Connect with us

Featured

పవన్ నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు! (సోషల్ మీడియాలో వైరలవుతున్న రేణూ దేశాయ్ కామెంట్స్)

Published

on

రేణు దేశాయ్ మహారాష్ట్ర లోని పూణెలో స్థిరపడ్డ గుజరాతీ కుటుంబంలో 1981 డిసెంబర్ 4 న జన్మించింది. ఆమె మొదట మోడల్‌గా తన కెరీర్ ను ప్రారంభించింది. 2000లో పార్థిబన్ హీరోగా తమిళంలో తెరకెక్కిన జేమ్స్ పాండు చిత్రం ద్వారా ఆమె సినిమా రంగ ప్రవేశం చేశారు.

అదే ఏడాది పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో రూపొందిన ‘బద్రి’ చిత్రంలో హీరో పవన్ కళ్యాణ్ సరసన నటించారు. ఆ చిత్ర నిర్మాణ సమయంలోనే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ప్రేమకు బీజం పడింది. ఆ తరువాత వారి సహ జీవనం మొదలైంది. పవన్ తో సహజీవనం మొదలైన తరువాత రేణు దేశాయ్ సినిమాలలో నటించలేదు. మళ్లీ 2003లో పవన్ తోనే ‘జానీ’ సినిమాలో నటించింది. 2004లో వీరిద్దరికి పెళ్ళి కాకముందే అబ్బాయి అకీరా నందన్ పుట్టాడు. 2009లో వీరిద్దరూ పెద్దలు, తమ పిల్లవాడి సమక్షంలో పెళ్ళి చేసుకున్నారు. ఆ తర్వాత వారికి కూతురు ఆద్యా పుట్టింది. ఇక ఆ తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల ఇద్దరు విడిపోయారు. 

ఇక అసలు విషయానికొస్తే.. రేణూ దేశాయ్‌ ఈమధ్య సోషల్‌ మీడియాలో ఓ ముఖ్యమైన పోస్టును షేర్ చేశారు. రేణూ దేశాయ్‌ కోసం పవన్‌ కల్యాణ్‌ స్వయంగా హైదరాబాద్‌లో ఖరీదైన ఇల్లు కొనిచ్చారంటూ గతంలో రూమర్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో చాలామంది ఫ్రెండ్స్, ఫ్యాన్స్ ఈ అంశంపై రేణూకు తెగ ఫోన్లు చేసి విసిగిస్తున్నారు. దాంతో ఆ రూమర్స్ కు చెక్ పెడుతూ రేణూ తన ఫేస్‌బుక్‌ ఖాతాలో ఒక పోస్టును షేర్ చేశారు. “తన కష్టార్జితంతో హైదరాబాద్‌ లో ఓ ప్లాట్‌ కొనుకున్నానని, ఇలాంటి అవాస్తవాలను ప్రచారం చేయొద్దని, ఒక వ్యక్తి నిజమైన ఆస్తి తన ఆత్మ గౌరవం.. ఒక వ్యక్తి నిజమైన ఆస్తి తన నిజాయతీ.. ఒక వ్యక్తి నిజమైన ఆస్తి తన అస్తిత్వం అన్న సంగతి మీకు తెలియదా.? నేను, నా జీవన భృతి కోసం ఒంటరిగా, తీవ్రంగా, ఎంతగానో కష్టపడున్నాను. పోరాడుతున్నాను. ఇప్పటి వరకూ కనీసం మా తండ్రి దగ్గర్నుంచి కూడా ఏ రకమైన ఆర్థిక సహాయాన్ని నేను ఆశించలేదు, తీసుకోలేదు. అలాగే, నా మాజీ భర్త పవన్ దగ్గర్నుంచి కూడా ఎలాంటి భరణాన్నీ ఆశించలేదు, తీసుకోలేదు. అది నా వ్యక్తిత్వం!! అయినా మీరు నా గురించి ఇలా అన్యాయంగా, అసంబద్ధమైన అబద్ధపు రూమర్స్ ను ప్రచారం చేస్తూనే ఉన్నారు! మీరందరూ అనుకుంటున్నట్లుగా ఇప్పుడు హైదరాబాద్‌లో నేను కొన్న ఫ్లాట్ నిజంగా మాకెవరూ కొనివ్వలేదు. అది నా కష్టార్జితంతో ఒక్కో రూపాయి కూడబెట్టుకుని కొనుక్కున్న నా సొంత ఇల్లు. అది నా మాజీ భర్త మాకు కొనిచ్చారన్న అసత్య ప్రచారాల వల్ల నా నిజాయతీ, ఆత్మగౌరవం, చివరికి నా ఉనికికే ప్రమాదం సంభవిస్తుందనే చిన్న ఆలోచన మీకెవ్వరికీ రాలేదా?? దయచేసి ఆలోచించండి.

అంతెందుకు.. పవన్ నటించిన ‘ఖుషీ’ సినిమాలోని ఏ మేరా జహా పాట అందరికీ తెలుసు.. దర్శకుడు ఎస్‌జే సూర్య ఈ పాటను 20 నిమిషాల రష్ షూట్ చేసాడు. ఆ పాటను 5 నిమిషాలకు కట్ చేయడానికి ఎడిటర్ మార్తండ్ కే వెంకటేష్ ట్రై చేస్తుంటే.. హిందీ తెలిసిన నేను ఆ పాటను 5 నిమిషాల వరకు ఎడిట్ చేసాను. ఆ టైంలో నాకు ఇచ్చిన రెమ్యునరేషన్ జీరో. ఇలా పవన్ కళ్యాణ్ సినిమాలకు ఎప్పుడు పని చేసినా కూడా నాకు వచ్చిందేమీ లేదు. నాకు ఒక్క రూపాయి కూడా ఎవరూ ఇవ్వలేదు. పవన్‌తో కలిసున్నపుడు ఆయన నటించిన సినిమాలకు చాలా వరకు ఎడిటర్‌గా కూడా వర్క్ చేశాను. కానీ ఫ్రీగానే చేసాను. నేను వర్క్ చేసిన చిత్రాలలో నా పేరు పడలేదు కాబట్టి ఎవరికీ నా టాలెంట్ తెలియలేదు. జీవితంలో ఇప్పటి వరకూ ఏ మగవాడి సాయం లేకుండా ముందుకు సాగుతున్న నాలాంటి ఒంటరి తల్లి జీవన పోరాటానికీ గౌరవం ఇవ్వకపోయినా ఫర్వాలేదు కానీ.. దయచేసి, ఇలా కించపరచకండి. నేను మీతో పంచుకుంటున్న ఈ బాధను సరిగ్గా అర్థం చేసుకోకుండా మళ్లీ నాకూ, నా మాజీ భర్త పవన్ ఫ్యాన్స్ కు మధ్య, దయచేసి ఎలాంటి గొడవలు సృష్టించకండి” అని అభ్యర్ధించింది రేణూదేశాయ్.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Niharika: యుద్ధం గెలిచిన రాముడు అయోధ్యకు వచ్చినట్టు ఉంది… బాబాయ్ పై నిహారిక కామెంట్స్!

Published

on

Niharika: నిహారిక కొణిదెల పరిచయం అవసరం లేని పేరు. ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీలో నిర్మాతగా నటిగా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు. తన భర్త నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన నిహారిక తిరిగి కెరియర్ పై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే నిర్మాతగా కూడా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇక నిహారిక నిర్మాణంలో తెరకెక్కిన కమిటీ కుర్రోళ్ళు సినిమా ఆగస్టు 9వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈమె ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆహాలో ప్రసారమవుతున్న సర్కార్ సక్సెస్ సెలబ్రేషన్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.

ఇక ఈ ప్రోమోలో భాగంగా నిహారిక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ నేను వచ్చేది ఎప్పుడు నెక్స్ట్ సీజనా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సుడిగాలి సుదీర్ రెస్పాండ్ అవుతూ మీకేంటండి మీరు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలూకా అంటూ మాట్లాడారు. అనంతరం పవన్ కళ్యాణ్ విజయం సాధించిన తర్వాత చిరంజీవి ఇంటికి వచ్చి ఆశీర్వాదం తీసుకున్న వీడియో ఎంతలా వైరల్ అయిందో మనకు తెలిసిందే .ఇక ఈ వీడియోని ప్లే చేశారు.

Advertisement

యుద్ధం గెలిచిన రాముడు…
ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది అంటూ నిహారికను ప్రశ్నించారు. ఇక నిహారిక ఈ వీడియో గురించి మాట్లాడుతూ యుద్ధం గెలిచిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకు వచ్చినప్పుడు కూడా ఇలాగే ఉండేదేమో అనిపించింది అంటూ తన బాబాయ్ విజయం గురించి నిహారిక మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Anasuya: ఇకపై రంగమ్మత్త లాంటి పాత్రలు అసలు చేయను.. గ్లామర్ పాత్రలకు సై అంటున్న అనసూయ?

Published

on

Anasuya: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు. ఈమె జబర్దస్త్ యాంకర్ గా బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ అందుకొని అనంతరం వెండి తెరపై సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా వెండితెరపై వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న అనసూయ తిరిగి బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈమె స్టార్ మా లో ప్రసారమవుతున్న కిరాక్ బాయ్స్ కిలాడి లేడీస్ అనే కార్యక్రమంలో సందడి చేస్తున్నారు. ఇలా ఒక వైపు బుల్లితెర కార్యక్రమాలు మరోవైపు వెండితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్న అనసూయ త్వరలోనే సింబా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ఈమె మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఇటీవల కాలంలో మీరు చాలా సినిమాలను రిజెక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది కారణం ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ తాను సినిమాలు రిజెక్ట్ చేస్తున్న మాట నిజమేనని తెలిపారు. నేను ఒక సినిమాలో నటించిన పాత్ర హిట్ అవడంతో తదుపరి సినిమాలలో కూడా అలాంటి పాత్రలలో నటించే అవకాశం వస్తుందని తెలిపారు.

Advertisement

రంగమ్మత్త..
ఇలా ఒక పాత్రలో నటించిన తర్వాత తిరిగి అలాంటి పాత్రలలో నటించిన ప్రేక్షకులు పెద్దగా తీసుకోలేరు ఉదాహరణకు రంగమ్మత్త పాత్ర చాలా హైలెట్ అయింది. తదుపరి అలాంటి పాత్రలు వస్తే నేను చెయ్యను నేను అన్ని చాలా డిఫరెంట్ గా ఉండేలా చేయాలని భావిస్తున్నాను. ఇక ఎక్కువగా తాను గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా అనసూయ గ్లామర్ రోల్ చేయడానికి సై అంటూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Mahesh Babu: మహేష్ రాజమౌళి సినిమా టైటిల్ లీక్… సినిమా పేరు ఏంటో తెలుసా?

Published

on

Mahesh Babu: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా జరుగబోతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన కూడా తెలియజేయబోతున్నారు.

ఇక ఈ సినిమాలో మహేష్ బాబు చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు మొదటిసారి వర్క్ షాప్ లో కూడా పాల్గొనబోతున్నారని సమాచారం.

ఇప్పటివరకు మహేష్ బాబు ఏ సినిమా కోసం ఇలా వర్క్ షాప్ లో పాల్గొనలేదు మొదటిసారి రాజమౌళి సినిమా కోసం పాల్గొనబోతున్న నేపథ్యంలో ఈయన కూడా ఈ సినిమా విషయంలో చాలా ఆతృత కనబరుస్తున్నారు. ఇకపోతే తాజాగా మహేష్ బాబు రాజమౌళి సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

గోల్డ్..
తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమాకు సంబంధించి ఓ టైటిల్ సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమా టైటిల్ కూడా అందుకు అనుగుణంగానే ఉండాలి. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం గోల్డ్ అనే టైటిల్ పెట్టబోతున్నారంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఈ సినిమా టైటిల్ గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం వైరల్ అవుతుంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!