Connect with us

Featured

పాపం సుజాత.. తోలు బెల్టుతో భర్త చేతిలో చావు దెబ్బలు అనుభవించింది…!!

Published

on

హీరోయిన్ సుజాత.. అప్పటి కాలంలో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్స్ లో ఈవిడ కూడా ఒకరు. హీరోయిన్ సుజాత పేరు వింటే మనకు మొదటిగా గుర్తొచ్చే సినిమా గోరింటాకు. 1952 డిసెంబర్ 10న పుట్టిన సుజాత తనకు 14 సంవత్సరాల సమయం లోనే చిత్ర పరిశ్రమకు పరిచయమైంది. ఈవిడ తెలుగు, తమిళ్, కన్నడ సినిమాలలో మొత్తంగా మూడు వందలకు పైగా సినిమాల్లోనే నటించింది. ఇక ఈవిడ చివరి సినిమా శ్రీరామదాసు. ఇక సుజాత తండ్రి ఇ ఉద్యోగరీత్యా శ్రీలంకలోని గాలే లో పని చేసేవారు. అక్కడ ఉన్న సమయంలోనే ఆవిడ శ్రీలంక లోనే పుట్టి పెరిగింది. ఆయన తండ్రి రిటైర్ అయ్యాక ఫ్యామిలీ మొత్తం తిరిగి ఇండియాకు వచ్చేసింది.

ఇక తనకు 14 సంవత్సరాల సమయంలోనే 1974 సంవత్సరంలో కె.బాలచందర్ డైరెక్షన్ లో ‘ అవ్వాలోరు తుధల్ కథై ‘ సినిమాతో పరిచయమైన ఆవిడ ఆ సినిమా హిట్ అవడంతో తమిళంలో స్టార్ హీరోలు ఆయన రజనీకాంత్, కమల్ హాసన్, జెమిని గణేశన్ వంటి వారితో ఎన్నో చిత్రాల్లో కలిసి పనిచేసింది. ఇక టాలీవుడ్ పరిశ్రమకు గోరింటాకు సినిమా ద్వారా ఆవిడ పరిచయం అయ్యింది. అచ్చం తెలుగు అమ్మాయిలా కనిపించే ఆవిడ టాలీవుడ్ లో ఎన్నో ప్రముఖ చిత్రాలలో ఛాన్సును దక్కించుకుంది. అప్పటి బడా హీరో లైన సీనియర్ ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వర రావు, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు లాంటి హీరోలందరి సరసన నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. అయితే ఇలా సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే శ్రీలంక నుండి భారతదేశానికి వచ్చిన తర్వాత వారు ఉంటున్న ఇంటి యజమాని వాళ్ళ అబ్బాయిని ప్రేమించి మరి వివాహం చేసుకుంది. అతని పేరు జయకర్. ఇక వీరిద్దరికీ ఒక అమ్మాయి ఒక అబ్బాయి కూడా ఉన్నారు. ఇలా జయకర్ ను వివాహం చేసుకున్న ఆవిడ కొన్ని రోజులు అమెరికాకు అతనితో కలిసి వెళ్లి పోయింది.

అయితే ఆమెకు అక్కడి వాతావరణం పడకపోవడంతో తిరిగి మళ్లీ ఇండియాకు చేరుకుంది. ఇండియాకు వచ్చిన తర్వాత సినిమాల్లో నటించడం మొదలు పెట్టింది. అయితే, సినిమాలలో అనేక మంది బడా హీరోలతో మంచి హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఇంట్లో మాత్రం ఆవిడ పరిస్థితి వేరేగా ఉండేది. సుజాత భర్త జయకర్ సొంతంగా ఏ పని చేయకపోయినా ఇంట్లో ఉంటూ ఆమెను శతవిధాల చిత్రహింసలకు గురి చేసేవాడు. ఒక్కోసారి ఆమె షూటింగ్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత జరిగే గొడవల్లో ఆమెను తన భర్త బెల్టుతో కూడా కొట్టిన సందర్భాలు లేకపోలేదు. అంతేకాదు కొన్ని సార్లు షూటింగ్స్ జరిగే స్పాట్ లో కూడా ఆమెపై చేయి చేసుకున్న సంఘటనలు ఉన్నాయని అప్పట్లో చర్చించుకునేవారు. అయితే ఆవిడ ఎన్నో సినిమాల్లో ఎన్నో కష్టాలను రీల్ జీవితంలో భరించిన ఆవిడ రియల్ లైఫ్ లో కూడా ఆ అనుభవాలను చూసింది. అయితే బడా హీరోల తో అంత మంచి పేరు తెచ్చుకున్న ఈవిడకు సినిమాలు తగ్గడానికి కారణం కూడా ఆమె భర్తనే. ఎవరైనా సినిమా దర్శక నిర్మాతలు సినిమా చేయమని అడగడానికి వస్తే వారికి దిమ్మతిరిగేలా కండిషన్స్ పెట్టి చివరికి ఆమెకు అవకాశాలు లేకుండా చేశాడు తన భర్త జయకర్.

ఇలా తన జీవితం కొనసాగుతున్న సమయంలో ఆవిడ ఒక వైపు సినిమాలలో హీరోయిన్ గా చేసిన రోజులు తర్వాత తల్లిగా, వదినగా, అక్కగా ఇలా విభిన్న రోల్స్ చేస్తూ తెలుగు అభిమానులను మెప్పించింది. ఈమెకు టాలీవుడ్ లో గోరింటాకు, సూత్రధారులు, సర్కస్ రాముడు, సూరిగాడు, వంశ గౌరవం, బహుదూరపు బాటసారి, ఎమ్మెల్యే ఏడుకొండలు, చంటి, పెళ్లి లాంటి చిత్రాల్లో ఆమె నటన మంచి మార్కులే పడ్డాయి. అలాగే 1997 సంవత్సరంలో ఆమె నటించిన పెళ్లి సినిమాకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బెస్ట్ క్యారెక్టర్ రోల్ గా నంది అవార్డును కూడా ప్రకటించింది. అంతే కాదు తమిళనాడు రాష్ట్రంలో ఎంతో ప్రత్యేకంగా చెప్పుకునే కళైమామణి అవార్డును కూడా ఆవిడ దక్కించుకున్నారు. ఇక చివరి సినిమా శ్రీరామదాసు నటించిన తర్వాత కొద్ది కాలానికి ఆమె అనారోగ్యం బారిన పడి చివరికి 58 సంవత్సరాల వయసులో 2006 లో చెన్నై నగరంలో ఉన్న తన ఇంట్లోనే ఆవిడ కన్నుమూసింది.

Advertisement

Continue Reading
Advertisement

Featured

Niharika: యుద్ధం గెలిచిన రాముడు అయోధ్యకు వచ్చినట్టు ఉంది… బాబాయ్ పై నిహారిక కామెంట్స్!

Published

on

Niharika: నిహారిక కొణిదెల పరిచయం అవసరం లేని పేరు. ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీలో నిర్మాతగా నటిగా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు. తన భర్త నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన నిహారిక తిరిగి కెరియర్ పై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే నిర్మాతగా కూడా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇక నిహారిక నిర్మాణంలో తెరకెక్కిన కమిటీ కుర్రోళ్ళు సినిమా ఆగస్టు 9వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈమె ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆహాలో ప్రసారమవుతున్న సర్కార్ సక్సెస్ సెలబ్రేషన్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.

ఇక ఈ ప్రోమోలో భాగంగా నిహారిక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ నేను వచ్చేది ఎప్పుడు నెక్స్ట్ సీజనా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సుడిగాలి సుదీర్ రెస్పాండ్ అవుతూ మీకేంటండి మీరు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలూకా అంటూ మాట్లాడారు. అనంతరం పవన్ కళ్యాణ్ విజయం సాధించిన తర్వాత చిరంజీవి ఇంటికి వచ్చి ఆశీర్వాదం తీసుకున్న వీడియో ఎంతలా వైరల్ అయిందో మనకు తెలిసిందే .ఇక ఈ వీడియోని ప్లే చేశారు.

Advertisement

యుద్ధం గెలిచిన రాముడు…
ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది అంటూ నిహారికను ప్రశ్నించారు. ఇక నిహారిక ఈ వీడియో గురించి మాట్లాడుతూ యుద్ధం గెలిచిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకు వచ్చినప్పుడు కూడా ఇలాగే ఉండేదేమో అనిపించింది అంటూ తన బాబాయ్ విజయం గురించి నిహారిక మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Anasuya: ఇకపై రంగమ్మత్త లాంటి పాత్రలు అసలు చేయను.. గ్లామర్ పాత్రలకు సై అంటున్న అనసూయ?

Published

on

Anasuya: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు. ఈమె జబర్దస్త్ యాంకర్ గా బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ అందుకొని అనంతరం వెండి తెరపై సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా వెండితెరపై వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న అనసూయ తిరిగి బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈమె స్టార్ మా లో ప్రసారమవుతున్న కిరాక్ బాయ్స్ కిలాడి లేడీస్ అనే కార్యక్రమంలో సందడి చేస్తున్నారు. ఇలా ఒక వైపు బుల్లితెర కార్యక్రమాలు మరోవైపు వెండితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్న అనసూయ త్వరలోనే సింబా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ఈమె మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఇటీవల కాలంలో మీరు చాలా సినిమాలను రిజెక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది కారణం ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ తాను సినిమాలు రిజెక్ట్ చేస్తున్న మాట నిజమేనని తెలిపారు. నేను ఒక సినిమాలో నటించిన పాత్ర హిట్ అవడంతో తదుపరి సినిమాలలో కూడా అలాంటి పాత్రలలో నటించే అవకాశం వస్తుందని తెలిపారు.

Advertisement

రంగమ్మత్త..
ఇలా ఒక పాత్రలో నటించిన తర్వాత తిరిగి అలాంటి పాత్రలలో నటించిన ప్రేక్షకులు పెద్దగా తీసుకోలేరు ఉదాహరణకు రంగమ్మత్త పాత్ర చాలా హైలెట్ అయింది. తదుపరి అలాంటి పాత్రలు వస్తే నేను చెయ్యను నేను అన్ని చాలా డిఫరెంట్ గా ఉండేలా చేయాలని భావిస్తున్నాను. ఇక ఎక్కువగా తాను గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా అనసూయ గ్లామర్ రోల్ చేయడానికి సై అంటూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Mahesh Babu: మహేష్ రాజమౌళి సినిమా టైటిల్ లీక్… సినిమా పేరు ఏంటో తెలుసా?

Published

on

Mahesh Babu: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా జరుగబోతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన కూడా తెలియజేయబోతున్నారు.

ఇక ఈ సినిమాలో మహేష్ బాబు చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు మొదటిసారి వర్క్ షాప్ లో కూడా పాల్గొనబోతున్నారని సమాచారం.

ఇప్పటివరకు మహేష్ బాబు ఏ సినిమా కోసం ఇలా వర్క్ షాప్ లో పాల్గొనలేదు మొదటిసారి రాజమౌళి సినిమా కోసం పాల్గొనబోతున్న నేపథ్యంలో ఈయన కూడా ఈ సినిమా విషయంలో చాలా ఆతృత కనబరుస్తున్నారు. ఇకపోతే తాజాగా మహేష్ బాబు రాజమౌళి సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

గోల్డ్..
తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమాకు సంబంధించి ఓ టైటిల్ సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమా టైటిల్ కూడా అందుకు అనుగుణంగానే ఉండాలి. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం గోల్డ్ అనే టైటిల్ పెట్టబోతున్నారంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఈ సినిమా టైటిల్ గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం వైరల్ అవుతుంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!