Connect with us

Featured

Rajanikanth Vs Jayalalitha : చాలా కాలం తమిళనాడులో రజని వెర్సెస్ జయలలిత… ట్రాఫిక్ లో వెయిట్ చేయించినందుకు పగా తీర్చుకున్న రజని…!

Published

on

Rajanikanth Vs Jayalalitha : కర్ణాటక బస్ కండక్టర్ గా జీవితం మొదలు పెట్టి నేడు తమిళ ప్రజలకు సూపర్ స్టార్ అయిన వ్యక్తి రజనీకాంత్. ఒక మామూలు వ్యక్తి తలచుకుంటే ఎంత ఎత్తుకైనా ఎదగవచ్చు అని రజనీకాంత్ నిరూపించారు. ఎన్నో సూపర్ హిట్స్ ఆయన ఖాతాలో వేసుకుని సౌత్ లో అగ్ర హీరోల్లో ఒకరిగా ఉంటూ ఏడు పదుల వయసులోనూ హిట్లు కొడుతూ కొత్త వారికి పోటీగా ఉన్నారు. పీక్స్ లో స్టార్ డమ్ అన్నీ ఉన్నా కూడా రజనీకాంత్ గారు చాలా సింపుల్ గా ఉండటం ఆయన ప్రత్యేకత. అలాంటి రజనీకాంత్ గారికి తమిళనాడు మాజీ దివంగత సీఎం జయలలితతో కయ్యం పెట్టుకున్నారు. చాలా రోజులు వీరిద్దరి మధ్య గొడవ సాగింది.

ట్రాఫిక్ లో వెయిట్ చేయించినందుకు పగ తీర్చుకున్న రజని…

జయలలిత గారు సినిమాల్లో ఇంకా నటిస్తున్న సమయంలో రజనీకాంత్ ఇంకా కొత్తగా హీరోగా ఎదుగుతున్న సమయంలో ఒక సినిమాలో రజనీకాంత్ నటించాల్సి ఉండగా జయలలిత మొదట ఒకే చెప్పి ఆ తరువాత రామప్రభ కోసం శరత్ బాబుని పెట్టుకున్నారట. ఆ సినిమా చేసుంటే రజని కెరీర్ కి ఉపయోగపడేదని రజని జయలలిత గారితో మాట్లాడటానికి ఇంటికి వెళ్లగా ఆమె ఉండి కూడా లేనని చెప్పించి కలవడానికి నిరాకరించారు. అప్పటి అవమానంను గుర్తు పెట్టుకున్న రజని ఆమెతో దూరంగానే ఉన్నారు. అయితే జయలలిత సీఎం అయ్యారు, మరో వైపు రజనీకాంత్ సూపర్ స్టార్ అయ్యారు. ఆ సమయంలో ఒకసారి షూటింగ్ ముగించుకుని అలసిపోయి ఇంటికి సాయంత్రం బయలుదేరిన రజనీకాంత్ ను సీఎం అటు వైపు వస్తున్నారని ట్రాఫిక్ లో అరగంట పైగా ఆపేసారట. దీంతో చిరాకుపడిన రజనీకాంత్ కారు నుండి బయటికి వచ్చి ఒక లారీ ఎక్కి అందరినీ పలకరించి స్టైల్ గా సిగరెట్ తాగడంతో రోడ్డు మీద ఉన్న వారంతా ఒక్కసారిగా రజనీని చూడటానికి ఎగబడటంతో ట్రాఫిక్ పోలీసులు కూడా అదుపు చేయలేక చేతులెత్తేశారట. అదే సమయంలో అక్కడికి సీఎం కాన్వయ్ రావడంతో ట్రాఫిక్ జామ్ అయింది.

Advertisement

జయలలిత వెయిట్ చేయడంతో కోపం వచ్చి పోలీసుల మీద ఆరిచేసరికి రజనీకాంత్ మీకు ఐదు నిమిషాల ఆలస్యానికి కోపం వస్తోంది మరి మాకు గంటలపాటు ట్రాఫిక్ జామ్ చేస్తే మా పనులు ఆగిపోతాయి ఆ విషయం ఆలోచించరా అంటూ అడిగారట. ఇక మరుసటి రోజు మీడియాలో అంతా అదే న్యూస్ రావడంతో కోపం పెంచుకున్న జయలలిత రజని మీద ఐటి దాడులకు పురమాయించినా ఏమి లాభం రాలేదు. ఇక ఎన్నికలలో జయలలిత గురించి రజని నెగెటివ్ గా మాట్లాడటం వల్ల ఆ ఎన్నికల్లో డిఎంకే పార్టీకి లాభం చేకూరి గెలిచారు. అయితే వాళ్ళు వచ్చాక కూడా రజని ఇబ్బంది పెట్టారు. ఆ తరువాత రజని జయలలిత పాలనే కొంచం బాగుంది డిఎమ్కే పాలనకంటే అని రియలైజ్ అయ్యారు. ఆ విషయాన్నే బాహాటంగా చెప్పిన రజని తరువాత జయలలిత గారితో సఖ్యతగా ఉన్నారు. తన కూతుర్ల పెళ్లిళ్లకు పిలిచారు. ఆమె కూడా రజని తో బాగున్నారు. ఆమె మరణించినపుడు రజనికాంత్ ఒక గొప్ప వ్యక్తిని తమిళనాడు కోల్పోయిందంటూ కామెంట్స్ చేసారు.

Continue Reading
Advertisement

Featured

Niharika: యుద్ధం గెలిచిన రాముడు అయోధ్యకు వచ్చినట్టు ఉంది… బాబాయ్ పై నిహారిక కామెంట్స్!

Published

on

Niharika: నిహారిక కొణిదెల పరిచయం అవసరం లేని పేరు. ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీలో నిర్మాతగా నటిగా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు. తన భర్త నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన నిహారిక తిరిగి కెరియర్ పై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే నిర్మాతగా కూడా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇక నిహారిక నిర్మాణంలో తెరకెక్కిన కమిటీ కుర్రోళ్ళు సినిమా ఆగస్టు 9వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈమె ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆహాలో ప్రసారమవుతున్న సర్కార్ సక్సెస్ సెలబ్రేషన్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.

ఇక ఈ ప్రోమోలో భాగంగా నిహారిక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ నేను వచ్చేది ఎప్పుడు నెక్స్ట్ సీజనా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సుడిగాలి సుదీర్ రెస్పాండ్ అవుతూ మీకేంటండి మీరు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలూకా అంటూ మాట్లాడారు. అనంతరం పవన్ కళ్యాణ్ విజయం సాధించిన తర్వాత చిరంజీవి ఇంటికి వచ్చి ఆశీర్వాదం తీసుకున్న వీడియో ఎంతలా వైరల్ అయిందో మనకు తెలిసిందే .ఇక ఈ వీడియోని ప్లే చేశారు.

Advertisement

యుద్ధం గెలిచిన రాముడు…
ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది అంటూ నిహారికను ప్రశ్నించారు. ఇక నిహారిక ఈ వీడియో గురించి మాట్లాడుతూ యుద్ధం గెలిచిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకు వచ్చినప్పుడు కూడా ఇలాగే ఉండేదేమో అనిపించింది అంటూ తన బాబాయ్ విజయం గురించి నిహారిక మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Anasuya: ఇకపై రంగమ్మత్త లాంటి పాత్రలు అసలు చేయను.. గ్లామర్ పాత్రలకు సై అంటున్న అనసూయ?

Published

on

Anasuya: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు. ఈమె జబర్దస్త్ యాంకర్ గా బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ అందుకొని అనంతరం వెండి తెరపై సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా వెండితెరపై వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న అనసూయ తిరిగి బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈమె స్టార్ మా లో ప్రసారమవుతున్న కిరాక్ బాయ్స్ కిలాడి లేడీస్ అనే కార్యక్రమంలో సందడి చేస్తున్నారు. ఇలా ఒక వైపు బుల్లితెర కార్యక్రమాలు మరోవైపు వెండితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్న అనసూయ త్వరలోనే సింబా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ఈమె మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఇటీవల కాలంలో మీరు చాలా సినిమాలను రిజెక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది కారణం ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ తాను సినిమాలు రిజెక్ట్ చేస్తున్న మాట నిజమేనని తెలిపారు. నేను ఒక సినిమాలో నటించిన పాత్ర హిట్ అవడంతో తదుపరి సినిమాలలో కూడా అలాంటి పాత్రలలో నటించే అవకాశం వస్తుందని తెలిపారు.

Advertisement

రంగమ్మత్త..
ఇలా ఒక పాత్రలో నటించిన తర్వాత తిరిగి అలాంటి పాత్రలలో నటించిన ప్రేక్షకులు పెద్దగా తీసుకోలేరు ఉదాహరణకు రంగమ్మత్త పాత్ర చాలా హైలెట్ అయింది. తదుపరి అలాంటి పాత్రలు వస్తే నేను చెయ్యను నేను అన్ని చాలా డిఫరెంట్ గా ఉండేలా చేయాలని భావిస్తున్నాను. ఇక ఎక్కువగా తాను గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా అనసూయ గ్లామర్ రోల్ చేయడానికి సై అంటూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Mahesh Babu: మహేష్ రాజమౌళి సినిమా టైటిల్ లీక్… సినిమా పేరు ఏంటో తెలుసా?

Published

on

Mahesh Babu: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా జరుగబోతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన కూడా తెలియజేయబోతున్నారు.

ఇక ఈ సినిమాలో మహేష్ బాబు చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు మొదటిసారి వర్క్ షాప్ లో కూడా పాల్గొనబోతున్నారని సమాచారం.

ఇప్పటివరకు మహేష్ బాబు ఏ సినిమా కోసం ఇలా వర్క్ షాప్ లో పాల్గొనలేదు మొదటిసారి రాజమౌళి సినిమా కోసం పాల్గొనబోతున్న నేపథ్యంలో ఈయన కూడా ఈ సినిమా విషయంలో చాలా ఆతృత కనబరుస్తున్నారు. ఇకపోతే తాజాగా మహేష్ బాబు రాజమౌళి సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

గోల్డ్..
తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమాకు సంబంధించి ఓ టైటిల్ సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమా టైటిల్ కూడా అందుకు అనుగుణంగానే ఉండాలి. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం గోల్డ్ అనే టైటిల్ పెట్టబోతున్నారంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఈ సినిమా టైటిల్ గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం వైరల్ అవుతుంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!