Connect with us

Featured

Mulugu MLA Seethakka : నక్సలైట్ నుండి ప్రజాప్రతినిధి వరకు సీతక్క ప్రస్థానం… నేడు డిప్యూటీ సీఎం రేసులో సీతక్క…!

Published

on

Mulugu MLA Seethakka : ఆదివాసీ కోయ జాతికి చెందిన దంసారి అనసూయ అలియాస్ సీతక్క రెండు తెలుగు రాష్ట్రాలకు బాగా తెలిసిన వ్యక్తి. ఆమె జీవితం ఖచ్చితంగా ఎందరికో ఆదర్శం. విద్యార్ధి జీవితం నుండే పోరాట జీవితం మొదలు పెట్టిన అనసూయ ఆపైన దళంలో చేరి అన్నలతో కలిసి ప్రభుత్వం మీద పోరాటం చేసింది. ఇక అక్కడ మారిన సిద్ధాంతాలు పొసగక జనజీవన స్రవంతిలో కలిసిపోయి ఆపైన గిరిజన మహిళలకు ఉపాధినిచ్చే ప్రభుత్వ సంస్థలో చేరి ఉద్యోగం చేసుకుంటూనే మరోవైపు సామజిక సేవ వైపు సాగింది. ఆపైన రాజకీయాలలోకి వచ్చి ఎమ్మెల్యేగా తన ప్రాంత ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి పక్షాన నిలిచి పోరాడుతూ నిజమైన ప్రజాసేవకు మార్గం తెలుసుకున్నారు. ఇలా నక్సలైట్ జీవితం నుండి నేడు డిప్యూటీ సీఎం రేస్ లో ఉన్న ఆమె ప్రస్థానం అందరికీ ఆదర్శమే.

చిన్న వయసులోనే ప్రజాపోరాటంలోకి…

వరంగల్ జిల్లా ములుగు మండలం జగ్గన్నగూడెంకి చెందిన సమ్మక్క, సమ్మయ్యలకు జన్మించిన దంసారి అనసూయ అలియాస్ సీతక్క ప్రభుత్వ గిరిజన వసతి గృహంలో ఉంటూ చదువుకుంటున్న సమయంలోనే అక్కడ సరిగా భోజనం పెట్టడం లేదని అలాగే బాలికలకు ప్రభుత్వం ఇస్తున్న పది రూపాయలను వసతి గృహ అధికారులు ఇవ్వడం లేదని తోటి విద్యార్థులను కూడగట్టుకుని ధర్నా చేసింది. ఆలా 13 ఏళ్ల వయసులోనే 1986లో పోరాట జీవితంలోకి అడుగుపెట్టిన సీతక్క పీపుల్స్ వార్ దళం సభ్యుల కంట్లో పడింది. తన సోదరుడు సాంబయ్య కూడా నక్సలైట్ కాగా పోలీసుల చేతిలో మరణించాడు. బావ శ్రీరాముడు దళంలో ఉండటంతో 14 ఏళ్ల వయసులో నక్సలిజంలో చేరినా సీతక్క చదువును వదలలేదు. దళ సభ్యులను పోలీసులు అరెస్టు చేసి జైలుకి పంపినప్పుడు జైలులో ఉంటూనే పదోతరగతిలో ఫెయిల్ అయిన సబ్జక్ట్స్ పాస్ అయింది. ఆపైన ప్రేమించిన తన బావ శ్రీరాముడినే పెళ్లి చేసుకున్న అనసూయ, సీతక్కగా తన పేరును మార్చుకున్నారు. కొడుకు పుట్టిన తరువాత రెండు నెలల పిల్లాడిని బయట వేరేవాళ్లకు పెంచడానికి ఇచ్చి అడవిలోకి వెళ్లిపోయిన సీతక్క దంపతుల మధ్య విబేధాలు రావడం దళంలో పొసగలేక 1996లో బయటికి వచ్చేసిన సీతక్క ఆ తరువాత ఐటిడీఏ (ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ) లో నెల జీతానికి పనిచేస్తూ చదువు కొనసాగించారు.

Advertisement

అలా ‘లా’ చదివిన సీతక్క ఆపైన చంద్రబాబు ప్రోత్సాహంతో టీడీపీ పార్టీ పట్ల ఆకర్షితురాలై 2004లో అందులో చేరి ములుగు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ పైన 2009లో మళ్ళీ కాంగ్రెస్ అభ్యర్థి పోడెం వీరయ్య మీద పోటీ చేసి గెలిచారు. ఆలా ఎమ్మెల్యే అయిన సీతక్క నిత్యం తన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వచ్చారు. తెలంగాణ ఉద్యమ సమయములో టీడీపీ పార్టీ నుండి ఎమ్మెల్యేగా ఓడిపోయిన సీతక్క 2017లో కాంగ్రెస్ లోకి చేరారు. 2019 ఎన్నిక్షల్లో గెలిచినా టిఆర్ఎస్ ప్రభుత్వం ఎంతవరకు సహకరిస్తుందో తెలియని పరిస్థితి. ఇక కరోనా సమయంలో అందరూ ఇళ్ళకే పరిమితం అయితే తాను మాత్రం టిఆర్ఎస్ ప్రభుత్వ సహాయం లేకున్నా తన నియోజకవర్గంలో గ్రామాలను తిరుగుతూ ఎంతోమందికి ఆహారం, నిత్యావసర వస్తువులను అందజేసి ఎమ్మెల్యే బాధ్యతలు ఏమిటో తెలియజేసారు. ఆలా నేడు తెలంగాణ కాంగ్రెస్ మహిళా ఇంచార్జ్ గా ఉంటూనే ఎమ్మెల్యేగా మరోసారి గెలిచి నేడు డిప్యూటీ సీఎం రేస్ లో నిలిచారు. తన బాధ్యతలను నిర్వర్తిస్తూనే ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాలోని గోత్తి కోయ గిరిజనుల జీవన స్థితిగతుల మీద పరిశోధనలకు గౌరవ డాక్టరేట్ పొందారు. అలా నక్సలైట్ జీవితం నుండి లాయర్ గా మారి ఆపైన ఎమ్మెల్యే అయిన ఆమె జీవితం ఎందరికో ఆదర్శం.

Continue Reading
Advertisement

Featured

Niharika: యుద్ధం గెలిచిన రాముడు అయోధ్యకు వచ్చినట్టు ఉంది… బాబాయ్ పై నిహారిక కామెంట్స్!

Published

on

Niharika: నిహారిక కొణిదెల పరిచయం అవసరం లేని పేరు. ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీలో నిర్మాతగా నటిగా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు. తన భర్త నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన నిహారిక తిరిగి కెరియర్ పై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే నిర్మాతగా కూడా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇక నిహారిక నిర్మాణంలో తెరకెక్కిన కమిటీ కుర్రోళ్ళు సినిమా ఆగస్టు 9వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈమె ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆహాలో ప్రసారమవుతున్న సర్కార్ సక్సెస్ సెలబ్రేషన్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.

ఇక ఈ ప్రోమోలో భాగంగా నిహారిక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ నేను వచ్చేది ఎప్పుడు నెక్స్ట్ సీజనా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సుడిగాలి సుదీర్ రెస్పాండ్ అవుతూ మీకేంటండి మీరు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలూకా అంటూ మాట్లాడారు. అనంతరం పవన్ కళ్యాణ్ విజయం సాధించిన తర్వాత చిరంజీవి ఇంటికి వచ్చి ఆశీర్వాదం తీసుకున్న వీడియో ఎంతలా వైరల్ అయిందో మనకు తెలిసిందే .ఇక ఈ వీడియోని ప్లే చేశారు.

Advertisement

యుద్ధం గెలిచిన రాముడు…
ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది అంటూ నిహారికను ప్రశ్నించారు. ఇక నిహారిక ఈ వీడియో గురించి మాట్లాడుతూ యుద్ధం గెలిచిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకు వచ్చినప్పుడు కూడా ఇలాగే ఉండేదేమో అనిపించింది అంటూ తన బాబాయ్ విజయం గురించి నిహారిక మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Anasuya: ఇకపై రంగమ్మత్త లాంటి పాత్రలు అసలు చేయను.. గ్లామర్ పాత్రలకు సై అంటున్న అనసూయ?

Published

on

Anasuya: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు. ఈమె జబర్దస్త్ యాంకర్ గా బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ అందుకొని అనంతరం వెండి తెరపై సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా వెండితెరపై వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న అనసూయ తిరిగి బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈమె స్టార్ మా లో ప్రసారమవుతున్న కిరాక్ బాయ్స్ కిలాడి లేడీస్ అనే కార్యక్రమంలో సందడి చేస్తున్నారు. ఇలా ఒక వైపు బుల్లితెర కార్యక్రమాలు మరోవైపు వెండితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్న అనసూయ త్వరలోనే సింబా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ఈమె మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఇటీవల కాలంలో మీరు చాలా సినిమాలను రిజెక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది కారణం ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ తాను సినిమాలు రిజెక్ట్ చేస్తున్న మాట నిజమేనని తెలిపారు. నేను ఒక సినిమాలో నటించిన పాత్ర హిట్ అవడంతో తదుపరి సినిమాలలో కూడా అలాంటి పాత్రలలో నటించే అవకాశం వస్తుందని తెలిపారు.

Advertisement

రంగమ్మత్త..
ఇలా ఒక పాత్రలో నటించిన తర్వాత తిరిగి అలాంటి పాత్రలలో నటించిన ప్రేక్షకులు పెద్దగా తీసుకోలేరు ఉదాహరణకు రంగమ్మత్త పాత్ర చాలా హైలెట్ అయింది. తదుపరి అలాంటి పాత్రలు వస్తే నేను చెయ్యను నేను అన్ని చాలా డిఫరెంట్ గా ఉండేలా చేయాలని భావిస్తున్నాను. ఇక ఎక్కువగా తాను గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా అనసూయ గ్లామర్ రోల్ చేయడానికి సై అంటూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Mahesh Babu: మహేష్ రాజమౌళి సినిమా టైటిల్ లీక్… సినిమా పేరు ఏంటో తెలుసా?

Published

on

Mahesh Babu: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా జరుగబోతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన కూడా తెలియజేయబోతున్నారు.

ఇక ఈ సినిమాలో మహేష్ బాబు చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు మొదటిసారి వర్క్ షాప్ లో కూడా పాల్గొనబోతున్నారని సమాచారం.

ఇప్పటివరకు మహేష్ బాబు ఏ సినిమా కోసం ఇలా వర్క్ షాప్ లో పాల్గొనలేదు మొదటిసారి రాజమౌళి సినిమా కోసం పాల్గొనబోతున్న నేపథ్యంలో ఈయన కూడా ఈ సినిమా విషయంలో చాలా ఆతృత కనబరుస్తున్నారు. ఇకపోతే తాజాగా మహేష్ బాబు రాజమౌళి సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

గోల్డ్..
తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమాకు సంబంధించి ఓ టైటిల్ సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమా టైటిల్ కూడా అందుకు అనుగుణంగానే ఉండాలి. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం గోల్డ్ అనే టైటిల్ పెట్టబోతున్నారంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఈ సినిమా టైటిల్ గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం వైరల్ అవుతుంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!