Connect with us

Featured

Mohan Babu : ఆ దర్శకుడికి చాలా పొగరు.. అలా అనడంతో నా తలపై కిరీటాన్ని తీసి నేల కొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాను. : మోహన్ బాబు

Published

on

Mohan Babu : 1978 పొట్టేలు పున్నమ్మ చిత్రం ఆ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగ చెప్పుకోవచ్చు. ఆ తర్వాత రామకృష్ణులు, మల్లెపువ్వు, కటకటాల రుద్రయ్య లాంటి చిత్రాలు విజయవంతంగా నిలిచాయి. ఎన్టీ రామారావు నటించిన మరో చిత్రం సింహబలుడు 1978, ఆగష్టు 11న విడుదలైన తెలుగు చలనచిత్రం. కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు, వాణిశ్రీ నాయికానాయకులుగా నటించగా, మోహన్ బాబు ప్రతి కథానాయనిగా నటించారు. ఎం.ఎస్. విశ్వనాధన్ సంగీతం అందించారు. ఇందులో రావు గోపాలరావు నియంతగా నటించాడు. ఎన్టీ రామారావు చివరిసారిగా నటించిన జానపద చిత్రం.. దర్శకుడు రాఘవేంద్రరావు తీసిన తొలి జానపద చిత్రం సింహబలుడు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఎన్టీఆర్ తో అనేక చిత్రాలు రూపొందించారు అలాగే ఆయన తీసిన కొన్ని చిత్రాల్లో మోహన్ బాబు ప్రతి కథానాయకుడుగా నటించారు.

ఆ తర్వాత లక్ష్మీ ప్రసన్న బ్యానర్ లో మోహన్ బాబు నిర్మాతగా కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో అల్లుడుగారు చిత్రం విడుదలయ్యింది. ఈ చిత్రంలో మోహన్ బాబు, శోభన హీరో, హీరోయిన్లుగా నటించారు. అలా కథానాయకుడిగా ప్రతి నాయకుడిగా రాఘవేంద్రరావు డైరెక్షన్లో మోహన్ బాబు నటించారు. అయితే ఒక టీవీ కార్యక్రమంలో దర్శకుడు రాఘవేంద్రరావు ప్రక్కన కూర్చుని మోహన్ బాబు మాట్లాడుతూ.. 1978 లో వచ్చిన “సింహబలుడు” చిత్ర షూటింగ్ విశేషాలను గుర్తు చేసుకుంటూ.. ఒక పోరాట సన్నివేశంలో ఎన్టీ రామారావుకు మోహన్ బాబుకు మధ్యలో వార్ జరుగుతుంది. ఎత్తయిన ప్రదేశంలో పోరాట సన్నివేశం జరుగుతున్న సందర్భంలో మోహన్ బాబు తన కిరీటాన్ని పెట్టుకున్నారు.. ఎందుకంటే ఎన్టీ రామారావు తన కత్తితో కొడితే ఆ కిరీటం కింద పడిపోవాలి. అది అప్పుడు రాఘవేంద్రరావు దర్శకుడిగా సూచించారు. కెమెరా స్టార్ట్ అనడంతో ఎన్టీఆర్ యాక్షన్ సీన్లోకి ఎంటర్ అయ్యారు. ఒక్కసారి మోహన్ బాబు కిరీటంపై ఎన్టీఆర్ కొట్టారు. ఆ కిరీటం కింద పడకపోగా.. ఆ దెబ్బకు మోహన్ బాబుకు తలనొప్పి వచ్చింది. ఈ విషయాన్ని దగ్గరే ఉన్న కో- డైరెక్టర్ కోదండరామిరెడ్డికి డూప్ ను పెట్టండని మోహన్ బాబు చెప్పారు..

దర్శకుడు రాఘవేంద్రరావుతో కోదండ రామిరెడ్డి చెప్పడంతో.. ఆఫ్ట్రాల్ ఒక జూనియర్ ఆర్టిస్ట్ వాడు చెప్తే నేను వినాలా? అనే తల పొగరు రాఘవేంద్రరావుకు ఆ రోజుల్లో ఉండేదని, ఎందుకంటే హిట్స్ పై హిట్స్ రావడంతో అలా రాఘవేంద్రరావు ప్రవర్తించారని.. ఆ తర్వాత రోజు బెంగళూరులో మరో షెడ్యూలు జరుగుతున్న సందర్భంలో తనను రూముకు పిలిపించుకొని రాఘవేంద్రరావు కాలు మీద కాలు వేసుకుని జీవితంలో పైకి వచ్చేవాడివి ఎందుకలా ప్రవర్తించావు అంటూ అడిగారని.. ఐతే రాఘవేంద్రరావును కలవబోయే ముందు ఇంట్లో తన శ్రీమతి పెద్దాయనతో (రాఘవేంద్రరావు) గొడవ ఎందుకని చెప్పిందని.. అందుకే మౌనంగా ఉండిపోయానన్నారు. ఆ తర్వాత మేమిద్దరం కలిసిపోయి ఆ సినిమా పూర్తి చేసామని.. ఆ టీవీ కార్యక్రమంలో మోహన్ బాబు చెప్పుకొచ్చారు. అలా మోహన్ బాబు అనడంతో అక్కడే ఉన్నా రాఘవేంద్రరావు అలాగే కోదండరామిరెడ్డి, బి.గోపాల్ ఆశ్చర్యంగా చూడడాన్ని బుల్లితెర ప్రేక్షకులు గమనించడం జరిగింది.

Advertisement

Featured

Rajamouli: వరుస ఫ్లాపులు వచ్చిన ఐరన్ లెగ్ అని పిలిచినా.. ఆ హీరోయిన్లనే తీసుకుంటాం: రాజమౌళి

Published

on

Rajamouli: తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు డైరెక్టర్ రాజమౌళి. ఈయన దర్శకుడిగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు. ఇక తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లిన ఘనత రాజమౌళికి దక్కుతుందని చెప్పాలి. ఇలా దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

రాజమౌళి కెరియర్ లో వచ్చిన మగధీర సినిమా ఎంతో ప్రత్యేకమైనదని చెప్పాలి. మొదటిసారి ఇలాంటి సినిమా ద్వారా ఈయన ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు అయితే ఈ సినిమా సమయంలో తాను ఎంతో కంగారు పడ్డానని అప్పటికే ఇది చాలా భారీ బడ్జెట్ కావడంతో ఒక రకమైన భయం ఉండేదని తెలిపారు.

ఇక తన సినిమాలలో అందరిలాగే స్టార్ హీరోయిన్లనే పెట్టుకోవాలని నేను అనుకుంటాను. కానీ నేను రాసుకున్న కథకు అనుగుణంగా ఏ హీరోయిన్ అయితే సెట్ అవుతుందో వారినే తీసుకుంటాను. ఆ హీరోయిన్ కు వరుసగా ప్లాపులు వచ్చిన ఆమె ఐరన్ లెగ్ అంటూ ట్రోల్స్ ఎదుర్కొన్న తాను వాటిని లెక్క చేయను.
మగధీర..

Advertisement

ఇలా ఆ హీరోయిన్ హిస్టరీ గురించి నేను ఏమాత్రం ఆలోచించనని నా పాత్రకు సూట్ అయితే తప్పనిసరిగా వారికి అవకాశాలు ఇస్తాను అంటూ ఈ సందర్భంగా హీరోయిన్ల గురించి రాజమౌళి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం ఈయన మహేష్ బాబుతో సినిమా చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోతోంది.

Advertisement
Continue Reading

Featured

Venu Swamy: బిగ్ బాస్ లోకి వేణు స్వామి… భారీ రెమ్యూనరేషన్ అందుకోబోతున్న జ్యోతిష్యులు!

Published

on

Venu Swamy: బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్ బాస్ 8 కార్యక్రమంలో కంటెస్టెంట్లుగా వేణు స్వామి సందడి చేయబోతున్నారనే సంగతి మనకు తెలిసిందే. త్వరలోనే ఈ కార్యక్రమం ప్రసారం కాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి సంబంధించిన ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ కార్యక్రమం ఆగస్టులోనే ప్రారంభం కాబోతుందని తెలుస్తుంది.

ఇదిలా ఉండగా ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్లకు సంబంధించిన లిస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో వేణు స్వామి కూడా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ప్రముఖ ఆస్ట్రాలజర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వేణు స్వామి బిగ్ బాస్ 8 కార్యక్రమంలో పాల్గొనబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.

ఇలా ఆస్ట్రాలజర్ గా ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి ఈయన బిగ్ బాస్ కార్యక్రమంలోకి రాబోతున్నారని తెలియగానే ఈ కార్యక్రమం పై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇక ఈయన కారణంగా రేటింగ్స్ కూడా భారీగా వచ్చే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇకపోతే వేణు స్వామి బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొంటూ అందుకోబోయే రెమ్యూనరేషన్ గురించి కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

లక్షల్లో రెమ్యునరేషన్..

Advertisement


దేశ చరిత్రలోనే ఇప్పటివరకు ఏ కంటెస్టెంట్ తీసుకొని రెమ్యూనరేషన్ ఈయన అందుకోబోతున్నారని తెలుస్తోంది. వేణు స్వామి వారానికి లక్షల్లోనే రెమ్యూనరేషన్ అందుకునే విధంగా అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్టు సమాచారం. మరి వేణు స్వామి ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని ఆయన రెమ్యూనరేషన్ గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Advertisement
Continue Reading

Featured

Kumari Aunty: కుమారి ఆంటీని కలిసిన సోను సూద్… నేనున్నానంటూ ధైర్యం చెప్పిన హీరో!

Published

on

Kumari Aunty: కుమారి ఆంటీ పరిచయం అవసరం లేని పేరు. ఈమె హైదరాబాదులో రోడ్డు పక్కన ఫుడ్ స్టాల్ బిజినెస్ చేసుకుంటూ జీవనం గడిపేది అయితే ఈమె చాలా తక్కువ ధరకే కడుపునిండా భోజనం పెట్టడంతో ఈమె గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఎంతోమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఆమె దగ్గరికి వెళ్లి తనతో ఇంటర్వ్యూ తీసుకోవడంతో ఒక్కసారిగా ఈమె పాపులర్ అయ్యారు.

ఇలా సోషల్ మీడియా వేదికగా ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్న ఈమె ప్రస్తుతం సెలబ్రిటీగా మారిపోయారని చెప్పాలి. ఎన్నో కార్యక్రమాలలో కూడా కుమారి ఆంటీ సందడి చేశారు. ఇక త్వరలోనే కుమారి ఆంటీ బిగ్ బాస్ కార్యక్రమంలో కూడా పాల్గొనబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు.

ఈ విధంగా కుమారి ఆంటీ రోజురోజుకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకోవడంతో ఎంతోమంది సెలబ్రిటీలు కూడా ఆమె వద్దకు వచ్చి ఆమె ఫుడ్ టేస్ట్ చేస్తున్నారు. ఇకపోతే తాజాగా కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ వద్దకు సినీ నటుడు సోను సూద్ వచ్చి ఒక్కసారిగా సర్ప్రైజ్ ఇచ్చారు. కుమారి ఆంటీని కలిసిన ఈయన ఆమెతో సరదాగా మాట్లాడి తన కుటుంబ సభ్యుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

Advertisement

మహిళా సాధికారత..
మహిళా సాధికారత కష్టపడే తత్వానికి కుమారి ఆంటీ నిదర్శనమని సోను సూద్ ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాకుండా తనకు ఎలాంటి కష్టం వచ్చినా నేనున్నానని వెంటనే నాకు తెలియజేయాలి అంటూ ఆమెకు ధైర్యం చెప్పారు. ఇక సోను సూద్ గురించి కుమారి ఆంటీ మాట్లాడుతూ.. ఎంతోమందికి సహాయం చేసిన సోను సూద్ కి ఏమిచ్చినా తక్కువే అంటూ కుమారి ఆంటీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!