్రమను ఓ ఊపు ఊపారు. ఇక ఈమె స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలో తన వ్యక్తిగత విషయాలలో కూడా వార్తలలో నిలిచారు.

Advertisement

ఈమె ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూనే మరోవైపు పలువురు హీరోలతో ఎఫైర్ పెట్టుకుంది అంటూ వార్తలు వచ్చాయి. ఒక స్టార్ హీరోతో పీకల్లోతు ప్రేమలో పడినప్పటికీ ఆయనని పెళ్లి చేసుకోలేదు. ఇక ఈమె సామ్రాట్ దహాల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పటికీ రెండేళ్లకే తనతో విడాకులు తీసుకొని విడిపోయి పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు.

ఇలా డిప్రెషన్ లోకి వెళ్లిన మనీషా కోయిరాల మందుకు అలవాటు పడ్డారు.పెళ్లికి ముందే మనీషా కోయిరాలా ఏకంగా 12 మందితో డేటింగ్ చేసిందట. ఆమె డేటింగ్ చేసినవాళ్ల లిస్ట్ లో నటులు, వ్యాపారవేత్తలు,అంబాసిడర్ కూడా ఉన్నారు. వివేక్ ముశ్రన్‌, నానా పటేకర్‌, DJ హుస్సేన్‌, లండన్‌కు చెందిన నైజీరియన్ వ్యాపారవేత్త సెసిల్ ఆంథోనీ, ఆర్యన్ వైద్‌ వంటి ప్రముఖులతో ఈమె డేటింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది.

12 మందితో డేటింగ్..
ఇలా తరచూ డేటింగ్ ల ద్వారా కూడా ఈమె వార్తల్లో నిలిచారు. ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో బిజీగా గడిపారు. పలువురు దర్శక నిర్మాతలు సైతం ఈమె డేట్స్ కోసం ఎంతగానో ఎదురు చూసేవారు. ఇలా సినిమా ఇండస్ట్రీని ఓ ఊపిన ఈమె మధ్యలో ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్ లతో బిజీగా గడుపుతున్నారు.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: విష్ణు ప్రియకు షాక్ ఇచ్చిన నిఖిల్… కన్నీళ్లు పెట్టుకున్న నిఖిల్.. అసలు ఆట ఆరంభం!

Published

on

Bigg Boss 8: తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమం ప్రారంభం అయ్యి 5 రోజులు పూర్తయింది. ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయింది అయితే హౌస్ లో ఉన్నటువంటి 14 మంది కంటెస్టెంట్లను బిగ్ బాస్ మూడు గ్రూపులుగా విడదీశారు. అయితే ఈ గ్రూపులోకి ఎవరెవరు సభ్యులను తీసుకోవాలనేది చీఫ్ ఎన్నుకోవాల్సి ఉంటుంది.

Advertisement

ఈ క్రమంలోనే కంటెస్టెంట్ విష్ణు ప్రియ కచ్చితంగా తనని నిఖిల్ తన గ్రూపులోకి తీసుకుంటారని ఆమె భావించింది. కానీ నిఖిల్ మాత్రం ఆమెకు షాక్ ఇచ్చారు. దీంతో విష్ణు ప్రియను నైనిక తన టీమ్ లోకి తీసుకున్నారు. అయితే ఈ విషయం గురించి నిఖిల్ విష్ణుప్రియ మధ్య పెద్ద ఎత్తున చర్చ జరిగింది. వీరిద్దరికి ముందే మంచి పరిచయమున్న నేపథ్యంలో తప్పకుండా నిఖిల్ తన టీమ్ లోకి తీసుకుంటారని విష్ణు ప్రియ భావించింది కానీ అది జరగలేదు.

ఇలా ఇద్దరి మధ్య ఉన్న పరిచయం కారణంగా విష్ణు ప్రియ సరదాగా నిఖిల్ ను ఓ ఆట ఆడుకుంది. దీంతో నిఖిల్ ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలా ఇప్పటివరకు ఎంతో సరదాగా గడిపిన కంటెస్టెంట్లను మూడు గ్రూపులుగా విడదీయడంతో అసలైన ఆట మొదలైంది.

టాస్కులపై ఫోకస్..
కంటెస్టెంట్లను టీమ్స్ గా విడదీసి బిగ్ బాస్ టాస్కులను ఇవ్వడం మొదలుపెట్టారు. ఇలా ఇచ్చిన మొదటి టాస్కోలో భాగంగా ఇప్పటివరకు హౌస్ లో సైలెంట్ గా కూర్చున్న పృథ్విరాజ్ తన ఆట తీరును కనబరుస్తూ యష్మీ టీమ్ ను గెలిపించారు. దీంతో ముందు ముందు ఏ ఏ కంటెస్టెంట్ ఎలా తన ఆట తీరుతో ప్రేక్షకులను మెప్పిస్తారో తెలియాల్సి ఉంది.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు వచ్చారు బ్రో…. ఆ కంటెస్టెంట్లను ఆడేసుకుంటున్న ట్రోలర్స్!

Published

on

Bigg Boss 8: బిగ్ బాస్ కార్యక్రమానికి తెలుగులో కూడా ఎంతో మంచి ఆదరణ ఉంది. ఈ కార్యక్రమం తెలుగులో ఇప్పటికి ఏడు సీజన్లను పూర్తి చేసుకుని ఎనిమిదవ సీజన్ కూడా గత ఆదివారం ఎంతో ఘనంగా ప్రారంభమైంది. మొదట 14 మంది కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపించారు. మిగిలిన వారిని ఐదవ వారం వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి పంపించబోతున్నారని సమాచారం.

Advertisement

ఇక హౌస్ లోకి వెళ్లిన తర్వాత మొదటి రోజు నుంచే కంటెస్టెంట్లు పెద్ద ఎత్తున గొడవలు పడుతూ పోట్లాడుతూ ప్రేక్షకులకు కావాల్సినంత కంటెంట్ ఇస్తున్నారు. అయితే కొంతమంది మాత్రమే బాగా ఎక్స్పోజ్ అవుతున్నారు. మిగిలిన వారు మాత్రం అసలు హౌస్ లో ఉన్నారా లేదా అన్నా సందేహాలు వస్తున్నాయి. హౌస్ లోకి వెళ్ళేటప్పుడు ఎంతో యాక్టివ్ గా వెళ్లిన కంటెస్టెంట్లు లోపల మాత్రం అనుకున్న స్థాయిలో కంటెంట్ ఇవ్వలేకపోతున్నారనే చెప్పాలి.

ముఖ్యంగా హీరో ఆదిత్య ఓం అయితే హౌస్ లో ఉన్నాడా లేదా అన్న సందేహం మాత్రం అందరికీ కలుగుతుంది. ఈయన ఉంటే ఒంటరిగా ఉంటారు లేకపోతే నిద్రపోతూ ఉంటారు. పెద్దగా ఫేమస్ అయిన కంటెంట్ మాత్రం ఈయన ఇవ్వలేకపోతున్నారు. దీంతో పలువురు ట్రోలర్స్ బ్రో అసలు ఎందుకొచ్చావు బ్రో బిగ్ బాస్ హౌస్ కి అంటూ భారీగా విమర్శలు చేస్తున్నారు.

ఈయనతో పాటు బెజవాడ బేబక్క కూడా విమర్శలను ఎదుర్కొంటుంది. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా కనిపించే ఈమె హౌస్ లో మాత్రం ఎక్కువగా కిచెన్ లోనే ఉంటుంది. కానీ సరైన కంటెంట్ మాత్రం ఇవ్వలేకపోతున్నారు.అఫ్రిదీ కూడా డల్‌గానే ఉన్నాడనే టాక్‌ వస్తుంది. పృధ్విరాజ్, అభయ్ నవీన్ వంటి వారందరూ కూడా హౌస్ లో డల్ గా కనిపిస్తున్న తరుణంలో పలువురు మీరంతా హౌస్ లోకి ఎందుకు వచ్చారో ఏమో అంటూ వీరిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు అలాగే మరి కొంతమందిని బాగా హైలైట్ చేస్తూ కూడా కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

ఎలిమినేషన్ ఉంటుందా…
ఇక ఈ వారం నామినేషన్స్ లో భాగంగా బెజవాడ బేబక్క, విష్ణు ప్రియ, శేఖర్ భాష, నాగ మణికంఠ సోనియా ఆకుల ప్రేరణ వంటి వారు నామినేషన్ లో ఉన్నారు. అయితే గత సీజన్లో మాదిరిగా ఈ సీజన్లో కూడా మొదటి వారం ఎలిమినేషన్ ఉండకపోవచ్చని తెలుస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!