Connect with us

Featured

బాలు ఆరోగ్యంపై శ్రద్ద వహించిన తమిళనాడు ప్రభుత్వం !

Published

on

గాన గంధర్వులు, పద్మభూషణ్ డాక్టర్ శ్రీ పండితారాధ్యుల బాల సుబ్రహ్మణ్యం గారి ఆరోగ్యం త్వరితగతిన మెరుగు పరిచే ప్రయత్నంలో తమిళనాడు ప్రభుత్వం చురుగ్గా వున్నట్లుగా, తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని MGM హెల్త్ కేర్ వైద్యశాలలో బాలుగారికి చికిత్స చేయిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

ఆదివారం బాలు గారి కోసం MGM హెల్త్ కేర్ హాస్పిటల్ లో ప్రత్యేకంగా ఒక ఐసోలేషన్ రూమును రూపొందించినట్లు, ఆదివారం చెన్నైలో సంపూర్ణ లాక్ డౌన్ అయినా ముఖ్యమంత్రి చొరవతో ఐసోలేషన్ రూమును కావలసిన సామాగ్రి అంతా బయట నుండి వాహనాల్లో రప్పించ్చారని, అలాగే MGM లో కరోనా చికిత్స కోసం బాలు గారు చేరారన్న వార్త చెవిలో పడ్డప్పటి నుండి భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు యాజమాన్యంతో మాట్లాడుతూ బాలు ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకొంటున్నారని తెలిసింది. గతంలో చెన్నైలోని MGM హెల్త్ కేర్ ను వెంకయ్యనాయుడు చేతుల మీదుగానే ప్రారంభించబడడం విశేషం.

వెంకయ్యనాయుడు సూచనల మేరకు ప్రత్యేక ఐసోలేషన్ ను – హాస్పిటల్ లో యాజమాన్యం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిసింది. ఔ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ గారి కార్యాలయం ఎప్పటికప్పుడు బాలు గారి ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ బులిటెన్స్ తెప్పించుకొని పరిశీలిస్తున్నట్లు కూడా వార్తలు అందుతున్నాయి. ఈ సందర్భంగా మరోవైపు కర్ణాటక ప్రభుత్వం కూడా బాలసుబ్రహ్మణ్యం గారి ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది . కన్నడ గాయకుడిగా బాలు గారు ఎంత ఖ్యాతి గడించాడన్నది ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.

ఇదిలావుండగా.. కేంద్ర ప్రభుత్వం , పొరుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు గాన గంధర్వులు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గారి ఆరోగ్యానికి సంబంధించిన వివరాలు సేకరిస్తుంటే.. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ , ఆంద్రప్రదేశ్ లకు చెందిన తెలుగు ముఖ్యమంత్రులు K.చంద్రశేఖర రావు గాని, Y.s జగన్ గాని నేటికి కూడా బాలు గారి ఆరోగ్యం గురించిన వివరాలను ఫోన్లో వాకబు చేయకపోవడం దురదృష్టకరమని చెప్పవచ్చు. బాలుగారికి కరోనా పాజిటివ్ సోకిన క్రమంలో “మా నాన్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, మి అమ్మ సావిత్రి గారి ఆరోగ్యాలు మెరుగవుతున్నాయి” అని ఆయన కుమారుడు చరణ్ బాబు ప్రకటించినప్పటి నుండి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంగీతప్రియులు, బాలు గారి అభిమానుల వదనాల్లో ఆనందం వ్యక్తమౌతుంది.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Niharika: యుద్ధం గెలిచిన రాముడు అయోధ్యకు వచ్చినట్టు ఉంది… బాబాయ్ పై నిహారిక కామెంట్స్!

Published

on

Niharika: నిహారిక కొణిదెల పరిచయం అవసరం లేని పేరు. ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీలో నిర్మాతగా నటిగా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు. తన భర్త నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన నిహారిక తిరిగి కెరియర్ పై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే నిర్మాతగా కూడా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇక నిహారిక నిర్మాణంలో తెరకెక్కిన కమిటీ కుర్రోళ్ళు సినిమా ఆగస్టు 9వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈమె ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆహాలో ప్రసారమవుతున్న సర్కార్ సక్సెస్ సెలబ్రేషన్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.

ఇక ఈ ప్రోమోలో భాగంగా నిహారిక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ నేను వచ్చేది ఎప్పుడు నెక్స్ట్ సీజనా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సుడిగాలి సుదీర్ రెస్పాండ్ అవుతూ మీకేంటండి మీరు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలూకా అంటూ మాట్లాడారు. అనంతరం పవన్ కళ్యాణ్ విజయం సాధించిన తర్వాత చిరంజీవి ఇంటికి వచ్చి ఆశీర్వాదం తీసుకున్న వీడియో ఎంతలా వైరల్ అయిందో మనకు తెలిసిందే .ఇక ఈ వీడియోని ప్లే చేశారు.

Advertisement

యుద్ధం గెలిచిన రాముడు…
ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది అంటూ నిహారికను ప్రశ్నించారు. ఇక నిహారిక ఈ వీడియో గురించి మాట్లాడుతూ యుద్ధం గెలిచిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకు వచ్చినప్పుడు కూడా ఇలాగే ఉండేదేమో అనిపించింది అంటూ తన బాబాయ్ విజయం గురించి నిహారిక మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Anasuya: ఇకపై రంగమ్మత్త లాంటి పాత్రలు అసలు చేయను.. గ్లామర్ పాత్రలకు సై అంటున్న అనసూయ?

Published

on

Anasuya: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు. ఈమె జబర్దస్త్ యాంకర్ గా బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ అందుకొని అనంతరం వెండి తెరపై సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా వెండితెరపై వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న అనసూయ తిరిగి బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈమె స్టార్ మా లో ప్రసారమవుతున్న కిరాక్ బాయ్స్ కిలాడి లేడీస్ అనే కార్యక్రమంలో సందడి చేస్తున్నారు. ఇలా ఒక వైపు బుల్లితెర కార్యక్రమాలు మరోవైపు వెండితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్న అనసూయ త్వరలోనే సింబా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ఈమె మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఇటీవల కాలంలో మీరు చాలా సినిమాలను రిజెక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది కారణం ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ తాను సినిమాలు రిజెక్ట్ చేస్తున్న మాట నిజమేనని తెలిపారు. నేను ఒక సినిమాలో నటించిన పాత్ర హిట్ అవడంతో తదుపరి సినిమాలలో కూడా అలాంటి పాత్రలలో నటించే అవకాశం వస్తుందని తెలిపారు.

Advertisement

రంగమ్మత్త..
ఇలా ఒక పాత్రలో నటించిన తర్వాత తిరిగి అలాంటి పాత్రలలో నటించిన ప్రేక్షకులు పెద్దగా తీసుకోలేరు ఉదాహరణకు రంగమ్మత్త పాత్ర చాలా హైలెట్ అయింది. తదుపరి అలాంటి పాత్రలు వస్తే నేను చెయ్యను నేను అన్ని చాలా డిఫరెంట్ గా ఉండేలా చేయాలని భావిస్తున్నాను. ఇక ఎక్కువగా తాను గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా అనసూయ గ్లామర్ రోల్ చేయడానికి సై అంటూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Mahesh Babu: మహేష్ రాజమౌళి సినిమా టైటిల్ లీక్… సినిమా పేరు ఏంటో తెలుసా?

Published

on

Mahesh Babu: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా జరుగబోతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన కూడా తెలియజేయబోతున్నారు.

ఇక ఈ సినిమాలో మహేష్ బాబు చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు మొదటిసారి వర్క్ షాప్ లో కూడా పాల్గొనబోతున్నారని సమాచారం.

ఇప్పటివరకు మహేష్ బాబు ఏ సినిమా కోసం ఇలా వర్క్ షాప్ లో పాల్గొనలేదు మొదటిసారి రాజమౌళి సినిమా కోసం పాల్గొనబోతున్న నేపథ్యంలో ఈయన కూడా ఈ సినిమా విషయంలో చాలా ఆతృత కనబరుస్తున్నారు. ఇకపోతే తాజాగా మహేష్ బాబు రాజమౌళి సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

గోల్డ్..
తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమాకు సంబంధించి ఓ టైటిల్ సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమా టైటిల్ కూడా అందుకు అనుగుణంగానే ఉండాలి. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం గోల్డ్ అనే టైటిల్ పెట్టబోతున్నారంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఈ సినిమా టైటిల్ గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం వైరల్ అవుతుంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!