Connect with us

Featured

షాకింగ్.. ఈ హీరోస్ గుర్తుపట్టలేనంతగా మారిపోయారు

Published

on

హీరోయిన్స్ అంటేనే సన్నగా ఉండాలని తమ నాజుకు అందాలతో యువత మతి పోగొట్టాలని అనుకుంటారు.. అందంగా ఉన్న హీరోయిన్స్ కొన్ని రోజుల లోనే ముద్దుగా బొద్దుగా కనబడితే మాత్రం చూసి చీ ఎంటి ఇలా తయరయ్యింది అంటూ చురకలెయ్యకుండా ఉండలేం. సినిమాలు తగ్గగానే పెళ్ళి చేసుకోని లేక ఏ పని లేకనో హీరోయిన్స్ గుర్తు పట్తకుండా అయిపోయారు. మన హీరోలలో కూడా మార్పు వస్తోంది. వారు కూడా కాలానుగుణంగా మారడానికి సిద్ధపడుతున్నారు. అయితే ఈ మార్పు బాలీవుడ్, కోలివుడ్లతో పోల్చుకుంటే చాలా నిదానంగా జరుగుతోంది. హిందీ, తమిళం, మళయాల హీరోలు మూస చిత్రాలకు చాలా వరకు స్వస్తి పలికారు. మల్టీస్టార్ చిత్రాలలో నటిస్తున్నారు. కథలలో కొత్తదనంతోపాటు, ఎటువంటి పాత్రనైనా చేస్తున్నారు. జనం మెప్పు పొందుతున్నారు. మన హీరోలు కూడా అదేబాటలోకి వెళుతున్నారు.

కొందరు తారలు ఒక్క సినిమాలో కనిపించినా చెరిగిపోని ముద్ర వేస్తారు. కొందరు నటీనటులు తెరమరుగై ఏళ్లు గడిచినా అభిమానుల మనసు పొరల్లో నిలిచే ఉంటారు. ఒకప్పటి నటి గిరిజా షెట్టర్‌, సర్వదమన్‌ బెనర్జీ, మంజునాథ్‌, మాధవి, అన్షు, రవళి, మీనాక్షీ శేషాద్రి, రక్షిత… లాంటి తారలు ఆ కోవకు చెందినవారే. ఇంతకీ వాళ్లు ఇప్పుడు ఎక్కడ, ఎలా ఉన్నారో తెలుసా…

Advertisement

1 . రోహిత్

ఈ హీరో చిన్న బడ్జెట్ సినిమాలకు రారాజులా వెలిగాడు. సిక్స్టీన్ సినిమాతో ఎంటర్ అయిన ఈ హీరో తరవాత గర్ల్ ప్రెండ్ ఈ రెండు సినిమాలు అప్పట్లో సంచనం సాధించాయి. ఆ తరవాత రోహిత్ కు ఆఫర్లు తగ్గి, ఇతర హీరోల సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాల్సి వచ్చింది. చిరు సినిమా శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో రోహిత్ నటించిన పాత్ర ఇప్పటికి ప్రేక్షకుల మదిలో ఉంది. చివరిగా 2010 లో మా అన్నయ్య బంగారం లో కనిపించి ఆ తరవాత కనిపించడం మానేసాడు. తాజాగా ఒక ఫంక్షన్ లో రోహిత్ కనిపించాడు గాని అతనిని ఎవ్వరు గుర్తు పట్టలేకుండా ఉన్నారు.


2 . మంజునాథ్

పాతికేళ్ల కిందట దర్శకుడు కె. విశ్వనాధ్ తీసిన స్వాతి కిరణం చిత్రంలో హీరో మమ్ముట్టి. కానీ అతని కన్నా ఎక్కువ పేరొచ్చింది ఆ చిత్రంలో గంగాధరం పాత్ర పోషించిన కుర్రాడు మంజునాథ్ కే. బెంగళూరుకు చెందిన ఈ కుర్రాడు కన్నడ, హిందీ భాషల్లో 60కి పైగా చిత్రాల్లో నటించాడు. 19 ఏళ్ళ వయసులో చదువుకోసం నటనకు దూరమయ్యాడు. ప్రస్తుతం బెంగళూరు లో ఉంటూ సొంతంగా పీ ఆర్ కన్సల్టెన్సీ సంస్థను నిర్వహిస్తున్నాడు. బెంగళూరు – మైసూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కారిడార్ ప్రోజెక్టుకూ పని చేస్తున్నాడు. కర్ణాటకకు చెందిన అథ్లెట్ స్వర్ణరేఖ ను పెళ్లి చేసుకున్న మంజునాథ్ కు ఓ బాబు కూడా ఉన్నాడు.

Advertisement


3 . సర్వదమన్‌ బెనర్జీ

సిరివెన్నెల సినిమాలో అంధుడైన ఫ్లూటిస్ట్‌గా సర్వదమన్‌ బెనర్జీ పోషించిన పాత్రను ఆ సినిమా చూసినవారెవ్వరూ మర్చిపోలేరు. దూరదర్శన్‌లో వచ్చిన రామానంద్‌ సాగర్‌ ‘కృష్ణ’ సీరియల్‌లో శ్రీ కృష్ణుడిగానూ దేశం మొత్తానికీ ఆయన సుపరిచితుడు. ఉత్తరాదిలో ఇప్పటికీ చాలామంది సర్వదమన్‌ని ‘కృష్ణ’ అనే పిలుస్తారు. విచిత్రం ఏంటంటే ఆ సీరియల్‌లో కృష్ణుడిగా నటించినప్పట్నుంచీ ఆయన పూర్తిగా కృష్ణతత్వంలోకీ ఆధ్యాత్మిక చింతనలోకీ వెళ్లిపోయారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లోని రిషీకేశ్‌లో స్థిరపడి ధ్యాన బోధన చేస్తున్నారు. పేద పిల్లల్ని చదివించే ‘పంఖ్‌’ అనే స్వచ్ఛంద సంస్థ తరఫున పనిచేస్తూ సొంత ఖర్చులతో కొందరు విద్యార్థులనూ చదివిస్తున్నారు సర్వదమన్‌.

4 . ఉదయ్ చోప్రా

ధూమ్‌’ సిరీస్‌లో తన కామెడీ అలరించిన ఉదయ్‌ చోప్రా గుర్తున్నాడా? యశ్‌ చోప్రా తనయుడైన ఉదయ్‌ చోప్రా బాలీవుడ్‌లో గొప్పగా రాణించలేదు. దీంతో సినిమాల నుంచి తప్పుకున్న ఉదయ్‌.. కేవలం ‘ధూమ్‌’ సిరీస్‌లో మాత్రం నటిస్తున్నాడు. 2013లో ఆమిర్‌ ఖాన్‌ హీరోగా తెరకెక్కిన ‘ధూమ్‌-3’ సినిమాలో ఉదయ్‌ చివరిసారిగా తెరపైన కనిపించాడు. ఆ సినిమాలో కండలు తిరిగిన దేహసౌష్టవంతో ఎనర్జిటిక్‌గా కనిపించిన ఉదయ్‌.. ఇప్పుడు కండలు లేవు సరికదా గుర్తుపట్టలేని రీతిలో మారిపోయాడు. బొద్దుగా గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఆయన తాజా ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి. ఉదయ్‌ ఆ మధ్య నర్గీస్‌ ఫక్రీతో డేటింగ్‌ చేసినట్టు కథనాలు వచ్చిన వారి మధ్య ఇటీవల బ్రేకప్‌ అయిందని బాలీవుడ్‌ చెప్పుకుంటోంది.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Featured

Niharika: యుద్ధం గెలిచిన రాముడు అయోధ్యకు వచ్చినట్టు ఉంది… బాబాయ్ పై నిహారిక కామెంట్స్!

Published

on

Niharika: నిహారిక కొణిదెల పరిచయం అవసరం లేని పేరు. ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీలో నిర్మాతగా నటిగా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు. తన భర్త నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన నిహారిక తిరిగి కెరియర్ పై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే నిర్మాతగా కూడా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇక నిహారిక నిర్మాణంలో తెరకెక్కిన కమిటీ కుర్రోళ్ళు సినిమా ఆగస్టు 9వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈమె ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆహాలో ప్రసారమవుతున్న సర్కార్ సక్సెస్ సెలబ్రేషన్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.

ఇక ఈ ప్రోమోలో భాగంగా నిహారిక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ నేను వచ్చేది ఎప్పుడు నెక్స్ట్ సీజనా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సుడిగాలి సుదీర్ రెస్పాండ్ అవుతూ మీకేంటండి మీరు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలూకా అంటూ మాట్లాడారు. అనంతరం పవన్ కళ్యాణ్ విజయం సాధించిన తర్వాత చిరంజీవి ఇంటికి వచ్చి ఆశీర్వాదం తీసుకున్న వీడియో ఎంతలా వైరల్ అయిందో మనకు తెలిసిందే .ఇక ఈ వీడియోని ప్లే చేశారు.

Advertisement

యుద్ధం గెలిచిన రాముడు…
ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది అంటూ నిహారికను ప్రశ్నించారు. ఇక నిహారిక ఈ వీడియో గురించి మాట్లాడుతూ యుద్ధం గెలిచిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకు వచ్చినప్పుడు కూడా ఇలాగే ఉండేదేమో అనిపించింది అంటూ తన బాబాయ్ విజయం గురించి నిహారిక మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Anasuya: ఇకపై రంగమ్మత్త లాంటి పాత్రలు అసలు చేయను.. గ్లామర్ పాత్రలకు సై అంటున్న అనసూయ?

Published

on

Anasuya: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు. ఈమె జబర్దస్త్ యాంకర్ గా బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ అందుకొని అనంతరం వెండి తెరపై సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా వెండితెరపై వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న అనసూయ తిరిగి బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈమె స్టార్ మా లో ప్రసారమవుతున్న కిరాక్ బాయ్స్ కిలాడి లేడీస్ అనే కార్యక్రమంలో సందడి చేస్తున్నారు. ఇలా ఒక వైపు బుల్లితెర కార్యక్రమాలు మరోవైపు వెండితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్న అనసూయ త్వరలోనే సింబా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ఈమె మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఇటీవల కాలంలో మీరు చాలా సినిమాలను రిజెక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది కారణం ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ తాను సినిమాలు రిజెక్ట్ చేస్తున్న మాట నిజమేనని తెలిపారు. నేను ఒక సినిమాలో నటించిన పాత్ర హిట్ అవడంతో తదుపరి సినిమాలలో కూడా అలాంటి పాత్రలలో నటించే అవకాశం వస్తుందని తెలిపారు.

Advertisement

రంగమ్మత్త..
ఇలా ఒక పాత్రలో నటించిన తర్వాత తిరిగి అలాంటి పాత్రలలో నటించిన ప్రేక్షకులు పెద్దగా తీసుకోలేరు ఉదాహరణకు రంగమ్మత్త పాత్ర చాలా హైలెట్ అయింది. తదుపరి అలాంటి పాత్రలు వస్తే నేను చెయ్యను నేను అన్ని చాలా డిఫరెంట్ గా ఉండేలా చేయాలని భావిస్తున్నాను. ఇక ఎక్కువగా తాను గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా అనసూయ గ్లామర్ రోల్ చేయడానికి సై అంటూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Mahesh Babu: మహేష్ రాజమౌళి సినిమా టైటిల్ లీక్… సినిమా పేరు ఏంటో తెలుసా?

Published

on

Mahesh Babu: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా జరుగబోతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన కూడా తెలియజేయబోతున్నారు.

ఇక ఈ సినిమాలో మహేష్ బాబు చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు మొదటిసారి వర్క్ షాప్ లో కూడా పాల్గొనబోతున్నారని సమాచారం.

ఇప్పటివరకు మహేష్ బాబు ఏ సినిమా కోసం ఇలా వర్క్ షాప్ లో పాల్గొనలేదు మొదటిసారి రాజమౌళి సినిమా కోసం పాల్గొనబోతున్న నేపథ్యంలో ఈయన కూడా ఈ సినిమా విషయంలో చాలా ఆతృత కనబరుస్తున్నారు. ఇకపోతే తాజాగా మహేష్ బాబు రాజమౌళి సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

గోల్డ్..
తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమాకు సంబంధించి ఓ టైటిల్ సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమా టైటిల్ కూడా అందుకు అనుగుణంగానే ఉండాలి. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం గోల్డ్ అనే టైటిల్ పెట్టబోతున్నారంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఈ సినిమా టైటిల్ గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం వైరల్ అవుతుంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!