Connect with us

Featured

Senior Journalist Bharadwaja : చిరంజీవి, బాలకృష్ణ మధ్య గొడవలు నిజమేనా?? బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగినపుడు అల్లు అరవింద్, చిరంజీవి ఏం చేసారు…: సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ

Published

on

Senior Journalist Bharadwaja : మల్టీ స్టారర్ సినిమాలంటే పాత తరం హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణం రాజు వీరి టైములో ఎలాంటి ఇబ్బందిలు లేకుండా ఎన్నో సినిమాలు వచ్చాయి. ఒకానొక టైములో ఇగో క్లాష్ వచ్చినా కూడా ఇద్దరు హీరోలు కలిసి నటించేవారు. అయితే తరువాత వచ్చిన హీరోల్లో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వీరు మాత్రం మల్టీ స్టారర్ సినిమాలను చేయలేదు. దీనికి ప్రధాన కారణం హీరో ఫ్యాన్స్ కి మధ్య ఉన్న అభిప్రాయ బేధాలు. చాలా మటుకు ఇగో ఇబ్బందులకు వాళ్లే ఏ డైరెక్టర్ ఇద్దరు అగ్రహీరోలను కలిపి సినిమా తీసే సాహాసం చేయలేదు. ఇక రీసెంట్ గా అన్ స్టాపబుల్ షోలో ఇటీవల అల్లు అరవింద్ బాలయ్య, చిరు కాంబినేషన్ లో సినిమా చేయడం కల అంటూ చెప్పడంతో మళ్ళీ వీరి కాంబినేషన్ లో మల్టీ స్టారర్ గురించి చర్చలు మొదలయ్యాయి. దీంతో ఈ విషయాల గురించి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఆయన అభిప్రాయాలను పంచుకున్నారు.

చిరు, బాలయ్య మధ్యలో గొడవలు…

చిరంజీవి, బాకృష్ణ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా చేయాలని కోదండ రామి రెడ్డి ప్రయత్నించినా, ఆ ఇద్దరు హీరోలు సుముఖంగా ఉన్నా ఎందుకో అది జరగలేదు. అయితే వారి మధ్య ఎప్పుడు ఎలాంటి అభిప్రాయ బేధాలు లేవు, కేవలం ఫ్యాన్స్ మధ్య ఉన్నాయి అంటూ భరద్వాజ గారు అభిప్రాయపడ్డారు. బాలకృష్ణ ఇంట్లో బెల్లం కొండ సురేష్ మీద జరిగిన కాల్పుల ఘటన సమయంలో కూడా బాలకృష్ణ ను హాస్పిటల్ కు తరలించాక చాలా సేపు అల్లు అరవింద్, చిరంజీవి, బాలకృష్ణ దగ్గరే ఉన్నారు. ఈ విషయం అప్పుడు దిన పత్రికలను ఎక్కువగా ఫాలో అయిన అందరికీ తెలిసిన విషయమే అంటూ చెప్పారు భరద్వాజ గారు. ఇక ఇప్పుడు అల్లు అరవింద్ మీ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా తీయాలని ఉంది అన్నారు.

Advertisement

ఇక బాలకృష్ణ అది పాన్ వరల్డ్ సినిమా అవుతుంది అని చెప్పడం మీద భరద్వాజ గారు మాట్లాడుతూ వీళ్ళిద్దరినీ హ్యాండిల్ చేయగల డైరెక్టర్ కథ రెండు దొరికితే ఖచ్చితంగా అది పాన్ వరల్డ్ ప్రొజెక్ట్ అవుతుంది అంటూ చెప్పారు. రాజమౌళి ఆల్రడీ ఆర్ఆర్ఆర్ తీసి చరణ్, తారక్ ను కలిపి సినిమా చేసారు కాబట్టి ఆయనకు బాలయ్య, చిరంజీవితో సినిమాలను చేయాలని ఉందని చెప్పారు కాబట్టి మంచికథ సిద్ధం చేస్తే ఖచ్చితంగా వాళ్లిద్దరూ చేస్తారు ఇక ఆ సినిమా ఖచ్చితంగా మంచి క్రేజీ ప్రొజెక్ట్ అవుతుంది అంటూ చెప్పారు.

Continue Reading
Advertisement

Featured

ITR FIling : గడువు పెంచలేదు.. ఫేక్ న్యూస్ నమ్మొద్దు.. “జూలై 31వ తేదీలోపు మీ ITR ఫైల్ చేయండి”.. కీలక ప్రకటన చేసిన ఐటీ శాఖ

Published

on

ITR ఫైలింగ్ : పన్ను చెల్లింపుదారులకు ముఖ్యమైన గమనిక. మీరు FY 2023-2024 కోసం మీ ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఇంకా ఫైల్ చేయలేదా? ఆదాయపు పన్ను శాఖ మరో కీలక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నెల 31లోగా ఐటీ రిటర్నులు సమర్పించాలని కోరింది ఐటీ శాఖ. మరో నెల రోజులు గడువు పెంపుపై వస్తున్న వార్తల్లో నిజం లేదని తేలింది. పన్ను చెల్లింపుదారులు ఇలాంటి ఫేక్ న్యూస్ నమ్మవద్దని సోషల్ మీడియా ఎక్స్ లో సూచించింది.

గడువు 4 రోజులు మాత్రమే. జూలై 31వ తేదీలోపు ITR ఫైల్ చేయాలి. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ వీలైనంత త్వరగా రిటర్నులు సమర్పించాలని ఐటీ శాఖ సూచించింది. పన్ను పోర్టల్ లో ఎటువంటి సాంకేతిక సమస్య లేదు. మీరు గడువు సమయంలోపు ITR ఫైల్ చేయకపోతే, మీరు సెక్షన్ 234A కింద వడ్డీని మరియు ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 234F కింద జరిమానా చెల్లించవలసి ఉంటుంది.

మరోవైపు ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేసి వాపసు కోరుతున్న వారిని కూడా ఐటీ శాఖ హెచ్చరించింది. సైబర్ నేరగాళ్లు ఫోన్లలో మెసేజ్ లు పంపుతూ మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిసిందని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. ఇలాంటి ఫేక్ మెసేజ్‌లను చూసి మోసపోకండి మరియు రీఫండ్ కోసం మీ బ్యాంక్ ఖాతా వివరాలు మరియు వన్-టైమ్ పాస్‌వర్డ్‌లను అడుగుతూ మీకు కాల్ వస్తే అప్రమత్తంగా ఉండండి. అటువంటి లింక్‌లపై క్లిక్ చేయవద్దు. ఇప్పటి వరకు 5 కోట్ల మంది పన్ను రిటర్నులు దాఖలు చేసినట్లు గుర్తించింది. వీరిలో ఇప్పటికే 1.8 మిలియన్ల రిటర్న్‌లు ప్రాసెస్ చేయబడి, రీఫండ్ ఖాతాలకు జమ అయినట్లు కూడా తెలిపింది.

Advertisement

Continue Reading

Featured

Niharika: యుద్ధం గెలిచిన రాముడు అయోధ్యకు వచ్చినట్టు ఉంది… బాబాయ్ పై నిహారిక కామెంట్స్!

Published

on

Niharika: నిహారిక కొణిదెల పరిచయం అవసరం లేని పేరు. ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీలో నిర్మాతగా నటిగా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు. తన భర్త నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన నిహారిక తిరిగి కెరియర్ పై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే నిర్మాతగా కూడా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇక నిహారిక నిర్మాణంలో తెరకెక్కిన కమిటీ కుర్రోళ్ళు సినిమా ఆగస్టు 9వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈమె ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆహాలో ప్రసారమవుతున్న సర్కార్ సక్సెస్ సెలబ్రేషన్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.

ఇక ఈ ప్రోమోలో భాగంగా నిహారిక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ నేను వచ్చేది ఎప్పుడు నెక్స్ట్ సీజనా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సుడిగాలి సుదీర్ రెస్పాండ్ అవుతూ మీకేంటండి మీరు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలూకా అంటూ మాట్లాడారు. అనంతరం పవన్ కళ్యాణ్ విజయం సాధించిన తర్వాత చిరంజీవి ఇంటికి వచ్చి ఆశీర్వాదం తీసుకున్న వీడియో ఎంతలా వైరల్ అయిందో మనకు తెలిసిందే .ఇక ఈ వీడియోని ప్లే చేశారు.

Advertisement

యుద్ధం గెలిచిన రాముడు…
ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది అంటూ నిహారికను ప్రశ్నించారు. ఇక నిహారిక ఈ వీడియో గురించి మాట్లాడుతూ యుద్ధం గెలిచిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకు వచ్చినప్పుడు కూడా ఇలాగే ఉండేదేమో అనిపించింది అంటూ తన బాబాయ్ విజయం గురించి నిహారిక మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Anasuya: ఇకపై రంగమ్మత్త లాంటి పాత్రలు అసలు చేయను.. గ్లామర్ పాత్రలకు సై అంటున్న అనసూయ?

Published

on

Anasuya: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు. ఈమె జబర్దస్త్ యాంకర్ గా బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ అందుకొని అనంతరం వెండి తెరపై సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా వెండితెరపై వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న అనసూయ తిరిగి బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈమె స్టార్ మా లో ప్రసారమవుతున్న కిరాక్ బాయ్స్ కిలాడి లేడీస్ అనే కార్యక్రమంలో సందడి చేస్తున్నారు. ఇలా ఒక వైపు బుల్లితెర కార్యక్రమాలు మరోవైపు వెండితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్న అనసూయ త్వరలోనే సింబా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ఈమె మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఇటీవల కాలంలో మీరు చాలా సినిమాలను రిజెక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది కారణం ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ తాను సినిమాలు రిజెక్ట్ చేస్తున్న మాట నిజమేనని తెలిపారు. నేను ఒక సినిమాలో నటించిన పాత్ర హిట్ అవడంతో తదుపరి సినిమాలలో కూడా అలాంటి పాత్రలలో నటించే అవకాశం వస్తుందని తెలిపారు.

Advertisement

రంగమ్మత్త..
ఇలా ఒక పాత్రలో నటించిన తర్వాత తిరిగి అలాంటి పాత్రలలో నటించిన ప్రేక్షకులు పెద్దగా తీసుకోలేరు ఉదాహరణకు రంగమ్మత్త పాత్ర చాలా హైలెట్ అయింది. తదుపరి అలాంటి పాత్రలు వస్తే నేను చెయ్యను నేను అన్ని చాలా డిఫరెంట్ గా ఉండేలా చేయాలని భావిస్తున్నాను. ఇక ఎక్కువగా తాను గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా అనసూయ గ్లామర్ రోల్ చేయడానికి సై అంటూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!