Connect with us

Featured

Vijayashanti : “కర్తవ్యం” సినిమా తర్వాత విజయశాంతి ప్రవర్తనలో మార్పు వచ్చిందా?.. ఆ రెండు సినిమాలే అందుకు ఉదాహరణలుగా నిలిచాయా.??

Published

on

Vijayashanti : ఒకప్పటి పోలీస్ ఆఫీసర్ కిరణ్ బేడీ జీవితాన్ని ఆదర్శంగా చేసుకొని ఒక కథ తయారు చేయమని ఎ.ఏం.రత్నం, పరుచూరి సోదరులతో చెప్పారు. ఆ క్రమంలో.. పరుచూరి సోదరులు అద్భుతమైన పవర్ ఫుల్ పోలీస్ స్టోరీని రాయడం జరిగింది. ఆ స్టోరీ ఏ.ఎం.రత్నం, మోహన్ గాంధీలకు నచ్చడంతో విజయశాంతితో సినిమా తీయడానికి సంసిద్ధులు అయ్యారు. ఇక విజయశాంతికి దీటుగా సరికొత్త విలనిజాన్ని పండించడానికి కొత్త వారిచే విలన్ పాత్ర చేయించాలనే ఉద్దేశంతో… ప్రముఖ నిర్మాత పుండరీకాక్షయ్యను కర్తవ్యం చిత్రంలో విలన్ గా తీసుకున్నారు. అలా 1990,జూన్ లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాన్ని సాధించింది.

Advertisement
Vijayashanti : "కర్తవ్యం" సినిమా తర్వాత విజయశాంతి ప్రవర్తనలో మార్పు వచ్చిందా?.. ఆ రెండు సినిమాలే అందుకు ఉదాహరణలుగా నిలిచాయా.??

ఆ తర్వాత 1991, మాగంటి రవీంద్రనాథ్ చౌదరి నిర్మాణం, విజయబాపినీడు దర్శకత్వంలో “గ్యాంగ్ లీడర్” చిత్రం పాట “భద్రాచలం కొండా సీతమ్మ వారి అండ.. కావాలా నీకు అండా దండా” అనే పాట చిత్రీకరణ జరుగుతున్న సందర్భంలో కర్తవ్యం సినిమాకి జాతీయ ఉత్తమ నటిగా విజయశాంతికి అవార్డు ప్రకటించారు. గ్యాంగ్ లీడర్ సినిమా యూనిట్ సభ్యులు మొత్తం ఆమెను అభినందించారు. అయితే గ్యాంగ్ లీడర్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి డిఫరెంటు లుక్ అండ్ మేనరిజం డైలాగ్, సూపర్ సాంగ్స్ అండ్ డాన్స్, వెరైటీ కాస్ట్యూమ్స్ తో యూత్ మొత్తాన్ని తన సినిమా వైపు చిరంజీవి తిప్పుకున్నారు.

Vijayashanti : "కర్తవ్యం" సినిమా తర్వాత విజయశాంతి ప్రవర్తనలో మార్పు వచ్చిందా?.. ఆ రెండు సినిమాలే అందుకు ఉదాహరణలుగా నిలిచాయా.??

ఒక విధంగా చెప్పాలంటే చిరంజీవి అన్నీ తానై ఈ సినిమా అద్భుత విజయానికి కారకులయ్యారు. అయితే‌ గ్యాంగ్ లీడర్ సినిమా పోస్టర్స్ పైన చిరంజీవి మాస్ లుక్ తో అభిమానులను ఆకట్టుకున్నారు. అలాగే కర్తవ్యం సినిమాతో హీరోలతో సమానంగా ఇమేజ్ వచ్చినా కూడా ఈ సినిమాలో సరైన గుర్తింపు రాలేదని ఆమె అనుకున్నారని వినికిడి.అయితే మూవీ పోస్టర్స్ పైన విజయశాంతి ఫోటో లేదని “గ్యాంగ్ లీడర్” శతదినోత్సవానికి విజయశాంతి హాజరు కాలేదని అప్పట్లో ఇండస్ట్రీలో ఒక టాక్ కూడా వినిపించింది.

Vijayashanti : "కర్తవ్యం" సినిమా తర్వాత విజయశాంతి ప్రవర్తనలో మార్పు వచ్చిందా?.. ఆ రెండు సినిమాలే అందుకు ఉదాహరణలుగా నిలిచాయా.??

కర్తవ్యం సినిమా తర్వాత సరిగ్గా మూడు సంవత్సరాలకు (1993) బాలయ్యతో విజయశాంతి జోడీగా నటించారు. యువరత్న ఆర్ట్స్, ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో నిప్పురవ్వ చిత్రం షూటింగ్ మొదలైంది. మొదట రాసుకున్న స్క్రిప్టులో హీరోయిన్ పాటలకు మాత్రమే పరిమితం కాకుండా.. హీరో బాలకృష్ణతో సరిసమానంగా తన పాత్రను మరింత పొడిగించాలని తరుచూ విజయశాంతి అడుగుతూ ఉండేవారు. అలా చేయడంతో బాలయ్య, విజయశాంతి మధ్య దూరం ఏర్పడింది. ఎప్పుడైతే ఈ సినిమాలో బాలకృష్ణ పార్ట్ అయిపోయిందో ఇక “నిప్పురవ్వ’ సినిమా గురించి ఆయన పట్టించుకోలేదు. సినిమా ప్రమోషన్స్ కి బాలయ్య హాజరు కాలేకపోయారు.

Vijayashanthi:nమహేష్ బాబుని 'గారు' అన్న విజయశాంతిని తప్పుబట్టిన నెటిజెన్.. రాములమ్మ రియాక్షన్ చూస్తే షాక్ అవ్వాలసిందే!
Vijayashanthi:nమహేష్ బాబుని ‘గారు’ అన్న విజయశాంతిని తప్పుబట్టిన నెటిజెన్.. రాములమ్మ రియాక్షన్ చూస్తే షాక్ అవ్వాలసిందే!

విజయశాంతి బాలయ్య మధ్య సఖ్యత ఉంటే మొదట ప్రకటించిన విడుదల తేదీకి సినిమా రిలీజ్ చేసి అద్భుత విజయాన్ని సాధించడానికి అవకాశం ఉండేది. కానీ నిప్పురవ్వ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన.. తరుచూ వాయిదా వేయడంతో సినిమా షూటింగ్ మూడు సంవత్సరాలు జాప్యం జరిగి 1993, సెప్టెంబర్ లో “నిప్పురవ్వ” చిత్రం విడుదలై బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పరాజయం పొందింది. అయితే కర్తవ్యం సినిమా అనంతరం విజయశాంతి అనేక లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో హీరోలతో సమానంగా బాక్సాఫీస్ వద్ద పోటీలో నిలిచినప్పటికీ ఆ సినిమాలు అంతగా విజయం సాధించలేకపోయాయి.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Star Heroin: స్టార్ హీరోతో ప్రేమ,పెళ్లి విడాకులు..12 మందితో ఎఫైర్ పెట్టుకున్న హీరోయిన్… ఎవరంటే?

Published

on

Star Heroin: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో సీనియర్ నటి మనీషా కొయిరాల ఒకరు. ఈమె సౌత్ లో కంటే నార్త్ లోనే ఎక్కువ సినిమాలలో నటించి ఒకానొక సమయంలో బాలీవుడ్ చిత్ర పరిశ్రమను ఓ ఊపు ఊపారు. ఇక ఈమె స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలో తన వ్యక్తిగత విషయాలలో కూడా వార్తలలో నిలిచారు.

Advertisement

ఈమె ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూనే మరోవైపు పలువురు హీరోలతో ఎఫైర్ పెట్టుకుంది అంటూ వార్తలు వచ్చాయి. ఒక స్టార్ హీరోతో పీకల్లోతు ప్రేమలో పడినప్పటికీ ఆయనని పెళ్లి చేసుకోలేదు. ఇక ఈమె సామ్రాట్ దహాల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పటికీ రెండేళ్లకే తనతో విడాకులు తీసుకొని విడిపోయి పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు.

ఇలా డిప్రెషన్ లోకి వెళ్లిన మనీషా కోయిరాల మందుకు అలవాటు పడ్డారు.పెళ్లికి ముందే మనీషా కోయిరాలా ఏకంగా 12 మందితో డేటింగ్ చేసిందట. ఆమె డేటింగ్ చేసినవాళ్ల లిస్ట్ లో నటులు, వ్యాపారవేత్తలు,అంబాసిడర్ కూడా ఉన్నారు. వివేక్ ముశ్రన్‌, నానా పటేకర్‌, DJ హుస్సేన్‌, లండన్‌కు చెందిన నైజీరియన్ వ్యాపారవేత్త సెసిల్ ఆంథోనీ, ఆర్యన్ వైద్‌ వంటి ప్రముఖులతో ఈమె డేటింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది.

12 మందితో డేటింగ్..
ఇలా తరచూ డేటింగ్ ల ద్వారా కూడా ఈమె వార్తల్లో నిలిచారు. ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో బిజీగా గడిపారు. పలువురు దర్శక నిర్మాతలు సైతం ఈమె డేట్స్ కోసం ఎంతగానో ఎదురు చూసేవారు. ఇలా సినిమా ఇండస్ట్రీని ఓ ఊపిన ఈమె మధ్యలో ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్ లతో బిజీగా గడుపుతున్నారు.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: విష్ణు ప్రియకు షాక్ ఇచ్చిన నిఖిల్… కన్నీళ్లు పెట్టుకున్న నిఖిల్.. అసలు ఆట ఆరంభం!

Published

on

Bigg Boss 8: తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమం ప్రారంభం అయ్యి 5 రోజులు పూర్తయింది. ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయింది అయితే హౌస్ లో ఉన్నటువంటి 14 మంది కంటెస్టెంట్లను బిగ్ బాస్ మూడు గ్రూపులుగా విడదీశారు. అయితే ఈ గ్రూపులోకి ఎవరెవరు సభ్యులను తీసుకోవాలనేది చీఫ్ ఎన్నుకోవాల్సి ఉంటుంది.

Advertisement

ఈ క్రమంలోనే కంటెస్టెంట్ విష్ణు ప్రియ కచ్చితంగా తనని నిఖిల్ తన గ్రూపులోకి తీసుకుంటారని ఆమె భావించింది. కానీ నిఖిల్ మాత్రం ఆమెకు షాక్ ఇచ్చారు. దీంతో విష్ణు ప్రియను నైనిక తన టీమ్ లోకి తీసుకున్నారు. అయితే ఈ విషయం గురించి నిఖిల్ విష్ణుప్రియ మధ్య పెద్ద ఎత్తున చర్చ జరిగింది. వీరిద్దరికి ముందే మంచి పరిచయమున్న నేపథ్యంలో తప్పకుండా నిఖిల్ తన టీమ్ లోకి తీసుకుంటారని విష్ణు ప్రియ భావించింది కానీ అది జరగలేదు.

ఇలా ఇద్దరి మధ్య ఉన్న పరిచయం కారణంగా విష్ణు ప్రియ సరదాగా నిఖిల్ ను ఓ ఆట ఆడుకుంది. దీంతో నిఖిల్ ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలా ఇప్పటివరకు ఎంతో సరదాగా గడిపిన కంటెస్టెంట్లను మూడు గ్రూపులుగా విడదీయడంతో అసలైన ఆట మొదలైంది.

టాస్కులపై ఫోకస్..
కంటెస్టెంట్లను టీమ్స్ గా విడదీసి బిగ్ బాస్ టాస్కులను ఇవ్వడం మొదలుపెట్టారు. ఇలా ఇచ్చిన మొదటి టాస్కోలో భాగంగా ఇప్పటివరకు హౌస్ లో సైలెంట్ గా కూర్చున్న పృథ్విరాజ్ తన ఆట తీరును కనబరుస్తూ యష్మీ టీమ్ ను గెలిపించారు. దీంతో ముందు ముందు ఏ ఏ కంటెస్టెంట్ ఎలా తన ఆట తీరుతో ప్రేక్షకులను మెప్పిస్తారో తెలియాల్సి ఉంది.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు వచ్చారు బ్రో…. ఆ కంటెస్టెంట్లను ఆడేసుకుంటున్న ట్రోలర్స్!

Published

on

Bigg Boss 8: బిగ్ బాస్ కార్యక్రమానికి తెలుగులో కూడా ఎంతో మంచి ఆదరణ ఉంది. ఈ కార్యక్రమం తెలుగులో ఇప్పటికి ఏడు సీజన్లను పూర్తి చేసుకుని ఎనిమిదవ సీజన్ కూడా గత ఆదివారం ఎంతో ఘనంగా ప్రారంభమైంది. మొదట 14 మంది కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపించారు. మిగిలిన వారిని ఐదవ వారం వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి పంపించబోతున్నారని సమాచారం.

Advertisement

ఇక హౌస్ లోకి వెళ్లిన తర్వాత మొదటి రోజు నుంచే కంటెస్టెంట్లు పెద్ద ఎత్తున గొడవలు పడుతూ పోట్లాడుతూ ప్రేక్షకులకు కావాల్సినంత కంటెంట్ ఇస్తున్నారు. అయితే కొంతమంది మాత్రమే బాగా ఎక్స్పోజ్ అవుతున్నారు. మిగిలిన వారు మాత్రం అసలు హౌస్ లో ఉన్నారా లేదా అన్నా సందేహాలు వస్తున్నాయి. హౌస్ లోకి వెళ్ళేటప్పుడు ఎంతో యాక్టివ్ గా వెళ్లిన కంటెస్టెంట్లు లోపల మాత్రం అనుకున్న స్థాయిలో కంటెంట్ ఇవ్వలేకపోతున్నారనే చెప్పాలి.

ముఖ్యంగా హీరో ఆదిత్య ఓం అయితే హౌస్ లో ఉన్నాడా లేదా అన్న సందేహం మాత్రం అందరికీ కలుగుతుంది. ఈయన ఉంటే ఒంటరిగా ఉంటారు లేకపోతే నిద్రపోతూ ఉంటారు. పెద్దగా ఫేమస్ అయిన కంటెంట్ మాత్రం ఈయన ఇవ్వలేకపోతున్నారు. దీంతో పలువురు ట్రోలర్స్ బ్రో అసలు ఎందుకొచ్చావు బ్రో బిగ్ బాస్ హౌస్ కి అంటూ భారీగా విమర్శలు చేస్తున్నారు.

ఈయనతో పాటు బెజవాడ బేబక్క కూడా విమర్శలను ఎదుర్కొంటుంది. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా కనిపించే ఈమె హౌస్ లో మాత్రం ఎక్కువగా కిచెన్ లోనే ఉంటుంది. కానీ సరైన కంటెంట్ మాత్రం ఇవ్వలేకపోతున్నారు.అఫ్రిదీ కూడా డల్‌గానే ఉన్నాడనే టాక్‌ వస్తుంది. పృధ్విరాజ్, అభయ్ నవీన్ వంటి వారందరూ కూడా హౌస్ లో డల్ గా కనిపిస్తున్న తరుణంలో పలువురు మీరంతా హౌస్ లోకి ఎందుకు వచ్చారో ఏమో అంటూ వీరిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు అలాగే మరి కొంతమందిని బాగా హైలైట్ చేస్తూ కూడా కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

ఎలిమినేషన్ ఉంటుందా…
ఇక ఈ వారం నామినేషన్స్ లో భాగంగా బెజవాడ బేబక్క, విష్ణు ప్రియ, శేఖర్ భాష, నాగ మణికంఠ సోనియా ఆకుల ప్రేరణ వంటి వారు నామినేషన్ లో ఉన్నారు. అయితే గత సీజన్లో మాదిరిగా ఈ సీజన్లో కూడా మొదటి వారం ఎలిమినేషన్ ఉండకపోవచ్చని తెలుస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!