Connect with us

Featured

టాప్ హీరో చేయూత ఇచ్చిన దారుణమైన స్థితిలో మరణించిన బాలక్రిష్ణ మొదటి సినిమా హీరోయిన్

Published

on

బాలకృష్ణ మొదటి హీరోయిన్ ఆత్మహత్యచేసుకుందని మీకు తెలుసా….?
విజ్జి…. ఎయిటీస్ లో ఆమె కోలీవుడ్ ఇండస్ట్రీ లో ఒక చక్కటి నటి. అందం, అభినయం రెండూ కలగలిసిన ఆమె 1982 లో గంగై అమరన్ చిత్రం కోళి కూవుదు సినిమాతో తమిళ్ చిత్ర రంగ ప్రవేశం చేసింది. ఆ సినిమా సూపర్ హిట్టవడంతో , ఆమెకు తమిళ్ లో ఆఫర్స్ మీద ఆఫర్స్ వచ్చిపడ్డాయి. ఆమె సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ ఆమె తనకెరీర్ ను ప్లాన్డ్ గా కొనసాగించింది. అప్పటి తమిళ్ ఇండస్ట్రీలోని అందరి ప్రముఖ హీరోల సినిమాల్లోనూ ఆమెకు ఆఫర్స్ వచ్చిపడ్డాయి. ముఖ్యంగా విజయ్ కాంత్ నటించిన సినిమాల్లో ఆమెకు తరచుగా ఆఫర్స్ వస్తూండేవి. విజయకాంత్ తో ఆమెకున్న మంచి పరిచయం కారణంగానే దర్శకులు ఆమెను తీసుకునేవారు. ఆ టైమ్ లోనే బాలకృష్ణ హీరోగా నటించిన మొదటి చిత్రం సాహసమే జీవితం సినిమాలో ఆమెను హీరోయన్ గా సెలెక్ట్ చేసారు. ఆ సినిమాకి పి.వాసు, మహానది, గుణ సినిమాలతో దర్శకుడిగా పేరు తెచ్చుకున్న సంతాన భారతి కలిసి భారతి వాసు పేరుతో ఆ సినిమాను డైరెక్ట్ చేసారు. ఇదిలా ఉంటే, విజ్జీ సినీ జీవితం ఎలా ఉన్నా, ఆమె వ్యక్తిగత జీవితం మాత్రం ఎన్నో ఒడిదుడుకులతో సాగేది. ఆమె అప్పట్లో తమిళ్ దర్శకుడు ఎ.ఆర్ .రమేష్ ను గాఢంగా ప్రేమించింది. అతడికి పెళ్ళైనా సరే అతడి తో ఎఫైర్ కంటిన్యూ చేస్తూండేది. అతడ్ని తరుచుగా తనను పెళ్లిచేసుకోమని ఒత్తిడి చేసేది. కానీ అతడు జవాబు చెప్పకుండా తప్పించుకొనేవాడు.
అయితే ఆమెను దురదృష్టం మరో కోణంలో వెంటాడింది. 1996లో పూవే ఉనక్కాగ అనే సినిమా షూటింగ్ లో ఉండగా, ఆమెకు బ్యాక్ పెయిన్ ఎటాక్ అయింది. అది సివియర్ గా మారడంతో , ఆమె వెన్నుపూసకు ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ, చెన్నై అపోలో హాస్పటిల్ లో ఆమెకు చేసిన ఆపరేషన్ ఫెయిల్ అయింది. లోపల ఇన్ఫెక్షన్ కారణంగానే ఈ ఆపరేషన్ ఫెయిల్ అయిందని డాక్టర్లు చెప్పారు. మరి కొన్ని సర్జరీలు చేయడంతో ఆమెకు తాత్కాలిక పక్షవాతం వచ్చింది. దాంతో అపోలో హాస్పటల్ మీద ఆమె కేసు ఫైల్ చేసింది. అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి కలగచేసుకోవడంతో ఆమెకు అపోలో వాళ్లు ముప్పై వేలు నష్ట పరిహారంగా చెల్లించారు. ఆ తర్వాత చేసిన మరో సర్జరీతో ఆమె వెన్నునెప్పి తగ్గిపోయింది. దీని ఫలితంగా ఆమెకు ఛాన్సులు కరువయిపోయాయి. విజయకాంత్ వల్ల ఒకటో రెండో సినిమాల్లో ఛాన్సులొచ్చాయి. ఆమె హస్పటిల్ లో ఉన్న సమయంలో విజ్జి ప్రేమించిన దర్శకుడు ఎ.ఆర్ .రమేష్ వచ్చిపోతుండేవాడు. అప్పడు అతడ్ని విజ్జి తన పెళ్లిగురించి మరింత వత్తిడి చేసింది. తనుకు పెళ్లైందని , నీతో ఎఫైర్ మాత్రమే కొనసాగిస్తానని , విజ్జి మధ్యవర్తులతో ఖరాఖండిగా చెప్పేసాడు. దాంతో తీవ్ర మనస్థాపానికి గురైన విజ్జి, 2000 సంవత్సరంలో చెన్నై మహాలింగపురంలో ఉన్న తన అపార్ట్ మెంట్ లో ఫ్యాన్ కు ఉరిపోసుకొని ఆత్మహత్యచేసుకుంది. చనిపోయే ముందు రమేష్ తో తను మాట్లాడిన టెలిఫోన్ సంభాషణను రికార్డు చేసి , తన చావుకు అతడే కారణమని సూసైడ్ నోట్ రాసి మరీ చనిపోయింది. ఆ తర్వాత దర్శకుడు రమేష్ ను పోలీసులు రిమాండ్ కు తరలించారు. అలా… కేవలం 34 ఏళ్ల ప్రాయంలోనే తను ప్రేమించిన వాడికోసం అసువులు బాసింది ఆ అందాల హీరోయిన్.

Advertisement
Continue Reading
Advertisement

Featured

ITR FIling : గడువు పెంచలేదు.. ఫేక్ న్యూస్ నమ్మొద్దు.. “జూలై 31వ తేదీలోపు మీ ITR ఫైల్ చేయండి”.. కీలక ప్రకటన చేసిన ఐటీ శాఖ

Published

on

ITR ఫైలింగ్ : పన్ను చెల్లింపుదారులకు ముఖ్యమైన గమనిక. మీరు FY 2023-2024 కోసం మీ ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఇంకా ఫైల్ చేయలేదా? ఆదాయపు పన్ను శాఖ మరో కీలక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నెల 31లోగా ఐటీ రిటర్నులు సమర్పించాలని కోరింది ఐటీ శాఖ. మరో నెల రోజులు గడువు పెంపుపై వస్తున్న వార్తల్లో నిజం లేదని తేలింది. పన్ను చెల్లింపుదారులు ఇలాంటి ఫేక్ న్యూస్ నమ్మవద్దని సోషల్ మీడియా ఎక్స్ లో సూచించింది.

గడువు 4 రోజులు మాత్రమే. జూలై 31వ తేదీలోపు ITR ఫైల్ చేయాలి. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ వీలైనంత త్వరగా రిటర్నులు సమర్పించాలని ఐటీ శాఖ సూచించింది. పన్ను పోర్టల్ లో ఎటువంటి సాంకేతిక సమస్య లేదు. మీరు గడువు సమయంలోపు ITR ఫైల్ చేయకపోతే, మీరు సెక్షన్ 234A కింద వడ్డీని మరియు ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 234F కింద జరిమానా చెల్లించవలసి ఉంటుంది.

మరోవైపు ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేసి వాపసు కోరుతున్న వారిని కూడా ఐటీ శాఖ హెచ్చరించింది. సైబర్ నేరగాళ్లు ఫోన్లలో మెసేజ్ లు పంపుతూ మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిసిందని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. ఇలాంటి ఫేక్ మెసేజ్‌లను చూసి మోసపోకండి మరియు రీఫండ్ కోసం మీ బ్యాంక్ ఖాతా వివరాలు మరియు వన్-టైమ్ పాస్‌వర్డ్‌లను అడుగుతూ మీకు కాల్ వస్తే అప్రమత్తంగా ఉండండి. అటువంటి లింక్‌లపై క్లిక్ చేయవద్దు. ఇప్పటి వరకు 5 కోట్ల మంది పన్ను రిటర్నులు దాఖలు చేసినట్లు గుర్తించింది. వీరిలో ఇప్పటికే 1.8 మిలియన్ల రిటర్న్‌లు ప్రాసెస్ చేయబడి, రీఫండ్ ఖాతాలకు జమ అయినట్లు కూడా తెలిపింది.

Advertisement

Continue Reading

Featured

Niharika: యుద్ధం గెలిచిన రాముడు అయోధ్యకు వచ్చినట్టు ఉంది… బాబాయ్ పై నిహారిక కామెంట్స్!

Published

on

Niharika: నిహారిక కొణిదెల పరిచయం అవసరం లేని పేరు. ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీలో నిర్మాతగా నటిగా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు. తన భర్త నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన నిహారిక తిరిగి కెరియర్ పై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే నిర్మాతగా కూడా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇక నిహారిక నిర్మాణంలో తెరకెక్కిన కమిటీ కుర్రోళ్ళు సినిమా ఆగస్టు 9వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈమె ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆహాలో ప్రసారమవుతున్న సర్కార్ సక్సెస్ సెలబ్రేషన్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.

ఇక ఈ ప్రోమోలో భాగంగా నిహారిక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ నేను వచ్చేది ఎప్పుడు నెక్స్ట్ సీజనా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సుడిగాలి సుదీర్ రెస్పాండ్ అవుతూ మీకేంటండి మీరు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలూకా అంటూ మాట్లాడారు. అనంతరం పవన్ కళ్యాణ్ విజయం సాధించిన తర్వాత చిరంజీవి ఇంటికి వచ్చి ఆశీర్వాదం తీసుకున్న వీడియో ఎంతలా వైరల్ అయిందో మనకు తెలిసిందే .ఇక ఈ వీడియోని ప్లే చేశారు.

Advertisement

యుద్ధం గెలిచిన రాముడు…
ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది అంటూ నిహారికను ప్రశ్నించారు. ఇక నిహారిక ఈ వీడియో గురించి మాట్లాడుతూ యుద్ధం గెలిచిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకు వచ్చినప్పుడు కూడా ఇలాగే ఉండేదేమో అనిపించింది అంటూ తన బాబాయ్ విజయం గురించి నిహారిక మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Anasuya: ఇకపై రంగమ్మత్త లాంటి పాత్రలు అసలు చేయను.. గ్లామర్ పాత్రలకు సై అంటున్న అనసూయ?

Published

on

Anasuya: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు. ఈమె జబర్దస్త్ యాంకర్ గా బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ అందుకొని అనంతరం వెండి తెరపై సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా వెండితెరపై వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న అనసూయ తిరిగి బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈమె స్టార్ మా లో ప్రసారమవుతున్న కిరాక్ బాయ్స్ కిలాడి లేడీస్ అనే కార్యక్రమంలో సందడి చేస్తున్నారు. ఇలా ఒక వైపు బుల్లితెర కార్యక్రమాలు మరోవైపు వెండితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్న అనసూయ త్వరలోనే సింబా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ఈమె మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఇటీవల కాలంలో మీరు చాలా సినిమాలను రిజెక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది కారణం ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ తాను సినిమాలు రిజెక్ట్ చేస్తున్న మాట నిజమేనని తెలిపారు. నేను ఒక సినిమాలో నటించిన పాత్ర హిట్ అవడంతో తదుపరి సినిమాలలో కూడా అలాంటి పాత్రలలో నటించే అవకాశం వస్తుందని తెలిపారు.

Advertisement

రంగమ్మత్త..
ఇలా ఒక పాత్రలో నటించిన తర్వాత తిరిగి అలాంటి పాత్రలలో నటించిన ప్రేక్షకులు పెద్దగా తీసుకోలేరు ఉదాహరణకు రంగమ్మత్త పాత్ర చాలా హైలెట్ అయింది. తదుపరి అలాంటి పాత్రలు వస్తే నేను చెయ్యను నేను అన్ని చాలా డిఫరెంట్ గా ఉండేలా చేయాలని భావిస్తున్నాను. ఇక ఎక్కువగా తాను గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా అనసూయ గ్లామర్ రోల్ చేయడానికి సై అంటూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!