Hero Suman: ఎన్టీఆర్ శత జయంతి వేడుకలలో భాగంగా తెలుగుదేశం పార్టీ నేతలు ఘనంగా విజయవాడలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను నిర్వహించిన విషయం మనకు తెలిసిందే. ఇలా ఎన్టీఆర్ శత జయంతి వేడుకలలో భాగంగా సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో ఈయన ఎన్టీఆర్ తో తనకు ఉన్నటువంటి అనుబంధం గురించి అలాగే చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం గురించి కూడా తెలియజేశారు.ఇలా రజనీకాంత్ చంద్రబాబు గురించి గొప్పగా మాట్లాడటంతో వైఎస్ఆర్సిపి నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు దీంతో రజినీకాంత్ పై విమర్శలు చేయడంతో రజనీ ఫ్యాన్స్ హీరో రజనీకాంత్ కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో రజనీకాంత్ వైఎస్ఆర్సిపి పార్టీ పేరు కూడా పలకలేదు కేవలం ఎన్టీఆర్ గురించి చంద్రబాబు నాయుడు గురించి మాత్రమే మాట్లాడారు అందుకే ఆయనకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే తాజాగా ఈ విషయంపై నటుడు సుమన్ స్పందించారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ రజినీకాంత్ ఎన్టీఆర్ శత జయంతి వేడుకలలో మాట్లాడిన మాటలలో ఏ మాత్రం తప్పు లేదని ఆయన తెలిపారు.

Hero Suman: చేసింది చేయలేదని చెప్పలేం కదా..
చంద్రబాబు నాయుడు హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి జరిగిందని రాజకీయాలన్న తర్వాత ఎత్తు పల్లాలు సర్వసాధారణం అయితే చంద్రబాబు నాయుడు టైం బాగాలేక ప్రజలు మార్పును కోరుకున్నారని కానీ ఆయన చేసింది చేయలేదని చెప్పడం భావ్యం కాదు అంటూ సుమన్ చంద్రబాబు నాయుడుకి మద్దతు తెలుపుతూ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.