Connect with us

Featured

Producer MS Raju : ‘వర్షం’ తరవాత ‘వాన’ ఒస్తే.. నిర్మాత ఎమ్మెస్ రాజుకు ఉన్నది కాస్తా ఊడ్చుకుపోయింది..?!

Published

on

Producer MS Raju : 1990-2000 దశకంలో తెలుగు సినిమా రంగంలో అగ్ర నిర్మాతగా విజయవంతమైన చిత్రాలను రూపొందించిన సుమంత్ ఆర్ట్స్ బ్యానర్ అధినేత ఎమ్మెస్ రాజు తక్కువ కాలంలోనే ఎక్కువ పేరు సంపాదించుకున్న నిర్మాతల్లో ఒకరు. విక్టరీ వెంకటేష్ తో చిత్రాలు నిర్మించడం మొదలుపెట్టిన ఎమ్మెస్ రాజు సినీ ప్రయాణం అంచెలంచెలుగా ఎదుగుతూ… ఎమ్మెస్ రాజు పేరుతో ప్రేక్షకులు సినిమా థియేటర్ కు వచ్చిన రోజులు కూడా ఉన్నాయి.

Advertisement
Producer MS Raju : 'వర్షం' తరవాత 'వాన' ఒస్తే.. నిర్మాత ఎమ్మెస్ రాజుకు ఉన్నది కాస్తా ఊడ్చుకుపోయింది..?!

మొదటి చిత్రంతో విజయాన్ని అందిపుచ్చుకున్నారు. ఆ తర్వాత విజయశాంతితో ‘పోలీస్ లాకప్’ సినిమా రూపొందించినప్పటికీ ఆమెతో ‘స్ట్రీట్ ఫైటర్’ సినిమా తీసి చేతులు కాల్చుకున్నారు. ఆ తర్వాత ‘దేవి’ సినిమాతో కొంత ఉపశమనం పొందగా వెంకటేష్ తో రెండోసారి తీసిన చిత్రం ‘దేవి పుత్రుడు’ ఆయనను పునరాలోచించేలా చేసింది. వి.ఎన్. ఆదిత్య దర్శకత్వంలో ఉదయ్ కిరణ్, రీమాసేన్ హీరో, హీరోయిన్లుగా ‘మనసంతానువ్వే’ చిత్రాన్ని‌ నిర్మించి మరో విజయవంతమైన చిత్రాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.

Producer MS Raju : 'వర్షం' తరవాత 'వాన' ఒస్తే.. నిర్మాత ఎమ్మెస్ రాజుకు ఉన్నది కాస్తా ఊడ్చుకుపోయింది..?!

ఆయన గుణశేఖర్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ‘ఒక్కడు’ చిత్రం రూపొందించగా..మహేష్ బాబు కెరీర్ లో ఈ చిత్రం మూడవ విజయవంతమైన చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత ఎమ్మెస్ రాజు తెలంగాణ నేపథ్యంలో ఒక ప్రేమకథా చిత్రాన్ని రూపొందించాలనుకున్నారు. ఆ క్రమంలో ఆయన రచయిత వీరుపోట్ల చెప్పిన కథ నచ్చడంతో ప్రభాస్, త్రిష హీరో, హీరోయిన్స్ గా చారిత్రక నేపథ్యం గల వరంగల్, ఆ నగరం చుట్టూ పరిసర ప్రాంతాలను ఆధారం చేసుకుని దర్శకుడు శోభన్ తీసిన చిత్రం “వర్షం” 2004 జనవరిలో విడుదలై అద్భుత విజయాన్ని సాధించింది. సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ అందించిన గీతాలు యువత గుండెల్లో మార్మోగాయి. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా.. అనే పాటను స్వరపరిచిన దేవిశ్రీప్రసాద్ కు ఆ రోజుల్లో విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఆ పాటకు త్రిష వేసిన స్టెప్పులకు కుర్రకారు పిచ్చెక్కిపోయారు.

Producer MS Raju : 'వర్షం' తరవాత 'వాన' ఒస్తే.. నిర్మాత ఎమ్మెస్ రాజుకు ఉన్నది కాస్తా ఊడ్చుకుపోయింది..?!

అంతటి భారీ విజయాన్ని అందుకున్న ఎమ్మెస్ రాజుకు.. ఆ జ్ఞాపకాలు తన మదిలో నుంచి పోలేదు. దాదాపుగా అదే టైటిల్ తో మళ్లీ వర్షం నేపథ్యంగా మరో చిత్రాన్ని రూపొందించాలనుకున్నారు.. ఆ క్రమంలో 2008 సుమంత్ ఆర్ట్స్ నిర్మాణం, ఎమ్మెస్.రాజు నిర్మాత, దర్శకత్వంలో ‘వాన’ చిత్రం విడుదలయ్యింది. ఈ సినిమాలో వినయ్, మీరా చోప్రా హీరో, హీరోయిన్లుగా నటించారు. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఒక విధంగా వర్షం సినిమాతో పీక్ లో ఉన్న ఎమ్మెస్.రాజు ‘వాన’ సినిమా‌ నిర్మించి చేతులు కాల్చుకున్నారు.

MS Raju : దర్శకుడిగా మారినా ఫలితం దక్కలేదు

Producer MS Raju : 'వర్షం' తరవాత 'వాన' ఒస్తే.. నిర్మాత ఎమ్మెస్ రాజుకు ఉన్నది కాస్తా ఊడ్చుకుపోయింది..?!

‘వర్షం’ చిత్రంతో వచ్చిన డబ్బులు కాస్త..’వాన’ చిత్రంతో ఊడ్చుకు పోయాయి. ఆ తరువాత ఎమ్మెస్ రాజు దర్శకత్వం వహిస్తూ.. తన కొడుకు సుమంత్ అశ్విన్ హీరోగా “తూనీగా తూనీగా” చిత్రం తీయగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఎమ్మెస్ రాజు నిర్మాణ బాధ్యతలతో పాటు దర్శకత్వం వహిస్తూ.. శ్రవణ్ రెడ్డి, రుహానిశర్మ,సిమ్రత్ కౌర్ హీరో, హీరోయిన్లుగా”డర్టీ హరి” చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా కూడా బాక్సాఫీసు వద్ద విజయాన్ని సాధించలేకపోయింది.

Advertisement

Featured

Star Heroin: స్టార్ హీరోతో ప్రేమ,పెళ్లి విడాకులు..12 మందితో ఎఫైర్ పెట్టుకున్న హీరోయిన్… ఎవరంటే?

Published

on

Star Heroin: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో సీనియర్ నటి మనీషా కొయిరాల ఒకరు. ఈమె సౌత్ లో కంటే నార్త్ లోనే ఎక్కువ సినిమాలలో నటించి ఒకానొక సమయంలో బాలీవుడ్ చిత్ర పరిశ్రమను ఓ ఊపు ఊపారు. ఇక ఈమె స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలో తన వ్యక్తిగత విషయాలలో కూడా వార్తలలో నిలిచారు.

Advertisement

ఈమె ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూనే మరోవైపు పలువురు హీరోలతో ఎఫైర్ పెట్టుకుంది అంటూ వార్తలు వచ్చాయి. ఒక స్టార్ హీరోతో పీకల్లోతు ప్రేమలో పడినప్పటికీ ఆయనని పెళ్లి చేసుకోలేదు. ఇక ఈమె సామ్రాట్ దహాల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పటికీ రెండేళ్లకే తనతో విడాకులు తీసుకొని విడిపోయి పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు.

ఇలా డిప్రెషన్ లోకి వెళ్లిన మనీషా కోయిరాల మందుకు అలవాటు పడ్డారు.పెళ్లికి ముందే మనీషా కోయిరాలా ఏకంగా 12 మందితో డేటింగ్ చేసిందట. ఆమె డేటింగ్ చేసినవాళ్ల లిస్ట్ లో నటులు, వ్యాపారవేత్తలు,అంబాసిడర్ కూడా ఉన్నారు. వివేక్ ముశ్రన్‌, నానా పటేకర్‌, DJ హుస్సేన్‌, లండన్‌కు చెందిన నైజీరియన్ వ్యాపారవేత్త సెసిల్ ఆంథోనీ, ఆర్యన్ వైద్‌ వంటి ప్రముఖులతో ఈమె డేటింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది.

12 మందితో డేటింగ్..
ఇలా తరచూ డేటింగ్ ల ద్వారా కూడా ఈమె వార్తల్లో నిలిచారు. ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో బిజీగా గడిపారు. పలువురు దర్శక నిర్మాతలు సైతం ఈమె డేట్స్ కోసం ఎంతగానో ఎదురు చూసేవారు. ఇలా సినిమా ఇండస్ట్రీని ఓ ఊపిన ఈమె మధ్యలో ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్ లతో బిజీగా గడుపుతున్నారు.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: విష్ణు ప్రియకు షాక్ ఇచ్చిన నిఖిల్… కన్నీళ్లు పెట్టుకున్న నిఖిల్.. అసలు ఆట ఆరంభం!

Published

on

Bigg Boss 8: తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమం ప్రారంభం అయ్యి 5 రోజులు పూర్తయింది. ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయింది అయితే హౌస్ లో ఉన్నటువంటి 14 మంది కంటెస్టెంట్లను బిగ్ బాస్ మూడు గ్రూపులుగా విడదీశారు. అయితే ఈ గ్రూపులోకి ఎవరెవరు సభ్యులను తీసుకోవాలనేది చీఫ్ ఎన్నుకోవాల్సి ఉంటుంది.

Advertisement

ఈ క్రమంలోనే కంటెస్టెంట్ విష్ణు ప్రియ కచ్చితంగా తనని నిఖిల్ తన గ్రూపులోకి తీసుకుంటారని ఆమె భావించింది. కానీ నిఖిల్ మాత్రం ఆమెకు షాక్ ఇచ్చారు. దీంతో విష్ణు ప్రియను నైనిక తన టీమ్ లోకి తీసుకున్నారు. అయితే ఈ విషయం గురించి నిఖిల్ విష్ణుప్రియ మధ్య పెద్ద ఎత్తున చర్చ జరిగింది. వీరిద్దరికి ముందే మంచి పరిచయమున్న నేపథ్యంలో తప్పకుండా నిఖిల్ తన టీమ్ లోకి తీసుకుంటారని విష్ణు ప్రియ భావించింది కానీ అది జరగలేదు.

ఇలా ఇద్దరి మధ్య ఉన్న పరిచయం కారణంగా విష్ణు ప్రియ సరదాగా నిఖిల్ ను ఓ ఆట ఆడుకుంది. దీంతో నిఖిల్ ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలా ఇప్పటివరకు ఎంతో సరదాగా గడిపిన కంటెస్టెంట్లను మూడు గ్రూపులుగా విడదీయడంతో అసలైన ఆట మొదలైంది.

టాస్కులపై ఫోకస్..
కంటెస్టెంట్లను టీమ్స్ గా విడదీసి బిగ్ బాస్ టాస్కులను ఇవ్వడం మొదలుపెట్టారు. ఇలా ఇచ్చిన మొదటి టాస్కోలో భాగంగా ఇప్పటివరకు హౌస్ లో సైలెంట్ గా కూర్చున్న పృథ్విరాజ్ తన ఆట తీరును కనబరుస్తూ యష్మీ టీమ్ ను గెలిపించారు. దీంతో ముందు ముందు ఏ ఏ కంటెస్టెంట్ ఎలా తన ఆట తీరుతో ప్రేక్షకులను మెప్పిస్తారో తెలియాల్సి ఉంది.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు వచ్చారు బ్రో…. ఆ కంటెస్టెంట్లను ఆడేసుకుంటున్న ట్రోలర్స్!

Published

on

Bigg Boss 8: బిగ్ బాస్ కార్యక్రమానికి తెలుగులో కూడా ఎంతో మంచి ఆదరణ ఉంది. ఈ కార్యక్రమం తెలుగులో ఇప్పటికి ఏడు సీజన్లను పూర్తి చేసుకుని ఎనిమిదవ సీజన్ కూడా గత ఆదివారం ఎంతో ఘనంగా ప్రారంభమైంది. మొదట 14 మంది కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపించారు. మిగిలిన వారిని ఐదవ వారం వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి పంపించబోతున్నారని సమాచారం.

Advertisement

ఇక హౌస్ లోకి వెళ్లిన తర్వాత మొదటి రోజు నుంచే కంటెస్టెంట్లు పెద్ద ఎత్తున గొడవలు పడుతూ పోట్లాడుతూ ప్రేక్షకులకు కావాల్సినంత కంటెంట్ ఇస్తున్నారు. అయితే కొంతమంది మాత్రమే బాగా ఎక్స్పోజ్ అవుతున్నారు. మిగిలిన వారు మాత్రం అసలు హౌస్ లో ఉన్నారా లేదా అన్నా సందేహాలు వస్తున్నాయి. హౌస్ లోకి వెళ్ళేటప్పుడు ఎంతో యాక్టివ్ గా వెళ్లిన కంటెస్టెంట్లు లోపల మాత్రం అనుకున్న స్థాయిలో కంటెంట్ ఇవ్వలేకపోతున్నారనే చెప్పాలి.

ముఖ్యంగా హీరో ఆదిత్య ఓం అయితే హౌస్ లో ఉన్నాడా లేదా అన్న సందేహం మాత్రం అందరికీ కలుగుతుంది. ఈయన ఉంటే ఒంటరిగా ఉంటారు లేకపోతే నిద్రపోతూ ఉంటారు. పెద్దగా ఫేమస్ అయిన కంటెంట్ మాత్రం ఈయన ఇవ్వలేకపోతున్నారు. దీంతో పలువురు ట్రోలర్స్ బ్రో అసలు ఎందుకొచ్చావు బ్రో బిగ్ బాస్ హౌస్ కి అంటూ భారీగా విమర్శలు చేస్తున్నారు.

ఈయనతో పాటు బెజవాడ బేబక్క కూడా విమర్శలను ఎదుర్కొంటుంది. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా కనిపించే ఈమె హౌస్ లో మాత్రం ఎక్కువగా కిచెన్ లోనే ఉంటుంది. కానీ సరైన కంటెంట్ మాత్రం ఇవ్వలేకపోతున్నారు.అఫ్రిదీ కూడా డల్‌గానే ఉన్నాడనే టాక్‌ వస్తుంది. పృధ్విరాజ్, అభయ్ నవీన్ వంటి వారందరూ కూడా హౌస్ లో డల్ గా కనిపిస్తున్న తరుణంలో పలువురు మీరంతా హౌస్ లోకి ఎందుకు వచ్చారో ఏమో అంటూ వీరిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు అలాగే మరి కొంతమందిని బాగా హైలైట్ చేస్తూ కూడా కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

ఎలిమినేషన్ ఉంటుందా…
ఇక ఈ వారం నామినేషన్స్ లో భాగంగా బెజవాడ బేబక్క, విష్ణు ప్రియ, శేఖర్ భాష, నాగ మణికంఠ సోనియా ఆకుల ప్రేరణ వంటి వారు నామినేషన్ లో ఉన్నారు. అయితే గత సీజన్లో మాదిరిగా ఈ సీజన్లో కూడా మొదటి వారం ఎలిమినేషన్ ఉండకపోవచ్చని తెలుస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!