Connect with us

Featured

దీపను చంపేసి.. మనం పెళ్లి చేసుకుందాం కార్తీక్.. మోనిత మరో రాక్షస ప్లాన్!

Published

on

బుల్లితెరలో ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రస్తుతం బాగా ఆసక్తిగా మారింది. మళ్లీ మోనిత కనిపించడంతో ఇంకా మోనిత బతికే ఉందని.. మళ్లీ ఎటువంటి ప్రమాదాలు తీసుకు వస్తుందో అని ప్రేక్షకులు కూడా తెగ టెన్షన్ పడుతున్నారు.

Advertisement

ఈరోజు ఎపిసోడ్ హైలెట్స్ ఏంటో చూద్దాం.. మొత్తానికి రత్న సీత మోనిత మనిషేనని అందరికీ అర్థమైంది. కార్తీక్ ఫోటో చూసి మోనిత ఎంత పిచ్చిగా ప్రవర్తించిందో చూసాం. కార్తీక్ ను వదలను అంటూ గట్టిగా అరిచింది. హిమ, శౌర్య దీప కింద పడుకోవడంతో ఏడుస్తూ ఎందుకు పడుకున్నావని అంటారు.

ఇక పిల్లల ప్రశ్నలకు సమాధానం చెప్పక జైల్లో ఉన్న కార్తీక్ గురించి ఆలోచిస్తుంది. ఇక పిల్లలు తన తండ్రిని చూడటానికి తన తల్లిని కోరుకుంటారు. దీప మాత్రం వద్దు అని అంటుంది. ఆయన పిల్లలు వినకుండా మారం చేస్తారు. ఇక దీప అలాగే ఆలోచిస్తూ ఉంటుంది.

మరోవైపు సౌందర్య ఇల్లును అదేపనిగా చూడటంతో ఆదిత్య ఎందుకు ఇలా అని ప్రశ్నిస్తాడు. దాంతో కళ తప్పినట్లుగా ఉందని.. మీ అన్నా ఇంట్లో లేడని అందుకే ఇలా ఉంది అని మాట్లాడుకుంటారు. అలా కార్తీక్ గురించి బాగా ఎమోషన్ గా మాట్లాడుతుంది.

దీప గురించి మాట్లాడుతూ.. తనకి ఈ బాధ అంతా పరిచయమే ఉంది కాబట్టి తనకు అలవాటు అయిందని అంటుంది. కార్తీక్ మోనితను చంపాడని నమ్మలేకపోతునానని.. కాని సాక్ష్యాలు చూసి నమ్మాల్సి వస్తుంది అని ఏడుస్తుంది.

ఇక మోనిత.. కార్తీక్ ఫోటోను చూసుకుంటూ.. నీ జీవితంలోకి అడుగు పెట్టాలని ఎంతగానో ఎదురు చూశాను అంటూ.. కానీ ఇలా ఉన్నాను అంటూ.. అందుకు నీపై ప్రేమ అని అంటుంది. ఇదంతా నీ కోసమే చేశాను అంటూ.. జైల్లో పెట్టాలనే ఉద్దేశంతో నాకు లేదని అంటుంది.

దీపను కార్తీక్ ను దూరం చేయాలని అనుకుంటుంది.తను చనిపోయినట్లు నాటకం చేస్తే అలా కార్తీక్ జైల్లో ఉండటం వల్ల కొన్ని రోజులైనా దీప, కార్తీక్ లు దూరంగా ఉంటారు అనే ఉద్దేశంతో అలా చేశానని అనుకుంటుంది. ఇక తనకు శిక్ష పడే లోపు వచ్చేస్తాను అనుకుంటుంది.

అంతలోపే పిల్లలు తప్ప దీపను, అందరినీ చంపేస్తానంటూ గట్టిగా అరుస్తుంది.నిన్ను చూడాలని ఉంది అంటూ.. కానీ అంతలోపే ఆ కనుబొమ్మలు పైకి ఎత్తే దానిని పైకి పంపిస్తాను అంటూ దీపం ఉద్దేశించి మాట్లాడుతుంది.

ఇక దీప పిల్లలతో రావడాన్ని చూసి.. సౌందర్య గుడికా అని అడుగుతుంది. దేవుడి దగ్గరికి అనడంతో.. డాడీ దగ్గరికి వెళ్తున్నాం అని హిమ అంటుంది. సౌందర్య పైకి వెళ్ళి తాతకు చెప్పండి అని అనగా వెంటనే హిమ పైకి వెళుతుంది.

అది చూసిన సౌర్య ఆగు ఎక్కడికి వెళ్తున్నావు అని కాసేపు హిమతో మాట్లాడుతుంది. నానమ్మ అమ్మతో ఏదో చెప్పాలని అనుకుంటుంది అందుకే.. మనల్ని పక్కకు పంపిస్తున్నారు అని అంటుంది. అలాంటప్పుడు ఎక్కడికి వెళ్లడం ఏంటి.. బయటికి వెళదామని అంటుంది సౌర్య.

సౌర్య మాటలు విని సౌందర్య షాక్ అవుతూ దీపతో వారి తెలివి గురించి మాట్లాడుతుంది.ఇక వాళ్లకు మోనిత చనిపోయిన విషయం తెలియదని.. పోలీస్ స్టేషన్ లో ఎవరైనా ఆ మాట అంటే ఆ పిల్లలు ఎలా తట్టుకుంటారు అని ప్రశ్నిస్తుంది. పిల్లలకు ఏ విషయం తెలియకుండా జాగ్రత్త పడమని సలహా ఇస్తుంది.

మోనిత.. కార్తీక మాటలను తలచుకుని గతాన్ని గుర్తు చేసుకుంటుంది. కార్తీక్ తో తాను చివరిగా మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటుంది. దీప ఏమైతే మనకేంటి అనడంతో.. కార్తీక్ మోనితపై అరిచి అక్కడనుంచి వెళ్లడం.. తర్వాత గన్ తో షూట్ చేసుకోవడం వంటి సీన్ ను చూపిస్తారు.

Featured

Star Heroin: స్టార్ హీరోతో ప్రేమ,పెళ్లి విడాకులు..12 మందితో ఎఫైర్ పెట్టుకున్న హీరోయిన్… ఎవరంటే?

Published

on

Star Heroin: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో సీనియర్ నటి మనీషా కొయిరాల ఒకరు. ఈమె సౌత్ లో కంటే నార్త్ లోనే ఎక్కువ సినిమాలలో నటించి ఒకానొక సమయంలో బాలీవుడ్ చిత్ర పరిశ్రమను ఓ ఊపు ఊపారు. ఇక ఈమె స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలో తన వ్యక్తిగత విషయాలలో కూడా వార్తలలో నిలిచారు.

Advertisement

ఈమె ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూనే మరోవైపు పలువురు హీరోలతో ఎఫైర్ పెట్టుకుంది అంటూ వార్తలు వచ్చాయి. ఒక స్టార్ హీరోతో పీకల్లోతు ప్రేమలో పడినప్పటికీ ఆయనని పెళ్లి చేసుకోలేదు. ఇక ఈమె సామ్రాట్ దహాల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పటికీ రెండేళ్లకే తనతో విడాకులు తీసుకొని విడిపోయి పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు.

ఇలా డిప్రెషన్ లోకి వెళ్లిన మనీషా కోయిరాల మందుకు అలవాటు పడ్డారు.పెళ్లికి ముందే మనీషా కోయిరాలా ఏకంగా 12 మందితో డేటింగ్ చేసిందట. ఆమె డేటింగ్ చేసినవాళ్ల లిస్ట్ లో నటులు, వ్యాపారవేత్తలు,అంబాసిడర్ కూడా ఉన్నారు. వివేక్ ముశ్రన్‌, నానా పటేకర్‌, DJ హుస్సేన్‌, లండన్‌కు చెందిన నైజీరియన్ వ్యాపారవేత్త సెసిల్ ఆంథోనీ, ఆర్యన్ వైద్‌ వంటి ప్రముఖులతో ఈమె డేటింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది.

12 మందితో డేటింగ్..
ఇలా తరచూ డేటింగ్ ల ద్వారా కూడా ఈమె వార్తల్లో నిలిచారు. ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో బిజీగా గడిపారు. పలువురు దర్శక నిర్మాతలు సైతం ఈమె డేట్స్ కోసం ఎంతగానో ఎదురు చూసేవారు. ఇలా సినిమా ఇండస్ట్రీని ఓ ఊపిన ఈమె మధ్యలో ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్ లతో బిజీగా గడుపుతున్నారు.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: విష్ణు ప్రియకు షాక్ ఇచ్చిన నిఖిల్… కన్నీళ్లు పెట్టుకున్న నిఖిల్.. అసలు ఆట ఆరంభం!

Published

on

Bigg Boss 8: తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమం ప్రారంభం అయ్యి 5 రోజులు పూర్తయింది. ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయింది అయితే హౌస్ లో ఉన్నటువంటి 14 మంది కంటెస్టెంట్లను బిగ్ బాస్ మూడు గ్రూపులుగా విడదీశారు. అయితే ఈ గ్రూపులోకి ఎవరెవరు సభ్యులను తీసుకోవాలనేది చీఫ్ ఎన్నుకోవాల్సి ఉంటుంది.

Advertisement

ఈ క్రమంలోనే కంటెస్టెంట్ విష్ణు ప్రియ కచ్చితంగా తనని నిఖిల్ తన గ్రూపులోకి తీసుకుంటారని ఆమె భావించింది. కానీ నిఖిల్ మాత్రం ఆమెకు షాక్ ఇచ్చారు. దీంతో విష్ణు ప్రియను నైనిక తన టీమ్ లోకి తీసుకున్నారు. అయితే ఈ విషయం గురించి నిఖిల్ విష్ణుప్రియ మధ్య పెద్ద ఎత్తున చర్చ జరిగింది. వీరిద్దరికి ముందే మంచి పరిచయమున్న నేపథ్యంలో తప్పకుండా నిఖిల్ తన టీమ్ లోకి తీసుకుంటారని విష్ణు ప్రియ భావించింది కానీ అది జరగలేదు.

ఇలా ఇద్దరి మధ్య ఉన్న పరిచయం కారణంగా విష్ణు ప్రియ సరదాగా నిఖిల్ ను ఓ ఆట ఆడుకుంది. దీంతో నిఖిల్ ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలా ఇప్పటివరకు ఎంతో సరదాగా గడిపిన కంటెస్టెంట్లను మూడు గ్రూపులుగా విడదీయడంతో అసలైన ఆట మొదలైంది.

టాస్కులపై ఫోకస్..
కంటెస్టెంట్లను టీమ్స్ గా విడదీసి బిగ్ బాస్ టాస్కులను ఇవ్వడం మొదలుపెట్టారు. ఇలా ఇచ్చిన మొదటి టాస్కోలో భాగంగా ఇప్పటివరకు హౌస్ లో సైలెంట్ గా కూర్చున్న పృథ్విరాజ్ తన ఆట తీరును కనబరుస్తూ యష్మీ టీమ్ ను గెలిపించారు. దీంతో ముందు ముందు ఏ ఏ కంటెస్టెంట్ ఎలా తన ఆట తీరుతో ప్రేక్షకులను మెప్పిస్తారో తెలియాల్సి ఉంది.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు వచ్చారు బ్రో…. ఆ కంటెస్టెంట్లను ఆడేసుకుంటున్న ట్రోలర్స్!

Published

on

Bigg Boss 8: బిగ్ బాస్ కార్యక్రమానికి తెలుగులో కూడా ఎంతో మంచి ఆదరణ ఉంది. ఈ కార్యక్రమం తెలుగులో ఇప్పటికి ఏడు సీజన్లను పూర్తి చేసుకుని ఎనిమిదవ సీజన్ కూడా గత ఆదివారం ఎంతో ఘనంగా ప్రారంభమైంది. మొదట 14 మంది కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపించారు. మిగిలిన వారిని ఐదవ వారం వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి పంపించబోతున్నారని సమాచారం.

Advertisement

ఇక హౌస్ లోకి వెళ్లిన తర్వాత మొదటి రోజు నుంచే కంటెస్టెంట్లు పెద్ద ఎత్తున గొడవలు పడుతూ పోట్లాడుతూ ప్రేక్షకులకు కావాల్సినంత కంటెంట్ ఇస్తున్నారు. అయితే కొంతమంది మాత్రమే బాగా ఎక్స్పోజ్ అవుతున్నారు. మిగిలిన వారు మాత్రం అసలు హౌస్ లో ఉన్నారా లేదా అన్నా సందేహాలు వస్తున్నాయి. హౌస్ లోకి వెళ్ళేటప్పుడు ఎంతో యాక్టివ్ గా వెళ్లిన కంటెస్టెంట్లు లోపల మాత్రం అనుకున్న స్థాయిలో కంటెంట్ ఇవ్వలేకపోతున్నారనే చెప్పాలి.

ముఖ్యంగా హీరో ఆదిత్య ఓం అయితే హౌస్ లో ఉన్నాడా లేదా అన్న సందేహం మాత్రం అందరికీ కలుగుతుంది. ఈయన ఉంటే ఒంటరిగా ఉంటారు లేకపోతే నిద్రపోతూ ఉంటారు. పెద్దగా ఫేమస్ అయిన కంటెంట్ మాత్రం ఈయన ఇవ్వలేకపోతున్నారు. దీంతో పలువురు ట్రోలర్స్ బ్రో అసలు ఎందుకొచ్చావు బ్రో బిగ్ బాస్ హౌస్ కి అంటూ భారీగా విమర్శలు చేస్తున్నారు.

ఈయనతో పాటు బెజవాడ బేబక్క కూడా విమర్శలను ఎదుర్కొంటుంది. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా కనిపించే ఈమె హౌస్ లో మాత్రం ఎక్కువగా కిచెన్ లోనే ఉంటుంది. కానీ సరైన కంటెంట్ మాత్రం ఇవ్వలేకపోతున్నారు.అఫ్రిదీ కూడా డల్‌గానే ఉన్నాడనే టాక్‌ వస్తుంది. పృధ్విరాజ్, అభయ్ నవీన్ వంటి వారందరూ కూడా హౌస్ లో డల్ గా కనిపిస్తున్న తరుణంలో పలువురు మీరంతా హౌస్ లోకి ఎందుకు వచ్చారో ఏమో అంటూ వీరిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు అలాగే మరి కొంతమందిని బాగా హైలైట్ చేస్తూ కూడా కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

ఎలిమినేషన్ ఉంటుందా…
ఇక ఈ వారం నామినేషన్స్ లో భాగంగా బెజవాడ బేబక్క, విష్ణు ప్రియ, శేఖర్ భాష, నాగ మణికంఠ సోనియా ఆకుల ప్రేరణ వంటి వారు నామినేషన్ లో ఉన్నారు. అయితే గత సీజన్లో మాదిరిగా ఈ సీజన్లో కూడా మొదటి వారం ఎలిమినేషన్ ఉండకపోవచ్చని తెలుస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!