Connect with us

Featured

Telugu Stop Mobile App: ఘనంగా తెలుగు స్టాప్ మొబైల్ యాప్ ప్రారంభం… ఇకపై లోకల్ వార్తలు మరింత సులభం!

Published

on

Telugu Stop Mobile App: ఎప్పటికప్పుడు వార్తా విశేషాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే వెంటనే తెలుగు స్టాప్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీ ప్రాంతంలో సినిమా, రాజకీయ వార్త విశేషాలను తెలుసుకోవాలి అంటే వెంటనే తెలుగు స్టాప్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఎప్పటికప్పుడు వార్త సమాచారాన్ని తెలుసుకోవచ్చు.

కేవలం వెబ్ మీడియా ద్వారా మాత్రమే కాకుండా మొబైల్ యాప్ ద్వారా కూడా ఎప్పటికప్పుడు న్యూస్ అప్డేట్స్ తెలుసుకునే విధంగా మండలాల వారిగాను నియోజకవర్గం అన్ని వార్తా విశేషాలను తెలుసుకోవడం కోసం తెలుగు స్టాప్ సరికొత్తగా మొబైల్ యాప్ లాంచ్ చేశారు. ఈ క్రమంలోనే తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేతుల మీదుగా ఈ తెలుగు స్టాప్ మొబైల్ యాప్ ఎంతో ఘనంగా ప్రారంభించడం జరిగింది.

పార్టీలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా ఖచ్చితమైన వార్తలను అందించడమే తెలుగు స్టాప్ ద్యేయంగా ఈ యాప్ లాంచ్ చేశారు. తెలుగు స్టాప్ చీఫ్ ఎడిటర్ వడ్లమూడి రఘు ఆధ్వర్యంలో ఎల్లప్పుడు పాఠకులకు అనుగుణంగా సమగ్రమైన ఖచ్చితమైన వార్త విశేషాలను అందిస్తూ ఎంతోమంచి గుర్తింపు సంపాదించుకున్న తెలుగు స్టాప్ ఇప్పుడు సరికొత్తగా తెలుగు స్టాప్ డాట్ కామ్ మొబైల్ యాప్ ద్వారా మీ ముందుకు రాబోతోంది.

Advertisement

Telugu Stop Mobile App:

ఇకపై ఎప్పటికప్పుడు మీ ప్రాంతంలో జరిగే వార్త విశేషాలను తెలుసుకోవాలంటే వెంటనే ప్లే స్టోర్ కి వెళ్లి తెలుగు స్టాప్ మొబైల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకొని తాజా సమాచారాన్ని పొందవచ్చు. మరి ఎందుకు ఆలస్యం వెంటనే ప్లే స్టోర్ కి వెళ్లి ఈ యాప్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకుని వార్త సమాచారాలను వీక్షించండి

Continue Reading
Advertisement

Featured

Nara Lokesh: నారా లోకేష్ గెలుపు పై భారీ బెట్టింగ్స్.. ఓ రేంజ్ లో జరుగుతున్న బెట్టింగ్?

Published

on

Nara Lokesh: బెట్టింగులు అంటే ఒకప్పుడు కోళ్ల పందేల వరకు మాత్రమే ఉండేవి అయితే అనంతరం క్రికెట్ మ్యాచ్ లపై కూడా చాలామంది బెట్టింగులు కడుతూ వచ్చారు. కానీ ఇప్పుడు ఈ అలవాటు రాజకీయాల వరకు కూడా పాకిపోయిందని తెలుస్తుంది. ఏపీలో ఏ ప్రభుత్వం అధికారంలోకి రాబోతోంది అంటూ పెద్ద ఎత్తున బెట్టింగ్ రాయుళ్ళు కోట్లలో బెట్టింగులు కాస్తూ ఉన్నారు.

ముఖ్యంగా కూటమి అధికారంలోకి రాబోతుందని కొందరు లేదు వైఎస్సార్సీపి అధికారంలోకి రాబోతుందని మరికొందరు భారీ స్థాయిలో బెట్టింగులు కట్టారు. ఇకపోతే మంగళగిరిలో గత ఎన్నికలలో భాగంగా నారా లోకేష్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి మాత్రమే ఇక్కడ భారీ మెజారిటీతో గెలుస్తారు అంటూ పెద్ద ఎత్తున మంగళగిరిలో బెట్టింగ్ నడుస్తుందని తెలుస్తోంది.

మంగళగిరిలో నారా లోకేష్ విజయం ఖాయం అయితే ఈయనకు వచ్చే మెజారిటీపై ఏకంగా 50 కోట్ల రూపాయల వరకు బెట్టింగులు వేసినట్టు తెలుస్తోంది. 50 కోట్ల రూపాయల బెట్టింగ్ అంటే మామూలు విషయం కాదని చెప్పాలి అయితే లోకేష్ పై మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో వచ్చే మెజారిటీపై కూడా ఇదే స్థాయిలో బెట్టింగ్ నడుస్తోందని సమాచారం.

Advertisement

కోట్లలో బెట్టింగులు..
అయితే గత ఎన్నికలలో భాగంగా ఇలా పలు రాజకీయ నాయకుల మెజారిటీల గురించి భారీ స్థాయిలో బెట్టింగులు నడిచాయి ఇలా బెట్టింగ్ వేసుకున్నటువంటి వారందరూ కూడా చేతులు కాల్చుకున్నారు. అయితే తాజాగా మరోసారి అదే స్థాయిలో బెట్టింగులు వేయటం చూస్తుంటే ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు ఎంత ఆసక్తికరంగా మారాయో తెలుస్తుంది.

Advertisement
Continue Reading

Featured

Tollywood: టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరో అతనేనా… మెగా హీరోలకు ఇది షాకింగ్ న్యూసే?

Published

on

Tollywood: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు అయితే ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి హీరోల అభిమానులు మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని తరచూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున గొడవ పడుతూ ఉంటారు. అయితే ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరో ఎవరు అనే విషయాలు గురించి ఎప్పటికప్పుడు పలు సర్వేలు తెలియజేస్తూ ఉంటాయి.

తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరో ఎవరు అనే విషయం గురించి ప్రముఖ మీడియా సంస్థ ఏప్రిల్ 24 వరకు నిర్వహించిన సర్వే ఫలితాలు వెల్లడించింది. తెలుగు మోస్ట్ పాప్యులర్ మేల్ స్టార్స్ పేరిట జరిగిన సర్వే లో కొన్ని షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. ఈ సర్వేలలో భాగంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా ప్రభాస్ మొదటి స్థానాన్ని కైవసం చేసుకోగా రెండో స్థానంలో మహేష్ బాబు నిలిచారు.

ఇక మూడో స్థానంలో ఎన్టీఆర్ నాలుగో స్థానంలో అల్లు అర్జున్ 5వ స్థానంలో రామ్ చరణ్ ఉన్నారు. ఇక ఆరవ స్థానం నుంచి వరుసగా 10 వరకు ఆరవ స్థానంలో పవన్ కళ్యాణ్, నాని, రవితేజ చిరంజీవి విజయ్ దేవరకొండ వరుసగా 6 నుంచి పది స్థానాలలో చోటు దక్కించుకున్నారు.

Advertisement

మొదటి స్థానంలో ప్రభాస్..
ఇలా ఇండస్ట్రీలో నెంబర్ వన్ సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీగా మెగా ఫ్యామిలీకి గుర్తింపు పొంది కానీ ఈ సర్వేలో మాత్రం మెగా హీరోలు నాలుగు ఐదు స్థానాలలో ఉండటంతో ఇది నిజంగానే వారికి షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. ఇక ఈ సర్వేలో ప్రభాస్ మొదటి స్థానంలో ఉండడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Continue Reading

Featured

Chiranjeevi: నాగబాబుకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన చిరు..ఆ ట్వీట్ కారణమా?

Published

on

Chiranjeevi: సినీ నటుడు చిరంజీవి తన తమ్ముడు నాగబాబుకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారని తెలుస్తోంది. సాధారణంగా తన తమ్ముళ్లపై ఎంతో ప్రేమ కురిపించే చిరంజీవి ఇలా నాగబాబును తిట్టడం వెనుక కారణం లేకపోలేదని తెలుస్తుంది. ఇటీవల ఎన్నికలు పూర్తయిన తర్వాత నాగబాబు సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్ అందుకు కారణమని చెప్పాలి.

సోషల్ మీడియా వేదికగా నాగబాబు మావాడైన పరాయి వాడికి సపోర్ట్ చేస్తే తను పరాయి వాడే పరాయి వాడు మా పక్క నిలబడితే మా వాడే అంటూ ఈయన చేసిన పోస్ట్ సంచలనంగా మారింది. అయితే ఇది అల్లు అర్జున్ ని ఉద్దేశించే చేశారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఈ వార్త వైరల్ అవ్వడమే కాకుండా నాగబాబు పై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు.

ఇలా పరోక్షంగా నాగబాబు అల్లు అర్జున్ ని ఉద్దేశించి చేశారంటూ చాలామంది మెగా ఫ్యామిలీ పై విమర్శలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే రెండు కుటుంబాల మధ్య పోరు మొదలవుతూ ఉన్న నేపథ్యంలో చిరంజీవి నాగబాబుకు వార్నింగ్ ఇచ్చారట ఇలా మన కుటుంబ సభ్యులకు గురించి మనమే సోషల్ మీడియాలో మాట్లాడుతూ పరువు పోగొట్టుకోవడం అవసరమా అని వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

Advertisement

మొదలైన ఫ్యాన్స్ వార్..
అయితే గత కొంతకాలంగా అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ మధ్య సరైన సఖ్యత లేదని వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ పోస్టులతో అది నిజమేనని, కానీ మెగా ఫ్యామిలీ లేకపోతే అల్లు అర్జున్ లేరు అని అభిమానుల వ్యాఖ్యలను బన్నీ ఫాన్స్ తిప్పి కొడుతున్నారు. ఇలా రెండు కుటుంబాల అభిమానుల మధ్య సోషల్ మీడియా వార్ కూడా మొదలైందని చెప్పాలి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!