Connect with us

Technology

వాట్సాప్ లో మీ ప్రొఫైల్ ని ఎవరెవరు ఓపెన్ చేసారో తెలుసుకోవాలా..? అయితే సింపుల్ గా ఇలా చేయండి!

Published

on

ఈ రోజుల్లో ఎవరి చేతిలో చూసినా ఉండే ఒకే ఒక్క వస్తువు మొబైల్… అస్సలు ఫోన్ లేకుండా ఇంట్లో నుండి బయటకి కూడా రారు,బయటకి రావడం సంగతి పక్కన పెడితే,అసలు ఇంట్లో కూడా ఫోన్ చేతిలో లేకుండా టాయిలెట్ కి కూడా వెళ్లని వారు ఉన్నారు,24 గంటలూ ఫోన్ లో మునిగిపోయి బయటి ప్రపంచంలో ఏం జరుగుతోందో తెలుసుకోలేకపోతున్నారు,కూర్చున్న చోట నుండి కదలకుండా శరీరానికి వ్యాయామం లేక,బయటకి వెళ్లి ప్రకృతిని ఆస్వాదించడం మానేసి యాంత్రిక జీవితాన్ని గడుపుతున్నారు..అసలు ఈ ఫోన్ లు ఇంతగా మనల్ని వశపరుచుకోవడానికి గల కారణాలు ఏంటి..?

సోషల్ మీడియా…మొబైల్ అంటే ఇది వరకు కేవలం ఫోన్ మాట్లాడుకోవడానికి మాత్రమే ఉపయోగపడేది,కానీ ఇప్పుడు అలా కాదు,ఫోన్ అంటే అదొక ప్రపంచం,మొత్తంల్డతా జనాలు ఫోన్ కి అడిక్ట్ అవ్వడానికి కారణం గేమ్స్ అయితే ఆ తర్వాత మెల్ల మెల్లగా ఫోన్ లో ఇంటర్నెట్ వచ్చి మొత్తం ప్రపంచాన్ని మన అరచేతిలో పెట్టింది,అయితే ముఖ్యంగా ఈ సోషల్ మీడియా యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి జనాలు విపరీతంగా బానిసలు అయిపోయాయారు,పొద్దున్న లేచి ఎదుట ఉన్న మనిషికి ఏనాడు గుడ్ మార్నింగ్ అని చెప్పి ఎరుగని వాళ్ళు కూడా వాట్సాప్ ఓపెన్ చేసి అందరికి గుడ్ మార్నింగ్,గుడ్ నైట్ అని మెసేజ్ పెడతాడు,కాకపోతే ఈ సోషల్ మీడియా మనం అనుకున్నంత సేఫ్ కాదు, ముఖ్యంగా మహిళలకు ఎన్నో సమస్యలు తెచ్చిపెట్టే అవకాయసం ఉంది,ముఖ్యంగా మీరు షేర్ చేసుకొనే ఫొటోస్,వీడియోస్ దుర్వినియోగం జరిగే అవకాశం ఉంది…మీరు వాట్సాప్ లో పెట్టె ప్రొఫైల్ పిక్చర్ ఎవరు చూస్తున్నారో తెలుసుకోవచ్చు..ఎలాగో తెలుసా..?
వాట్సాప్… ఇది వచ్చి పాపం SMS ని పూర్తిగా అంతం చేసేసింది,అయితే ఇది కేవలం మెసేజెస్ పంపించుకోవడానికి మాత్రమే అనుకుంటే పొరపాటే,స్టేటస్ లు పెట్టచ్చు,మీ ఫొటోస్ వీడియోస్ మీ సన్నిహితులతో షేర్ చేస్కోవచ్చు,ఈ మధ్య కొత్తగా వాట్సాప్ ద్వారా కాల్స్,వీడియో కాల్స్ చేసుకొనే సదుపాయం కూడా కలిగిస్తున్నారు,ఇప్పుడు కొత్తగా స్టేటస్ లోనే ఫోటోలు,వీడియోలు అప్ లోడ్ చేసే అవకాశం కూడా కల్పిస్తున్నారు,అలాగే మీరు ఉన్న లొకేషన్ ని కూడా ఎవరితో అయినా షేర్ చేస్కోవచ్చు,ఇన్ని ఉన్నా కూడా తరచూ ఎదో ఒక కొత్త ఫీచర్ ని ప్రవేశ పెడుతూనే ఉంటారు,ఎన్ని కొత్త ఫీచర్స్ వచ్చినా మనం ఎప్పటి నుండో కోరుకుంటున్న ఫీచర్ మాత్రం ఒకటి రావట్లేదు,అదే మీ వాట్సాప్ ప్రొఫైల్ పిక్ ని ఎవరెవరు చూసారు అనేది తెలుసుకొనే అవకాశం వాట్సాప్ లో లేదు.

Advertisement

మరి ఎలా అది జరగని పనేనా అని ఢీలా పడకండి.. ఇప్పుడు మీ వాట్సాప్ ప్రొఫైల్ ఇమేజ్ ని ఎవరెవరు చూసారో సులభంగా తెలుసుకోవచ్చు.. దానికోసం ఒక చిన్న ట్రిక్ ఉంది ఇప్పుడు ఆ ట్రిక్ ఏంటో తెలుసుకొందాం.. ముందుగా మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేసి వాట్స్ ట్రాకర్ అనే యాప్ ని ఇన్స్టాల్ చేయండి,ఇది ఇన్స్టాల్ చేసిన తర్వాత వాట్సప్ లో మాదిరిగానేఇక్కడ కూడా మీ పేరు ,కాంటాక్ట్ నంబర్ ఆధారంగా లాగిన్ అవ్వండి,అలా అయినతర్వాత మీకు వాట్స్ ట్రాకర్ యాప్ ఓపెన్ అవుతుంది.యాప్ ఓపెన్ చేసాక మీకు అక్కడ 3ఆఫ్షన్స్ కనపడతాయి. కాంటాక్ట్స్,విజిటెడ్,విజిటర్స్ అని…కాంటాక్స్ అనే ఆప్షన్ లో మన వాట్సప్ కాంటాక్ట్స్ ఉంటాయి.విజిటెడ్ అనే ఆప్షన్ లో మనం ఎవరి ప్రొఫైల్స్ చూసాం అన్నది ఉంటుంది. విజిటర్స్ అనే ఆప్షన్ లో మన ప్రొఫైల్ ని ఎవరు చూసారన్నది ఉంటుంది.అమ్మాయిలు మీకు బాగా ఉపయోగపడే యాప్ ఇది తప్పకుండా ట్రై చేయండి,అలాగే మనల్ని ఎంత మంది ఫాలో అవుతున్నారో తెలుసుకోవాలని కూడా చాలామందికి ఉంటుంది కదా.. ఈ యాప్ తో అది సాధ్య పడుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఇన్స్టాల్ చేయండి.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Vivo v30: మార్కెట్లోకి విడుదల అయిన వివో సరికొత్త స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ మామూలుగా లేవుగా?

Published

on

Vivo v30: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజ సంస్థ వివో ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లు విడుదల చేసిన విషయం మనందరికీ తెలిసిందే. వినియోగదారులను మరింత ఆకర్షించడం కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్ లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంటుంది. అందరికి అందుబాటులో ఉండే విధంగా బడ్జెట్ ధరలోనే మంచి మంచి ఫీచర్స్ కలిగిన కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ ని మార్కెట్లోకి లాంచ్ చేసింది వివో సంస్థ. వివో వీ 30 పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. అయితే ప్రస్తుతం చైనాలో లాంచ్‌ అయిన ఈ స్మార్ట్ ఫోన్‌ను త్వరలోనే భారత్‌ తో పాటు ఇతర దేశాల్లోనూ కూడా లాంచ్‌ చేయనున్నారు.

మరి తాజాగా విడుదల అయినా ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన ధర ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో క్వాల్‌ కామ్‌ స్నాప్‌ డ్రాగన్‌ 7 జనరేషన్‌ 3 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ ను అందించారు. కాగా ఈ స్మార్ట్‌ ఫోన్‌ గరిష్టంగా 12 జీబీ ర్యామ్‌ తో రానుంది. ఇక ఇందులో 120 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌ తో కూడిన 3డీ కర్వ్డ్‌ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లే ను అందిస్తున్నారు. కాగా ఈ ఫోన్‌ మనకు బ్లూమ్ వైట్, లష్ గ్రీన్, నోబుల్ బ్లాక్, వేవింగ్ ఆక్వా వంటి కలర్స్‌ లో లభించనుంది. ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ తో పనిచేసే ఈ స్మార్ట్‌ ఫోన్‌ లో 6,78 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌ హెచ్‌డీ అమోఎల్ఈడీ డిస్‌ప్లే ను ఇవ్వనున్నారు. 3డీ కర్వ్డ్ డిస్‌ప్లే హెచ్‌డీఆర్10+ సపోర్ట్‌ను అందించారు.

ఫీచర్ల విషయానికొస్తే..

డీసీఐ పీ3 కలర్ ఆప్షన్ 100 శాతం కవరేజీతో పాటు 2800 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ ను ఈ ఫోన్‌ అందిస్తుంది. ఇక ఈ స్మార్ట్‌ ఫోన్‌ను 8జీబీ +128జీబీ, 8జీబీ+256జీబీ, 12జీబీ+256జీబీ, 12జీబీ+512జీబీ ర్యామ్ వంటి స్టోరేజ్ వేరియంట్స్‌ లో తీసుకొచ్చారు. అంటే ఈ స్మార్ట్ ఫోన్ మనకు మొత్తం గా నాలుగు వేరియంట్స్ లో లభించనుంది. ఇకపోతే ఈ ఫోన్ కెమెరా విషయానికొస్తే.. వివో వి30 స్మార్ట్‌ ఫోన్‌లో ట్రిపుల్ ఆరా లైట్ రియర్ కెమెరా సెటప్‌ ను అందించారు. 50ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, పోర్ట్రెయిట్ సెన్సార్‌తో కూడిన 50ఎంపీ ఓమ్నివిజన్ ఓవీ50 ఈ సెన్సార్‌ ను ఇచ్చారు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 50 మెగాపిక్సెల్స్‌ తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను కూడా అందించారు.

Advertisement

Continue Reading

Featured

Revantha Reddy: రేవంత్ రెడ్డి ప్రేమ వివాహం గురించి ఈ విషయాలు తెలుసా… సినిమాని మించిన ట్విస్టుల?

Published

on

Revantha Reddy: రేవంత్ రెడ్డి అనుముల తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఓ ప్రభంజనం సృష్టించారు. పిసిసి అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ 2023 అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసినటువంటి ఈయన కాంగ్రెస్ పార్టీని గెలిపించి తెలంగాణలో హస్తం జెండాను ఎగురవేశారు. ఇలా ముఖ్యమంత్రి పదవికి మరికొన్ని గంటలలో రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం కూడా చేయబోతున్నారు.

ఇలా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించబోతున్నటువంటి రేవంత్ రెడ్డి విజయం వెనుక తన భార్య గీతారెడ్డి కూడా ఉన్నారు. ఇలా ఈయన చదువుకుంటున్న సమయంలోనే విద్యార్థి సంఘానికి లీడర్ గా కొనసాగారు ఇలా మొదలైనటువంటి ఈయన ప్రస్థానం నేడు ముఖ్యమంత్రి పదవి అధిష్టించే వరకు చేరుకుంది. ఇక ఈయన రాజకీయ ప్రస్థానం పక్కనపెట్టి వ్యక్తిగత విషయానికి వస్తే రేవంత్ రెడ్డిది ప్రేమ వివాహమని చెప్పాలి.

నాగర్ కర్నూలు జిల్లా కొండారెడ్డి గ్రామంలో జన్మించినటువంటి రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో చదివారు. ఇలా చదువుతున్న సమయంలోనే ఈయన విద్యార్థి సంఘానికి లీడర్ గా ఉన్నారు. అదే సమయంలోనే కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి సోదరుడు కుమార్తె గీతారెడ్డి ప్రేమలో పడ్డారు. ఇక వీర ప్రేమ విషయం గీతారెడ్డి తండ్రికి తెలియడంతో ఆమెను ఢిల్లీలో ఉన్నటువంటి తన సోదరుడు జైపాల్ రెడ్డి వద్దకు పంపించారు. అక్కడికి వెళ్లిన వీర ప్రేమ ప్రయాణం మాత్రం ఆగలేదు. జైపాల్ రెడ్డినే రాయబారిగా మార్చి తమ ప్రేమను గెలిపించుకున్నారు.

Advertisement

రేవంత్ విజయం వెనుక భార్య గీతా రెడ్డి…

రేవంత్ రెడ్డిలో ఉన్నటువంటి పట్టుదల మొండితనం చూసినటువంటి జైపాల్ రెడ్డి తన సోదరుడికి నచ్చ చెప్పారట ఎంతో కసి మొండిదల ఉన్నటువంటి ఈ వ్యక్తి ఎప్పటికైనా ఉన్నత స్థాయిలో ఉంటారని తన సోదరుడికి నచ్చచెప్పి ఈ పెళ్లికి ఒప్పించారు. ఇక వీరిద్దరిది కూడా ఒకే సామాజిక వర్గం కావడంతో పెళ్లికి ఒప్పుకున్నారు. తర్వాత ఈయన జెడ్పిటిసి మెంబర్ గాను ఎమ్మెల్యే గాను, ఎంపీగాను రాజకీయపరంగా అంచలంచలుగా ఎదుగుతూ నేడు ముఖ్యమంత్రిగా గెలుపొందారు. ఇక ఈయన ప్రజాస్వామ్యం అంటూ బయటకు రాగా తన భార్య మాత్రం తన పిల్లల బాధ్యతలను ఎంతో చక్కగా నిర్వర్తిస్తూ తన భర్త విజయానికి కారణం అయింది.

Advertisement
Continue Reading

Featured

స్మార్ట్ ఫోన్ చార్జింగ్ చేసే విషయంలో మీరు ఈ తప్పులు చేయకండి.. లేదంటే..

Published

on

ఈ రోజుల్లో ప్రతీ ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉండే ఉంటుంది. అయితే చాలామంది చార్జింగ్ పెట్టే విధానంలో చాలా తప్పులు చేస్తున్నారు. దీంతో బ్యాటరీ లైఫ్ త్వరగా అయిపోతుంటుంది. తర్వాత చార్జింగ్ ఆగడం లేదంటూ లబోదిబోమంటుంటారు. అలా కాకుండా మొదటి నుంచే మనం దీనిపై జాగ్రత్తగా ఉంటే ఆ సమస్య నుంచి ఎంచక్కా బయటపడొచ్చు. స్మార్ట్ ఫోన్ ను ఇష్టారీతిగా ఛార్జింగ్ చేస్తే త్వరగా పాడవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఫోన్ చార్జింగ్ పూర్తిగా అయిపోక ముందే చాలామంది చార్జింగ్ పెడుతుంటారు. అలా చేయకూడదు. ఇది ఫోన్ మన్నికపై ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా 100 శాతం వరకు కూడా చార్జింగ్ అస్సలు చేయకూడదు. రాత్రి పడుకునే ముందు ఛార్జింగ్ పెట్టి ఉదయం తీసేవారు కూడా ఉంటారు.

ఇది మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. 80 నుంచి 90 శాతం వరకు చార్జింగ్ పెడితే చాలు అంటున్నారు నిపుణులు. రాత్రి ఛార్జింగ్ పెట్టి నిద్రపోతే.. ఆఫోన్ వేడెక్కి పేలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఆ పనులు చేయవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 20 శాతం కంటే తక్కువ చార్జింగ్ ఉన్నప్పుడు.. 90 శాంత వరకు చర్జింగ్ పెడితే బ్యాటరీ లైఫ్ పెరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.

Advertisement

చార్జింగ్ పెడుతూ ఫోన్ మాట్లాడటం.. ఫోన్లోని పాటలను వినడం.. బ్రౌజ్ చేయడం లాంటివి చేస్తే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా ఇంటర్ నెట్ ఉపయోగించే క్రమంలో కూడా చార్జింగ్ బాగా అయిపోతూ ఉంటుంది.. దీనికి సెట్టింగ్ లోకి వెళ్లి ఉపయోగం లేని యాప్స్ ను ఇన్ యాక్టివ్ చేస్తే సరిపోతుంది. చార్జింగ్ మరి కొంత సేపు ఎక్కువగా ఉంటుంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!