Connect with us

Featured

రక్తం గ్రూపుని బట్టి వ్యక్తుల గుణగణాలు ఎలా ఉంటాయో తెలుసుకోండి.

Published

on

వ్యక్తి తల రాతను బట్టి వ్యక్తిత్వాలు ఉంటాయని తెలుసు. ఆకారాన్ని బట్టి వ్యవహరిస్తారని తెలుసు. ఆఖరికి నిద్రపోయే విధానాన్ని బట్టి వారి వ్యక్తిత్వాలు ఉంటాయని కూడా తెలుసు. ఇక జోతిష్యం సంగతి కూడా తెలుసు కానీ రక్త వర్గాలను బట్టి వ్యక్తులుంటారా? కానీ ఇది నిజమనే చెప్తున్నారు నిపుణులు. అదికూడా పరిశోధనల ద్వారానే దీన్ని ధ్రువపరిచామని కూడా వారు తెలిపారు. కాబట్టి ప్రతి వ్యక్తికీ ఏదో ఒక కోణం.. ఆలోచనా విధానం ఉంటుంది. అలాగే వ్యక్తిగతంగా ఓ బ్లడ్‌గ్రూప్ కూడా ఉంటుంది. రక్తం చెప్పే మనస్తత్వాల గురించి ఏమాత్రం లేట్ చేయకుండా తెలుసుకుందామా…

ఆ బ్లడ్‌గ్రూప్‌లోని హిమోగ్లోబిన్ శాతమెంత? ప్లాస్మా పర్సెంటేజీ ఏంటీ? వంటి విషయాలు పక్కనబెడితే పర్సనాలిటీ.. మనసు కోణంలోనే ఆలోచిస్తే రక్తవర్గ చరిత్ర తెలుసుకోవచ్చు! మనలో చాలామంది దానగుణాలు చేసే వ్యక్తిత్వం కలవారుంటారు. ఇతరులను చూస్తే ఓర్వలేని వారుంటారు. ఒకరైతే వేరొకరి కోసం జీవితాన్నే త్యాగం చేసేవాళ్లు. మరొకరు ఎప్పటికీ.. ఎవ్వరికీ అర్థంకానివాళ్లు. ఇలా ఒక్కొక్కరిది ఒక్కో పరిస్థితి. ఈ చర్యలన్నీ శరీరంలో ప్రతిక్షణం సరఫరా అయ్యే ప్రతి రక్తం బొట్టుపై ఆధారపడి ఉంటుందనేదే ఆసక్తి.. ఆశ్చర్యం కలిగించే విషయం. అందుకే ఇవి తెలుసుకోవాలనే ఆసక్తి ఉండటంలో తప్పు లేదు!

Advertisement

బ్లడ్ గ్రూపులను బట్టి మనస్తత్వం ఉంటుందని మొదటగా జపనీయులు కనిపెట్టారు. ఈ విషయం శాస్త్రీయంగా ధ్రువపడ లేదు కానీ గణాంకాల ప్రకారం సరి అవుతున్నట్లు చెప్తున్నారు మానసిక.. పర్సనాలిటీ డెవలప్‌మెంట్ నిపుణులు. దక్షిణ కొరియాలో కూడా దీనికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. అందుకే పెళ్లి సంబంధాలు.. ఉద్యోగాల విషయంలో రక్త వర్గాలను ప్రామాణికంగా పాటిస్తున్న దేశాలూ.. సంస్థలూ ఉన్నాయి! రక్తాన్ని బట్టి మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసుకుని ఆ పరంగా మనకు తెలిసిన వారి మనస్తత్వాన్ని పరిశీలిస్తుండటం సరదాగా అనిపిస్తుంది కదా!

క్రూరంగా ప్రవర్తించేవాళ్లను పచ్చినెత్తురు తాగేవాళ్లు అని అంటుంటారు. కానీ ఆయనది ఏ గ్రూపో తెలిస్తే తన క్రూరత్వాన్ని మార్చుకోవచ్చుగా అని ఆలోచించే.. రక్త వర్గాలపై కొన్నేళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. మనిషికి.. మనస్తత్వానికి ఇంత సంబంధం ఉన్నప్పుడు.. వాటికంత ప్రాధాన్యం ఉన్నప్పుడు కచ్చితంగా ఎవరికైనా తమ జాతకమేంటో తెలుసుకోవాలని ఉంటుంది. అయితే అంతకంటే ముందు రక్తంలో ఎన్ని వర్గాలు ఉంటాయి.. అసలు రక్తం అంటే ఏమిటో బ్రీఫ్‌గా తెలుసుకుందాం! ఇతిహాసాల్లో.. చరిత్రలో.. సాహిత్యంలోనూ రక్తం ప్రస్తావన ఉంది.

మహాభారతంలో ద్రౌపది వస్త్రాపరణ సందర్భంలో.. దుశ్శాసునుడి చంపి రక్తం తాగుతానని భీముడు.. ఆ నెత్తురును తల నూనెగా రాసుకుంటానని ద్రౌపది శపథం చేస్తారు! అంటే మనిషి రక్తానికి ఇచ్చే ప్రాధాన్యత ఏంటో ఇట్టే తెలిసిపోతుంది. రక్తంలో ఉండే ఎర్ర రక్తకణాలు, ప్లాస్మా, ప్లేట్టేట్స్ వేర్వేరు వ్యక్తుల్లో వేరుగా ఉంటాయి. రక్తంలో ముఖ్యంగా నాలుగు వర్గాలు ఉన్నాయి. ఏ, బీ, ఏబీ, ఓ. తిరిగి వీటిలో రీసస్ (ఆర్‌హెచ్) ఫ్యాక్టర్ ఆధారంగా పాజిటివ్ లేదా.. నెగెటివ్‌గా వర్గీకరించారు. ఓ నెగెటివ్ గ్రూప్ రక్తం విశ్వదాతగానూ.. ఏబీ పాజిటివ్ విశ్వ గ్రహీతగానూ పేర్కొంటారు. మానవ శరీర బరువులో దాదాపు 7 శాతం వరకు రక్తం ఉంటుందని పరిశోధకుల అంచనా!

Advertisement

రక్తం గురించీ ఒకమాట! రక్తం ఉపయోగం.. దాని స్థితి ఏంటో ఒకమాటలో తెలుసుకోవాలని లేదా? అయితే చదవండి. రక్తం ఆపదలో ఉన్నవారి ప్రాణాలు కాపాడుతుంది. దాదాపు 473 మిల్లీ లీటర్ల రక్తం ద్వారా ముగ్గురిని ప్రాణాపాయ స్థితుల నుంచి కాపాడుతుంది. ఒక సగటు వయోజన వ్యక్తి బరువులో 65 నుంచి 80 కిలో బరువులో దాదాపు రక్తం 4.7 నుంచి 5.5 లీటర్ల వరకు ఉంటుంది. మనిషి జీవిత కాలంలో గుండె దాదాపు 1.5 మిలియన్ బారెల్స్ రక్తాన్ని సరఫరా చేస్తోంది. గుండె ప్రతి హృదయ స్పందనలో దాదాపు 55 నుంచి 80 మిల్లీ లీటర్ల రక్తాన్ని సరఫరా చేస్తుంది.

ఏ పాజిటివ్:
వీరు నాయకత్వ లక్షణాలు కలవారు. ఏ- పాజిటివ్ రక్తం ఉన్న వ్యక్తులు బయటకు బక్కచిక్కగా.. సాధారణంగా కనిపించొచ్చు. కానీ వాళ్లలో బ్లడ్‌గ్రూప్ తెలిస్తే అసలు విషయం కనుక్కోవచ్చు. నాయకుడంటే పరిపాలనాదక్షుడు. సన్మార్గంలో నడిపేవాడు. ప్రభావితం చేసేవాడు. నాయకత్వాన్ని వెతికి నేర్వడం కంటే.. అది మన రక్తంలో ఉంటుందని గ్రహించాలేమో!

ఏ నెగెటివ్:
వీరు కష్టపడే మనస్తత్వం కలవారు. కష్టం కంటే పనిని ఇష్టపడేవారు అనొచ్చు. చూసి కష్టాన్ని ఎలా ఇష్టపడాలో తెలుసుకోవచ్చు. ముఖ్యంగా మెరిసేదంతా బంగారం కాదు.. మోగేదంతా కంచు కాదు అని తెలుసుకుంటే బావుంటుంది. ఎందుకంటే బంగారంలా కనిపిస్తుందని వేరేవాళ్ల మెరుపు కోసం.. మెప్పు కోసం కాకుండా కష్టపడుతూ స్వయంగా ఎదగడం నేర్చుకోవడం కోసం.

Advertisement

బీ పాజిటివ్:
త్యాగం చేసే మనస్తత్వం కలవారు. త్యాగాన్ని కూడా త్యాగం చేసేవాళ్లన్నమాట! బీ పాజిటివ్‌గా ఉంటేనే ఇది సాధ్యం అన్నమాట. రక్తమే కాదు.. మన మనసూ బీ పాజిటివ్‌గా ఆలోచిస్తే ఇక నువ్వెన్ని త్యాగాలు చేసినా సంక్షోభం రాదు. నీ మనసు నిండా సంతృప్తి నిండి ఉంటుంది. మంచి వ్యక్తిగా.. తెలివితేటలుకలవానిగా.. నిజాయితీ కలవానిగా ఎంత త్యాగం చేసినా మనసు కరగని వెన్నలానే ఈ బ్లడ్ గ్రూప్ వారు ఉంటారన్నమాట.

బీ నెగెటివ్:
వీరు పరిస్థితులతో కాస్త సర్దుబాటు కాలేరు. వీళ్ల రక్తమే నెగెటివ్ కదా.. అని కాదు.. బ్లడ్‌గ్రూప్ మిమ్మల్ని ఇలానే ఉండమని చెప్పట్లేదు. కూడా మారొచ్చు.. పరిస్థితులను అర్థం చేసుకోవచ్చు.. మార్చేస్తే మారుతారు సామీ అని చెప్తోంది. సర్దుబాటు అవ్వడం అనేది రక్తాన్ని.. దాని గ్రూపును బట్టి ఉండకపోవచ్చు.. చుట్టూ ఉన్న మనుషులు.. పరిస్థితులను బట్టే ఉంటుంది కదా.. అందుకే బీ నెగెటివ్ వారు సర్దుబాటు కాలేరు అనేది సర్వేలు చెబుతున్నా.. ఇందులో పూర్తి వాస్తవం లేకపోవచ్చు.

ఓ పాజిటివ్:
ఈ బ్లడ్ గ్రూప్‌వారు చురుకైన మనసును కలిగి ఉంటారు. ఏ విషయంలోనూ బద్దకిస్తే అది మనకే ప్రమాదం. నువ్వు చురుకుగా ఉంటే.. నీ జాతకాన్ని మార్చే మంత్రదండమేదీ లేదు. మనలో కొంతమంది మానవ సంబంధాల విషయంలో కూడా అలసత్వంగా.. నిర్లక్ష్యంగా ఉంటారు. కానీ మనుషులు దూరంగా ఉంటే ఏం ప్రయోజనం. మనసులు దగ్గరగా ఉండేలా చురుగ్గా ఉంటే ఇతరుల మనసుల్ని గెలవడమే కాదు.. మనం కూడా ఆనందంగా ఉండొచ్చు. ఇది ఓ-పాజిటివ్ వాళ్లకు మెండుగా ఉంది కాబట్టి నో టెన్షన్!

Advertisement

ఓ నెగెటివ్:
వీరు కాస్త అర్థంకాని మనస్తత్వం కలవారు! అయినా మీరే చెప్పండి.. అక్క మనది అయితే.. బావ మనోడు కాడా?.. అవుతాడు కదా. అలాగే వీరిలో అంత ఈజీగా అర్థంకాని తత్వం కాస్త ఉన్నా.. ఈ సెల్ఫీల కాలంలో చల్తాహై. ఓ-నెగెటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్లు ప్రతీదాన్ని నెగెటివ్‌గా ఆలోచిస్తారనడం వాస్తవం లేకపోవచ్చు. ఇదే మీ బ్లడ్ గ్రూప్ అయితే.. ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి.. మీలోని క్వాలిటీస్ ఓసారి కర్టె చేసుకోండి. ఒక వేళ కాస్తో కూస్తో.. అవకాశం ఉంటే.. మీ మనస్తత్వం కాస్త మార్చుకోండి. ఎందుకంటే.. మీ నెగెటివ్ రక్తానికి ఎందుకు నెగెటివ్ పేరు తేవడం.. బీ పాజిటివ్ యార్!

ఏబీ పాజిటివ్:
వీరిని అర్థం చేసుకోవడం చాలా కష్టమట! ఇతరులకు సహాయం చేసేందుకు పుట్టారట వీళ్లు! ఈ గ్రూప్‌వాళ్లలో రెండు లక్షణాలున్నాయి. రెండూ వేటికవే భిన్నం. ఒక వ్యక్తిని ఏదో ఒకరకంగా అర్థం చేసుకోవచ్చు. కానీ కొందరు ఎంత అర్థం చేసుకున్నా అర్థం కారు. అందుకే మనలో చాలామంది వీడెంతకూ అర్థమవడురా బాబూ అని పెదవి విరుస్తుంటారు కూడా! ఇది ఒక లక్షణం అయితే.. ఇతరులకు సహాయం చేయడం వీరిలోని రెండో లక్షణం! కానీ ఇది మొదటిదానికి పూర్తిగా భిన్నం! మొదటిదాంట్లో నెగెటివ్ శాతం ఎక్కువగా ఉంటే.. రెండో లక్షణంలో పాజిటివ్ శాతం పుష్కలంగా ఉంది! కాబట్టి మీలో ఎవరైనా ఏబీ పాజిటివ్ ఉన్నవాళ్లుంటే వాళ్లను రెండు విధాలుగా అర్థం చేసుకోండి!

ఏబీ నెగెటివ్:
మెండైన తెలివి తేటలు కలిగి ఉంటారు! చూడటానికి చలాకీగా.. చురుగ్గా ఉంటారు. అందరితో చక్కగా మాట్లాడతారు. కమ్యూనికేషన్ గ్యాప్‌కూడా వీళ్ల దరి చేరదు. మన తెలివే మనల్ని కాపాడుతుంది. తెలివి లేకపోతే సకల సౌకర్యాలున్నా ప్రయోజనం ఉండదు. కాబట్టి ఏబీ నెగెటివ్ వాళ్లు ఇలానే తమ తెలివితేటల్ని ప్రదర్శిస్తూ భవిష్యత్‌లో మరింత ఉన్నతంగా ఎదిగేలా ప్లాన్ చేసుకోవాలి. దాంతోపాటు ఇతరులను కూడా అభివృద్ధి చెందే విధంగా ప్రోత్సహించాలి. ఎందుకంటే ఏబీ నెగెటివ్ గ్రూప్ వాళ్లు అన్నీ తెలిసిన తెలివిమంతులు కదా!

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Featured

ITR FIling : గడువు పెంచలేదు.. ఫేక్ న్యూస్ నమ్మొద్దు.. “జూలై 31వ తేదీలోపు మీ ITR ఫైల్ చేయండి”.. కీలక ప్రకటన చేసిన ఐటీ శాఖ

Published

on

ITR ఫైలింగ్ : పన్ను చెల్లింపుదారులకు ముఖ్యమైన గమనిక. మీరు FY 2023-2024 కోసం మీ ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఇంకా ఫైల్ చేయలేదా? ఆదాయపు పన్ను శాఖ మరో కీలక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నెల 31లోగా ఐటీ రిటర్నులు సమర్పించాలని కోరింది ఐటీ శాఖ. మరో నెల రోజులు గడువు పెంపుపై వస్తున్న వార్తల్లో నిజం లేదని తేలింది. పన్ను చెల్లింపుదారులు ఇలాంటి ఫేక్ న్యూస్ నమ్మవద్దని సోషల్ మీడియా ఎక్స్ లో సూచించింది.

గడువు 4 రోజులు మాత్రమే. జూలై 31వ తేదీలోపు ITR ఫైల్ చేయాలి. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ వీలైనంత త్వరగా రిటర్నులు సమర్పించాలని ఐటీ శాఖ సూచించింది. పన్ను పోర్టల్ లో ఎటువంటి సాంకేతిక సమస్య లేదు. మీరు గడువు సమయంలోపు ITR ఫైల్ చేయకపోతే, మీరు సెక్షన్ 234A కింద వడ్డీని మరియు ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 234F కింద జరిమానా చెల్లించవలసి ఉంటుంది.

మరోవైపు ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేసి వాపసు కోరుతున్న వారిని కూడా ఐటీ శాఖ హెచ్చరించింది. సైబర్ నేరగాళ్లు ఫోన్లలో మెసేజ్ లు పంపుతూ మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిసిందని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. ఇలాంటి ఫేక్ మెసేజ్‌లను చూసి మోసపోకండి మరియు రీఫండ్ కోసం మీ బ్యాంక్ ఖాతా వివరాలు మరియు వన్-టైమ్ పాస్‌వర్డ్‌లను అడుగుతూ మీకు కాల్ వస్తే అప్రమత్తంగా ఉండండి. అటువంటి లింక్‌లపై క్లిక్ చేయవద్దు. ఇప్పటి వరకు 5 కోట్ల మంది పన్ను రిటర్నులు దాఖలు చేసినట్లు గుర్తించింది. వీరిలో ఇప్పటికే 1.8 మిలియన్ల రిటర్న్‌లు ప్రాసెస్ చేయబడి, రీఫండ్ ఖాతాలకు జమ అయినట్లు కూడా తెలిపింది.

Advertisement

Continue Reading

Featured

Niharika: యుద్ధం గెలిచిన రాముడు అయోధ్యకు వచ్చినట్టు ఉంది… బాబాయ్ పై నిహారిక కామెంట్స్!

Published

on

Niharika: నిహారిక కొణిదెల పరిచయం అవసరం లేని పేరు. ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీలో నిర్మాతగా నటిగా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు. తన భర్త నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన నిహారిక తిరిగి కెరియర్ పై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే నిర్మాతగా కూడా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇక నిహారిక నిర్మాణంలో తెరకెక్కిన కమిటీ కుర్రోళ్ళు సినిమా ఆగస్టు 9వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈమె ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆహాలో ప్రసారమవుతున్న సర్కార్ సక్సెస్ సెలబ్రేషన్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.

ఇక ఈ ప్రోమోలో భాగంగా నిహారిక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ నేను వచ్చేది ఎప్పుడు నెక్స్ట్ సీజనా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సుడిగాలి సుదీర్ రెస్పాండ్ అవుతూ మీకేంటండి మీరు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలూకా అంటూ మాట్లాడారు. అనంతరం పవన్ కళ్యాణ్ విజయం సాధించిన తర్వాత చిరంజీవి ఇంటికి వచ్చి ఆశీర్వాదం తీసుకున్న వీడియో ఎంతలా వైరల్ అయిందో మనకు తెలిసిందే .ఇక ఈ వీడియోని ప్లే చేశారు.

Advertisement

యుద్ధం గెలిచిన రాముడు…
ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది అంటూ నిహారికను ప్రశ్నించారు. ఇక నిహారిక ఈ వీడియో గురించి మాట్లాడుతూ యుద్ధం గెలిచిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకు వచ్చినప్పుడు కూడా ఇలాగే ఉండేదేమో అనిపించింది అంటూ తన బాబాయ్ విజయం గురించి నిహారిక మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Anasuya: ఇకపై రంగమ్మత్త లాంటి పాత్రలు అసలు చేయను.. గ్లామర్ పాత్రలకు సై అంటున్న అనసూయ?

Published

on

Anasuya: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు. ఈమె జబర్దస్త్ యాంకర్ గా బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ అందుకొని అనంతరం వెండి తెరపై సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా వెండితెరపై వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న అనసూయ తిరిగి బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈమె స్టార్ మా లో ప్రసారమవుతున్న కిరాక్ బాయ్స్ కిలాడి లేడీస్ అనే కార్యక్రమంలో సందడి చేస్తున్నారు. ఇలా ఒక వైపు బుల్లితెర కార్యక్రమాలు మరోవైపు వెండితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్న అనసూయ త్వరలోనే సింబా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ఈమె మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఇటీవల కాలంలో మీరు చాలా సినిమాలను రిజెక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది కారణం ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ తాను సినిమాలు రిజెక్ట్ చేస్తున్న మాట నిజమేనని తెలిపారు. నేను ఒక సినిమాలో నటించిన పాత్ర హిట్ అవడంతో తదుపరి సినిమాలలో కూడా అలాంటి పాత్రలలో నటించే అవకాశం వస్తుందని తెలిపారు.

Advertisement

రంగమ్మత్త..
ఇలా ఒక పాత్రలో నటించిన తర్వాత తిరిగి అలాంటి పాత్రలలో నటించిన ప్రేక్షకులు పెద్దగా తీసుకోలేరు ఉదాహరణకు రంగమ్మత్త పాత్ర చాలా హైలెట్ అయింది. తదుపరి అలాంటి పాత్రలు వస్తే నేను చెయ్యను నేను అన్ని చాలా డిఫరెంట్ గా ఉండేలా చేయాలని భావిస్తున్నాను. ఇక ఎక్కువగా తాను గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా అనసూయ గ్లామర్ రోల్ చేయడానికి సై అంటూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!