Connect with us

Featured

కరోనాను జయించేందుకు 13 మెట్లు.. సోషల్ మీడియాలో వైరల్!

Published

on

ప్రస్తుతం కరోనా పరిస్థితులు ప్రతి ఒక్కరిని ఎంతో భయాందోళనకు గురిచేస్తున్నాయి. కరోనా పాజిటివ్ అనగానే ప్రతి ఒక్కరూ ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకోవాలని భావిస్తుంటారు. అయితే కరోనా సోకిన ప్రతి ఒక్కరికి ఆస్పత్రిలో చికిత్స ఏమాత్రం అవసరం లేదు. ఇంట్లో ఉంటూనే కొన్ని నియమాలను పాటించడం ద్వారా కరోనా నుంచి బయటపడవచ్చు. కరోనా నుంచి కోలుకొని బయటపడాలంటే తప్పనిసరిగా ఈ 13 మెట్లు పాటించాల్సిన అవసరం ఎంతో ఉంది. కరోనాను జయించిన డానికి 13 సోపానాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

  1. కరోనా లక్షణాలు కనబడిన మొదటి రోజే హోమ్ ఐసోలేషన్ లోకి వెళ్లడం.
  2. స్వల్ప లక్షణాలు కనిపించిన మొదటి రోజే డాక్టర్ పర్యవేక్షణలో ఉండి అతని సూచనలు పాటించడం.
  3. కరోనా లక్షణం కనపడిన రెండవ రోజు RTPCR test ఇవ్వండి. దాని రిజల్ట్ గురించి ఆందోళన వద్దు.
  4. లక్షణాలు కనిపించిన అయిదవరోజు రక్త పరీక్షలు, ఎక్స్రే, సిటీ స్కాన్ అవసరం ఉండదు.

5.కరోనా లక్షణాలు తగ్గనప్పటికీ డాక్టర్లు సూచిస్తే తప్ప రక్త పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉండదు.

  1. కరోనా లక్షణాలు కనిపించిన ఐదవ రోజు నుంచి ప్రతి మూడు గంటలకు ఆక్సిజన్ స్థాయిలను పరీక్షించుకోవాలి.మన శరీరంలో 94 శాతం ఆక్సిజన్ ఉంటే భయపడాల్సిన పనిలేదు. 93 ఉండి శ్వాసకు ఇబ్బంది లేకపోతే ఆందోళన చెందవలసిన అవసరం లేదు. 90 నుంచి 93 మధ్య ఉంటే ఈ విషయాన్ని డాక్టర్ కి తెలియజేసి సరైన సూచనలు తీసుకోవాలి.
  2. అవసరమైతే ఎక్స్రే 6 నుంచి 10 రోజుల మధ్యలో డాక్టర్ సూచిస్తే చేయించుకోవాలి.

8.లక్షణాలు కనిపించిన ఐదవ రోజు నుంచి పదవ రోజు వరకు జ్వరం తీవ్రత తగ్గకుండా అధికంగా ఉంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.

9.ఆక్సిజన్ శాతం 90 నుంచి 93 మధ్య ఉంటే ఆక్సిజన్ స్థాయిలు పడిపోతున్నాయని కంగారు పడటం వల్ల ఆక్సిజన్ స్థాయిలో మరింత పడిపోయి ప్రమాదానికి దారి తీస్తాయి.

Advertisement

10.93 శాతం కన్నా ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉండటం ప్రతి పది మందిలో ఒకరికి జరుగుతుంది కాబట్టి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

11.హోం ఐసోలేషన్లో సరిగా తినని వాళ్ళు కరోనా నుండి కోలుకోవడాని చాలా సమయం పడుతోంది. కనుక ప్రతి మూడు గంటలకు ఒకసారి ఎంతో కొంత తినడం ముఖ్యం. షుగరు జబ్బు ఉన్నవారు తగినంత ఆహారం తీసుకుంటూ ఇంట్లో రెండు పూటలా షుగర్ టెస్టు చేయించుకుంటూ మందులను ఉపయోగించాలి.

  1. కరోనా లక్షణాలు కనిపిస్తూ హోం ఐసోలేషన్ లో ఉన్నపుడు వీలైనంత పడుకోవడమూ అవసరం. అనవసర శక్తి ప్రదర్శన వ్యాయామాలు చేస్తూ తాము బాగానే ఉన్నామని అనుకోకూడదు ఈ సమయంలో విశ్రాంతి ఎంతో అవసరం.

13.హోం ఐసోలేషన్ లో ఉంటూ కరోనాకు సంబంధించి భయం గొలిపే వార్తలను చూడకూడదు. ఈ సమయంలో మన మనసుకు ప్రశాంతత కల్పించే సంగీతం వినడం సినిమాలు చూడటం వంటివి, యోగ చేయడం వంటివి చేయాలి.

పై తెలిపిన 13 సూత్రాలను పాటించడం ద్వారా కరోనా బారిన పడిన వారు ఎటువంటి భయాందోళనలు లేకుండా తొందరగా వ్యాధి నుంచి బయట పడవచ్చు.

Advertisement

Featured

Kakli: కల్కి సినిమాకు ఫస్ట్ ఛాయిస్ ప్రభాస్ కదా.. ఆ హీరో సజెస్ట్ చేస్తేనే ప్రభాస్ వరకు వచ్చిందా?

Published

on

Kakli: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన తాజా చిత్రం కల్కి. ఈ సినిమా జూన్ 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ వారు ఏకంగా 600 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.

ఇక ఈ సినిమా జూన్ 27వ తేదీ విడుదల అయ్యి ఎంతో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకోవడమే కాకుండా భారీ స్థాయిలో కలెక్షన్లను రాబడుతుంది. ఇక ఈ సినిమా ఇంత మంచి సక్సెస్ అయిన నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందులో ప్రభాస్ భైరవ పాత్రలో నటించిన సంగతి మనకు తెలిసిందే.

నిజానికి ఈ సినిమాలో ముందుగా ప్రభాస్ ను అనుకోలేదట డైరెక్టర్ అయితే ఒక స్టార్ హీరో ఈ సినిమాని రిజెక్ట్ చేయడంతోనే ప్రభాస్ వరకు వచ్చిందని తెలుస్తుంది. ఈ సినిమా కథ మొత్తం సిద్ధం చేసుకున్న తర్వాత డైరెక్టర్ నాగ్ అశ్విన్ మెగాస్టార్ చిరంజీవి వద్దకు వెళ్లి ఈ సినిమా కథను వివరించారట ఈ సినిమా కథ విన్న చిరంజీవి సినిమా చాలా అద్భుతంగా ఉంది కచ్చితంగా సక్సెస్ అవుతుందని తెలియజేశారట.

Advertisement

చిరు రిజెక్ట్ చేశారా..
ఇలా తనకు కథ చెప్పిన తర్వాత ఇందులో భైరవ పాత్రలో మీరు నటించాలని కోరుకుంటున్నాను అని చెప్పడంతో వెంటనే చిరంజీవి ఈ సినిమాలో భైరవ పాత్రలో నేను నటిస్తే ఆ పాత్రకు పూర్తిగా న్యాయం జరగదు. ఈ పాత్రకు ప్రభాస్ సరిగ్గా సరిపోతారని ఆయనే ప్రభాస్ పేరును సజెస్ట్ చేశారని తెలుస్తోంది. ఇలా చిరంజీవి కాదంటేనే కల్కి సినిమా కథ ప్రభాస్ వరకు వచ్చిందని, చిరు కారణంగానే ప్రభాస్ మరో హిట్ సినిమాని అందుకున్నారని తెలుస్తోంది.

Advertisement
Continue Reading

Featured

NTR: చిరంజీవి ఇచ్చిన అవార్డును ఆ హీరో ఇంటికి పంపిన తారక్.. ఏమైందంటే?

Published

on

NTR: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు నటుడు ఎన్టీఆర్. ఈయన బాల నటుడి గానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అతి చిన్న వయసులోనే హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇలా హీరోగా ఇండస్ట్రీలో ఎంతో సక్సెస్ అందుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.

ఇలా వరుస సినిమాలలో నటిస్తున్న తారక్ గురించి తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది. ఎన్టీఆర్ హీరోగా నటించిన యమదొంగ సినిమా ఎలాంటి సక్సెస్ అయ్యిందో మనకు తెలిసిందే .ఈ సినిమాకు గాను ఈయనకు స్టార్ మా అవార్డు అందుకున్నారు అయితే ఈ అవార్డు ప్రముఖ నటుడు చిరంజీవి నాగార్జున చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. అయితే ఈ అవార్డును తీసుకున్న తారక్ ఇంట్లో పెట్టుకోకుండా వేరే హీరోకి పంపించారని తెలుస్తోంది.

ఇలా స్టార్ హీరో చిరంజీవి చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకున్నటువంటి ఈయన వేదికపై మాట్లాడుతూ తాను చిన్నప్పటినుంచి చిరంజీవి గారు నాగార్జున బాబాయ్ సినిమాలను చూస్తూ తాను పెరిగానని తెలిపారు. ఇక ఈవెంట్ జరుగుతున్న నేపథ్యంలో సీనియర్ నటుడు శోభన్ బాబు మరణించారనే వార్త తెలియడంతో తనకు వచ్చిన ఈ అవార్డు శోభన్ బాబు గారి ఇంట్లో ఉండాలని నిర్ణయం తీసుకున్న ఎన్టీఆర్ ఆ అవార్డును తన ఇంటికి పంపించారు.

Advertisement

శోభన్ బాబు ఇంటికి..
ఆ క్షణం ఎన్టీఆర్ తీసుకున్న ఆ నిర్ణయానికి చిరంజీవి సైతం ఫిదా అవ్వడమే కాకుండా ఎన్టీఆర్ పై ప్రశంశల వర్షం కురిపించారు. ఇక ఎన్టీఆర్ ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే ఈయన కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Advertisement
Continue Reading

Featured

YS Sharmila: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన షర్మిల.. కారణం అదేనా?

Published

on

YS Sharmila: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల కలిశారు. ఇటీవల హైదరాబాద్ లోనే ఉంటున్న ఈమె తెలంగాణ ముఖ్యమంత్రిని కలవడమే కాకుండా తన తండ్రి జయంతి వేడుకలకు హాజరు కావాల్సిందిగా ఆమె తనకు ఆహ్వానం అందజేశారు. జులై 8వ తేదీ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి అనే సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే ఈసారి వైయస్సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించబోతున్నట్లు తెలుస్తుంది. ఇన్ని రోజులపాటు జగన్మోహన్ రెడ్డి షర్మిల ఎవరికి వారు వైయస్సార్ ఘాట్ వద్దకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేసి తన తండ్రికి నివాళులు అర్పించేవారు.

ఇటీవల జగన్మోహన్ రెడ్డి నుంచి షర్మిల దూరంగా వెళ్లడమే కాకుండా ఆమె కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడంతో ఈసారి జరగబోయే జయంతి వేడుకలను షర్మిల ఘనంగా జరిపించడమే కాకుండా కాంగ్రెస్ పెద్దలను కూడా ఆహ్వానిస్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి జూలై 8వ తేది విజయవాడలోని CK కన్వెన్షన్ సెంటర్ లో జరిగే రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకలకు హాజరుకావాలని ఆహ్వానించారు.

Advertisement

ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు..

జులై 8వ తేదీ జరగబోయే ఈ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ , లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ , జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, ఇతర AICC పెద్దలతో పాటు .. ఏపి, తెలంగాణ,కర్ణాటక రాష్ట్రాల నాయకులు, ప్రముఖులు హాజరు కానున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!