Connect with us

Featured

Tollywood : ఒకే భాష.. కానీ మూడు ప్రాంతాల యాసలతో సినిమాలను కుమ్మేశారు..!!

Published

on

Tollywood : భాష, యాసలతో కూడుకున్న మొరటైన కథలను ఎక్కువగా మనం తమిళ చిత్రాలలో చూస్తుంటాం. ఎందుకో ఈమధ్య డైరెక్టర్ సుకుమార్ అలాంటి కథలకి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అలాంటి కథతో వచ్చిన సినిమాలే ఆయనకి సినీ పరిశ్రమలో పేరును తీసుకువచ్చాయి.

Advertisement

1985లో జరిగిన.. ఇతివృత్తంగా “రంగస్థలం” సినిమా కథని తీర్చిదిద్దారు. ఓ పాత కథ , ఏమాత్రం కొత్తదనం లేదు. కానీ కథ స్క్రీన్ ప్లే ఓ కొత్త తరహాలో వెళుతుంది. గోదావరి ప్రాంతాన్ని ఏ సినిమాలో తీసుకున్న నీటితో నిండిన గోదావరి పారుతుంటే.. సగటు ప్రేక్షకుడు ఎంతో ఆనందపడేవాడు. ఆ సినిమా కూడా అంతటి ఘన విజయాన్ని సాధించేది. అలా ఈ చిత్రానికి రామ్ చరణ్,సమంత లాంటి హీరో, హీరోయిన్స్ తోడవడంతో సూపర్ హిట్ గా నిలిచింది.

మొరటైన పచ్చి పల్లెటూరు కథతో వచ్చిన రంగస్థలం చిత్రాన్ని ప్రేక్షకులు హిట్ చేయడంతో.. డైరెక్టర్ సుకుమార్ మళ్ళీ ఓ మొరటైన కథ తో ఓ సినిమా రూపొందించాలనుకున్నారు. ఆ క్రమంలో.. ఈసారి ఆయన కొత్త ప్రాంతాన్ని అంటే రాయలసీమ నేపద్యంలో సినిమా రూపొందించాల అనుకున్నారు. దట్టమైన అటవీ ప్రాంతంలో కథ సాగేలా సుకుమార్ ఓ కథను రాసుకున్నాడు. తిరిగి మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో.. అల్లు అర్జున్, రష్మిక మందన హీరో, హీరోయిన్లుగా “పుష్ప” సినిమా విడుదలైంది. అల్లు అర్జున్ ని మునుపెన్నడూ చూడని విధంగా పూర్తిగా డిగ్లామరైజ్ చేస్తూ డైరెక్టర్ సుకుమార్ రాయలసీమ స్లాంగ్ తో కథని నడిపించిన తీరు తెలుగు ప్రేక్షకులే కాకుండా బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యేలా చేసింది. అలా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘనవిజయం సాధించింది.

తెలుగు రాష్ట్రాల్లోని రెండు ప్రాంతాలైన ఆంధ్ర, రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో రంగస్థలం, పుష్ప చిత్రాలు వచ్చాయి. ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో మరొక తెలంగాణ ప్రాంతం బ్యాక్ డ్రాప్ లో కూడా డైరెక్టర్ సుకుమార్ ఓ సినిమా రూపొందిస్తారని ఆసక్తిగా ప్రేక్షకులు ఎదురుచూసారు. ఆ సమయంలో.. ఆయన శిష్యుడైన శ్రీకాంత్ ఓదెల ఓ మొరటు కథ తయారు చేసుకున్నారు.ఆ కథకి తగిన విధంగా.. తెలంగాణ ప్రాంతం, సింగరేణి పరిసర ప్రాంతాలను ఎంచుకున్నారు.

అయితే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర బ్యానర్ లో శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో “దసరా” సినిమా విడుదలయింది. ఈ సినిమాలో నాని,కీర్తి సురేష్ హీరో, హీరోయిన్లుగా నటించారు. కథలో కొత్తదనం పెద్దగా లేనప్పటికీ హీరో నానిని ఇంతకుముందు డిగ్లామర్ గా ప్రేక్షకులు చూడలేదు. నాని అలా కొత్తగా కనిపించడంతో.. ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. అలా ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ మూడు తెలుగు ప్రాంతాల నేపథ్యంతో కూడుకొని వచ్చిన ఈ మూడు సినిమాలు విజయదుందుభి మోగించాయి.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Star Heroin: స్టార్ హీరోతో ప్రేమ,పెళ్లి విడాకులు..12 మందితో ఎఫైర్ పెట్టుకున్న హీరోయిన్… ఎవరంటే?

Published

on

Star Heroin: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో సీనియర్ నటి మనీషా కొయిరాల ఒకరు. ఈమె సౌత్ లో కంటే నార్త్ లోనే ఎక్కువ సినిమాలలో నటించి ఒకానొక సమయంలో బాలీవుడ్ చిత్ర పరిశ్రమను ఓ ఊపు ఊపారు. ఇక ఈమె స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలో తన వ్యక్తిగత విషయాలలో కూడా వార్తలలో నిలిచారు.

Advertisement

ఈమె ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూనే మరోవైపు పలువురు హీరోలతో ఎఫైర్ పెట్టుకుంది అంటూ వార్తలు వచ్చాయి. ఒక స్టార్ హీరోతో పీకల్లోతు ప్రేమలో పడినప్పటికీ ఆయనని పెళ్లి చేసుకోలేదు. ఇక ఈమె సామ్రాట్ దహాల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పటికీ రెండేళ్లకే తనతో విడాకులు తీసుకొని విడిపోయి పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు.

ఇలా డిప్రెషన్ లోకి వెళ్లిన మనీషా కోయిరాల మందుకు అలవాటు పడ్డారు.పెళ్లికి ముందే మనీషా కోయిరాలా ఏకంగా 12 మందితో డేటింగ్ చేసిందట. ఆమె డేటింగ్ చేసినవాళ్ల లిస్ట్ లో నటులు, వ్యాపారవేత్తలు,అంబాసిడర్ కూడా ఉన్నారు. వివేక్ ముశ్రన్‌, నానా పటేకర్‌, DJ హుస్సేన్‌, లండన్‌కు చెందిన నైజీరియన్ వ్యాపారవేత్త సెసిల్ ఆంథోనీ, ఆర్యన్ వైద్‌ వంటి ప్రముఖులతో ఈమె డేటింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది.

12 మందితో డేటింగ్..
ఇలా తరచూ డేటింగ్ ల ద్వారా కూడా ఈమె వార్తల్లో నిలిచారు. ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో బిజీగా గడిపారు. పలువురు దర్శక నిర్మాతలు సైతం ఈమె డేట్స్ కోసం ఎంతగానో ఎదురు చూసేవారు. ఇలా సినిమా ఇండస్ట్రీని ఓ ఊపిన ఈమె మధ్యలో ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్ లతో బిజీగా గడుపుతున్నారు.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: విష్ణు ప్రియకు షాక్ ఇచ్చిన నిఖిల్… కన్నీళ్లు పెట్టుకున్న నిఖిల్.. అసలు ఆట ఆరంభం!

Published

on

Bigg Boss 8: తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమం ప్రారంభం అయ్యి 5 రోజులు పూర్తయింది. ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయింది అయితే హౌస్ లో ఉన్నటువంటి 14 మంది కంటెస్టెంట్లను బిగ్ బాస్ మూడు గ్రూపులుగా విడదీశారు. అయితే ఈ గ్రూపులోకి ఎవరెవరు సభ్యులను తీసుకోవాలనేది చీఫ్ ఎన్నుకోవాల్సి ఉంటుంది.

Advertisement

ఈ క్రమంలోనే కంటెస్టెంట్ విష్ణు ప్రియ కచ్చితంగా తనని నిఖిల్ తన గ్రూపులోకి తీసుకుంటారని ఆమె భావించింది. కానీ నిఖిల్ మాత్రం ఆమెకు షాక్ ఇచ్చారు. దీంతో విష్ణు ప్రియను నైనిక తన టీమ్ లోకి తీసుకున్నారు. అయితే ఈ విషయం గురించి నిఖిల్ విష్ణుప్రియ మధ్య పెద్ద ఎత్తున చర్చ జరిగింది. వీరిద్దరికి ముందే మంచి పరిచయమున్న నేపథ్యంలో తప్పకుండా నిఖిల్ తన టీమ్ లోకి తీసుకుంటారని విష్ణు ప్రియ భావించింది కానీ అది జరగలేదు.

ఇలా ఇద్దరి మధ్య ఉన్న పరిచయం కారణంగా విష్ణు ప్రియ సరదాగా నిఖిల్ ను ఓ ఆట ఆడుకుంది. దీంతో నిఖిల్ ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలా ఇప్పటివరకు ఎంతో సరదాగా గడిపిన కంటెస్టెంట్లను మూడు గ్రూపులుగా విడదీయడంతో అసలైన ఆట మొదలైంది.

టాస్కులపై ఫోకస్..
కంటెస్టెంట్లను టీమ్స్ గా విడదీసి బిగ్ బాస్ టాస్కులను ఇవ్వడం మొదలుపెట్టారు. ఇలా ఇచ్చిన మొదటి టాస్కోలో భాగంగా ఇప్పటివరకు హౌస్ లో సైలెంట్ గా కూర్చున్న పృథ్విరాజ్ తన ఆట తీరును కనబరుస్తూ యష్మీ టీమ్ ను గెలిపించారు. దీంతో ముందు ముందు ఏ ఏ కంటెస్టెంట్ ఎలా తన ఆట తీరుతో ప్రేక్షకులను మెప్పిస్తారో తెలియాల్సి ఉంది.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు వచ్చారు బ్రో…. ఆ కంటెస్టెంట్లను ఆడేసుకుంటున్న ట్రోలర్స్!

Published

on

Bigg Boss 8: బిగ్ బాస్ కార్యక్రమానికి తెలుగులో కూడా ఎంతో మంచి ఆదరణ ఉంది. ఈ కార్యక్రమం తెలుగులో ఇప్పటికి ఏడు సీజన్లను పూర్తి చేసుకుని ఎనిమిదవ సీజన్ కూడా గత ఆదివారం ఎంతో ఘనంగా ప్రారంభమైంది. మొదట 14 మంది కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపించారు. మిగిలిన వారిని ఐదవ వారం వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి పంపించబోతున్నారని సమాచారం.

Advertisement

ఇక హౌస్ లోకి వెళ్లిన తర్వాత మొదటి రోజు నుంచే కంటెస్టెంట్లు పెద్ద ఎత్తున గొడవలు పడుతూ పోట్లాడుతూ ప్రేక్షకులకు కావాల్సినంత కంటెంట్ ఇస్తున్నారు. అయితే కొంతమంది మాత్రమే బాగా ఎక్స్పోజ్ అవుతున్నారు. మిగిలిన వారు మాత్రం అసలు హౌస్ లో ఉన్నారా లేదా అన్నా సందేహాలు వస్తున్నాయి. హౌస్ లోకి వెళ్ళేటప్పుడు ఎంతో యాక్టివ్ గా వెళ్లిన కంటెస్టెంట్లు లోపల మాత్రం అనుకున్న స్థాయిలో కంటెంట్ ఇవ్వలేకపోతున్నారనే చెప్పాలి.

ముఖ్యంగా హీరో ఆదిత్య ఓం అయితే హౌస్ లో ఉన్నాడా లేదా అన్న సందేహం మాత్రం అందరికీ కలుగుతుంది. ఈయన ఉంటే ఒంటరిగా ఉంటారు లేకపోతే నిద్రపోతూ ఉంటారు. పెద్దగా ఫేమస్ అయిన కంటెంట్ మాత్రం ఈయన ఇవ్వలేకపోతున్నారు. దీంతో పలువురు ట్రోలర్స్ బ్రో అసలు ఎందుకొచ్చావు బ్రో బిగ్ బాస్ హౌస్ కి అంటూ భారీగా విమర్శలు చేస్తున్నారు.

ఈయనతో పాటు బెజవాడ బేబక్క కూడా విమర్శలను ఎదుర్కొంటుంది. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా కనిపించే ఈమె హౌస్ లో మాత్రం ఎక్కువగా కిచెన్ లోనే ఉంటుంది. కానీ సరైన కంటెంట్ మాత్రం ఇవ్వలేకపోతున్నారు.అఫ్రిదీ కూడా డల్‌గానే ఉన్నాడనే టాక్‌ వస్తుంది. పృధ్విరాజ్, అభయ్ నవీన్ వంటి వారందరూ కూడా హౌస్ లో డల్ గా కనిపిస్తున్న తరుణంలో పలువురు మీరంతా హౌస్ లోకి ఎందుకు వచ్చారో ఏమో అంటూ వీరిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు అలాగే మరి కొంతమందిని బాగా హైలైట్ చేస్తూ కూడా కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

ఎలిమినేషన్ ఉంటుందా…
ఇక ఈ వారం నామినేషన్స్ లో భాగంగా బెజవాడ బేబక్క, విష్ణు ప్రియ, శేఖర్ భాష, నాగ మణికంఠ సోనియా ఆకుల ప్రేరణ వంటి వారు నామినేషన్ లో ఉన్నారు. అయితే గత సీజన్లో మాదిరిగా ఈ సీజన్లో కూడా మొదటి వారం ఎలిమినేషన్ ఉండకపోవచ్చని తెలుస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!