Connect with us

Featured

వందల సినిమాలలో నటించిన కల్పనా రాయ్ లాంటి వారు అంత్యక్రియలకి కూడా డబ్బులేని ధీన స్థితిలో లోకాన్ని వీడి వెళుతున్నారు.. దానికి కారణాలు ఇవేనా పాపం!

Published

on


సినిమా ఇండస్ట్రీలో సుధీర్గ ప్రయాణం కొనసాగి దాదాపు 350 నుంచి 400 సినిమాలలో నటించిన నటీ నటులు ఎందరో చివరి చూపుకు నోచుకోకుండా, ఆఖరికి అంత్యక్రియలకి కూడా డబ్బు లేని ధీన స్థితిలో ఈ లోకాన్ని వీడి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ వయసున్నా, ముసలితనం వచ్చినా కొందరు సినీ తారలకి డబ్బు, హోదా ఉంటే ఎవరైనా పలకరిస్తారు.. చుట్టపు చూపుకి నోచుకుంటారు. లేదంటే ఈగలను తోలుకుంటూ బ్రతకాల్సిందే. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ అనే ఈ రంగుల ప్రపంచంలో ఏదీ ఇక్కడ శాశ్వతం కాదు. ఈ విషయం ఇప్పటికే ఎంతోమంది స్వయానుభవాలను చెప్పిన సందర్భాలున్నాయి.

Advertisement

వచ్చేటప్పుడు ఎలా వస్తామో పోయేటప్పుడు అలానే పోతాము. ఇదే నిజం. మధ్యలో బ్రతికేదంతా మన ఊపిరి తీసుకొని వదిలేటువంటి జీవితమే. ఊపిరి తీసుకున్న వారు మళ్ళీ వదిలేలోపే అనంతలోకాలకి వెళ్ళినవారున్నారు. అలా వదిలిన ఊపిరి తీసుకునే లోపూ కళ్ళు మూస్తున్న వారూ ఉన్నారు. కానీ ఈ సత్యం అందరికీ తెలియడం లేదు. అందుకే ఈర్ష్యా భావాలతో బ్రతికేస్తున్నారు. సినిమా వాళ్ల జీవితాలు ఎంతో అద్భుతంగా ఉంటాయని అందరూ అనుకుంటుంటారు. కానీ మావి కూలి బ్రతుకులే అని కొందరు
చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక్కడ నేం ఫేం ఉన్నంతవరకే సెలబ్రిటీ.

అవి పోయాయంటే అందరూ దూరమవుతారు. మంచి మంచి సినిమాలు చేస్తూ బాగా సంపాదించిన వారు ఇతరులకి దానం చేయడం వల్ల తమ వద్ద ఉన్నదంతా పోగొట్టుకొని చివరికి ఒకరి చేయూత కోసం ఎదురు చూస్తూ ఎవరైనా వచ్చి ఆదుకుంటే బావుంటుందని ఎదురు చూస్తున్న వారు ఇండస్ట్రీలో ఇప్పటికీ చాలా మంది ఉన్నారనడంలో ఎలాంటి సందేహాలు లేవు. అలాంటి వారిలో దివంగతనటి కల్పనా రాయ్ కూడా ఉన్నారు. ‘ఓ సీత కథ’ చిత్రంతో తెలుగు చిత్రరంగంలో అడుగు పెట్టిన ఆమె దాదాపు 450 చిత్రాలలో హాస్య ప్రధానమైన పాత్రల్లో నటించి మెప్పించారు.

400 పై చిలుకు చిత్రాలంటే సాధారణంగా ఏ నటి, నటులకైనా ఆస్తులు బాగానే ఉండి ఉంటాయని అనుకోవడం సహజం. కానీ అదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. మరొక వైపు చూస్తే పేరుకే 400 చిత్రాలలో నటించినా అందులో ఎన్ని చిత్రాలకి సరైన రెమ్యునరేషన్ అందుకొని ఉంటారు..అంత మంది సినిమాలలో పాత్రలు పూర్తయ్యాక ఎగ్గొట్టిన వారుంటారు.. ఆలోచిస్తే కల్పనా రాయ్ లాంటి వారు చివరి దశలో ఆర్ధిక కష్టాలను ఎందుకు అనుభవించారో అర్థమవుతుంది. ఇలాంటి చిన్న ఆర్టిస్టులకి కెరీర్ ప్రారంభంలో అవకాశాల కోసం రెమ్యునరేషన్ అనే మాట లేకుండా సినిమాలు చేస్తుంటారు.

కాస్త పేరొచ్చాక డిమాండ్ చేద్దామంటే తమకొచ్చే అవకాశాలు ఎక్కడ కొత్తవారొచ్చి దక్కించుకుంటారో అనే భావన. కొన్ని సినిమాలు చేసి మంచి రెమ్యునరేషన్ ఇచ్చినా ఇంట్లో బాధ్యతలకో, మానవతా దృక్పథంతో సమాజ సేవకో ధారాదత్తం చేసేయడం.. కష్టాల్లో ఉన్నవారిని చూసి చలించిపోయి రేపు తెల్లవారితే కదా మనకి అవసరం వీరికి ఇప్పుడు పూట గడవాలి కదా అనే ఆలోచనతో ఉన్నదంతా ఇచ్చేయడం.. ఇలాంటి సహాయాలు చేసి చివరికి దిక్కు మొక్కూ లేకుండా కఠిన జీవితాన్ని అనుభవిస్తున్నారు. అందుకు ఉదాహరణ సావిత్రి లాంటి వారే.

కల్పనా రాయ్ కూడా చాలా సినిమాలకి రెమ్యునరేషన్ లేకుండానే నటించారట. వచ్చిన డబ్బు కాస్తో కూస్తో దాచుకోకుండా ఇతరులకి ఖర్చు చేసేవారని చెప్పుకుంటారు. అందుకే ఆమె అనారోగ్యం బారిన పడినా మందులు కొనుక్కోలేని పరిస్థితి గడపాల్సి వచ్చిందట.

వయసైపోయిన ముసలావిడ కాబట్టి ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదని.. చివరికి ఆమె మరణించాక తెలుగు సినిమా నటుల సంఘం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తన అంత్యక్రియల కోసం 10 వేల రూపాయలు కేటాయించింది. ఇలా చివరి దశను అనుభవిస్తున్న నటీ నటులు ఇప్పటికీ చాలామంది ఉన్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Star Heroin: స్టార్ హీరోతో ప్రేమ,పెళ్లి విడాకులు..12 మందితో ఎఫైర్ పెట్టుకున్న హీరోయిన్… ఎవరంటే?

Published

on

Star Heroin: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో సీనియర్ నటి మనీషా కొయిరాల ఒకరు. ఈమె సౌత్ లో కంటే నార్త్ లోనే ఎక్కువ సినిమాలలో నటించి ఒకానొక సమయంలో బాలీవుడ్ చిత్ర పరిశ్రమను ఓ ఊపు ఊపారు. ఇక ఈమె స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలో తన వ్యక్తిగత విషయాలలో కూడా వార్తలలో నిలిచారు.

Advertisement

ఈమె ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూనే మరోవైపు పలువురు హీరోలతో ఎఫైర్ పెట్టుకుంది అంటూ వార్తలు వచ్చాయి. ఒక స్టార్ హీరోతో పీకల్లోతు ప్రేమలో పడినప్పటికీ ఆయనని పెళ్లి చేసుకోలేదు. ఇక ఈమె సామ్రాట్ దహాల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పటికీ రెండేళ్లకే తనతో విడాకులు తీసుకొని విడిపోయి పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు.

ఇలా డిప్రెషన్ లోకి వెళ్లిన మనీషా కోయిరాల మందుకు అలవాటు పడ్డారు.పెళ్లికి ముందే మనీషా కోయిరాలా ఏకంగా 12 మందితో డేటింగ్ చేసిందట. ఆమె డేటింగ్ చేసినవాళ్ల లిస్ట్ లో నటులు, వ్యాపారవేత్తలు,అంబాసిడర్ కూడా ఉన్నారు. వివేక్ ముశ్రన్‌, నానా పటేకర్‌, DJ హుస్సేన్‌, లండన్‌కు చెందిన నైజీరియన్ వ్యాపారవేత్త సెసిల్ ఆంథోనీ, ఆర్యన్ వైద్‌ వంటి ప్రముఖులతో ఈమె డేటింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది.

12 మందితో డేటింగ్..
ఇలా తరచూ డేటింగ్ ల ద్వారా కూడా ఈమె వార్తల్లో నిలిచారు. ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో బిజీగా గడిపారు. పలువురు దర్శక నిర్మాతలు సైతం ఈమె డేట్స్ కోసం ఎంతగానో ఎదురు చూసేవారు. ఇలా సినిమా ఇండస్ట్రీని ఓ ఊపిన ఈమె మధ్యలో ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్ లతో బిజీగా గడుపుతున్నారు.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: విష్ణు ప్రియకు షాక్ ఇచ్చిన నిఖిల్… కన్నీళ్లు పెట్టుకున్న నిఖిల్.. అసలు ఆట ఆరంభం!

Published

on

Bigg Boss 8: తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమం ప్రారంభం అయ్యి 5 రోజులు పూర్తయింది. ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయింది అయితే హౌస్ లో ఉన్నటువంటి 14 మంది కంటెస్టెంట్లను బిగ్ బాస్ మూడు గ్రూపులుగా విడదీశారు. అయితే ఈ గ్రూపులోకి ఎవరెవరు సభ్యులను తీసుకోవాలనేది చీఫ్ ఎన్నుకోవాల్సి ఉంటుంది.

Advertisement

ఈ క్రమంలోనే కంటెస్టెంట్ విష్ణు ప్రియ కచ్చితంగా తనని నిఖిల్ తన గ్రూపులోకి తీసుకుంటారని ఆమె భావించింది. కానీ నిఖిల్ మాత్రం ఆమెకు షాక్ ఇచ్చారు. దీంతో విష్ణు ప్రియను నైనిక తన టీమ్ లోకి తీసుకున్నారు. అయితే ఈ విషయం గురించి నిఖిల్ విష్ణుప్రియ మధ్య పెద్ద ఎత్తున చర్చ జరిగింది. వీరిద్దరికి ముందే మంచి పరిచయమున్న నేపథ్యంలో తప్పకుండా నిఖిల్ తన టీమ్ లోకి తీసుకుంటారని విష్ణు ప్రియ భావించింది కానీ అది జరగలేదు.

ఇలా ఇద్దరి మధ్య ఉన్న పరిచయం కారణంగా విష్ణు ప్రియ సరదాగా నిఖిల్ ను ఓ ఆట ఆడుకుంది. దీంతో నిఖిల్ ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలా ఇప్పటివరకు ఎంతో సరదాగా గడిపిన కంటెస్టెంట్లను మూడు గ్రూపులుగా విడదీయడంతో అసలైన ఆట మొదలైంది.

టాస్కులపై ఫోకస్..
కంటెస్టెంట్లను టీమ్స్ గా విడదీసి బిగ్ బాస్ టాస్కులను ఇవ్వడం మొదలుపెట్టారు. ఇలా ఇచ్చిన మొదటి టాస్కోలో భాగంగా ఇప్పటివరకు హౌస్ లో సైలెంట్ గా కూర్చున్న పృథ్విరాజ్ తన ఆట తీరును కనబరుస్తూ యష్మీ టీమ్ ను గెలిపించారు. దీంతో ముందు ముందు ఏ ఏ కంటెస్టెంట్ ఎలా తన ఆట తీరుతో ప్రేక్షకులను మెప్పిస్తారో తెలియాల్సి ఉంది.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు వచ్చారు బ్రో…. ఆ కంటెస్టెంట్లను ఆడేసుకుంటున్న ట్రోలర్స్!

Published

on

Bigg Boss 8: బిగ్ బాస్ కార్యక్రమానికి తెలుగులో కూడా ఎంతో మంచి ఆదరణ ఉంది. ఈ కార్యక్రమం తెలుగులో ఇప్పటికి ఏడు సీజన్లను పూర్తి చేసుకుని ఎనిమిదవ సీజన్ కూడా గత ఆదివారం ఎంతో ఘనంగా ప్రారంభమైంది. మొదట 14 మంది కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపించారు. మిగిలిన వారిని ఐదవ వారం వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి పంపించబోతున్నారని సమాచారం.

Advertisement

ఇక హౌస్ లోకి వెళ్లిన తర్వాత మొదటి రోజు నుంచే కంటెస్టెంట్లు పెద్ద ఎత్తున గొడవలు పడుతూ పోట్లాడుతూ ప్రేక్షకులకు కావాల్సినంత కంటెంట్ ఇస్తున్నారు. అయితే కొంతమంది మాత్రమే బాగా ఎక్స్పోజ్ అవుతున్నారు. మిగిలిన వారు మాత్రం అసలు హౌస్ లో ఉన్నారా లేదా అన్నా సందేహాలు వస్తున్నాయి. హౌస్ లోకి వెళ్ళేటప్పుడు ఎంతో యాక్టివ్ గా వెళ్లిన కంటెస్టెంట్లు లోపల మాత్రం అనుకున్న స్థాయిలో కంటెంట్ ఇవ్వలేకపోతున్నారనే చెప్పాలి.

ముఖ్యంగా హీరో ఆదిత్య ఓం అయితే హౌస్ లో ఉన్నాడా లేదా అన్న సందేహం మాత్రం అందరికీ కలుగుతుంది. ఈయన ఉంటే ఒంటరిగా ఉంటారు లేకపోతే నిద్రపోతూ ఉంటారు. పెద్దగా ఫేమస్ అయిన కంటెంట్ మాత్రం ఈయన ఇవ్వలేకపోతున్నారు. దీంతో పలువురు ట్రోలర్స్ బ్రో అసలు ఎందుకొచ్చావు బ్రో బిగ్ బాస్ హౌస్ కి అంటూ భారీగా విమర్శలు చేస్తున్నారు.

ఈయనతో పాటు బెజవాడ బేబక్క కూడా విమర్శలను ఎదుర్కొంటుంది. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా కనిపించే ఈమె హౌస్ లో మాత్రం ఎక్కువగా కిచెన్ లోనే ఉంటుంది. కానీ సరైన కంటెంట్ మాత్రం ఇవ్వలేకపోతున్నారు.అఫ్రిదీ కూడా డల్‌గానే ఉన్నాడనే టాక్‌ వస్తుంది. పృధ్విరాజ్, అభయ్ నవీన్ వంటి వారందరూ కూడా హౌస్ లో డల్ గా కనిపిస్తున్న తరుణంలో పలువురు మీరంతా హౌస్ లోకి ఎందుకు వచ్చారో ఏమో అంటూ వీరిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు అలాగే మరి కొంతమందిని బాగా హైలైట్ చేస్తూ కూడా కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

ఎలిమినేషన్ ఉంటుందా…
ఇక ఈ వారం నామినేషన్స్ లో భాగంగా బెజవాడ బేబక్క, విష్ణు ప్రియ, శేఖర్ భాష, నాగ మణికంఠ సోనియా ఆకుల ప్రేరణ వంటి వారు నామినేషన్ లో ఉన్నారు. అయితే గత సీజన్లో మాదిరిగా ఈ సీజన్లో కూడా మొదటి వారం ఎలిమినేషన్ ఉండకపోవచ్చని తెలుస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!