Connect with us

Featured

పుకార్లకు చెక్.. క్లారిటీ ఇచ్చేసిన ఆ జంట..!

Published

on

వెండితెరపై అయినా.. బుల్లితెరపై అయినా ఒక పెయిర్ హిట్ అయిందంటే వారిద్దరి మధ్య ఏదో ఉన్నట్లు పుకార్లు షికార్లు అవుతాయి. వారిద్దరికి సంబంధించి ఏ వార్త వచ్చినా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే ఇలా నెటిజన్లు కొన్ని పుకార్లను స్పష్టిస్తారు. అందులో కొన్ని నిజాలు ఉండొచ్చు.. మరికొన్ని అబద్దాలు కూడా ఉండొచ్చు. పెళ్లి కాకముందు నాగచైతన్య, సమంత మధ్య ప్రేమ నడుస్తుందని.. వారిద్దరి జంట గురించి వార్తలు పెద్ద ఎత్తున వచ్చాయి.

ఇలా వారు పెళ్లి చేసుకొని నెటిజన్ల పుకార్లను నిజం చేశారు. ఇలా జంటల మధ్య ఏదో ఉన్నట్లు క్రియేట్ చేయడం ప్రస్తుతం కొంతమందికి అలవాటయింది. అయితే ప్రస్తుతం మనం చెప్పుకునే జంట ఎవరంటే.. మౌనరాగం సీరియల్ లో నటించిన ప్రియాంక జైన్ మరియు శివ కుమార్. ప్రియాంక జైన్ మొదట్లో కొన్ని సినిమాల్లో నిటించినా అంతగా పేరు రాలేదు. తర్వాత మౌనరాగం సీరియల్ లో లీడ్ రోల్ పాత్ర చేసింది. మౌనరాగం సీరియల్ ఎంత పెద్ద హిట్ అయిందో.. అదే తరహాలో వీరి జంట కూడా అతి పెద్ద హిట్ అయింది.

అమ్ములుగా ఓ మూగ క్యారెక్టర్ చేసిన ప్రియాంక ప్రేక్షకులను మెప్పించింది. తన నటన, అభినయంతో తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పరచుకుంది. దీంతో ఆమెకు మౌనరాగం సీరియల్ తర్వాత జానకి కలగనలేదు సీరియల్ లో అవకాశం లభించింది. ఇక మౌనరాగం సీరియల్ లో అంకిత్ క్యారెక్టర్ చేసిన శివ కుమార్ కూడా నటనలో తనకంటూ పేరు తెచ్చుకున్నాడు. అయితే ఆ సీరియల్ నుంచే వీరిద్దరు ప్రేమ ఉందని.. పుకార్లు వచ్చిన సంగతి తెలిసిందే. వీరిద్దరు సోషల్ మీడియాలో తెగ యాక్టీవ్ గా ఉంటారు. ఫొటోలను షేర్ చేస్తూ తమ అభిమానులకు టచ్ లో ఉంటున్నారు. వీరిద్దరు ఎక్కువ దూరం ట్రావెల్ చేస్తుంటారని.. రాత్రి పబ్ లు, పార్టీలు అంటూ తిరుగుతుంటారని.. వీరిద్దరి మధ్య లైవ్ కాల్స్ కూడా నడుస్తున్నాయని సోషల్ మీడియలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

Advertisement

అయితే వీరి మధ్య ఎన్నో జరిగాయని వార్తలు వస్తున్న సమయంలో ఈ మధ్యన ఇద్దరు ఒకే కలర్ డ్రస్ వేసుకొని గుడిలో దర్శనమిచ్చారు. అచ్చం భార్యభర్తలులాగా ఉన్న ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తాజాగా లైవ్ కి వచ్చి మాట్లాడిన వీళ్లు.. వీటికి క్లారిటీ ఇచ్చే పని చేశారు. వీళ్ల పెళ్లి గురించి నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపించారు. అందులో ఒకరు మీరు పెళ్లి చేసకుంటున్నారా.. అని అడగడంతో ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ.. నువ్వు చెప్పు అంటే నుమ్ము చెప్పు అని సరదాగా ప్రశ్నలు వేసుకున్నారు. అయితే దీనికి సమాధానం త్వరలోనే ఇస్తామని అన్నారు. మీరు అమ్ముల్ని లవ్ చేస్తున్నారా.. అని ఓ నెటిజన్ శివను అడగ్గా.. అవును అని సమాధానం ఇచ్చాడు. దీంతో వీరిద్దరి మధ్య ప్రేమ ఉందని క్లారిటీకి వచ్చేసింది. త్వరలో ఈ బుల్లితెర జంట పెళ్లిపీటలపై కూర్చుంటారని తెలుస్తోంది.

Advertisement

Featured

Niharika: యుద్ధం గెలిచిన రాముడు అయోధ్యకు వచ్చినట్టు ఉంది… బాబాయ్ పై నిహారిక కామెంట్స్!

Published

on

Niharika: నిహారిక కొణిదెల పరిచయం అవసరం లేని పేరు. ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీలో నిర్మాతగా నటిగా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు. తన భర్త నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన నిహారిక తిరిగి కెరియర్ పై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే నిర్మాతగా కూడా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇక నిహారిక నిర్మాణంలో తెరకెక్కిన కమిటీ కుర్రోళ్ళు సినిమా ఆగస్టు 9వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈమె ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆహాలో ప్రసారమవుతున్న సర్కార్ సక్సెస్ సెలబ్రేషన్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.

ఇక ఈ ప్రోమోలో భాగంగా నిహారిక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ నేను వచ్చేది ఎప్పుడు నెక్స్ట్ సీజనా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సుడిగాలి సుదీర్ రెస్పాండ్ అవుతూ మీకేంటండి మీరు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలూకా అంటూ మాట్లాడారు. అనంతరం పవన్ కళ్యాణ్ విజయం సాధించిన తర్వాత చిరంజీవి ఇంటికి వచ్చి ఆశీర్వాదం తీసుకున్న వీడియో ఎంతలా వైరల్ అయిందో మనకు తెలిసిందే .ఇక ఈ వీడియోని ప్లే చేశారు.

Advertisement

యుద్ధం గెలిచిన రాముడు…
ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది అంటూ నిహారికను ప్రశ్నించారు. ఇక నిహారిక ఈ వీడియో గురించి మాట్లాడుతూ యుద్ధం గెలిచిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకు వచ్చినప్పుడు కూడా ఇలాగే ఉండేదేమో అనిపించింది అంటూ తన బాబాయ్ విజయం గురించి నిహారిక మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Anasuya: ఇకపై రంగమ్మత్త లాంటి పాత్రలు అసలు చేయను.. గ్లామర్ పాత్రలకు సై అంటున్న అనసూయ?

Published

on

Anasuya: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు. ఈమె జబర్దస్త్ యాంకర్ గా బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ అందుకొని అనంతరం వెండి తెరపై సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా వెండితెరపై వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న అనసూయ తిరిగి బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈమె స్టార్ మా లో ప్రసారమవుతున్న కిరాక్ బాయ్స్ కిలాడి లేడీస్ అనే కార్యక్రమంలో సందడి చేస్తున్నారు. ఇలా ఒక వైపు బుల్లితెర కార్యక్రమాలు మరోవైపు వెండితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్న అనసూయ త్వరలోనే సింబా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ఈమె మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఇటీవల కాలంలో మీరు చాలా సినిమాలను రిజెక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది కారణం ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ తాను సినిమాలు రిజెక్ట్ చేస్తున్న మాట నిజమేనని తెలిపారు. నేను ఒక సినిమాలో నటించిన పాత్ర హిట్ అవడంతో తదుపరి సినిమాలలో కూడా అలాంటి పాత్రలలో నటించే అవకాశం వస్తుందని తెలిపారు.

Advertisement

రంగమ్మత్త..
ఇలా ఒక పాత్రలో నటించిన తర్వాత తిరిగి అలాంటి పాత్రలలో నటించిన ప్రేక్షకులు పెద్దగా తీసుకోలేరు ఉదాహరణకు రంగమ్మత్త పాత్ర చాలా హైలెట్ అయింది. తదుపరి అలాంటి పాత్రలు వస్తే నేను చెయ్యను నేను అన్ని చాలా డిఫరెంట్ గా ఉండేలా చేయాలని భావిస్తున్నాను. ఇక ఎక్కువగా తాను గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా అనసూయ గ్లామర్ రోల్ చేయడానికి సై అంటూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Mahesh Babu: మహేష్ రాజమౌళి సినిమా టైటిల్ లీక్… సినిమా పేరు ఏంటో తెలుసా?

Published

on

Mahesh Babu: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా జరుగబోతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన కూడా తెలియజేయబోతున్నారు.

ఇక ఈ సినిమాలో మహేష్ బాబు చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు మొదటిసారి వర్క్ షాప్ లో కూడా పాల్గొనబోతున్నారని సమాచారం.

ఇప్పటివరకు మహేష్ బాబు ఏ సినిమా కోసం ఇలా వర్క్ షాప్ లో పాల్గొనలేదు మొదటిసారి రాజమౌళి సినిమా కోసం పాల్గొనబోతున్న నేపథ్యంలో ఈయన కూడా ఈ సినిమా విషయంలో చాలా ఆతృత కనబరుస్తున్నారు. ఇకపోతే తాజాగా మహేష్ బాబు రాజమౌళి సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

గోల్డ్..
తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమాకు సంబంధించి ఓ టైటిల్ సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమా టైటిల్ కూడా అందుకు అనుగుణంగానే ఉండాలి. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం గోల్డ్ అనే టైటిల్ పెట్టబోతున్నారంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఈ సినిమా టైటిల్ గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం వైరల్ అవుతుంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!