Sowmyarao: జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించినటువంటి వారిలో సౌమ్యరావు ఒకరు. ఈమె అనసూయ ఈ కార్యక్రమానికి యాంకర్ గా తప్పకున్న తర్వాత యాంకర్ గా పరిచయమయ్యారు అయితే ఈమె కన్నడ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి కావడంతో తెలుగు పెద్దగా సరిగా రాకపోయినప్పటికీ పెద్ద ఎత్తున తన మాట తీరుతో అభిమానులను ఆకట్టుకునేవారు.
ఇలా జబర్దస్త్ యాంకర్ గా కొనసాగుతున్నటువంటి ఈమె ఈ కార్యక్రమం నుంచి సడన్ గా తప్పుకోవడంతో ఈమె స్థానంలో బిగ్ బాస్ సిరి యాంకర్ గా కొనసాగుతూ ఉన్నారు. అయితే సౌమ్యరావు ఈ కార్యక్రమం నుంచి తప్పుకోవడానికి గల కారణాలు ఏంటి విషయం గురించి ఈమెను ప్రశ్నించడంతో సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెబుతానని తెలిపారు. అయితే తాజాగా తాను జబర్దస్త్ వదిలేయడానికి కారణాలను తెలిపారు.
జబర్దస్త్ కార్యక్రమం ఒక తెలుగు షో నాకు తెలుగు సరిగా రాదు. ఇలా వచ్చిరాని తెలుగులో మాట్లాడుతూ ఉంటే చాలామంది నన్ను విమర్శలు చేశారు అంతే కాకుండా నాకు డాన్స్ కూడా పెద్దగా రాదు అందుకే డాన్స్ నేర్చుకోవడం కోసం ప్రత్యేకంగా క్లాసెస్ కి కూడా వెళ్తున్నానని తెలిపారు. అసలే తాను చాలా సన్నగా ఉంటానని డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండడంతో మరింత సన్నగా అవుతున్నానని తెలిపారు.
Advertisement
జోక్స్ అర్థమయ్యేవి కాదు.. ఇలా నేను సన్నగా అవ్వడం చూసినటువంటి జబర్దస్త్ డైరెక్టర్ డాన్స్ ఎలాగైనా మేనేజ్ చేయొచ్చు మీరు ప్రాక్టీస్ చేయడం మానేయండి అంటూ నాకు సలహా ఇచ్చారు కానీ ఇలా డాన్స్ చేయలేక సరిగా తెలుగు మాట్లాడలేక స్కిట్ చేసేటప్పుడు ఆ జోక్స్ అర్థం కాక నేను ఎంతో ఇబ్బంది పడ్డానని అందుకే తాను ఈ కార్యక్రమం నుంచి తప్పుకున్నాను అంటూ ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Ali: సినిమా ఇండస్ట్రీకి రాజకీయ రంగానికి ఎంతో అవినాభావ సంబంధం ఉంది సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారందరూ కూడా రాజకీయాలలోకి వస్తున్నారు. ఇలా సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు అలీ సైతం రాజకీయాలలో కొనసాగిన సంగతి మనకు తెలిసిందే.
గతంలో పలు పార్టీలలో ఉన్నటువంటి ఈయన 2019 ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సిపి పార్టీలో చేరారు. ఇలా పార్టీ కోసం ఎంతో కష్టపడిన ఈయనకు వైఎస్ జగన్ ప్రభుత్వం ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారునిగా కూడా పదవి అప్పగించారు. ఇక 2024 ఎన్నికలలో తనకు ఎమ్మెల్యేగా లేదా ఎంపీగా టికెట్ వస్తుందని భావించారు.
ఇలా తనుకు టికెట్ వస్తుందని ఆశించిన అలీకి నిరాశ ఎదురయింది. అంతేకాకుండా ఈసారి ఎన్నికలలో పార్టీ తరఫున కూడా ఈయన ప్రచార కార్యక్రమాలను నిర్వహించకుండా పూర్తిగా దూరంగా ఉన్నారు. ఇక వైసీపీ ఘోర ఓటమి పాలు కావడంతో ఎక్కడా కూడా స్పందించిన దాఖలాలు కూడా లేవు.
Advertisement
సామాన్య పౌరుడిగా.. ఇలా రాజకీయాలకు కాస్త దూరంగా ఉన్నటువంటి ఈయన ఇటీవల సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించడమే కాకుండా ఇకపై తాను ఎలాంటి రాజకీయ పార్టీలలోకి వెళ్లనని పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని తెలిపారు. ఒక సామాన్య పౌరుడిగా మాత్రమే నేను నా ఓటు హక్కును వినియోగించుకుంటానని ఈ సందర్భంగా ఆలీ తెలియజేస్తూ ఒక వీడియోని షేర్ చేశారు.
AP: ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ వ్యవస్థ గురించి ప్రస్తుతం ఎన్నో సందేహాలు వాలంటీర్ వ్యవస్థ గురించి ఎన్నో ప్రశ్నలు కూడా తలెత్తుతూ ఉన్నాయి. ఒకటో తేదీ రానే వస్తుంది ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందజేయాలి అంటే తప్పనిసరిగా వాలంటీర్లు అవసరం కనుక జూలై ఒకటో తేదీకి ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ గురించి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుందని అందరూ ఎదురు చూస్తున్నారు.
ఇలా వాలంటీర్ గురించి ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అందరూ ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఈయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వాలంటీర్ వ్యవస్థ ఇకపై ఉండదని తేల్చి చెప్పారు.
ఇంటింటికి పెన్షన్ అందజేసే కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే సచివాలయ ఉద్యోగస్తులను నియమించారు. దీంతో వాలంటీర్ వ్యవస్థ ఉండదని గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నటువంటి తరుణంలో మంత్రి వ్యాఖ్యలు ఆందోళనకరంగా ఉన్నాయి. వాలంటీర్లతో పాటు గ్రామ పరిధిలో ఉన్నటువంటి ఆశ వర్కర్లు అంగన్వాడీ టీచర్లతో ఇంటింటికి వెళ్లి పించని పంపిణీ చేయాలని ఇప్పటికే ఆదేశాలు వచ్చిన సంగతి తెలిసిందే.
Advertisement
ఈ క్రమంలోనే పెన్షన్ల బాధ్యత సచివాలయ సిబ్బందికి అప్పగించారు ఇక రేషన్ పాత పద్ధతిలోనే రేషన్ షాపు వద్దకు వెళ్లి తీసుకోవాల్సి ఉంటుంది ఇలాంటి తరుణంలో వాలంటీర్ వ్యవస్థతో పనిలేదని అందుకే వాలంటీర్ వ్యవస్థ గురించి ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని అర్థమవుతుంది. అయితే మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలతో వాలంటీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆందోళనలో వాలంటీర్లు.. గత ప్రభుత్వం 5000 రూపాయల గౌరవ వేతనం చెల్లించింది కానీ చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా 10,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తున్నామని చెప్పడంతో ఎంతో మంది వాలంటీర్ ఉద్యోగం పట్ల ఆశాభావం వ్యక్తం చేస్తూ ఆయనకు ఓట్లు కూడా వేశారు కానీ గెలిచిన తర్వాత ఇలా వాలంటీర్ వ్యవస్థ గురించి నిర్ణయం తీసుకోకపోవడం వాలంటీర్ వ్యవస్థ ఉండదని చెప్పడం పట్ల వాలంటీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Rajamouli: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ కల్కి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా అద్భుతమైన టాక్ సొంతం చేసుకోవడమే కాకుండా భారీ స్థాయిలో కలెక్షన్స్ కూడా రాబట్టడంతో ఈ సినిమాపై ఎంతోమంది సినీ సెలెబ్రెటీలు స్పందిస్తూ వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్ సినిమాలకు సంబంధించి గత విషయాలు కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ప్రభాస్ ఒకప్పుడు కేవలం తెలుగు చిత్ర పరిశ్రమకు మాత్రమే పరిమితమయ్యారు కానీ ప్రభాస్ కి ఈ స్థాయిలో క్రేజ్ రావడానికి కారణం మాత్రం రాజమౌళి అని చెప్పాలి ఈయన దర్శకత్వంలో బాహుబలి సినిమా ద్వారా ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇక బాహుబలి సినిమాని ద్వారా రాజమౌళి ఎవరు చేయని సాహసం చేశారు.
అప్పటివరకు బాలీవుడ్ ఇండస్ట్రీలో సౌత్ సినిమాలకు పెద్దగా క్రేజీ లేదు అంతేకాకుండా బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఈ సినిమాలో లేరు అక్కడ ఈ సినిమా సక్సెస్ అవుతుందా అన్న సందేహంతోనే రాజమౌళి తనపై తాను నమ్మకం ఉంచి ఈ సినిమాని విడుదల చేశారు. ఇక ఈ సినిమా నార్త్ లోకి మంచి ఆదరణ పొందినప్పటికీ తెలుగు రాష్ట్రాలలో మాత్రం డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది.
Advertisement
నెగటివ్ టాక్.. ఇలా తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాకి నెగటివ్ టాక్ రావడంతో తాను చాలా కంగారపడ్డానని ఆ సమయంలో డిప్రెషన్ లోకి కూడా వెళ్లిపోయానని తెలిపారు. కానీ రాజమౌళి విజినరీ ముందు నెగిటివ్ టాక్ కొట్టుకుపోయి ప్రతి ఒక్కరు కూడా కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపారనే టాక్ కారణంగా సినిమా చూడటానికి వెళ్లి ఈ సినిమాని విజయవంతం చేశారని తెలుస్తోంది.