Connect with us

Featured

మెగాస్టార్ చిరంజీవితో నటించే అవకాశం తృటిలో తప్పిపోయిన హీరోయిన్స్ వీరే..!!

Published

on

1980 దశకంలో తెలుగుతెర పై ఇదివరకు ఎరగని డాన్సులు, ఫైట్స్ అవలీలగా చేసే సుప్రీం హీరో చిరంజీవి. హిట్టు, సూపర్ హిట్టు, ఇండస్ట్రీ హిట్టు సినిమాలకి మారుపేరుగా ఆయన మారిపోయాడు. అలాంటి స్టార్ హీరోతో సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన ప్రతి హీరోయిన్ నటించాలి అనుకోవడం అత్యంత సహజం.

Advertisement

అలా అప్పటి సమకాలీన హీరోలందరితో నటించిన రజిని చిరంజీవి తో నటించే అవకాశం తృటిలో తప్పిపోయింది. బాలకృష్ణతో సీతారామ కళ్యాణం, ప్రాణానికి ప్రాణం, రాము చిత్రాల్లో నటించింది. ఇక వెంకటేష్ తో ధ్రువ నక్షత్రం, బ్రహ్మరుద్రులు ఆయనకు జోడీగా చిందులు వేసింది. నాగార్జునతో మజ్ను, మురళీ కృష్ణుడు, కలెక్టర్ గారి అబ్బాయి.

ఇక రాజేంద్రప్రసాద్ తో రెండు రెళ్ళ ఆరు, అహ నా పెళ్ళంట లాంటి అనేక చిత్రాల్లో ఆమె నటించింది. అడపాదడపా చిరంజీవితో అవకాశాలు వచ్చినప్పటికీ మధ్యవర్తులు అవకాశం తన వరకు రాకుండా చేశారని ఆమె వాపోయారు.

హీరోయిన్ అశ్విని… చంద్రమోహన్, బాలకృష్ణ, రాజశేఖర్, రాజేంద్రప్రసాద్, మోహన్ బాబులతో కలిసి నటించింది. అయితే ఒకసారి బాలకృష్ణతో “భానుమతి గారి మొగుడు” చిత్రంలో నటిస్తున్నప్పుడు చిరంజీవితో కలిసి నటించే అవకాశం వచ్చినా డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో చిరంజీవితో చేసే అవకాశం అశ్విని చేజారిపోయింది.

1990 ప్రథమార్థంలో సినీ పరిశ్రమకు ప్రవేశించిన ఆమని కృష్ణ, బాలకృష్ణ, నాగార్జున, రాజేంద్ర ప్రసాద్ వంటి హీరోలతో నటించినప్పటికీ చిరంజీవితో నటించే అవకాశాన్ని త్రుటిలో కోల్పోయింది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన “రిక్షావోడు” చిత్రంలో సౌందర్యతో పాటుగా మరో హీరోయిన్ గా ఆమని అనుకున్నప్పటికీ నిర్మాతలు ఈ విషయాన్ని తెలపకుండా ఆమని తొలగించి నగ్మాను పెట్టుకున్నారు.

1994లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం లో యమలీల చిత్రంలో అలీ, ఇంద్రజ హీరో, హీరోయిన్ గా నటించారు. ఆ తర్వాత ఇంద్రజ.. రాజేంద్ర ప్రసాద్, నాగార్జున, బాలకృష్ణతో “పెద్దన్నయ్య” చిత్రంలో నటిస్తున్నప్పుడు చిరంజీవి తో చేసే అవకాశం వచ్చినప్పటికీ డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఇంద్రజ చిరంజీవితో చేసే అవకాశాన్ని కోల్పోయింది.

శుభాకాంక్షలు సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమైన రాశి.. శ్రీకాంత్ జగపతిబాబు, మోహన్ బాబు, రాజశేఖర్, రాజేంద్ర ప్రసాద్, బాలకృష్ణ వంటి హీరోలతో కలిసి నటించారు. “మనసంతా నువ్వే” చిత్రం విజయం తర్వాత వి.ఎన్.ఆదిత్య దర్శకత్వంలో చిరంజీవి, రాశి హీరో, హీరోయిన్లుగా సినిమా అనౌన్స్మెంట్ జరిగి మధ్యలోనే సినిమా ఆగిపోవడం గమనార్హం. చిరంజీవితో అవకాశం తప్పిపోయినప్పటికి రాశి, పవన్ కళ్యాణ్ తో “సుస్వాగతం” సినిమా చేసే అవకాశాన్ని పొందింది.

ఈ విధంగా అనేక మంది హీరోయిన్స్ చిరంజీవితో అవకాశం వచ్చినట్టే వచ్చి తృటిలో తప్పి పోవడం వారి దురదృష్టంగా భావించడం జరిగింది.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Star Heroin: స్టార్ హీరోతో ప్రేమ,పెళ్లి విడాకులు..12 మందితో ఎఫైర్ పెట్టుకున్న హీరోయిన్… ఎవరంటే?

Published

on

Star Heroin: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో సీనియర్ నటి మనీషా కొయిరాల ఒకరు. ఈమె సౌత్ లో కంటే నార్త్ లోనే ఎక్కువ సినిమాలలో నటించి ఒకానొక సమయంలో బాలీవుడ్ చిత్ర పరిశ్రమను ఓ ఊపు ఊపారు. ఇక ఈమె స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలో తన వ్యక్తిగత విషయాలలో కూడా వార్తలలో నిలిచారు.

Advertisement

ఈమె ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూనే మరోవైపు పలువురు హీరోలతో ఎఫైర్ పెట్టుకుంది అంటూ వార్తలు వచ్చాయి. ఒక స్టార్ హీరోతో పీకల్లోతు ప్రేమలో పడినప్పటికీ ఆయనని పెళ్లి చేసుకోలేదు. ఇక ఈమె సామ్రాట్ దహాల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పటికీ రెండేళ్లకే తనతో విడాకులు తీసుకొని విడిపోయి పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు.

ఇలా డిప్రెషన్ లోకి వెళ్లిన మనీషా కోయిరాల మందుకు అలవాటు పడ్డారు.పెళ్లికి ముందే మనీషా కోయిరాలా ఏకంగా 12 మందితో డేటింగ్ చేసిందట. ఆమె డేటింగ్ చేసినవాళ్ల లిస్ట్ లో నటులు, వ్యాపారవేత్తలు,అంబాసిడర్ కూడా ఉన్నారు. వివేక్ ముశ్రన్‌, నానా పటేకర్‌, DJ హుస్సేన్‌, లండన్‌కు చెందిన నైజీరియన్ వ్యాపారవేత్త సెసిల్ ఆంథోనీ, ఆర్యన్ వైద్‌ వంటి ప్రముఖులతో ఈమె డేటింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది.

12 మందితో డేటింగ్..
ఇలా తరచూ డేటింగ్ ల ద్వారా కూడా ఈమె వార్తల్లో నిలిచారు. ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో బిజీగా గడిపారు. పలువురు దర్శక నిర్మాతలు సైతం ఈమె డేట్స్ కోసం ఎంతగానో ఎదురు చూసేవారు. ఇలా సినిమా ఇండస్ట్రీని ఓ ఊపిన ఈమె మధ్యలో ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్ లతో బిజీగా గడుపుతున్నారు.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: విష్ణు ప్రియకు షాక్ ఇచ్చిన నిఖిల్… కన్నీళ్లు పెట్టుకున్న నిఖిల్.. అసలు ఆట ఆరంభం!

Published

on

Bigg Boss 8: తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమం ప్రారంభం అయ్యి 5 రోజులు పూర్తయింది. ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయింది అయితే హౌస్ లో ఉన్నటువంటి 14 మంది కంటెస్టెంట్లను బిగ్ బాస్ మూడు గ్రూపులుగా విడదీశారు. అయితే ఈ గ్రూపులోకి ఎవరెవరు సభ్యులను తీసుకోవాలనేది చీఫ్ ఎన్నుకోవాల్సి ఉంటుంది.

Advertisement

ఈ క్రమంలోనే కంటెస్టెంట్ విష్ణు ప్రియ కచ్చితంగా తనని నిఖిల్ తన గ్రూపులోకి తీసుకుంటారని ఆమె భావించింది. కానీ నిఖిల్ మాత్రం ఆమెకు షాక్ ఇచ్చారు. దీంతో విష్ణు ప్రియను నైనిక తన టీమ్ లోకి తీసుకున్నారు. అయితే ఈ విషయం గురించి నిఖిల్ విష్ణుప్రియ మధ్య పెద్ద ఎత్తున చర్చ జరిగింది. వీరిద్దరికి ముందే మంచి పరిచయమున్న నేపథ్యంలో తప్పకుండా నిఖిల్ తన టీమ్ లోకి తీసుకుంటారని విష్ణు ప్రియ భావించింది కానీ అది జరగలేదు.

ఇలా ఇద్దరి మధ్య ఉన్న పరిచయం కారణంగా విష్ణు ప్రియ సరదాగా నిఖిల్ ను ఓ ఆట ఆడుకుంది. దీంతో నిఖిల్ ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలా ఇప్పటివరకు ఎంతో సరదాగా గడిపిన కంటెస్టెంట్లను మూడు గ్రూపులుగా విడదీయడంతో అసలైన ఆట మొదలైంది.

టాస్కులపై ఫోకస్..
కంటెస్టెంట్లను టీమ్స్ గా విడదీసి బిగ్ బాస్ టాస్కులను ఇవ్వడం మొదలుపెట్టారు. ఇలా ఇచ్చిన మొదటి టాస్కోలో భాగంగా ఇప్పటివరకు హౌస్ లో సైలెంట్ గా కూర్చున్న పృథ్విరాజ్ తన ఆట తీరును కనబరుస్తూ యష్మీ టీమ్ ను గెలిపించారు. దీంతో ముందు ముందు ఏ ఏ కంటెస్టెంట్ ఎలా తన ఆట తీరుతో ప్రేక్షకులను మెప్పిస్తారో తెలియాల్సి ఉంది.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు వచ్చారు బ్రో…. ఆ కంటెస్టెంట్లను ఆడేసుకుంటున్న ట్రోలర్స్!

Published

on

Bigg Boss 8: బిగ్ బాస్ కార్యక్రమానికి తెలుగులో కూడా ఎంతో మంచి ఆదరణ ఉంది. ఈ కార్యక్రమం తెలుగులో ఇప్పటికి ఏడు సీజన్లను పూర్తి చేసుకుని ఎనిమిదవ సీజన్ కూడా గత ఆదివారం ఎంతో ఘనంగా ప్రారంభమైంది. మొదట 14 మంది కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపించారు. మిగిలిన వారిని ఐదవ వారం వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి పంపించబోతున్నారని సమాచారం.

Advertisement

ఇక హౌస్ లోకి వెళ్లిన తర్వాత మొదటి రోజు నుంచే కంటెస్టెంట్లు పెద్ద ఎత్తున గొడవలు పడుతూ పోట్లాడుతూ ప్రేక్షకులకు కావాల్సినంత కంటెంట్ ఇస్తున్నారు. అయితే కొంతమంది మాత్రమే బాగా ఎక్స్పోజ్ అవుతున్నారు. మిగిలిన వారు మాత్రం అసలు హౌస్ లో ఉన్నారా లేదా అన్నా సందేహాలు వస్తున్నాయి. హౌస్ లోకి వెళ్ళేటప్పుడు ఎంతో యాక్టివ్ గా వెళ్లిన కంటెస్టెంట్లు లోపల మాత్రం అనుకున్న స్థాయిలో కంటెంట్ ఇవ్వలేకపోతున్నారనే చెప్పాలి.

ముఖ్యంగా హీరో ఆదిత్య ఓం అయితే హౌస్ లో ఉన్నాడా లేదా అన్న సందేహం మాత్రం అందరికీ కలుగుతుంది. ఈయన ఉంటే ఒంటరిగా ఉంటారు లేకపోతే నిద్రపోతూ ఉంటారు. పెద్దగా ఫేమస్ అయిన కంటెంట్ మాత్రం ఈయన ఇవ్వలేకపోతున్నారు. దీంతో పలువురు ట్రోలర్స్ బ్రో అసలు ఎందుకొచ్చావు బ్రో బిగ్ బాస్ హౌస్ కి అంటూ భారీగా విమర్శలు చేస్తున్నారు.

ఈయనతో పాటు బెజవాడ బేబక్క కూడా విమర్శలను ఎదుర్కొంటుంది. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా కనిపించే ఈమె హౌస్ లో మాత్రం ఎక్కువగా కిచెన్ లోనే ఉంటుంది. కానీ సరైన కంటెంట్ మాత్రం ఇవ్వలేకపోతున్నారు.అఫ్రిదీ కూడా డల్‌గానే ఉన్నాడనే టాక్‌ వస్తుంది. పృధ్విరాజ్, అభయ్ నవీన్ వంటి వారందరూ కూడా హౌస్ లో డల్ గా కనిపిస్తున్న తరుణంలో పలువురు మీరంతా హౌస్ లోకి ఎందుకు వచ్చారో ఏమో అంటూ వీరిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు అలాగే మరి కొంతమందిని బాగా హైలైట్ చేస్తూ కూడా కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

ఎలిమినేషన్ ఉంటుందా…
ఇక ఈ వారం నామినేషన్స్ లో భాగంగా బెజవాడ బేబక్క, విష్ణు ప్రియ, శేఖర్ భాష, నాగ మణికంఠ సోనియా ఆకుల ప్రేరణ వంటి వారు నామినేషన్ లో ఉన్నారు. అయితే గత సీజన్లో మాదిరిగా ఈ సీజన్లో కూడా మొదటి వారం ఎలిమినేషన్ ఉండకపోవచ్చని తెలుస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!