Connect with us

Featured

మొగలిరేకులు సీరియల్ హీరో మున్నా గురించి ఈ మూడు విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు.

Published

on

తెలుగు సీరియల్ నటుడు సాగర్ అంటే ఎవరూ టక్కున గుర్తుపట్టలేరు కానీ చక్రవాకం సీరియల్ జగన్, మొగలిరేకులు సీరియల్ మున్నా, ఆర్కే నాయుడు అంటే ప్రతి బుల్లితెర ప్రేక్షకుడు ఇట్టే గుర్తు పడతారు. నిజం చెప్పాలంటే మన భారతీయ సీరియల్స్ చూడ్డానికి చాలా తక్కువ మంది ఆసక్తి చూపుతుంటారు. కానీ మంజులా నాయుడు గారు దర్శకత్వం వహించిన మొగలిరేకులు, చక్రవాకం సీరియళ్లను… అప్పటి వరకు సీరియల్స్ అంటేనే అసహ్యించుకునే వారు కూడా చూసేవారు అంటే అతిశయోక్తి కాదు. మొగలిరేకులు సీరియల్ కి అభిమానులు కూడా ఉండాలి అంటే అతిశయోక్తి కాదు. అంత రసవత్తరంగా బుల్లితెర సీరియళ్లను కొనసాగించిన మంజులా నాయుడు గారికి మనం హ్యాట్సాఫ్ చెప్పవచ్చు.

మొగలిరేకులు సీరియల్ అయిపోయిన తర్వాత కూడా అది చూడాలనుకున్న వారి డిమాండ్ పెరిగిపోవడంతో మళ్లీ మొగలిరేకులు సీరియల్ ప్రసారం చేయడం ప్రారంభించారు. అయితే గతంలో ఎంత ప్రేక్షకాదరణ పొందిందో ఇప్పుడు కూడా అదే స్థాయిలో ప్రేక్షకాదరణ పొందుతుంది మొగలిరేకులు సీరియల్. ఈ సీరియల్ లో నటించిన ప్రతి ఒక్కరూ చిన్నపాటి స్టార్స్ గా మారారు అంటే అతిశయోక్తి కాదు. ఈ సీరియల్ లో ప్రధాన పాత్రలో నటించిన సాగర్ బుల్లితెర ప్రభాస్ గా పేరు తెచ్చుకున్నారు. ఈ బుల్లితెర ప్రభాస్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

సాగర్ ములుకుంట్ల 1983 ఆగస్టు 16వ తేదీన తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లా గోదావరిఖని లో జన్మించారు. అతను తన తల్లిదండ్రులకు మూడవ సంతానం. అతని విద్యాభ్యాసం మొత్తం హైదరాబాద్ నగరంలోనే కొనసాగింది. చిన్మయి విద్యాలయస్ పాఠశాలలో పదవ తరగతి వరకు చదువుకున్న సాగర్ హైదరాబాద్ నగరంలోని ఏవీ కాలేజీలో కంప్యూటర్స్ లో డిగ్రీ పట్టా పొందారు. ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్ చదువుని కూడా అదే కాలేజీలో పూర్తి చేశారు. అయితే పెద్ద చదువు చదివినప్పటికీ అతనికి నటన పై చాలా ఆసక్తి ఉండేది. అందుకే ఏ ఉద్యోగంలో చేరకుండా చాలా సంవత్సరాలపాటు సినీ సీరియళ్ల అవకాశాల కోసం కాళ్ళరిగేలా తిరిగాడు. కానీ ఎవరూ కూడా అవకాశం ఇవ్వలేదు.

దాంతో విసుకుచెందిన సాగర్ సాఫ్ట్వేర్ ఉద్యోగం లో చేరి హాయిగా జీవితాన్ని గడపాలనుకున్నారు. ఆ సమయంలోనే మంజుల నాయుడు గారు చక్రవాకం సీరియల్ రూపొందిస్తున్నాం అని జగన్ అనే పాత్రలో నటించడానికి ఒక యువ నటుడు కావాలని ఒక ప్రకటన ప్రచురించారు. ఈ ప్రకటన చూసిన సాగర్ చివరిసారిగా ట్రై చేద్దామని ఆడిషన్ కి వెళ్లగా అతన్ని మంజుల నాయుడు గారు సెలెక్ట్ చేశారు. ఆ విధంగా అతను చక్రవాకం సీరియల్ లో జగన్ పాత్రలో నటించే అవకాశాన్ని సంపాదించారు. ఆ తర్వాత మొగలిరేకులు సీరియల్ లో కూడా తానే ప్రధాన పాత్రలో నటించి ప్రేక్షకుల మనసులను చూరగొన్నారు. ఈ రెండు సీరియల్ మినహాయించి మిగతా ఏ సీరియల్ లో సాగర్ నటించలేదు. ఈ సీరియల్స్ లో అతని నటన ప్రతిభకు గాను నంది అవార్డులు కూడా లభించాయి అంటే అతను ఎంత గొప్ప నటుడో స్పష్టమవుతుంది. 2017 అక్టోబర్ 6వ తేదీన సౌందర్య అనే యువతిని పెళ్లి చేసుకున్నారు. ఇకపోతే సాగర్ తండ్రి సింగరేణిలో ఉద్యోగం చేసేవారు.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Niharika: యుద్ధం గెలిచిన రాముడు అయోధ్యకు వచ్చినట్టు ఉంది… బాబాయ్ పై నిహారిక కామెంట్స్!

Published

on

Niharika: నిహారిక కొణిదెల పరిచయం అవసరం లేని పేరు. ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీలో నిర్మాతగా నటిగా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు. తన భర్త నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన నిహారిక తిరిగి కెరియర్ పై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే నిర్మాతగా కూడా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇక నిహారిక నిర్మాణంలో తెరకెక్కిన కమిటీ కుర్రోళ్ళు సినిమా ఆగస్టు 9వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈమె ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆహాలో ప్రసారమవుతున్న సర్కార్ సక్సెస్ సెలబ్రేషన్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.

ఇక ఈ ప్రోమోలో భాగంగా నిహారిక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ నేను వచ్చేది ఎప్పుడు నెక్స్ట్ సీజనా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సుడిగాలి సుదీర్ రెస్పాండ్ అవుతూ మీకేంటండి మీరు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలూకా అంటూ మాట్లాడారు. అనంతరం పవన్ కళ్యాణ్ విజయం సాధించిన తర్వాత చిరంజీవి ఇంటికి వచ్చి ఆశీర్వాదం తీసుకున్న వీడియో ఎంతలా వైరల్ అయిందో మనకు తెలిసిందే .ఇక ఈ వీడియోని ప్లే చేశారు.

Advertisement

యుద్ధం గెలిచిన రాముడు…
ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది అంటూ నిహారికను ప్రశ్నించారు. ఇక నిహారిక ఈ వీడియో గురించి మాట్లాడుతూ యుద్ధం గెలిచిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకు వచ్చినప్పుడు కూడా ఇలాగే ఉండేదేమో అనిపించింది అంటూ తన బాబాయ్ విజయం గురించి నిహారిక మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Anasuya: ఇకపై రంగమ్మత్త లాంటి పాత్రలు అసలు చేయను.. గ్లామర్ పాత్రలకు సై అంటున్న అనసూయ?

Published

on

Anasuya: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు. ఈమె జబర్దస్త్ యాంకర్ గా బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ అందుకొని అనంతరం వెండి తెరపై సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా వెండితెరపై వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న అనసూయ తిరిగి బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈమె స్టార్ మా లో ప్రసారమవుతున్న కిరాక్ బాయ్స్ కిలాడి లేడీస్ అనే కార్యక్రమంలో సందడి చేస్తున్నారు. ఇలా ఒక వైపు బుల్లితెర కార్యక్రమాలు మరోవైపు వెండితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్న అనసూయ త్వరలోనే సింబా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ఈమె మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఇటీవల కాలంలో మీరు చాలా సినిమాలను రిజెక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది కారణం ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ తాను సినిమాలు రిజెక్ట్ చేస్తున్న మాట నిజమేనని తెలిపారు. నేను ఒక సినిమాలో నటించిన పాత్ర హిట్ అవడంతో తదుపరి సినిమాలలో కూడా అలాంటి పాత్రలలో నటించే అవకాశం వస్తుందని తెలిపారు.

Advertisement

రంగమ్మత్త..
ఇలా ఒక పాత్రలో నటించిన తర్వాత తిరిగి అలాంటి పాత్రలలో నటించిన ప్రేక్షకులు పెద్దగా తీసుకోలేరు ఉదాహరణకు రంగమ్మత్త పాత్ర చాలా హైలెట్ అయింది. తదుపరి అలాంటి పాత్రలు వస్తే నేను చెయ్యను నేను అన్ని చాలా డిఫరెంట్ గా ఉండేలా చేయాలని భావిస్తున్నాను. ఇక ఎక్కువగా తాను గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా అనసూయ గ్లామర్ రోల్ చేయడానికి సై అంటూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Mahesh Babu: మహేష్ రాజమౌళి సినిమా టైటిల్ లీక్… సినిమా పేరు ఏంటో తెలుసా?

Published

on

Mahesh Babu: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా జరుగబోతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన కూడా తెలియజేయబోతున్నారు.

ఇక ఈ సినిమాలో మహేష్ బాబు చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు మొదటిసారి వర్క్ షాప్ లో కూడా పాల్గొనబోతున్నారని సమాచారం.

ఇప్పటివరకు మహేష్ బాబు ఏ సినిమా కోసం ఇలా వర్క్ షాప్ లో పాల్గొనలేదు మొదటిసారి రాజమౌళి సినిమా కోసం పాల్గొనబోతున్న నేపథ్యంలో ఈయన కూడా ఈ సినిమా విషయంలో చాలా ఆతృత కనబరుస్తున్నారు. ఇకపోతే తాజాగా మహేష్ బాబు రాజమౌళి సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

గోల్డ్..
తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమాకు సంబంధించి ఓ టైటిల్ సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమా టైటిల్ కూడా అందుకు అనుగుణంగానే ఉండాలి. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం గోల్డ్ అనే టైటిల్ పెట్టబోతున్నారంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఈ సినిమా టైటిల్ గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం వైరల్ అవుతుంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!