Featured
![](https://telugudesk.net/wp-content/litespeed/avatar/48f246d9b01e880e5843b8d38f9199e4.jpg?ver=1719134034)
Published
6 months agoon
By
lakshanaMeena: మీ వయసు చిన్నదే కదా.. రెండో పెళ్లి ఎప్పుడంటూ మీనాను విసిగించిన యాంకర్.. నటి సమాధానం ఇదే?
Meena: వెండి తెర నటిగా ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాలలో నటించి ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నటువంటి వారిలో నటి మీనా ఒకరు. ఈమె వెండితెరపై బాలనటిగా నటించడమే కాకుండా హీరోయిన్ గా కూడా తెలుగు తమిళ భాష చిత్రాలలో నటించి పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు.
![](https://telugudesk.net/wp-content/uploads/2024/01/MixCollage-04-Jan-2024-12-54-PM-530-1024x555.jpg?v=1704353097)
ఇలా హీరోయిన్గా సౌత్ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె 2009వ సంవత్సరంలో ఐటి ఉద్యోగి విద్యాసాగర్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కుమార్తె కూడా జన్మించింది అయితే తన వైవాహిక జీవితంలో కూడా ఎంతో సంతోషంగా ఉన్నటువంటి మీనా జీవితంలో అనుకొని విషాదం నెలకొంది. మీనా భర్త విద్యాసాగర్ అనారోగ్య సమస్యలతో మరణించాడు.
ఇలా తన భర్త మరణ వార్త ఈమెను ఎంతగానో కృంగదీసింది ఈ విషయం నుంచి మీనా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు ఇలాంటి తరుణంలోనే మీనా రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ ఈమె రెండో పెళ్లి గురించి పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయ్యాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమెకు యాంకర్ తన రెండో పెళ్లి గురించి పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేశారు.
నా కూతురు భవిష్యత్ ముఖ్యం…
ఈమె నుంచి ఎలాగైనా సమాధానం రాబట్టాలన్న నేపథ్యంలోనే మీరు చూడటానికి చాలా అందంగా ఉంటారు. మీ వయసు కూడా చిన్నదే మరి రెండో పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నారు అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు మీనా కూడా తన స్టైల్ లోనే సమాధానం చెప్పారు. నేను పెళ్లి చేసుకుంటాను అని ఎక్కడ చెప్పలేదు అలాగని చేసుకోను కూడా చెప్పలేదు రేపు ఏం జరుగుతుంది అనే విషయాలు ఎవరికీ తెలియదు అందుకే నేను నా జీవితం గురించి ముందుగానే ఎలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వనని తెలిపారు. ప్రస్తుతం నా ముందున్న ప్రధాని లక్ష్యం నా కూతురు భవిష్యత్ అంటూ ఈమె చెప్పినటువంటి సమాధానం ప్రస్తుతం సంచలనంగా మారింది.
You may like
Meena: రెండో పెళ్లి వార్తలపై ఘాటుగా రియాక్ట్ అయిన మీనా… డబ్బుల కోసమే అంటూ?
Renu Desai: రేణు దేశాయ్ రెండో పెళ్లి గురించి అకీరా కామెంట్స్… ఇలా ఉన్నారేంట్రా బాబు?
Niharika: నాకు పిల్లలను కనాలని ఉంది.. రెండో పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేసిన నిహారిక?
Meena: బోల్డ్ సీన్స్ గురించి అలాంటి కామెంట్స్ చేసిన స్టార్ హీరోయిన్ మీనా?
Meena: నా భర్త చివరి క్షణాల వరకు అతనితోనే ఉన్నాను.. ఆ వార్తలపై రియాక్ట్ అయిన మీనా?
Samantha: రెండో పెళ్లి గురించి ప్రశ్నించిన నెటిజన్… రెండో పెళ్లి కూడా విడాకులే అంటూ క్లారిటీ ఇచ్చిన సమంత?
Featured
YS Jagan: జగన్ ప్రజలను మోసం చేయలేనని చెప్పారు.. సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత!
![](https://telugudesk.net/wp-content/litespeed/avatar/48f246d9b01e880e5843b8d38f9199e4.jpg?ver=1719134034)
Published
29 seconds agoon
29 June 2024By
lakshanaYS Jagan: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చింది. ఇక చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈయన పోలవరం గురించి ఎన్నో విషయాలను వెల్లడిస్తున్నారు తమ హయాంలోని 72% పోలవరం పనులు పూర్తి అయ్యాయని కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో నిధులన్ని దారి మళ్ళించారంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు అయితే ఈయన వ్యాఖ్యలపై వైసీపీ ఘాటుగా స్పందించారు.
గతంలో చంద్రబాబు నాయుడు చేసిన తప్పిదం మల్లె పోలవరం పూర్తి కాలేకపోయిందని చెప్పారు నాణ్యత లేకుండా డయాఫ్రమ్ నిర్మించడంతో డ్యాం పూర్తిగా డామేజ్ ఆయన నేపథ్యంలోనే పోలవరం పూర్తి కాలేకపోయిందని తెలియజేస్తున్నారు. ఇక ఇటీవల పోలవరం పై చంద్రబాబు నాయుడు శ్వేత పత్రం కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇలా పోలవరం విషయంలో నువ్వా నేనా అంటూ రెండు పార్టీలు మధ్య మాటల యుద్ధం నడుస్తున్న నేపథ్యంలో బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
బిజెపి నేత అలపాటి లక్ష్మీనారాయణ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. జగన్ పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ..పోలవరం విషయంలో డ్యామేజ్ ని కప్పి పుచ్ఛి పనులు కొనసాగిస్తే ప్రజలు ఎప్పటికీ క్షమించరని, ప్లాన్ మార్చమని చెప్పిన జగన్ లాంటి సీఎం ఎక్కడా ఉండరని లక్ష్మీనారాయణ తెలిపారు.
ప్రజలను మోసం చేయలేను..
పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు హయామంలో జరిగిన నిర్మాణ పనులలో డ్యామేజ్ కారణంగా వాటిని కప్పి పుచ్చి ప్రాజెక్టు పనులను పూర్తి చేస్తే అది ప్రజలకు పెద్ద ఎత్తున ప్రమాదకరమని ఈ విషయంలో ప్రజలను మోసం చేయలేనని చెప్పిన వ్యక్తి జగన్ అంటూ ఈయన చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
Featured
AP: మహిళలకు గుడ్ న్యూస్…జులై నుంచి ఏపీలో ఉచిత బస్సు సౌకర్యం!
![](https://telugudesk.net/wp-content/litespeed/avatar/48f246d9b01e880e5843b8d38f9199e4.jpg?ver=1719134034)
Published
4 mins agoon
29 June 2024By
lakshanaAP: ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం కూటమి అధికారంలో ఉంది. ఇలా కూటమి అధికారంలోకి రావడానికి ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా రాష్ట్ర ప్రజలకు పెద్ద ఎత్తున వరాలు కురిపించింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా కల్పించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ఉచిత బస్సు ప్రయాణం కర్ణాటకతో పాటు తెలంగాణలో కూడా అమలు అవుతున్న సంగతి తెలిసిందే.
ఇలా ఈ పథకాన్ని ప్రకటించడంతో అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలోనే అదే అస్త్రాన్ని కూటమి కూడా ఉపయోగించింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని ప్రకటించడమే కూడా కూటమి గెలుపుకు కారణమని చెప్పాలి. ఇంకా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడు కల్పిస్తున్నారనే విషయంపై గందరగోళం ఏర్పడింది.
రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి ఈ విషయంపై ఇదివరకే మాట్లాడుతూ తెలంగాణ కర్ణాటకలో పరిస్థితులను అక్కడ తలెత్తుతున్న సమస్యలను గుర్తించి ఏపీలో అలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్న తర్వాతనే ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని తెలిపారు.. అయితే ఉచిత బస్సు ప్రయాణం పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
జూలై 1 నుంచి..
ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా ఇచ్చిన హామీలలో ఒకటైన ఉచిత బస్సు సౌకర్యాన్ని జులై 1 నుంచి ఏపీలో అమలులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయం గురించి అధికారులతో చర్చించారని త్వరలోనే ఈ విషయం గురించి ప్రభుత్వం అధికారికంగా తెలియజేయబోతున్నారని తెలుస్తోంది.
Featured
Wedding Card: వామ్మో అనంత్ అంబానీ వెడ్డింగ్ కార్డు ధర అన్ని లక్షలా.. కార్డ్ స్పెషల్ ఏంటంటే?
![](https://telugudesk.net/wp-content/litespeed/avatar/48f246d9b01e880e5843b8d38f9199e4.jpg?ver=1719134034)
Published
23 hours agoon
28 June 2024By
lakshanaWedding Card: ప్రముఖ దిగ్గజ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. ముఖేష్ అంబానీ, నీత అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుకలు జరగబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిపై వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా ఎంతో ఘనంగా జరిగాయి. ఇకపోతే జూలై 12వ తేదీ వీరి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతోంది.
ఇక వీరి వివాహపు తేదీ దగ్గర పడుతున్న తరుణంలో పెళ్లి వేడుకలు కూడా శర వేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా ఇటీవల అనంత్ అంబానీ రాధిక మర్చంట్ వివాహపు వేడుకలలో భాగంగా వారి మొదటి వివాహ పత్రికను నీతా అంబానీ స్వయంగా శ్రీ కాశి విశ్వనాధుని సన్నిధి ఉంచి ప్రత్యేక పూజలు చేయించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే వీరి వెడ్డింగ్ కార్డు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వెడ్డింగ్ కార్డులో సుమారు మూడు కిలోలు వెండితో చిన్న మందిరం ఏర్పాటు చేయడమే కాకుండా అందులో విష్ణువు, లక్ష్మి వినాయకుడి బంగారు ప్రతిమలను తయారు చేసి పెట్టారని తెలుస్తోంది. ఇక ఈ వెడ్డింగ్ కార్డ్ ఓపెన్ చేయగానే ఓం అంటూ మంత్రోచ్ఛారణ వినిపిస్తుంది.
మూడు కిలోల వెండి మందిరం..
ఇలా చాలా స్పెషల్ గా ఈ వెడ్డింగ్ కార్డ్ డిజైన్ చేయించారని చెప్పాలి. మరి ఇన్ని ప్రత్యేకతలతో కూడిన ఈ వెడ్డింగ్ కార్డ్ ఖరీదు తెలిస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే. ఒక్కొక్క వెడ్డింగ్ కార్డ్ సుమారు 6.5 లక్షల రూపాయల విలువ చేస్తుందని తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. అయితే గతంలో కూడా ఈయన తన కుమార్తె ఈశా అంబానీ పెళ్లి వేడుకలలో కూడా ఇలా ఖరీదైన పెళ్లి పత్రికను తయారు చేయించారు ఇక ప్రస్తుతం అనంత్ రాధిక వెడ్డింగ్ కార్డ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
![](https://telugudesk.net/wp-content/uploads/2024/06/ys-jagan-1-80x80.webp)
YS Jagan: జగన్ ప్రజలను మోసం చేయలేనని చెప్పారు.. సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత!
![](https://telugudesk.net/wp-content/uploads/2024/06/ap-3-80x80.webp)
AP: మహిళలకు గుడ్ న్యూస్…జులై నుంచి ఏపీలో ఉచిత బస్సు సౌకర్యం!
![](https://telugudesk.net/wp-content/uploads/2024/06/anantambani-radhikamarchantweddingcard-1719481515-80x80.jpg?v=1719559577)
Wedding Card: వామ్మో అనంత్ అంబానీ వెడ్డింగ్ కార్డు ధర అన్ని లక్షలా.. కార్డ్ స్పెషల్ ఏంటంటే?
![](https://telugudesk.net/wp-content/uploads/2024/06/kalki-1-80x80.jpg?v=1719559465)
Vijay Devarakonda: మనమందరం వెళ్లిపోయిన కల్కి గుర్తుండిపోతుంది: విజయ్ దేవరకొండ
![](https://telugudesk.net/wp-content/uploads/2024/06/c0c9e3b6d7143455bf05325e737a0ba82090d83d228a0c1a3e874660bd3ddae4-80x80.webp)
Prabhas: పేరు మార్చుకున్న ప్రభాస్.. ఇకపై అలా పిలవాల్సిందేనా?
![](https://telugudesk.net/wp-content/uploads/2024/06/nallari-kirankumarireddy-80x80.png?v=1717917965)
Nallari Kiran Kumar Reddy : ఏపీలో దురదృష్టవంతుడంటే ఆయనే.. అంత సునామీలోనూ ఓటమి..
![](https://telugudesk.net/wp-content/uploads/2024/05/pallavi-prashanth-80x80.jpg?v=1717061451)
Pallavi Prashanth: జల్సాలకు అలవాటు పడిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్… మాట తప్పినట్లేగా?
![](https://telugudesk.net/wp-content/uploads/2024/05/balakrishna-80x80.webp)
Balakrishna: స్టేజ్ పైన హీరోయిన్ ను తోసేసిన బాలయ్య.. ఘాటుగా స్పందించిన వైసీపీ పార్టీ?
![](https://telugudesk.net/wp-content/uploads/2024/06/Ramoji_Rao-80x80.jpg?v=1717817310)
Ramoji Rao: ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు అస్తమయం!
![](https://telugudesk.net/wp-content/uploads/2022/12/aadi-reddy.jpg..jpg?v=1671517810)
Aadi Reddy: బిగ్ బాస్ ఆదిరెడ్డి యూట్యూబ్ నెల సంపాదన ఎంతో తెలుసా… సాఫ్ట్ వేర్స్ కూడా వేస్టే!
Trending
- Featured3 weeks ago
Nallari Kiran Kumar Reddy : ఏపీలో దురదృష్టవంతుడంటే ఆయనే.. అంత సునామీలోనూ ఓటమి..
- Featured4 weeks ago
Pallavi Prashanth: జల్సాలకు అలవాటు పడిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్… మాట తప్పినట్లేగా?
- Featured4 weeks ago
Balakrishna: స్టేజ్ పైన హీరోయిన్ ను తోసేసిన బాలయ్య.. ఘాటుగా స్పందించిన వైసీపీ పార్టీ?
- Featured3 weeks ago
Ramoji Rao: ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు అస్తమయం!
- Featured4 weeks ago
Aadi Reddy: బిగ్ బాస్ ఆదిరెడ్డి యూట్యూబ్ నెల సంపాదన ఎంతో తెలుసా… సాఫ్ట్ వేర్స్ కూడా వేస్టే!
- Featured3 weeks ago
Modi 3.0 : ఏపీకి ఐదు కేంద్ర మంత్రి పదవులు.. ఎవరెవరికంటే..
- Featured4 weeks ago
AP Election Results : తొలి ఫలితం నగరి నుంచే.. మొదట తేలేది రోజా జాతకమే..!
- Featured3 weeks ago
YS Jagan : పడి లేచిన కెరటమవుతారా? పత్తా లేకుండా పోతారా?