Connect with us

Political News

YS Sharmila: ఏపీకి మరో దత్తపుత్రుడు దొరికారు.. షర్మిల ర్యాగింగ్ మామూలుగా లేదు?

Published

on

YS Sharmila: ఏపీలో పిఠాపురంలో దత్తాత్రేయుడు ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారో అలాగే దత్తపుత్రుడు కూడా అంతే ఫేమస్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి ఏ కార్యక్రమానికి వెళ్లిన దత్తపుత్రుడు అనే పదం ఉపయోగించకుండా ఆయన సభ ముగించరు. ఇలా జగన్మోహన్ రెడ్డి దత్తపుత్రుడు ప్యాకేజి స్టార్ అంటూ పవన్ కళ్యాణ్ ని తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఉంటారు.

ఇకపోతే తాజాగా జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిల సైతం దత్తపుత్రుడు అంటూ చేసినటువంటి కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ కి మరో దత్తపుత్రుడు దొరికారు అంటూ ఈమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రకు మరో దత్తపుత్రుడు ఎవరంటే ఆయన మరెవరో కాదు సాక్షాత్తు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటూ ఈమె తెలిపారు.

జగన్మోహన్ రెడ్డి ఈ ఐదేళ్ల కాలంలో రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారు. ఎలాంటి ప్రాజెక్టులు పూర్తి చేయలేదు ఎలాంటి పరిశ్రమలను కూడా ఇక్కడికి తీసుకురాలేదు కేవలం తనని, తన వాళ్లను కేసుల నుంచి కాపాడుకోవడంలోనే బిజీగా ఉన్నారని షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలా తన వారందరిని కాపాడుకోవడం కోసం ఆంధ్రుల గౌరవాన్ని మోడీ కాళ్ల ముందు పెట్టారని మోడీకి ఈయన దత్తపుత్రుడిగా మారారని షర్మిల కామెంట్లు చేశారు.

Advertisement

ఇలా రాష్ట్ర ప్రయోజనాలను మోడీ దగ్గర తాకట్టుపెట్టి మోడీ చేతిలో కీలుబొమ్మగా మారినటువంటి జగన్మోహన్ రెడ్డి మోడీకి దత్తపుత్రుడు అంటూ ఈమె కామెంట్లు చేశారు. ఇలా ఈమె కామెంట్ లో వైరల్ గా మారడంతో పవన్ కళ్యాణ్ ని ఎప్పుడు దత్తపుత్రుడు అంటూ విమర్శించే జగన్మోహన్ రెడ్డి కూడా చివరికి దత్తపుత్రుడుగా మారిపోయారు అంటూ కామెంట లు చేస్తున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Featured

YS Jagan: జగన్ ప్రజలను మోసం చేయలేనని చెప్పారు.. సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత!

Published

on

YS Jagan: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చింది. ఇక చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈయన పోలవరం గురించి ఎన్నో విషయాలను వెల్లడిస్తున్నారు తమ హయాంలోని 72% పోలవరం పనులు పూర్తి అయ్యాయని కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో నిధులన్ని దారి మళ్ళించారంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు అయితే ఈయన వ్యాఖ్యలపై వైసీపీ ఘాటుగా స్పందించారు.

గతంలో చంద్రబాబు నాయుడు చేసిన తప్పిదం మల్లె పోలవరం పూర్తి కాలేకపోయిందని చెప్పారు నాణ్యత లేకుండా డయాఫ్రమ్ నిర్మించడంతో డ్యాం పూర్తిగా డామేజ్ ఆయన నేపథ్యంలోనే పోలవరం పూర్తి కాలేకపోయిందని తెలియజేస్తున్నారు. ఇక ఇటీవల పోలవరం పై చంద్రబాబు నాయుడు శ్వేత పత్రం కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇలా పోలవరం విషయంలో నువ్వా నేనా అంటూ రెండు పార్టీలు మధ్య మాటల యుద్ధం నడుస్తున్న నేపథ్యంలో బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

బిజెపి నేత అలపాటి లక్ష్మీనారాయణ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. జగన్ పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ..పోలవరం విషయంలో డ్యామేజ్ ని కప్పి పుచ్ఛి పనులు కొనసాగిస్తే ప్రజలు ఎప్పటికీ క్షమించరని, ప్లాన్ మార్చమని చెప్పిన జగన్ లాంటి సీఎం ఎక్కడా ఉండరని లక్ష్మీనారాయణ తెలిపారు.

Advertisement

ప్రజలను మోసం చేయలేను..
పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు హయామంలో జరిగిన నిర్మాణ పనులలో డ్యామేజ్ కారణంగా వాటిని కప్పి పుచ్చి ప్రాజెక్టు పనులను పూర్తి చేస్తే అది ప్రజలకు పెద్ద ఎత్తున ప్రమాదకరమని ఈ విషయంలో ప్రజలను మోసం చేయలేనని చెప్పిన వ్యక్తి జగన్ అంటూ ఈయన చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Advertisement
Continue Reading

Featured

AP: మహిళలకు గుడ్ న్యూస్…జులై నుంచి ఏపీలో ఉచిత బస్సు సౌకర్యం!

Published

on

AP: ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం కూటమి అధికారంలో ఉంది. ఇలా కూటమి అధికారంలోకి రావడానికి ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా రాష్ట్ర ప్రజలకు పెద్ద ఎత్తున వరాలు కురిపించింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా కల్పించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ఉచిత బస్సు ప్రయాణం కర్ణాటకతో పాటు తెలంగాణలో కూడా అమలు అవుతున్న సంగతి తెలిసిందే.

ఇలా ఈ పథకాన్ని ప్రకటించడంతో అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలోనే అదే అస్త్రాన్ని కూటమి కూడా ఉపయోగించింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని ప్రకటించడమే కూడా కూటమి గెలుపుకు కారణమని చెప్పాలి. ఇంకా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడు కల్పిస్తున్నారనే విషయంపై గందరగోళం ఏర్పడింది.

రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి ఈ విషయంపై ఇదివరకే మాట్లాడుతూ తెలంగాణ కర్ణాటకలో పరిస్థితులను అక్కడ తలెత్తుతున్న సమస్యలను గుర్తించి ఏపీలో అలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్న తర్వాతనే ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని తెలిపారు.. అయితే ఉచిత బస్సు ప్రయాణం పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

Advertisement

జూలై 1 నుంచి..
ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా ఇచ్చిన హామీలలో ఒకటైన ఉచిత బస్సు సౌకర్యాన్ని జులై 1 నుంచి ఏపీలో అమలులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయం గురించి అధికారులతో చర్చించారని త్వరలోనే ఈ విషయం గురించి ప్రభుత్వం అధికారికంగా తెలియజేయబోతున్నారని తెలుస్తోంది.

Advertisement
Continue Reading

Featured

Wedding Card: వామ్మో అనంత్ అంబానీ వెడ్డింగ్ కార్డు ధర అన్ని లక్షలా.. కార్డ్ స్పెషల్ ఏంటంటే?

Published

on

Wedding Card: ప్రముఖ దిగ్గజ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. ముఖేష్ అంబానీ, నీత అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుకలు జరగబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిపై వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా ఎంతో ఘనంగా జరిగాయి. ఇకపోతే జూలై 12వ తేదీ వీరి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతోంది.

ఇక వీరి వివాహపు తేదీ దగ్గర పడుతున్న తరుణంలో పెళ్లి వేడుకలు కూడా శర వేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా ఇటీవల అనంత్ అంబానీ రాధిక మర్చంట్ వివాహపు వేడుకలలో భాగంగా వారి మొదటి వివాహ పత్రికను నీతా అంబానీ స్వయంగా శ్రీ కాశి విశ్వనాధుని సన్నిధి ఉంచి ప్రత్యేక పూజలు చేయించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే వీరి వెడ్డింగ్ కార్డు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వెడ్డింగ్ కార్డులో సుమారు మూడు కిలోలు వెండితో చిన్న మందిరం ఏర్పాటు చేయడమే కాకుండా అందులో విష్ణువు, లక్ష్మి వినాయకుడి బంగారు ప్రతిమలను తయారు చేసి పెట్టారని తెలుస్తోంది. ఇక ఈ వెడ్డింగ్ కార్డ్ ఓపెన్ చేయగానే ఓం అంటూ మంత్రోచ్ఛారణ వినిపిస్తుంది.

Advertisement

మూడు కిలోల వెండి మందిరం..
ఇలా చాలా స్పెషల్ గా ఈ వెడ్డింగ్ కార్డ్ డిజైన్ చేయించారని చెప్పాలి. మరి ఇన్ని ప్రత్యేకతలతో కూడిన ఈ వెడ్డింగ్ కార్డ్ ఖరీదు తెలిస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే. ఒక్కొక్క వెడ్డింగ్ కార్డ్ సుమారు 6.5 లక్షల రూపాయల విలువ చేస్తుందని తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. అయితే గతంలో కూడా ఈయన తన కుమార్తె ఈశా అంబానీ పెళ్లి వేడుకలలో కూడా ఇలా ఖరీదైన పెళ్లి పత్రికను తయారు చేయించారు ఇక ప్రస్తుతం అనంత్ రాధిక వెడ్డింగ్ కార్డ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!