Featured
Urvashi Rautela: ఏపీ సీఎం పవన్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన నటి ఊర్వశి రౌతేలా… ఏకిపారేస్తున్న నేటిజన్స్?
![](https://telugudesk.net/wp-content/litespeed/avatar/48f246d9b01e880e5843b8d38f9199e4.jpg?ver=1719134034)
Published
11 months agoon
By
lakshanaUrvashi Rautela: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాయి ధరంతేజ్ హీరోలుగా నటించిన తాజా చిత్రం బ్రో ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి థియేటర్లలో ప్రేక్షకులను సందడి చేస్తోంది. ఇలా ఈ సినిమా నేడు విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర బృందం భారీ స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు. ఇక ఈ సినిమాలో మై డియర్ మార్కండేయ అనే సినిమాలో ముంబై ముద్దుగుమ్మ ఊర్వసి నటించిన విషయం మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే ఊర్వశి ఈ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ సినిమా నేటి విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈమె ప్రతి ఒక్కరు ఈ సినిమాని చూడాలి అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. అంతేకాకుండా ఈ పోస్టుల్లో పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి అంటూ ఈమె పోస్ట్ చేయడం సంచలనంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో కలిసి బ్రో ది అవతార్ సినిమాలో నటించడం చాలా ఆనందంగా ఉంది రేపే ఈ సినిమా విడుదల కాబోతుంది అందరం మళ్ళీ కలుద్దాం అంటూ ఈమె పవన్ కళ్యాణ్ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని చేస్తూ చేసినటువంటి ఈ ట్వీట్ సంచలనగా మారింది. దీంతో నేటిజన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
![](https://telugudesk.net/wp-content/uploads/2023/07/Urvashi-Rautela-Pawan.jpg-1024x555.jpg?v=1690539922)
Urvashi Rautela: ఆ మాత్రం జ్ఞానం లేదా..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ అనే విషయాన్ని ఈమె మర్చిపోయి ఇలాంటి పోస్ట్ చేశారా లేకపోతే పవన్ కళ్యాణ్ ని సీఎం అనుకొని ఇలాంటి పోస్ట్ చేశారా అని కామెంట్లు చేస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ అని పవన్ కళ్యాణ్ జనసేన అధినేత మాత్రమేనని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరో కూడా తెలియని పొజిషన్లో ఉన్నారా అంటూ ఈమె పై మండిపడుతున్నారు.
Delighted to share screen space with the esteemed Chief Minister of Andhra Pradesh @PawanKalyan in our film #BroTheAvatar 🎥 🍿 releases tomorrow #28thJuly worldwide 🌎 story about an arrogant person who is given a second chance to fix his mistakes after death. See you all ♥️… pic.twitter.com/IncVf6q1Kb
— URVASHI RAUTELA🇮🇳 (@UrvashiRautela) July 27, 2023
You may like
Pawan Kalyan: గ్లాస్ డైలాగుపై మరోసారి స్పందించిన పవన్.. మీరు ఒప్పుకోవాలంటూ రియాక్ట్ అయిన హరీష్?
Anasuya: పవన్ కళ్యాణ్ గొప్ప లీడర్.. పిలిస్తే జనసేన ప్రచారానికి వెళ్తా: అనసూయ
AP politics: పొత్తు ధర్మాన్ని పాటించకపోతే కఠిన చర్యలు తప్పవు.. పవన్ స్ట్రాంగ్ వార్నింగ్!
Pitapuram: పవన్ ను ఓడించే అందుకు కోట్లు ఖర్చు చేస్తున్న వైసీపీ… పవన్ గెలుపును ఒప్పుకున్నట్టేగా?
Pitapuram: పిఠాపురం పై ఫోకస్ చేసిన వైసీపీ అధిష్టానం.. పవన్ ఓటమి లక్ష్యమా?
Janasena: పవన్ ప్రచార సభలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న తెదేపా నాయకులు.. అందుకే పొత్తు పెట్టుకున్నారంటూ?
Featured
AP: వాలంటీర్ వ్యవస్థ పై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి ఆనం..షాక్ లో వాలంటీర్లు!
![](https://telugudesk.net/wp-content/litespeed/avatar/48f246d9b01e880e5843b8d38f9199e4.jpg?ver=1719134034)
Published
2 mins agoon
29 June 2024By
lakshanaAP: ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ వ్యవస్థ గురించి ప్రస్తుతం ఎన్నో సందేహాలు వాలంటీర్ వ్యవస్థ గురించి ఎన్నో ప్రశ్నలు కూడా తలెత్తుతూ ఉన్నాయి. ఒకటో తేదీ రానే వస్తుంది ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందజేయాలి అంటే తప్పనిసరిగా వాలంటీర్లు అవసరం కనుక జూలై ఒకటో తేదీకి ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ గురించి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుందని అందరూ ఎదురు చూస్తున్నారు.
ఇలా వాలంటీర్ గురించి ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అందరూ ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఈయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వాలంటీర్ వ్యవస్థ ఇకపై ఉండదని తేల్చి చెప్పారు.
ఇంటింటికి పెన్షన్ అందజేసే కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే సచివాలయ ఉద్యోగస్తులను నియమించారు. దీంతో వాలంటీర్ వ్యవస్థ ఉండదని గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నటువంటి తరుణంలో మంత్రి వ్యాఖ్యలు ఆందోళనకరంగా ఉన్నాయి. వాలంటీర్లతో పాటు గ్రామ పరిధిలో ఉన్నటువంటి ఆశ వర్కర్లు అంగన్వాడీ టీచర్లతో ఇంటింటికి వెళ్లి పించని పంపిణీ చేయాలని ఇప్పటికే ఆదేశాలు వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే పెన్షన్ల బాధ్యత సచివాలయ సిబ్బందికి అప్పగించారు ఇక రేషన్ పాత పద్ధతిలోనే రేషన్ షాపు వద్దకు వెళ్లి తీసుకోవాల్సి ఉంటుంది ఇలాంటి తరుణంలో వాలంటీర్ వ్యవస్థతో పనిలేదని అందుకే వాలంటీర్ వ్యవస్థ గురించి ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని అర్థమవుతుంది. అయితే మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలతో వాలంటీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆందోళనలో వాలంటీర్లు..
గత ప్రభుత్వం 5000 రూపాయల గౌరవ వేతనం చెల్లించింది కానీ చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా 10,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తున్నామని చెప్పడంతో ఎంతో మంది వాలంటీర్ ఉద్యోగం పట్ల ఆశాభావం వ్యక్తం చేస్తూ ఆయనకు ఓట్లు కూడా వేశారు కానీ గెలిచిన తర్వాత ఇలా వాలంటీర్ వ్యవస్థ గురించి నిర్ణయం తీసుకోకపోవడం వాలంటీర్ వ్యవస్థ ఉండదని చెప్పడం పట్ల వాలంటీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Featured
Rajamouli: ప్రభాస్ సినిమా.. డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను.. రాజమౌళి ఎమోషనల్ కామెంట్స్!
![](https://telugudesk.net/wp-content/litespeed/avatar/48f246d9b01e880e5843b8d38f9199e4.jpg?ver=1719134034)
Published
3 mins agoon
29 June 2024By
lakshanaRajamouli: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ కల్కి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా అద్భుతమైన టాక్ సొంతం చేసుకోవడమే కాకుండా భారీ స్థాయిలో కలెక్షన్స్ కూడా రాబట్టడంతో ఈ సినిమాపై ఎంతోమంది సినీ సెలెబ్రెటీలు స్పందిస్తూ వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్ సినిమాలకు సంబంధించి గత విషయాలు కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ప్రభాస్ ఒకప్పుడు కేవలం తెలుగు చిత్ర పరిశ్రమకు మాత్రమే పరిమితమయ్యారు కానీ ప్రభాస్ కి ఈ స్థాయిలో క్రేజ్ రావడానికి కారణం మాత్రం రాజమౌళి అని చెప్పాలి ఈయన దర్శకత్వంలో బాహుబలి సినిమా ద్వారా ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇక బాహుబలి సినిమాని ద్వారా రాజమౌళి ఎవరు చేయని సాహసం చేశారు.
అప్పటివరకు బాలీవుడ్ ఇండస్ట్రీలో సౌత్ సినిమాలకు పెద్దగా క్రేజీ లేదు అంతేకాకుండా బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఈ సినిమాలో లేరు అక్కడ ఈ సినిమా సక్సెస్ అవుతుందా అన్న సందేహంతోనే రాజమౌళి తనపై తాను నమ్మకం ఉంచి ఈ సినిమాని విడుదల చేశారు. ఇక ఈ సినిమా నార్త్ లోకి మంచి ఆదరణ పొందినప్పటికీ తెలుగు రాష్ట్రాలలో మాత్రం డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది.
నెగటివ్ టాక్..
ఇలా తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాకి నెగటివ్ టాక్ రావడంతో తాను చాలా కంగారపడ్డానని ఆ సమయంలో డిప్రెషన్ లోకి కూడా వెళ్లిపోయానని తెలిపారు. కానీ రాజమౌళి విజినరీ ముందు నెగిటివ్ టాక్ కొట్టుకుపోయి ప్రతి ఒక్కరు కూడా కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపారనే టాక్ కారణంగా సినిమా చూడటానికి వెళ్లి ఈ సినిమాని విజయవంతం చేశారని తెలుస్తోంది.
Featured
Ap: పీవీకి ఎన్టీఆర్ కు లేని సంస్కరణ సభ రామోజీరావుకు ఎందుకు.. ఇది కులాభిమానమేనా?
![](https://telugudesk.net/wp-content/litespeed/avatar/48f246d9b01e880e5843b8d38f9199e4.jpg?ver=1719134034)
Published
5 mins agoon
29 June 2024By
lakshanaAp: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడలో పత్రికా అధినేత రామోజీరావుకు సంస్కరణ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సభను నిర్వహించడం కోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఈ విధంగా చంద్రబాబు నాయుడు రామోజీరావుకు సంస్కరణ సభ ఏర్పాటు చేయడంతో వైఎస్ఆర్సిపి నేత హైకోర్టు న్యాయమూర్తి నారపరెడ్డి రాజారెడ్డి ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధానమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు చనిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధమైనటువంటి సంస్కరణ సభలు నిర్వహించలేదు కానీ పత్రికా రంగం అధినేత రామోజీరావుకు ఎందుకు ప్రభుత్వం తరఫున సంస్కరణ సభ నిర్వహించారని ప్రశ్నించారు. ఈయనకు ఏ అర్హత ఉందని ప్రభుత్వం తరఫున కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఈ సభను నిర్వహించారని ఆయన ప్రశ్నించారు.
దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చనిపోయినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నారు అప్పుడు ఎందుకు ఎన్టీఆర్ సంస్కరణ సభ నిర్వహించలేదని ప్రశ్నించారు. ఎన్టీఆర్ ను గద్దె దింపి చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావడానికి రామోజీరావు ఎంతగానో దోహదం చేశారు కనుక ఈ సంస్కరణ సభ నిర్వహించారా?
విచ్చలవిడిగా ప్రజాధనం ఖర్చు..
వైఎస్ జగన్పై ఈనాడు పత్రికలో అనేక అబద్ధాలు వండి వార్చి ప్రజలను ఏమార్చిన రామోజీరావు రుణం తీర్చుకునేందుకే చంద్రబాబు ప్రభుత్వం సొమ్మును విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారా అంటూ ఈయన తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇక చంద్రబాబు నాయుడుకు రామోజీరావు రైట్ హ్యాండ్ లాంటి వ్యక్తి అని చెప్పాలి. ఇక ఈయన మరణంతో ప్రజల సొమ్ముతో ఇలా సంస్కరణ సభలు చేయడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
![](https://telugudesk.net/wp-content/uploads/2024/06/anam-80x80.webp)
AP: వాలంటీర్ వ్యవస్థ పై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి ఆనం..షాక్ లో వాలంటీర్లు!
![](https://telugudesk.net/wp-content/uploads/2023/08/Rajamouli.jpg?v=1691127301)
Rajamouli: ప్రభాస్ సినిమా.. డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను.. రాజమౌళి ఎమోషనల్ కామెంట్స్!
![](https://telugudesk.net/wp-content/uploads/2024/06/babu-80x80.jpg?v=1719641044)
Ap: పీవీకి ఎన్టీఆర్ కు లేని సంస్కరణ సభ రామోజీరావుకు ఎందుకు.. ఇది కులాభిమానమేనా?
![](https://telugudesk.net/wp-content/uploads/2024/06/Pawan-Kalyan-2-80x80.jpg?v=1718069386)
Pawan Kalyan: రామోజీరావు ఆ మాట విన్న తర్వాతే మరణించారు: పవన్ కళ్యాణ్
![](https://telugudesk.net/wp-content/uploads/2024/06/ys-jagan-1-80x80.webp)
YS Jagan: జగన్ ప్రజలను మోసం చేయలేనని చెప్పారు.. సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత!
![](https://telugudesk.net/wp-content/uploads/2024/06/nallari-kirankumarireddy-80x80.png?v=1717917965)
Nallari Kiran Kumar Reddy : ఏపీలో దురదృష్టవంతుడంటే ఆయనే.. అంత సునామీలోనూ ఓటమి..
![](https://telugudesk.net/wp-content/uploads/2024/05/pallavi-prashanth-80x80.jpg?v=1717061451)
Pallavi Prashanth: జల్సాలకు అలవాటు పడిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్… మాట తప్పినట్లేగా?
![](https://telugudesk.net/wp-content/uploads/2024/05/balakrishna-80x80.webp)
Balakrishna: స్టేజ్ పైన హీరోయిన్ ను తోసేసిన బాలయ్య.. ఘాటుగా స్పందించిన వైసీపీ పార్టీ?
![](https://telugudesk.net/wp-content/uploads/2024/06/Ramoji_Rao-80x80.jpg?v=1717817310)
Ramoji Rao: ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు అస్తమయం!
![](https://telugudesk.net/wp-content/uploads/2022/12/aadi-reddy.jpg..jpg?v=1671517810)
Aadi Reddy: బిగ్ బాస్ ఆదిరెడ్డి యూట్యూబ్ నెల సంపాదన ఎంతో తెలుసా… సాఫ్ట్ వేర్స్ కూడా వేస్టే!
Trending
- Featured3 weeks ago
Nallari Kiran Kumar Reddy : ఏపీలో దురదృష్టవంతుడంటే ఆయనే.. అంత సునామీలోనూ ఓటమి..
- Featured4 weeks ago
Pallavi Prashanth: జల్సాలకు అలవాటు పడిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్… మాట తప్పినట్లేగా?
- Featured4 weeks ago
Balakrishna: స్టేజ్ పైన హీరోయిన్ ను తోసేసిన బాలయ్య.. ఘాటుగా స్పందించిన వైసీపీ పార్టీ?
- Featured3 weeks ago
Ramoji Rao: ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు అస్తమయం!
- Featured4 weeks ago
Aadi Reddy: బిగ్ బాస్ ఆదిరెడ్డి యూట్యూబ్ నెల సంపాదన ఎంతో తెలుసా… సాఫ్ట్ వేర్స్ కూడా వేస్టే!
- Featured3 weeks ago
Modi 3.0 : ఏపీకి ఐదు కేంద్ర మంత్రి పదవులు.. ఎవరెవరికంటే..
- Featured4 weeks ago
AP Election Results : తొలి ఫలితం నగరి నుంచే.. మొదట తేలేది రోజా జాతకమే..!
- Featured3 weeks ago
YS Jagan : పడి లేచిన కెరటమవుతారా? పత్తా లేకుండా పోతారా?