తెలుగు సీరియల్ నటుడు సాగర్ అంటే ఎవరూ టక్కున గుర్తుపట్టలేరు కానీ చక్రవాకం సీరియల్ జగన్, మొగలిరేకులు సీరియల్ మున్నా, ఆర్కే నాయుడు అంటే ప్రతి బుల్లితెర ప్రేక్షకుడు ఇట్టే గుర్తు పడతారు. నిజం చెప్పాలంటే మన భారతీయ సీరియల్స్ చూడ్డానికి చాలా తక్కువ మంది ఆసక్తి చూపుతుంటారు. కానీ మంజులా నాయుడు గారు దర్శకత్వం వహించిన మొగలిరేకులు, చక్రవాకం సీరియళ్లను… అప్పటి వరకు సీరియల్స్ అంటేనే అసహ్యించుకునే వారు కూడా చూసేవారు అంటే అతిశయోక్తి కాదు. మొగలిరేకులు సీరియల్ కి అభిమానులు కూడా ఉండాలి అంటే అతిశయోక్తి కాదు. అంత రసవత్తరంగా బుల్లితెర సీరియళ్లను కొనసాగించిన మంజులా నాయుడు గారికి మనం హ్యాట్సాఫ్ చెప్పవచ్చు.
మొగలిరేకులు సీరియల్ అయిపోయిన తర్వాత కూడా అది చూడాలనుకున్న వారి డిమాండ్ పెరిగిపోవడంతో మళ్లీ మొగలిరేకులు సీరియల్ ప్రసారం చేయడం ప్రారంభించారు. అయితే గతంలో ఎంత ప్రేక్షకాదరణ పొందిందో ఇప్పుడు కూడా అదే స్థాయిలో ప్రేక్షకాదరణ పొందుతుంది మొగలిరేకులు సీరియల్. ఈ సీరియల్ లో నటించిన ప్రతి ఒక్కరూ చిన్నపాటి స్టార్స్ గా మారారు అంటే అతిశయోక్తి కాదు. ఈ సీరియల్ లో ప్రధాన పాత్రలో నటించిన సాగర్ బుల్లితెర ప్రభాస్ గా పేరు తెచ్చుకున్నారు. ఈ బుల్లితెర ప్రభాస్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
సాగర్ ములుకుంట్ల 1983 ఆగస్టు 16వ తేదీన తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లా గోదావరిఖని లో జన్మించారు. అతను తన తల్లిదండ్రులకు మూడవ సంతానం. అతని విద్యాభ్యాసం మొత్తం హైదరాబాద్ నగరంలోనే కొనసాగింది. చిన్మయి విద్యాలయస్ పాఠశాలలో పదవ తరగతి వరకు చదువుకున్న సాగర్ హైదరాబాద్ నగరంలోని ఏవీ కాలేజీలో కంప్యూటర్స్ లో డిగ్రీ పట్టా పొందారు. ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్ చదువుని కూడా అదే కాలేజీలో పూర్తి చేశారు. అయితే పెద్ద చదువు చదివినప్పటికీ అతనికి నటన పై చాలా ఆసక్తి ఉండేది. అందుకే ఏ ఉద్యోగంలో చేరకుండా చాలా సంవత్సరాలపాటు సినీ సీరియళ్ల అవకాశాల కోసం కాళ్ళరిగేలా తిరిగాడు. కానీ ఎవరూ కూడా అవకాశం ఇవ్వలేదు.
దాంతో విసుకుచెందిన సాగర్ సాఫ్ట్వేర్ ఉద్యోగం లో చేరి హాయిగా జీవితాన్ని గడపాలనుకున్నారు. ఆ సమయంలోనే మంజుల నాయుడు గారు చక్రవాకం సీరియల్ రూపొందిస్తున్నాం అని జగన్ అనే పాత్రలో నటించడానికి ఒక యువ నటుడు కావాలని ఒక ప్రకటన ప్రచురించారు. ఈ ప్రకటన చూసిన సాగర్ చివరిసారిగా ట్రై చేద్దామని ఆడిషన్ కి వెళ్లగా అతన్ని మంజుల నాయుడు గారు సెలెక్ట్ చేశారు. ఆ విధంగా అతను చక్రవాకం సీరియల్ లో జగన్ పాత్రలో నటించే అవకాశాన్ని సంపాదించారు. ఆ తర్వాత మొగలిరేకులు సీరియల్ లో కూడా తానే ప్రధాన పాత్రలో నటించి ప్రేక్షకుల మనసులను చూరగొన్నారు. ఈ రెండు సీరియల్ మినహాయించి మిగతా ఏ సీరియల్ లో సాగర్ నటించలేదు. ఈ సీరియల్స్ లో అతని నటన ప్రతిభకు గాను నంది అవార్డులు కూడా లభించాయి అంటే అతను ఎంత గొప్ప నటుడో స్పష్టమవుతుంది. 2017 అక్టోబర్ 6వ తేదీన సౌందర్య అనే యువతిని పెళ్లి చేసుకున్నారు. ఇకపోతే సాగర్ తండ్రి సింగరేణిలో ఉద్యోగం చేసేవారు.
Prabhas: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ అనంతరం పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటుడు ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి ప్రభాస్ వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు.
ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ప్రభాస్ ఎప్పుడు చూసినా చాలా కూల్ గానే కనిపిస్తారు. ఈయన ఎప్పుడు కోప్పడిన సందర్భాలు కూడా లేవని చెప్పాలి. అయితే ప్రభాస్ ఏదైనా ఫ్రస్టేషన్లో ఉన్నప్పుడు లేదంటే సినిమాల విషయంలో కాస్త కంగారు పడినప్పుడు ఎవరిని కూడా కలవరట.
ప్రభాస్ ఏ విషయం గురించైనా కాస్త ఆలోచనలో ఉండి ఫ్రస్టేషన్ వస్తే కనుక తన చుట్టూ ఉన్న వారందరినీ కూడా బయటకు పంపించేసి తలుపు గది వేసుకొని ఒక దమ్ము కొట్టేస్తారట అనంతరం తనకు నచ్చిన ఫుడ్ తిని ప్రశాంతంగా నిద్రపోతారని తెలుస్తుంది. ఇలా నిద్రపోయి లేచిన తర్వాత ఆయన ఆ విషయం గురించి పూర్తిగా మర్చిపోయి ఫ్రెష్ మైండ్ తో బయటకు వస్తారట.
Advertisement
ఇష్టమైన ఫుడ్ తింటారు.. ఇలా ప్రభాస్ ఫ్రస్టేషన్ లో ఇలా వ్యవహరిస్తారని విషయం తెలిసి ప్రభాస్ లో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభాస్ కోప్పడే సందర్భాలు చాలా తక్కువ అని ఆయనతో ఉన్నవాళ్లు చెబుతుంటారు ఆయన ప్రతి ఒక్కరితో చాలా సరదాగా గడుపుతూ ఉంటారని 99% తనకు కోపం అనేది రాదని తనతో క్లోజ్ గా ఉన్న వాళ్ళు పలు సందర్భాలలో వెల్లడించారు.
Nikhil siddarth: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నటువంటి నటుడు నిఖిల్ సిద్ధార్థ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హ్యాపీడేస్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన అనంతరం పలు సినిమాలలో నటించి ఇండస్ట్రీలో సక్సెస్ అందుకున్నారు.
ఇలా నటుడిగా ఇండస్ట్రీలో గుర్తింపు పొందినటువంటి నిఖిల్ ఇటీవల కార్తికేయ 2 సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. త్వరలోనే ఈయన స్వయంబు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా షూటింగ్ పనులు సరవేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈయన స్వయంబు సినిమా గురించి పలు విషయాలను వెల్లడించారు.
త్వరలోనే స్వయంభూ సినిమా విడుదల తేదీ ప్రకటించబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా తన కుమారుడికి సంబంధించిన పలు విషయాలను కూడా నిఖిల్ అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల తనకు కుమారుడు జన్మించిన సంగతి మనకు తెలిసిందే. తన కుమారుడు జన్మించారనే విషయాన్ని తెలియజేయడమే కాకుండా తన కొడుకు బారసాల వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు.
Advertisement
పార్టీలకు వెళ్లడం మానుకున్న.. ఇలా బారసాల వేడుకలను నిర్వహించిన నిఖిల్ దంపతులు తమ కుమారుడికి ఏ పేరు పెట్టారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు అయితే తన కుమారుడికి ధీర సిద్ధార్థ్ అనే పేరు పెట్టినట్లు నిఖిల్ వెల్లడించారు. అయితే తన కొడుకు పుట్టిన తర్వాత తనలో చాలా మార్పు వచ్చిందని తెలిపారు. పిల్లలు సరైన వాతావరణంలో పెరగాలి అందుకు మనం కొన్ని అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. తనకు కొడుకు పుట్టిన తర్వాత నేను పార్టీలకు వెళ్లడం మానుకున్నానని తెలిపారు. వారంలో ఏదో ఒక రోజు తాను పార్టీకి వెళ్లే వాడినని ఇప్పుడు ఆ అలవాటు మార్చుకున్నాను అంటూ నిఖిల్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే .ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి సుమారు 700 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సంచలనాలను సృష్టించింది.
ఇక ఈ సినిమా థియేటర్లలోను అదేవిధంగా డిజిటల్ మీడియాలోనూ ప్రసారమవుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలోనే త్వరలోనే డిజిటల్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా సాటిలైట్ హక్కులు కూడా భారీ ధరలకు అమ్ముడుపోయాయని తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమా ఏప్రిల్ 21వ తేదీ సాయంత్రం 5:30కు స్టార్ మాలో ప్రసారం కాబోతున్న సంగతి తెలిసిందే.
ఇలా ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో సలార్ మేకర్స్ అద్భుతమైనటువంటి ఆఫర్ అభిమానులకు కల్పించారు. ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు మనం సమాధానాలు చెబితే చాలు ఈ సినిమాలో ప్రభాస్ నడిపినటువంటి ఐకానిక్ మోటార్ సైకిల్ బైక్ మీ సొంతం చేసుకోవచ్చని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
Advertisement
క్విజ్ కాంటెస్ట్.. ఇలా వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉండాలి అలాగే వారు పెట్టే కొన్ని కండిషన్స్ కూడా వర్తిస్తాయని వెల్లడించారు. ఇంకెందుకు ఆలస్యం ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పి బైక్ మీ సొంతం చేసుకోవచ్చు అయితే ఇలా మేకర్ ప్లాన్ చేశారు అంటే ఈ ఎఫెక్ట్ టి ఆర్ పి రేటింగ్ పై ప్రభావం చూపుతుందనే ఉద్దేశంతోనే ఇలాంటి ప్లాన్స్ చేశారని స్పష్టంగా తెలుస్తోంది.