Connect with us

Featured

Nagma: సౌరవ్ గంగూలీ నుంచి.. మనోజ్ తివారీ వరకు.. నగ్మా సాగించిన వ్యవహారాలు ఇవే..!

Nagma: బాలీవుడ్ నుంచి భోజ్‌పురి సినిమా వరకు నటనలో తన సత్తాను నిరూపించుకున్న నటి నగ్మాకు 47 సంవత్సరాలు. డిసెంబర్ 25న ఆమె పుట్టినరోజు

Published

on

Nagma: బాలీవుడ్ నుంచి భోజ్‌పురి సినిమా వరకు నటనలో తన సత్తాను నిరూపించుకున్న నటి నగ్మాకు 47 సంవత్సరాలు. డిసెంబర్ 25న ఆమె పుట్టినరోజు జరుపుకున్నారు. నటనతో తనదైన ముద్ర వేసిన నగ్మా ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండానే ఉంది. అయితే ఆమెకు నలుగురు పెళ్లయిన వారితో అక్రమ సంబంధం పెట్టుకున్నారు కనుకనే ఆమె ఒంటరిగా ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

Nagma: సౌరవ్ గంగూలీ నుంచి.. మనోజ్ తివారీ వరకు.. నగ్మా సాగించిన వ్యవహారాలు ఇవే..!
Nagma: సౌరవ్ గంగూలీ నుంచి.. మనోజ్ తివారీ వరకు.. నగ్మా సాగించిన వ్యవహారాలు ఇవే..!

నగ్మా 1974లో ముస్లిం, హిందూ కుటుంబంలో జన్మించింది. ఆమె తల్లి ముస్లిం, తండ్రి హిందూ. ఆమె తండ్రి జైసల్మేర్ రాజ కుటుంబానికి చెందినవాడు. ఆ తర్వాత గుజరాత్‌కు, ముంబైకి మకాం మార్చాడు. ఈ నటి హిందీలోనే కాకుండా భోజ్‌పురి మరియు సౌత్ సినిమాల్లో కూడా పనిచేసింది. ఆమె సల్మాన్ ఖాన్ చిత్రం ‘బాఘీ: ఎ రెబెల్ ఫర్ లవ్’తో హిందీ చిత్రసీమలో తన కెరీర్‌ను ప్రారంభించింది. నేడు ఆమె రాజకీయ నాయకురాలు కూడా. ఆమె సినిమాలు , కెరీర్ ఎప్పటిలాగే ప్రజాదరణ పొందాయి. అదేవిధంగా.. ఆమె వ్యక్తిగత జీవితం కూడా ఎప్పుడూ వార్తలో నిలుస్తూ వస్తోంది.

Nagma: సౌరవ్ గంగూలీ నుంచి.. మనోజ్ తివారీ వరకు..నగ్మా సాగించిన వ్యవహారాలు ఇవే..!
Nagma: సౌరవ్ గంగూలీ నుంచి.. మనోజ్ తివారీ వరకు..నగ్మా సాగించిన వ్యవహారాలు ఇవే..!

ఆమె భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీతో ఎఫైర్ పెట్టుకున్నారని.. ఆంధ్రప్రదేశ్‌లోని ఓ గుడిలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారని వార్తలు వచ్చాయి. ఈ విషయం 2001 సంవత్సరం నాటిది. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారని.. వార్తలు వచ్చాయి. అయితే దీనిపై అప్పట్లో వీరిద్దరూ ఖండించారు. ఆ తరువాత వీరిద్దరి మధ్య బ్రేకప్ అయిందనే వార్తలు వచ్చాయి.

అతడితో విడిపోయిన తర్వాత ఆమె సౌత్ నటుడు శరత్ కుమార్‌తో ఎఫైర్ పెట్టుకున్నట్లు వార్తలు వచ్చాయి. శరత్ కుమార్ నటుడే కాదు.. ఎంపీ కూడా. అతనికి కూడా అప్పటికే పెళ్లయింది. ఇద్దరూ ఒకరితో ఒకరు రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పటికీ.. వారి సంబంధం సానుకూలంగా సాగలేదు. వీరి వ్యవహారం శరత్ భార్యకు తెలియడంతో వివాహ బంధానికి స్వస్తి చెప్పి విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీని తరువాత నటి కూడా శరత్ తో తన సంబంధాన్ని తెంచుకోవాలని నిర్ణయించుకుంది. వీరిద్దరి మధ్య కూడా బ్రేకప్ అయింది.

Advertisement

నగ్మా రిలేషన్ లో ఉన్న వారిద్దరూ వివాహితులే..


ఆ తర్వాత ఈమె సౌత్ సినిమాలకు గుడ్ బై చెప్పి.. భోజ్‌పురి చిత్రాల్లో నటించింది. అక్కడ సూపర్ స్టార్ రవి కిషన్‌తో చాలా చిత్రాలలో యాక్ట్ చేసింది నగ్మా. తర్వాత వారి ప్రేమ గురించి మీడియాలో చర్చలు కూడా ప్రారంభమయ్యాయి. వీరిద్దరి మధ్య రిలేషన్ కొనసాగుతుండగా.. అతడి భార్యకు తెలిసింది. దీంతో నగ్మాను అతడు దూరం పెట్టేశాడు. రవి కిషన్‌తో విడిపోయిన తర్వాత, నగ్మా నటుడు మనోజ్ తివారీతో ఎఫైర్ పెట్టుకున్నట్లు పుకార్లు వచ్చాయి. అప్పట్లో మనోజ్, రవికిషన్ మధ్య ఇండస్ట్రీలో పెద్ద పోటీ నెలకొంది. దీని గురించి నటి ఒకసారి మాట్లాడుతూ.. ‘మేమిద్దరం కలిసి పని చేస్తున్నామంటే, మా మధ్య ఏదైనా జరుగుతున్నట్లు అర్థం కాదు అంటూ ఆమె క్లారిటీ ఇచ్చింది. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. మనోజ్ తివారీ మరియు రవి కిషన్ ఇద్దరూ వివాహితులు కావడం విశేషం.

Advertisement

Featured

Rajamouli: వరుస ఫ్లాపులు వచ్చిన ఐరన్ లెగ్ అని పిలిచినా.. ఆ హీరోయిన్లనే తీసుకుంటాం: రాజమౌళి

Published

on

Rajamouli: తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు డైరెక్టర్ రాజమౌళి. ఈయన దర్శకుడిగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు. ఇక తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లిన ఘనత రాజమౌళికి దక్కుతుందని చెప్పాలి. ఇలా దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

రాజమౌళి కెరియర్ లో వచ్చిన మగధీర సినిమా ఎంతో ప్రత్యేకమైనదని చెప్పాలి. మొదటిసారి ఇలాంటి సినిమా ద్వారా ఈయన ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు అయితే ఈ సినిమా సమయంలో తాను ఎంతో కంగారు పడ్డానని అప్పటికే ఇది చాలా భారీ బడ్జెట్ కావడంతో ఒక రకమైన భయం ఉండేదని తెలిపారు.

ఇక తన సినిమాలలో అందరిలాగే స్టార్ హీరోయిన్లనే పెట్టుకోవాలని నేను అనుకుంటాను. కానీ నేను రాసుకున్న కథకు అనుగుణంగా ఏ హీరోయిన్ అయితే సెట్ అవుతుందో వారినే తీసుకుంటాను. ఆ హీరోయిన్ కు వరుసగా ప్లాపులు వచ్చిన ఆమె ఐరన్ లెగ్ అంటూ ట్రోల్స్ ఎదుర్కొన్న తాను వాటిని లెక్క చేయను.
మగధీర..

Advertisement

ఇలా ఆ హీరోయిన్ హిస్టరీ గురించి నేను ఏమాత్రం ఆలోచించనని నా పాత్రకు సూట్ అయితే తప్పనిసరిగా వారికి అవకాశాలు ఇస్తాను అంటూ ఈ సందర్భంగా హీరోయిన్ల గురించి రాజమౌళి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం ఈయన మహేష్ బాబుతో సినిమా చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోతోంది.

Advertisement
Continue Reading

Featured

Venu Swamy: బిగ్ బాస్ లోకి వేణు స్వామి… భారీ రెమ్యూనరేషన్ అందుకోబోతున్న జ్యోతిష్యులు!

Published

on

Venu Swamy: బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్ బాస్ 8 కార్యక్రమంలో కంటెస్టెంట్లుగా వేణు స్వామి సందడి చేయబోతున్నారనే సంగతి మనకు తెలిసిందే. త్వరలోనే ఈ కార్యక్రమం ప్రసారం కాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి సంబంధించిన ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ కార్యక్రమం ఆగస్టులోనే ప్రారంభం కాబోతుందని తెలుస్తుంది.

ఇదిలా ఉండగా ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్లకు సంబంధించిన లిస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో వేణు స్వామి కూడా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ప్రముఖ ఆస్ట్రాలజర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వేణు స్వామి బిగ్ బాస్ 8 కార్యక్రమంలో పాల్గొనబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.

ఇలా ఆస్ట్రాలజర్ గా ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి ఈయన బిగ్ బాస్ కార్యక్రమంలోకి రాబోతున్నారని తెలియగానే ఈ కార్యక్రమం పై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇక ఈయన కారణంగా రేటింగ్స్ కూడా భారీగా వచ్చే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇకపోతే వేణు స్వామి బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొంటూ అందుకోబోయే రెమ్యూనరేషన్ గురించి కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

లక్షల్లో రెమ్యునరేషన్..

Advertisement


దేశ చరిత్రలోనే ఇప్పటివరకు ఏ కంటెస్టెంట్ తీసుకొని రెమ్యూనరేషన్ ఈయన అందుకోబోతున్నారని తెలుస్తోంది. వేణు స్వామి వారానికి లక్షల్లోనే రెమ్యూనరేషన్ అందుకునే విధంగా అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్టు సమాచారం. మరి వేణు స్వామి ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని ఆయన రెమ్యూనరేషన్ గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Advertisement
Continue Reading

Featured

Kumari Aunty: కుమారి ఆంటీని కలిసిన సోను సూద్… నేనున్నానంటూ ధైర్యం చెప్పిన హీరో!

Published

on

Kumari Aunty: కుమారి ఆంటీ పరిచయం అవసరం లేని పేరు. ఈమె హైదరాబాదులో రోడ్డు పక్కన ఫుడ్ స్టాల్ బిజినెస్ చేసుకుంటూ జీవనం గడిపేది అయితే ఈమె చాలా తక్కువ ధరకే కడుపునిండా భోజనం పెట్టడంతో ఈమె గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఎంతోమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఆమె దగ్గరికి వెళ్లి తనతో ఇంటర్వ్యూ తీసుకోవడంతో ఒక్కసారిగా ఈమె పాపులర్ అయ్యారు.

ఇలా సోషల్ మీడియా వేదికగా ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్న ఈమె ప్రస్తుతం సెలబ్రిటీగా మారిపోయారని చెప్పాలి. ఎన్నో కార్యక్రమాలలో కూడా కుమారి ఆంటీ సందడి చేశారు. ఇక త్వరలోనే కుమారి ఆంటీ బిగ్ బాస్ కార్యక్రమంలో కూడా పాల్గొనబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు.

ఈ విధంగా కుమారి ఆంటీ రోజురోజుకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకోవడంతో ఎంతోమంది సెలబ్రిటీలు కూడా ఆమె వద్దకు వచ్చి ఆమె ఫుడ్ టేస్ట్ చేస్తున్నారు. ఇకపోతే తాజాగా కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ వద్దకు సినీ నటుడు సోను సూద్ వచ్చి ఒక్కసారిగా సర్ప్రైజ్ ఇచ్చారు. కుమారి ఆంటీని కలిసిన ఈయన ఆమెతో సరదాగా మాట్లాడి తన కుటుంబ సభ్యుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

Advertisement

మహిళా సాధికారత..
మహిళా సాధికారత కష్టపడే తత్వానికి కుమారి ఆంటీ నిదర్శనమని సోను సూద్ ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాకుండా తనకు ఎలాంటి కష్టం వచ్చినా నేనున్నానని వెంటనే నాకు తెలియజేయాలి అంటూ ఆమెకు ధైర్యం చెప్పారు. ఇక సోను సూద్ గురించి కుమారి ఆంటీ మాట్లాడుతూ.. ఎంతోమందికి సహాయం చేసిన సోను సూద్ కి ఏమిచ్చినా తక్కువే అంటూ కుమారి ఆంటీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!