Connect with us

Featured

రమ్యకృష్ణ ఐరెన్ లెగ్.. హీరోయిన్‌గా పనికిరాదన్నారు.. తనలో నటిని గుర్తించిన స్టార్ డైరెక్టర్ ఆయనే..

Published

on

ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ చాలా ఎక్కువ. హీరో, హీరోయిన్, డైరెక్టర్, నిర్మాత ( ప్రొడక్షన్ హౌస్).. వీరిలో ఎవరు ముందు ఇండస్ట్రీకి పరిచయం అయినా డెబ్యూ ప్రాజెక్ట్ తోనే భారీ హిట్ అందుకోవాలి. కనీసం యావరేజ్ హిట్ అందుకొని విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంటే చాలు. ఆ తర్వాత ఎవరో ఒకరు రెండవ సినిమా అవకాశం ఇస్తారు. అందరూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌లా సెంటిమెంట్స్ గురించి పట్టించుకోకుండా టాలెంట్‌ని నమ్మీ గబ్బర్ సింగ్ సినిమాలో శృతి హాసన్‌కి అవకాశం ఇచ్చినట్టు ఇవ్వరు కదా. ఇక్క్డ సక్సెస్ ఫార్ములానే పనిచేస్తుంది. అదే ప్రధానం.

Advertisement

ఈ ఒక్క కారణంతోనే ఎన్నో ఆశలు, కలలు కంటూ ఇండస్ట్రీకొచ్చిన వారు వెనుతిరగాల్సి వచ్చింది. సగం మందికి లక్ కలిసి వచ్చి మొదటి సినిమా పోయినా మళ్ళీ అవకాశం అందుకొని సక్సెస్ అయ్యారు. ఇక చాలా తక్కువ శాతం మాత్రమే మొదటి రెండు మూడు సినిమాలు పోయినా నిలదొక్కుకునారు. స్టార్ హీరోయిన్ కెరీర్‌ని లీడ్ చేసి ఇండస్ట్రీ హిట్స్ అందుకొని, ఇప్పుడు గొప్ప పాత్రల్లో నటించే అవకాశం అందుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే ఈ పాత్ర వాళ్ళు మాత్రమే చేయగలరు అనే కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నారు. ఇలాంటి వారిలో రమ్యకృష్ణ ఒకరు.

రమ్యకృష్ణ తమిళ పరిశ్రమలోని ప్రముఖ పాత్రికేయులు, సినీ విమర్శకులు రామస్వామి మేనకోడలు. దాంతో ఈమె ఇండస్ట్రీకి పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాలేదు. అయితే ఇండస్ట్రీలోకి వచ్చాక మాత్రం సక్సెస్‌లు కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. ఈ క్రమంలో కొన్ని విమర్శలు ఎదురుకున్నారు. రమ్యకృష్ణ 1985లో భలే మిత్రులు చిత్రం ద్వారా హీరోయిన్ గా తెలుగు చిత్రరంగంలో అడుగుపెట్టారు. 1989లో వచ్చిన సూత్రధారులు చిత్రం ద్వారా మంచి నటిగా పేరు సంపాదించినప్పటికీ, అందులో చేసింది గ్లామర్ రోల్ కాకపోవడం వల్ల తనకి 5 – 6 ఏళ్ళ వరకూ పెద్ద అవకాశాలు రాలేదు.

అంతేకాదు కెరీర్ ప్రారంభంలో రమ్యకృష్ణ ఐరెన్ లెగ్ అనే టాక్ కూడా వినిపించింది. ఆమె నటిస్తే సినిమా ఫ్లాప్ గ్యారెంటీ అని కూడా చెప్పుకున్నారు. కానీ దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు తెరకెక్కించగా 1992 లో రిలీజయిన అల్లుడుగారు సినిమా తన సత్తా ఏంటో నిరూపించింది. మంచు మోహన్ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు రమ్యకృష్ణ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. అయితే అందరు తనని తీసుకోవాలంటే ఆలోచించేవారు. కానీ కె. రాఘవేంద్రరావు మాత్రం తనలో ఓ గొప్ప నటి ఉందని నమ్మారు.

అందుకే ఎక్కువగా ఆయన దర్శకత్వంలో వచ్చిన చాలా సినిమాలలో రమ్యకృష్ణకి వరుసగా హీరోయిన్ వేశాలిచ్చారు. వీరి కాంబినేషన్‌లో వచ్చినా దాదాపు అన్నీ సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. దాంతో అప్పటి నుంచి సినిమా హిట్ అవ్వాలంటే రమ్యకృష్ణ ఉండాల్సిందే అని దర్శక, నిర్మాతలతో పాటు హీరోలు నమ్మారు. ఈ క్రమంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన నరసింహ ఆమె కెరీర్ లో మైల్ స్టోన్ మూవీగా నిలిచింది. ఇప్పటి తరం హీరోయిన్స్ చాలా మందికి ఆ పాత్ర ఎంతో ఇన్స్పిరేషన్. అలా టాలీవుడ్ లో దాదాపు అందరి స్టార్ హీరోలతో, స్టార్ డైరెక్టర్స్ తో పనిచేశారు. ఇక దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమా రమ్యకృష్ణ కెరీర్ లో ఎంతో ప్రత్యేకం. శివగామిగా రమ్యకృష్ణ బాహుబలి సినిమాతో పాన్ ఇండియన్ నటిగా పాపులారిటీ సాధించారు.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Star Heroin: స్టార్ హీరోతో ప్రేమ,పెళ్లి విడాకులు..12 మందితో ఎఫైర్ పెట్టుకున్న హీరోయిన్… ఎవరంటే?

Published

on

Star Heroin: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో సీనియర్ నటి మనీషా కొయిరాల ఒకరు. ఈమె సౌత్ లో కంటే నార్త్ లోనే ఎక్కువ సినిమాలలో నటించి ఒకానొక సమయంలో బాలీవుడ్ చిత్ర పరిశ్రమను ఓ ఊపు ఊపారు. ఇక ఈమె స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలో తన వ్యక్తిగత విషయాలలో కూడా వార్తలలో నిలిచారు.

Advertisement

ఈమె ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూనే మరోవైపు పలువురు హీరోలతో ఎఫైర్ పెట్టుకుంది అంటూ వార్తలు వచ్చాయి. ఒక స్టార్ హీరోతో పీకల్లోతు ప్రేమలో పడినప్పటికీ ఆయనని పెళ్లి చేసుకోలేదు. ఇక ఈమె సామ్రాట్ దహాల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పటికీ రెండేళ్లకే తనతో విడాకులు తీసుకొని విడిపోయి పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు.

ఇలా డిప్రెషన్ లోకి వెళ్లిన మనీషా కోయిరాల మందుకు అలవాటు పడ్డారు.పెళ్లికి ముందే మనీషా కోయిరాలా ఏకంగా 12 మందితో డేటింగ్ చేసిందట. ఆమె డేటింగ్ చేసినవాళ్ల లిస్ట్ లో నటులు, వ్యాపారవేత్తలు,అంబాసిడర్ కూడా ఉన్నారు. వివేక్ ముశ్రన్‌, నానా పటేకర్‌, DJ హుస్సేన్‌, లండన్‌కు చెందిన నైజీరియన్ వ్యాపారవేత్త సెసిల్ ఆంథోనీ, ఆర్యన్ వైద్‌ వంటి ప్రముఖులతో ఈమె డేటింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది.

12 మందితో డేటింగ్..
ఇలా తరచూ డేటింగ్ ల ద్వారా కూడా ఈమె వార్తల్లో నిలిచారు. ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో బిజీగా గడిపారు. పలువురు దర్శక నిర్మాతలు సైతం ఈమె డేట్స్ కోసం ఎంతగానో ఎదురు చూసేవారు. ఇలా సినిమా ఇండస్ట్రీని ఓ ఊపిన ఈమె మధ్యలో ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్ లతో బిజీగా గడుపుతున్నారు.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: విష్ణు ప్రియకు షాక్ ఇచ్చిన నిఖిల్… కన్నీళ్లు పెట్టుకున్న నిఖిల్.. అసలు ఆట ఆరంభం!

Published

on

Bigg Boss 8: తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమం ప్రారంభం అయ్యి 5 రోజులు పూర్తయింది. ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయింది అయితే హౌస్ లో ఉన్నటువంటి 14 మంది కంటెస్టెంట్లను బిగ్ బాస్ మూడు గ్రూపులుగా విడదీశారు. అయితే ఈ గ్రూపులోకి ఎవరెవరు సభ్యులను తీసుకోవాలనేది చీఫ్ ఎన్నుకోవాల్సి ఉంటుంది.

Advertisement

ఈ క్రమంలోనే కంటెస్టెంట్ విష్ణు ప్రియ కచ్చితంగా తనని నిఖిల్ తన గ్రూపులోకి తీసుకుంటారని ఆమె భావించింది. కానీ నిఖిల్ మాత్రం ఆమెకు షాక్ ఇచ్చారు. దీంతో విష్ణు ప్రియను నైనిక తన టీమ్ లోకి తీసుకున్నారు. అయితే ఈ విషయం గురించి నిఖిల్ విష్ణుప్రియ మధ్య పెద్ద ఎత్తున చర్చ జరిగింది. వీరిద్దరికి ముందే మంచి పరిచయమున్న నేపథ్యంలో తప్పకుండా నిఖిల్ తన టీమ్ లోకి తీసుకుంటారని విష్ణు ప్రియ భావించింది కానీ అది జరగలేదు.

ఇలా ఇద్దరి మధ్య ఉన్న పరిచయం కారణంగా విష్ణు ప్రియ సరదాగా నిఖిల్ ను ఓ ఆట ఆడుకుంది. దీంతో నిఖిల్ ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలా ఇప్పటివరకు ఎంతో సరదాగా గడిపిన కంటెస్టెంట్లను మూడు గ్రూపులుగా విడదీయడంతో అసలైన ఆట మొదలైంది.

టాస్కులపై ఫోకస్..
కంటెస్టెంట్లను టీమ్స్ గా విడదీసి బిగ్ బాస్ టాస్కులను ఇవ్వడం మొదలుపెట్టారు. ఇలా ఇచ్చిన మొదటి టాస్కోలో భాగంగా ఇప్పటివరకు హౌస్ లో సైలెంట్ గా కూర్చున్న పృథ్విరాజ్ తన ఆట తీరును కనబరుస్తూ యష్మీ టీమ్ ను గెలిపించారు. దీంతో ముందు ముందు ఏ ఏ కంటెస్టెంట్ ఎలా తన ఆట తీరుతో ప్రేక్షకులను మెప్పిస్తారో తెలియాల్సి ఉంది.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు వచ్చారు బ్రో…. ఆ కంటెస్టెంట్లను ఆడేసుకుంటున్న ట్రోలర్స్!

Published

on

Bigg Boss 8: బిగ్ బాస్ కార్యక్రమానికి తెలుగులో కూడా ఎంతో మంచి ఆదరణ ఉంది. ఈ కార్యక్రమం తెలుగులో ఇప్పటికి ఏడు సీజన్లను పూర్తి చేసుకుని ఎనిమిదవ సీజన్ కూడా గత ఆదివారం ఎంతో ఘనంగా ప్రారంభమైంది. మొదట 14 మంది కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపించారు. మిగిలిన వారిని ఐదవ వారం వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి పంపించబోతున్నారని సమాచారం.

Advertisement

ఇక హౌస్ లోకి వెళ్లిన తర్వాత మొదటి రోజు నుంచే కంటెస్టెంట్లు పెద్ద ఎత్తున గొడవలు పడుతూ పోట్లాడుతూ ప్రేక్షకులకు కావాల్సినంత కంటెంట్ ఇస్తున్నారు. అయితే కొంతమంది మాత్రమే బాగా ఎక్స్పోజ్ అవుతున్నారు. మిగిలిన వారు మాత్రం అసలు హౌస్ లో ఉన్నారా లేదా అన్నా సందేహాలు వస్తున్నాయి. హౌస్ లోకి వెళ్ళేటప్పుడు ఎంతో యాక్టివ్ గా వెళ్లిన కంటెస్టెంట్లు లోపల మాత్రం అనుకున్న స్థాయిలో కంటెంట్ ఇవ్వలేకపోతున్నారనే చెప్పాలి.

ముఖ్యంగా హీరో ఆదిత్య ఓం అయితే హౌస్ లో ఉన్నాడా లేదా అన్న సందేహం మాత్రం అందరికీ కలుగుతుంది. ఈయన ఉంటే ఒంటరిగా ఉంటారు లేకపోతే నిద్రపోతూ ఉంటారు. పెద్దగా ఫేమస్ అయిన కంటెంట్ మాత్రం ఈయన ఇవ్వలేకపోతున్నారు. దీంతో పలువురు ట్రోలర్స్ బ్రో అసలు ఎందుకొచ్చావు బ్రో బిగ్ బాస్ హౌస్ కి అంటూ భారీగా విమర్శలు చేస్తున్నారు.

ఈయనతో పాటు బెజవాడ బేబక్క కూడా విమర్శలను ఎదుర్కొంటుంది. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా కనిపించే ఈమె హౌస్ లో మాత్రం ఎక్కువగా కిచెన్ లోనే ఉంటుంది. కానీ సరైన కంటెంట్ మాత్రం ఇవ్వలేకపోతున్నారు.అఫ్రిదీ కూడా డల్‌గానే ఉన్నాడనే టాక్‌ వస్తుంది. పృధ్విరాజ్, అభయ్ నవీన్ వంటి వారందరూ కూడా హౌస్ లో డల్ గా కనిపిస్తున్న తరుణంలో పలువురు మీరంతా హౌస్ లోకి ఎందుకు వచ్చారో ఏమో అంటూ వీరిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు అలాగే మరి కొంతమందిని బాగా హైలైట్ చేస్తూ కూడా కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

ఎలిమినేషన్ ఉంటుందా…
ఇక ఈ వారం నామినేషన్స్ లో భాగంగా బెజవాడ బేబక్క, విష్ణు ప్రియ, శేఖర్ భాష, నాగ మణికంఠ సోనియా ఆకుల ప్రేరణ వంటి వారు నామినేషన్ లో ఉన్నారు. అయితే గత సీజన్లో మాదిరిగా ఈ సీజన్లో కూడా మొదటి వారం ఎలిమినేషన్ ఉండకపోవచ్చని తెలుస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!