Connect with us

Featured

సమంత ఎంత కాపీక్యాటో మీకు తెలుసా ?

Published

on

ఎవరైనా సెలబ్రిటీ ఏదైనా కొత్త గా చేస్తే అది ఫ్యాన్స్ ఫాలో అవుతుంటారు. అది కామన్ గా జరుగుతుంది. కానీ ఒక సెలబ్రిటీ ని మరొక సెలబ్రిటీ ఫాలో అయితే మాత్రం కాపీ కొట్టడమే అవుతుంది. మాములుగా కథలు కాపీ కొట్టడం సినిమాలు కాపీ కొట్టడం చూస్తుంటాం. కానీ ఇప్పుడు ఒక సెలబ్రిటీ డ్రెస్సెస్ ని మరొక సెలబ్రిటీ కాపీ కొడుతుండటం కూడా చూస్తున్నాం. అయితే ఇది కాపీ కొట్టడం అనాలా లేదంటే స్ఫూర్తి పొందారని అనుకోవాలా అర్ధం కానీ పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితి ఇప్పుడు టాలీవుడ్ టాప్ యాక్ట్రెస్ సమంత విషయం లో జరిగింది. జాను సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న సమంత మొన్నీ మధ్య థాంక్స్ మీట్ కి ఎంతో అందంగా రెడీ అయి వచ్చింది. సారీ పై ఎద భాగంలో జాను అని ప్రింట్ చేసిన చీరలో వచ్చి ఫాన్స్ ని ఫిదా చేసింది. ఈ చీరలో ఫోటోలు అభిమానులు తెగ వైరల్ చేసారు కూడా అయితే ఇప్పుడు చెప్పాచ్చేది ఏంటంటే సమంత కట్టుకున్న చీర బాలీవుడ్ యాక్ట్రెస్ కరీనా కపూర్ కట్టుకున్న చీర ఒకేలా ఉండటం తో సమతా బెబో ని కాపీ కొట్టింది అని కామెంట్స్ వినిపిస్తుంది.

Advertisement

అంతే కాదు బెబో కట్టుకున్న చీర ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ఊర్వశి సేథ్ డిజైన్ చేసింది. ఆ ఫాషన్ డిజైనర్ దగ్గరే ఈ చీర ను కూడా రూపొందించింది. అయితే ఈ విషయం లో బాలీవుడ్ మీడియా సమంత పై చిందులు తొక్కుతుంది, బెబో ని కాపీ కొట్టడం ఏంటి తనకంటూ ఒక ఓన్ స్టైల్ ఉండక్కర్లేదా అని విసుర్లు విసురుతుంది పైగా సమంత ఇలా బాలీవుడ్ హీరోయిన్స్ ని కాపీ కొట్టడం ఇదేమి మొదటి సారి కాదు. 2012 డిసెంబర్ లో సోనమ్ కపూర్ ఒక స్పోర్ట్ ఈవెంట్ వైట్ సారీ విత్ బ్లాక్ బోర్డర్ చీరలో మెరవగా నెల తిరక్కుండానే జనవరి 2013 లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ప్లాటినం డిస్క్ ఫంక్షన్ కి అదే సారీ డిజైన్ లో కనిపించి అందరి నోళ్ళల్లోనూ నానింది.
ఇక ఇదే ఫంక్షన్ కి తాపీగా headgear లాంటిది ధరించింది సమంత ..అది అచుగుద్దినట్టు దీపికా మరొక ఈవెంట్ అప్పటికే ధరించింది.

ఇక జులై 2013 లో ఒక ఈవెంట్ కి దీపికా అర్పిత మెహతా లెమన్ అండ్ యెల్లో విత్ పింక్ దేసినరీ బ్లౌజ్ లో మెరవగా ఏప్రిల్ 2014 లో హైదరాబాద్ లో ఒక ముల్టీప్లెస్ ఓపెనింగ్ కి అచ్చు గుద్దినట్టు అదే సారి లో వచ్చింది సమంత. చివరగా ఇదే సంవత్సరం చిత్రగంద ధరించిన రెడ్ క్రాప్ సారీ ని కూడా అచుగుద్దినట్టు అలాగే డిజైన్ చేయించుకుంది సమంత ..మరి ఇంతలా బాలీవుడ్ హీరోయిన్స్ ని అనుకరిస్తే ఎలా అంటున్నారు మీడియా వర్గాలు. ఇక సినిమాల విషయానికి వస్తే అనుష్క శర్మలానే నిర్మాతగా మారి సమంత సత్తా చాటాలన్న పట్టుదలతో ఉందిట. అలాగే వెబ్ సిరీస్ లు .. టీవీ షోలు అంటూ పలువురు తారల్ని ఫాలో చేయనుంది. అయితే మునుముందు అయినా ఒకరిని అనుసరించకుండా.. తనదైన స్టైల్ ని సామ్ ప్రెజెంట్ చేస్తుందా లేదా? అన్నది చూడాలి.

Advertisement

Continue Reading
Advertisement

Featured

Star Heroin: స్టార్ హీరోతో ప్రేమ,పెళ్లి విడాకులు..12 మందితో ఎఫైర్ పెట్టుకున్న హీరోయిన్… ఎవరంటే?

Published

on

Star Heroin: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో సీనియర్ నటి మనీషా కొయిరాల ఒకరు. ఈమె సౌత్ లో కంటే నార్త్ లోనే ఎక్కువ సినిమాలలో నటించి ఒకానొక సమయంలో బాలీవుడ్ చిత్ర పరిశ్రమను ఓ ఊపు ఊపారు. ఇక ఈమె స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలో తన వ్యక్తిగత విషయాలలో కూడా వార్తలలో నిలిచారు.

Advertisement

ఈమె ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూనే మరోవైపు పలువురు హీరోలతో ఎఫైర్ పెట్టుకుంది అంటూ వార్తలు వచ్చాయి. ఒక స్టార్ హీరోతో పీకల్లోతు ప్రేమలో పడినప్పటికీ ఆయనని పెళ్లి చేసుకోలేదు. ఇక ఈమె సామ్రాట్ దహాల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పటికీ రెండేళ్లకే తనతో విడాకులు తీసుకొని విడిపోయి పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు.

ఇలా డిప్రెషన్ లోకి వెళ్లిన మనీషా కోయిరాల మందుకు అలవాటు పడ్డారు.పెళ్లికి ముందే మనీషా కోయిరాలా ఏకంగా 12 మందితో డేటింగ్ చేసిందట. ఆమె డేటింగ్ చేసినవాళ్ల లిస్ట్ లో నటులు, వ్యాపారవేత్తలు,అంబాసిడర్ కూడా ఉన్నారు. వివేక్ ముశ్రన్‌, నానా పటేకర్‌, DJ హుస్సేన్‌, లండన్‌కు చెందిన నైజీరియన్ వ్యాపారవేత్త సెసిల్ ఆంథోనీ, ఆర్యన్ వైద్‌ వంటి ప్రముఖులతో ఈమె డేటింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది.

12 మందితో డేటింగ్..
ఇలా తరచూ డేటింగ్ ల ద్వారా కూడా ఈమె వార్తల్లో నిలిచారు. ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో బిజీగా గడిపారు. పలువురు దర్శక నిర్మాతలు సైతం ఈమె డేట్స్ కోసం ఎంతగానో ఎదురు చూసేవారు. ఇలా సినిమా ఇండస్ట్రీని ఓ ఊపిన ఈమె మధ్యలో ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్ లతో బిజీగా గడుపుతున్నారు.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: విష్ణు ప్రియకు షాక్ ఇచ్చిన నిఖిల్… కన్నీళ్లు పెట్టుకున్న నిఖిల్.. అసలు ఆట ఆరంభం!

Published

on

Bigg Boss 8: తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమం ప్రారంభం అయ్యి 5 రోజులు పూర్తయింది. ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయింది అయితే హౌస్ లో ఉన్నటువంటి 14 మంది కంటెస్టెంట్లను బిగ్ బాస్ మూడు గ్రూపులుగా విడదీశారు. అయితే ఈ గ్రూపులోకి ఎవరెవరు సభ్యులను తీసుకోవాలనేది చీఫ్ ఎన్నుకోవాల్సి ఉంటుంది.

Advertisement

ఈ క్రమంలోనే కంటెస్టెంట్ విష్ణు ప్రియ కచ్చితంగా తనని నిఖిల్ తన గ్రూపులోకి తీసుకుంటారని ఆమె భావించింది. కానీ నిఖిల్ మాత్రం ఆమెకు షాక్ ఇచ్చారు. దీంతో విష్ణు ప్రియను నైనిక తన టీమ్ లోకి తీసుకున్నారు. అయితే ఈ విషయం గురించి నిఖిల్ విష్ణుప్రియ మధ్య పెద్ద ఎత్తున చర్చ జరిగింది. వీరిద్దరికి ముందే మంచి పరిచయమున్న నేపథ్యంలో తప్పకుండా నిఖిల్ తన టీమ్ లోకి తీసుకుంటారని విష్ణు ప్రియ భావించింది కానీ అది జరగలేదు.

ఇలా ఇద్దరి మధ్య ఉన్న పరిచయం కారణంగా విష్ణు ప్రియ సరదాగా నిఖిల్ ను ఓ ఆట ఆడుకుంది. దీంతో నిఖిల్ ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలా ఇప్పటివరకు ఎంతో సరదాగా గడిపిన కంటెస్టెంట్లను మూడు గ్రూపులుగా విడదీయడంతో అసలైన ఆట మొదలైంది.

టాస్కులపై ఫోకస్..
కంటెస్టెంట్లను టీమ్స్ గా విడదీసి బిగ్ బాస్ టాస్కులను ఇవ్వడం మొదలుపెట్టారు. ఇలా ఇచ్చిన మొదటి టాస్కోలో భాగంగా ఇప్పటివరకు హౌస్ లో సైలెంట్ గా కూర్చున్న పృథ్విరాజ్ తన ఆట తీరును కనబరుస్తూ యష్మీ టీమ్ ను గెలిపించారు. దీంతో ముందు ముందు ఏ ఏ కంటెస్టెంట్ ఎలా తన ఆట తీరుతో ప్రేక్షకులను మెప్పిస్తారో తెలియాల్సి ఉంది.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు వచ్చారు బ్రో…. ఆ కంటెస్టెంట్లను ఆడేసుకుంటున్న ట్రోలర్స్!

Published

on

Bigg Boss 8: బిగ్ బాస్ కార్యక్రమానికి తెలుగులో కూడా ఎంతో మంచి ఆదరణ ఉంది. ఈ కార్యక్రమం తెలుగులో ఇప్పటికి ఏడు సీజన్లను పూర్తి చేసుకుని ఎనిమిదవ సీజన్ కూడా గత ఆదివారం ఎంతో ఘనంగా ప్రారంభమైంది. మొదట 14 మంది కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపించారు. మిగిలిన వారిని ఐదవ వారం వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి పంపించబోతున్నారని సమాచారం.

Advertisement

ఇక హౌస్ లోకి వెళ్లిన తర్వాత మొదటి రోజు నుంచే కంటెస్టెంట్లు పెద్ద ఎత్తున గొడవలు పడుతూ పోట్లాడుతూ ప్రేక్షకులకు కావాల్సినంత కంటెంట్ ఇస్తున్నారు. అయితే కొంతమంది మాత్రమే బాగా ఎక్స్పోజ్ అవుతున్నారు. మిగిలిన వారు మాత్రం అసలు హౌస్ లో ఉన్నారా లేదా అన్నా సందేహాలు వస్తున్నాయి. హౌస్ లోకి వెళ్ళేటప్పుడు ఎంతో యాక్టివ్ గా వెళ్లిన కంటెస్టెంట్లు లోపల మాత్రం అనుకున్న స్థాయిలో కంటెంట్ ఇవ్వలేకపోతున్నారనే చెప్పాలి.

ముఖ్యంగా హీరో ఆదిత్య ఓం అయితే హౌస్ లో ఉన్నాడా లేదా అన్న సందేహం మాత్రం అందరికీ కలుగుతుంది. ఈయన ఉంటే ఒంటరిగా ఉంటారు లేకపోతే నిద్రపోతూ ఉంటారు. పెద్దగా ఫేమస్ అయిన కంటెంట్ మాత్రం ఈయన ఇవ్వలేకపోతున్నారు. దీంతో పలువురు ట్రోలర్స్ బ్రో అసలు ఎందుకొచ్చావు బ్రో బిగ్ బాస్ హౌస్ కి అంటూ భారీగా విమర్శలు చేస్తున్నారు.

ఈయనతో పాటు బెజవాడ బేబక్క కూడా విమర్శలను ఎదుర్కొంటుంది. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా కనిపించే ఈమె హౌస్ లో మాత్రం ఎక్కువగా కిచెన్ లోనే ఉంటుంది. కానీ సరైన కంటెంట్ మాత్రం ఇవ్వలేకపోతున్నారు.అఫ్రిదీ కూడా డల్‌గానే ఉన్నాడనే టాక్‌ వస్తుంది. పృధ్విరాజ్, అభయ్ నవీన్ వంటి వారందరూ కూడా హౌస్ లో డల్ గా కనిపిస్తున్న తరుణంలో పలువురు మీరంతా హౌస్ లోకి ఎందుకు వచ్చారో ఏమో అంటూ వీరిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు అలాగే మరి కొంతమందిని బాగా హైలైట్ చేస్తూ కూడా కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

ఎలిమినేషన్ ఉంటుందా…
ఇక ఈ వారం నామినేషన్స్ లో భాగంగా బెజవాడ బేబక్క, విష్ణు ప్రియ, శేఖర్ భాష, నాగ మణికంఠ సోనియా ఆకుల ప్రేరణ వంటి వారు నామినేషన్ లో ఉన్నారు. అయితే గత సీజన్లో మాదిరిగా ఈ సీజన్లో కూడా మొదటి వారం ఎలిమినేషన్ ఉండకపోవచ్చని తెలుస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!