తలచుకోగానే నోట్లో నీరు ఊరే పండు సీతాఫలం. ఇది చాల తక్కువ రోజులు అందుబాటులో ఉంటుంది. ఎందుకంటె ఇది ఒక సీజనల్ ఫ్రూట్. ఫ్రూట్ లవర్స్ వీటికోసం సెప్టెంబర్ నుండి ఎదురుచూస్తూ ఉంటారు. అంత అమోఘమైన రుచిని కలిగి ఉంటుంది సీతాఫలం. అంతేకాదు ఈ పండు అందించే ఆరోగ్య ప్రయోజనాలు కూడా అమోఘమే. ఈ కాలంలో విరివిగా దొరికే సీతాఫలం రుచిని ఇష్టపడనివారు ఎవరూ ఉండరు. పోషక విలువలు అధికంగా ఉండే సీతాఫలం పళ్ళు వర్షాకాలం ప్రారంభమవగానే మార్కెట్లో కనబడతాయి. వీటిని తిన్న వెంటనే శక్తినిస్థాయి. వీటిలో సి విటమిన్తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా లభిస్తాయి. ఇంకా ఇందులోని ఐరన్, విటమిన్ సి, పాస్ఫరస్, మెగ్రీషియం అధికంగా ఉండి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే పరగడుపున ఈ పండును తినకూడదు. సీతాఫలం గుజ్జును తేనెతో కలిపి తింటే బరువు పెరుగుతారు. సీతాఫలం వలన ఈ ప్రయోజనాలే కాకుండా ఇంకా చాలా ప్రజోజనాలున్నాయి. ముఖ్యంగా అవి మన ఆరోగ్యానికి సంబంధించినవే కావడం ఈ పండు విశేషం. మరి ఆ ప్రయోజనాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
సీతాఫలం తింటుంటే గుండె సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం ఉంటుంది. గుండె కొట్టుకునే తీరును సీతాఫలం క్రమబద్ధీకరిస్తుంది. సీతాఫలం రోజు తినడం వల్ల విటమిన్ సి శరీరానికి సమృద్ధిగా లభిస్తుంది. రక్తంలోని ఇన్సులిన్ శాతాన్ని క్రమబద్ధీకరిస్తుంది, గ్లూకోజ్ శాతాన్ని అదుపులో ఉంచుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కారకాలని దూరం చేస్తాయి. రక్తహీనత బారిన పడకుండా సీతాఫలం కాపాడుతుంది. కండరాలను దృఢంగా ఉంచే మెగ్నీషియం పోషకాన్ని అందిస్తుంది. సీతాఫలంలో ఉండే కాపర్ రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. ఒక సీతాఫలంలోనే వెయ్యి మిల్లీ గ్రాముల కాపర్ లభిస్తుంది. ఇంకా దీనిలో లభించే డయిటరీ పీచు జీర్ణ వ్యవస్థ పనితీరు బాగుండేలా చూస్తుంది. విటమిన్ ఎ కలిగి ఉండటంతో కంటిచూపు బాగుండేందుకు తోడ్పడుతుంది. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఈ కాలంలో వేధించే సమస్యలతో పోరాడతాయి.
సీతాఫలం తినడంవలన ఇన్ఫెక్షన్లు దరి చేరవు. గాయాలు కూడా త్వరగా మానుతాయి సీజన్లో రోజూ వీటిని తినడం వల్ల కడపులో మంట తగ్గుతుంది. జీర్ణశక్తి పెంపొందుతుంది. ఎముకలు దృఢంగా మారతాయి. కండరాలు, నరాల బలహీనతను అధిగమించడానికి సీతాఫలం తోడ్పడుతుంది. చెడు కొలస్ట్రాల్ ను తొలగిస్తుంది. మలబద్దకం తగ్గిస్తుంది. జీర్ణ వ్యవస్థని మెరుగుపరుస్తుంది. కీళ్ల సమస్యకు ఈ పండు మంచి పరిష్కారం. పురుషులలో నరాల బలహీనత సమస్యను అరికడుతుంది. గర్భిణీలు కూడా తప్పక తినదగ్గ పండు సీతాఫలం. పిల్లలు పుట్టే సమయంలో నొప్పుల్ని నివారించే గుణం ఈ పండుకి ఉంది. కండ పుష్టికి సులువైన మార్గం. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. రక్త హీనతను తగ్గిస్తుంది. చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. సీత ఫలం ఆకులను పసుపుతో కలిపి పేస్ట్ ల తయారుచేసి గాయాలకు లేపనం లాగా పూస్తే త్వరగా మానిపోతాయి. సీతాఫలం గింజలు పొడిచేసి ఆయిల్ లో కలిపి కుదుళ్లకు పట్టిస్తే పేళ్లు, చుండ్రు సమస్య తగ్గిపోతుంది. దంతాల వాపు, రక్తం కారడం లాంటి సమస్యలకు ఈ ఆకుల రసం పూస్తూ ఉంటె సమస్య క్రమంగా తగ్గిపోతుంది. ఈ పండు వలన ఇన్ని లాభాలున్నాయి కాబట్టే సీతాఫలాలకు డిమాండ్ పెరిగిపోతుంది. కాబట్టి కాస్త రేటు ఎక్కువైనా ఈ సీజన్లో సీతాఫలాలు కొనుక్కు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది.
AP Politics: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రోజురోజుకు మద్దతు పూర్తిగా తగ్గిపోతుందని చెప్పాలి.ఇలా వైసిపికి మద్దతు తగ్గిపోతూ కూటమికి భారీ స్థాయిలో మద్దతు లభిస్తుంది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సైతం కూటమికి మద్దతు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇటీవల చిరంజీవిని సీఎం రమేష్, పంచకర్ల రమేష్ కలిసారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు. తెలుగుదేశం బిజెపి, జనసేన కూటమిగా ఏర్పడటం శుభ పరిణామం అని తెలిపారు. చాలా సంతోషంగా ఉంది చాలా రోజుల తర్వాత రాజకీయాల గురించి మాట్లాడుతున్నానని తెలిపారు.
ఇలా నేను రాజకీయాల గురించి మాట్లాడుతున్నాను అంటే కేవలం తమ్ముడు పవన్ కళ్యాణ్ కారణం ఈయన తెలిపారు. సీఎం రమేష్ నా చిరకాల మిత్రుడు చాలా మంచివారు. పంచకర్ల రమేష్ నా ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చారు. ఇద్దరు నాకు కావలసినవారు ఇద్దరు సమర్థులే వారికి ఓటు వేసే గెలిపించాలి అంటూ చిరంజీవి తెలిపారు. వీరిద్దరు గెలిస్తే నియోజకవర్గం అభివృద్ధికి దోహదపడతారని చిరంజీవి తెలిపారు.
Advertisement
మెగా ఫాన్స్ ఓట్లు కూటమికే.. ఈ విధంగా చిరంజీవి కూటమికి మద్దతు తెలియజేయడంతో మెగా ఫాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే చిరంజీవి ఇలా పరోక్షంగా మద్దతు తెలియజేయడంతో కూటమికి భారీ స్థాయిలో అభిమానుల ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. ఇది జగన్మోహన్ రెడ్డికి పెద్ద షాకే అని స్పష్టంగా తెలుస్తుంది.
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే. ఈయన జనసేన పార్టీ తరఫున 21 మంది ఎన్నికలలో పోటీ చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నటువంటి ప్రాంతాలలో పవన్ కళ్యాణ్ పర్యటనలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఇటీవల పవన్ కళ్యాణ్ భీమవరంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమం కాస్త సంచలనగా మారింది. పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ ఉండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. ఈ క్రమంలోనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఆ వ్యక్తుల జోబులలో కత్తులు కనిపించడం సంచలనంగా మారింది.
ఈ ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వేరువేరుగా పోలీసులు వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఈ యువకులు పోలీసులపైనే దాడికి ప్రయత్నించి తప్పించుకునే ప్రయత్నం చేశారు కానీ పోలీసులు వీరిని అరెస్టు చేసి స్టేషన్ కి తరలించారు. ఇక వీరి వద్ద కత్తి ఉండడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఆందోళనలు వ్యక్తం చేశారు.
Advertisement
దాడికి ప్రయత్నమా.. ఈ సభలో ఇలా వీరిద్దరూ అనుమానాస్పదంగా కత్తులతో కనిపించడంతో బహుశా జోబు దొంగలు అయ్యి ఉంటారా లేదంటే ఎవరిపైన దాడి చేయడానికి ఇలా వచ్చారా అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయితే ఈ ఇద్దరు యువకులు కూడా భీమవరంలోని బలుసుమూడి, దుర్గాపురానికి చెందిన యువకులుగా వారిని పోలీసులు గుర్తించారు.
AP Politics: ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఎంతో ఆసక్తికరంగా మారాయి. జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలి జగన్మోహన్ రెడ్డి పట్ల వ్యతిరేకత చూపిస్తూ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక ఈమె కడప ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి పై పోటీకి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇటీవల ఈమె నామినేషన్ కూడా దాఖలు చేశారు.
ఈ క్రమంలోనే ఈమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి పై రాయి దాడి జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఈ విషయం గురించి షర్మిల మాట్లాడుతూ ఒక గులకరాయికే హత్యాయత్నం అంటూ తన సొంత పత్రికలో పెద్ద ఎత్తున వార్తలు రాశారు అలాగే బ్యానర్లు కూడా కట్టారు.
ఒక చిన్న గులకరాయికి ఇంతలా విలవిలలాడితే ఏడుసార్లు గొడ్డలితో వివేకానంద రెడ్డి గారిని చంపినప్పుడు ఏమైంది జగనన్న అంటూ ఈమె ప్రశ్నించారు. తన తండ్రి దారుణంగా హత్యకు గురి అయితే గత ఐదు సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాడుతున్నటువంటి సునీత మీకు కనపడలేదా అంటూ ప్రశ్నించారు.
Advertisement
కంచుకోటకు బీటలు.. ఈ విధంగా వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి వైయస్ షర్మిల సునీత పదేపదే మాట్లాడుతూ వైసీపీకి ముఖ్యంగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్నటువంటి కడపలో ఈసారి షర్మిల దెబ్బకు కంచుకోట బద్దలు కాబోతోందని తెలుస్తోంది. ఇలా వీరి వ్యాఖ్యలతో అక్కడ ప్రజలు కూడా ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది.