General News
Air Indian Flight: విమానంలో అస్వస్థతకు గురైన ప్రయాణికుడు.. చికిత్స అందించిన కేంద్రమంత్రి..
![](https://telugudesk.net/wp-content/litespeed/avatar/48f246d9b01e880e5843b8d38f9199e4.jpg?ver=1719738859)
Published
2 years agoon
By
lakshanaAir Indian Flight:సాధారణంగా రాజకీయ నాయకులు కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజల మధ్యలో తిరుగుతూ ఓట్ల కోసం పెద్ద ఎత్తున తాపత్రయ పడుతుంటారు. ఇలా ఎన్నికల సమయంలో కాకుండా మిగతా సమయంలో ప్రజలలోకి రావడానికి రాజకీయ నాయకులు పెద్దగా ఆసక్తి కనపరిచరు. అయితే కొంతమంది నేతలు మాత్రం ఇందుకు చాలా భిన్నంగా ఉంటారు. వాళ్లు నిత్యం ప్రజల కోసమే కృషి చేస్తూ.. ప్రజల సమస్యలను తీరుస్తూ నిజమైన ప్రజానాయకుడు గా వ్యవహరిస్తారు.
![Air Indian Flight: విమానంలో అస్వస్థతకు గురైన ప్రయాణికుడు.. చికిత్స అందించిన కేంద్రమంత్రి..](http://telugudesk.net/wp-content/uploads/2022/06/13fc7d2f-af56-4673-8a85-62c208715dd1-1.jpg)
Air Indian Flight: విమానంలో అస్వస్థతకు గురైన ప్రయాణికుడు.. చికిత్స అందించిన కేంద్రమంత్రి..
తాజాగా కేంద్ర మంత్రి చేసిన పని తెలిస్తే ప్రతి ఒక్కరూ అతనిపై ప్రశంసలు కురిపించకుండా ఉండలేరు. అసలేం జరిగిందనే విషయానికి వస్తే..శనివారం ఢిల్లీ-ఔరంగాబాద్ ఎయిరిండియా విమానంలో ఒక ప్రయాణికుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఈ విషయం తెలిసిన విమాన సిబ్బంది వెంటనే విమానంలో ఎవరైనా డాక్టర్స్ ఉంటే స్పందించాల్సి ఉంది అంటూ అనౌన్స్మెంట్ చేశారు. ఈ విధంగా అనౌన్స్మెంట్ విన్న కేంద్ర మంత్రి డాక్టర్ బీకే కరాద్, మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నేత డాక్టర్ సుభాష్ భమ్రే వెంటనే స్పందించారు.
![Air Indian Flight: విమానంలో అస్వస్థతకు గురైన ప్రయాణికుడు.. చికిత్స అందించిన కేంద్రమంత్రి..](http://telugudesk.net/wp-content/uploads/2022/06/Collage-Maker-20-Jun-2022-01.24-PM.jpg)
Air Indian Flight: విమానంలో అస్వస్థతకు గురైన ప్రయాణికుడు.. చికిత్స అందించిన కేంద్రమంత్రి..
ఈ క్రమంలోనే ఇద్దరు ప్రయాణికుడి దగ్గరకు వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకొని అతనికి చికిత్స అందించారు. ఇలా ప్రాథమిక చికిత్స అందించడంతో ఆ ప్రయాణికుడు త్వరగా ఉపశమనం పొందారు. వీరిద్దరూ ఒకరు కేంద్ర మంత్రిగా విధులు నిర్వహిస్తుండగా మరొకరు మాజీ మంత్రి ఇలా వీరిద్దరూ రాజకీయ నాయకులు మాత్రమే కాకుండా వృత్తి పరంగా ఎంతో అనుభవజ్ఞులైన డాక్టర్లు.
ప్రత్యేక ధన్యవాదాలు తెలియ చేసిన ఎయిర్ ఇండియా…
ప్రస్తుతం వీరిద్దరూ మంత్రి పదవులలో ఉన్నప్పటికీ ఒక రోగి పట్ల డాక్టర్ గా వ్యవహరించి ఆయనకు చికిత్స అందించడంతో కేంద్ర మంత్రి పై నెటిజన్లు పెద్దఎత్తున ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఎయిర్ ఇండియా ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ వారిద్దరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.
You may like
Comedian Sudhakar: బుల్లితెర షో లో సందడి చేసిన కమెడియన్ సుధాకర్… గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నటుడు!
Samantha -Naga Chaitanya: నాగచైతన్య నిజంగానే సమంతను పరామర్శిస్తాడా… ఇది జరిగే విషయమేనా?
Krishnam Raju: కృష్ణంరాజు అంత్యక్రియలను తన ఫామ్ హౌస్ లో చేయడం వెనుక ఇంత పెద్ద కారణం ఉందా?
Krishnam Raju: సినిమాలలో రాణిస్తూ కేంద్ర మంత్రిగా సక్సెస్ అయిన కృష్ణంరాజు!
Jabardasth Varsha: జబర్దస్త్ వర్ష చావు బతుకుల మధ్య పోరాడుతుందంటూ వార్తలు.. అసలు విషయం బయటపెట్టిన జబర్దస్త్ బ్యూటీ?
Nirupam – Manjula: అలాంటి వైరస్ సోకి అస్పత్రిలో డాక్టర్ బాబు భార్య మంజుల…ఎమోషనల్ వీడియో!
General News
ఏపీలో ఆ న్యూస్ ఛానల్ ప్రసారానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్!
![](https://telugudesk.net/wp-content/litespeed/avatar/48f246d9b01e880e5843b8d38f9199e4.jpg?ver=1719738859)
Published
1 week agoon
25 June 2024By
lakshanaఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అతిపెద్ద బిజినెస్ లలో సెటప్ బాక్స్ బిజినెస్ కూడా ఒకటి ఏపీలో సుమారు 65 లక్షల కుటుంబాలు ఏపీ ఫైబర్ సెటప్ బాక్స్ ని ఉపయోగిస్తూ ఉన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన రాజకీయాల కారణంగా జూన్ 6వ తేదీ నుంచి కొన్ని న్యూస్ చానల్స్ ప్రసారం ఆగిపోయాయి.
జూన్ ఆరవ తేదీ నుంచి సాక్షి టీవీతో పాటు ఎన్ టీవీ, టీవీ9 వంటికి కొన్ని న్యూస్ చానల్స్ ప్రసారాలు ఆగిపోయాయి. ఇలా న్యూస్ ఛానల్ లో ప్రసారం నిలిపివేయడంతో ఇది చట్టపరంగా విరుద్ధమని తిరిగి ప్రసారాలను పునరుద్ధరించాలని 15 మంది మల్టీ సిస్టమ్ ఆపరేటర్లను ఢిల్లీ హైకోర్టు ఆదేశించడాన్ని న్యూస్ బ్రాడ్కాస్టర్స్ ఫెడరేషన్ ప్రశంసించింది.న్యూస్ బ్రాడ్కాస్టర్స్ ఫెడరేషన్ ప్రకటన విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్లో చట్ట విరుద్ధంగా కొన్ని న్యూస్ ఛానల్ లను నిలిపివేయడం జరిగింది. ఇలా నిలిపివేయటాన్ని న్యాయస్థానం పూర్తిగా ఖండించింది. కేవలం రాజకీయ న్యాయకత్వం పరంగా మార్పులు రావడంతోనే కేబుల్ ఆపరేటర్ల పై ఈ న్యూస్ ఛానల్ ను నిలిపివేయాలని ఒత్తిడి తీసుకురావడం తగదని చెప్పారు.
ఇలా సుమారు 62 లక్షల కుటుంబాలకు ఈ న్యూస్ ఛానల్ ప్రసారం నిలిపివేయటం చట్టపరంగా విరుద్ధమని, ఈ విధంగా ఈ న్యూస్ ఛానల్ ను నిలిపివేయటం అనేది ప్రేక్షకుల సమాచార హక్కుని నిరాకరించే ప్రయత్నం జరగటం దురదృష్టకరమైన తెలిపారు. ఈ క్రమంలోనే నిలిపివేసిన ఈ చానల్లను తిరిగి పునరుద్ధరించాలని హైకోర్టు తీర్పును వెల్లడించింది.
Featured
Ramoji Rao: ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు అస్తమయం!
![](https://telugudesk.net/wp-content/litespeed/avatar/48f246d9b01e880e5843b8d38f9199e4.jpg?ver=1719738859)
Published
4 weeks agoon
8 June 2024By
lakshanaRamoji Rao: ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి ఈయన గత రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అయితే ఈయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నేడు తెల్లవారుజామున 4:50 నిమిషాలకు కన్నుమూశారు.
శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఈయనని హైదరాబాద్లోనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈయన పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటిలేటర్ పై చికిత్స అందించారు. అయితే ఈయన పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు.
ఒక రామోజీరావు మరణ వార్త తెలియడంతో సినీ పరిశ్రమ అటు మీడియా రంగం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. మీడియా రంగానికి ఎన్నో సేవలు చేసిన రామోజీరావు మరణ వార్త తెలిసి ప్రముఖ రాజకీయ నాయకులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈయన మరణ వార్త తెలియడంతో తెలుగుదేశం అధినేతలు మరణం వార్తపై సంతాపం ప్రకటిస్తున్నారు.
అనారోగ్యంతో కన్నుమూత..
రామోజీరావు అసలు పేరు చెరుకూరి రామయ్య ఈయన రామోజీ గ్రూప్ సంస్థలను స్థాపించి ఎంతో పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు. ఇలా పత్రిక రంగానికి ఎన్నో సేవలు చేస్తున్నటువంటి ఈయన ఎన్నో అవార్డులను పురస్కారాలను కూడా అందుకున్నారు. ప్రస్తుతం ఈయన పార్థివ దేహాన్ని రామోజీ ఫిలిం సిటీ లోని తన నివాసానికి తరలించారు కూడా స్పందిస్తున్నారు.
Featured
బరితెగించిన సైబర్ నేరగాళ్లు.. ఏకంగా డీజీపీ ఫోటో వాడేశారు
![](https://telugudesk.net/wp-content/litespeed/avatar/48f246d9b01e880e5843b8d38f9199e4.jpg?ver=1719738859)
Published
2 months agoon
21 May 2024By
lakshanaసైబర్ నేరగాళ్ల ఆగడాలకు అదుపు లేకుండా పోతుంది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. అడ్డదారుల తొక్కుతూనే ఉన్నారు. ఏకంగా తెలంగాణ డీజీపీ పేరుతో సైబర్ క్రైమ్ కు దిగారు. తెలంగాణ డీజీపీ వాట్సాప్ ఫోటోతో కొందరు కేటుగాళ్లు సైబర్ ఫ్రాడ్కు పాల్పడుతున్నారు. డీజీపీ ఫోటో పెట్టుకొని ఓ అగంతుకుడు ఓ వ్యాపారవేత్త కుమార్తెకు వాట్సాప్ కాల్ చేశాడు. డీపీ తెలంగాణ డీజీపీ రవి గుప్తా ఫోటో ఉండటంతో ఆమె అగంతుకుడితో మాట్లాడింది. డ్రగ్స్ కేసు ఆమెను అరెస్ట్ చేస్తున్నామని బెదిరించాడు.
కేసు నుండి తప్పించేందుకు 50 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబ్బు ఇవ్వకపోతే కేసు నుంచి ఎవరూ తప్పించలేరని బెదిరించాడు. అయితే.. ఆయన మాట్లాడిన తీరును అనుమానించి ఆ యువతి పోలీసులకు తన తండ్రికి చెప్పింది. ఆ వ్యాపారవేత్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. +92 కోడ్ తో వాట్సాప్ కాల్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఇది పాకిస్తాన్ కోడ్ అని సైబర్ పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా సైబర్ నేరగాళ్లు ఏ మాత్రం తగ్గడం లేదు. సులభంగా డబ్బు సంపాదించడం కోసం అడ్డుదారులు తొక్కుతూనే ఉన్నారు. దాని కోసం సమాజంలో పెద్ద వాళ్ల పేర్లు వాడుతున్నారు. ఒక్కోసారి పెద్దవారి సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాక్ చేస్తున్నారు. గతంలో తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై ట్విట్టర్ అకౌంట్ కూడా హ్యాక్ చేశారు.
![](https://telugudesk.net/wp-content/uploads/2023/08/Rajamouli.jpg?v=1691127301)
Rajamouli: వరుస ఫ్లాపులు వచ్చిన ఐరన్ లెగ్ అని పిలిచినా.. ఆ హీరోయిన్లనే తీసుకుంటాం: రాజమౌళి
![](https://telugudesk.net/wp-content/uploads/2024/07/bigg-boss-80x80.webp)
Venu Swamy: బిగ్ బాస్ లోకి వేణు స్వామి… భారీ రెమ్యూనరేషన్ అందుకోబోతున్న జ్యోతిష్యులు!
![](https://telugudesk.net/wp-content/uploads/2024/07/sonu-sood-80x80.webp)
Kumari Aunty: కుమారి ఆంటీని కలిసిన సోను సూద్… నేనున్నానంటూ ధైర్యం చెప్పిన హీరో!
![](https://telugudesk.net/wp-content/uploads/2024/07/Shruthi-Hassan-80x80.webp)
Shruthi Hassan: దయచేసి అమ్మాయిలను అలాంటి ప్రశ్నలు వేయొద్దు: శృతిహాసన్
![](https://telugudesk.net/wp-content/uploads/2024/07/ntr-80x80.jpg?v=1720185185)
NTR: ఎన్టీఆర్ పై కోపం వస్తే లక్ష్మీ ప్రణతి ఆ సినిమా చూస్తుందా… ఏంటా సినిమా?
![](https://telugudesk.net/wp-content/uploads/2024/06/nallari-kirankumarireddy-80x80.png?v=1717917965)
Nallari Kiran Kumar Reddy : ఏపీలో దురదృష్టవంతుడంటే ఆయనే.. అంత సునామీలోనూ ఓటమి..
![](https://telugudesk.net/wp-content/uploads/2024/06/Ramoji_Rao-80x80.jpg?v=1717817310)
Ramoji Rao: ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు అస్తమయం!
![](https://telugudesk.net/wp-content/uploads/2024/06/ysjagan-80x80.png?v=1717659232)
YS Jagan : పడి లేచిన కెరటమవుతారా? పత్తా లేకుండా పోతారా?
![](https://telugudesk.net/wp-content/uploads/2024/06/modi30-80x80.png?v=1717916702)
Modi 3.0 : ఏపీకి ఐదు కేంద్ర మంత్రి పదవులు.. ఎవరెవరికంటే..
![](https://telugudesk.net/wp-content/uploads/2024/06/pawan-kalyan-80x80.jpg?v=1717758472)
Pawan Kalyan: నరేంద్ర మోడీకి తన కొడుకుని పరిచయం చేసిన పవన్… సంతోషంలో ఫ్యాన్స్?
Trending
- Featured4 weeks ago
Nallari Kiran Kumar Reddy : ఏపీలో దురదృష్టవంతుడంటే ఆయనే.. అంత సునామీలోనూ ఓటమి..
- Featured4 weeks ago
Ramoji Rao: ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు అస్తమయం!
- Featured4 weeks ago
YS Jagan : పడి లేచిన కెరటమవుతారా? పత్తా లేకుండా పోతారా?
- Featured4 weeks ago
Modi 3.0 : ఏపీకి ఐదు కేంద్ర మంత్రి పదవులు.. ఎవరెవరికంటే..
- Featured4 weeks ago
Pawan Kalyan: నరేంద్ర మోడీకి తన కొడుకుని పరిచయం చేసిన పవన్… సంతోషంలో ఫ్యాన్స్?
- Featured1 week ago
Ali: ఇప్పుడు ఎన్నికలు పెట్టిన ఆయన సీఎం నేను హోమ్ మినిస్టర్ అవుతా: అలీ
- Featured4 weeks ago
YS Jagan & Sharmila : అన్నాచెల్లి కలుస్తారా? ఏపీలో ఇప్పుడిదే హాట్ టాపిక్..
- Featured4 weeks ago
Ramoji Rao: రామోజీరావు నటించిన ఏకైక చిత్రం ఏంటో తెలుసా?