Connect with us

Featured

మీకు స్మార్ట్ ఫోన్ ఉందా.. అయితే నెలకు ఇలా రూ.30 వేలు సంపాదించండి..

ప్రస్తతం ప్రతీ ఒక్కరికీ స్మార్ట్ ఉంటుంది. అయితే స్మార్ట్ ఫోన్ ఉన్న వాళ్లు ఆన్ లైన్ బిజినెస్ చేస్తూ సింపుల్ గా నెలకు రూ.30 వేలు సంపాదించవచ్చు.

Published

on

ప్రస్తతం ప్రతీ ఒక్కరికీ స్మార్ట్ ఉంటుంది. అయితే స్మార్ట్ ఫోన్ ఉన్న వాళ్లు ఆన్ లైన్ బిజినెస్ చేస్తూ సింపుల్ గా నెలకు రూ.30 వేలు సంపాదించవచ్చు. దానికి మన దగ్గర కాస్తంత తెలివి, టాలెంట్ ఉంటే చాలు. ఫ్లిప్‌కార్ట్ కొత్తగా ప్రారంభించిన Shopsy ప్లాట్‌ఫామ్ ద్వారా ఇది సాధ్యం. ఎలాంటి పెట్టుబడి లేకుండా వ్యాపారం చేయండి అంటూ పిలుపునిస్తోంది షాప్సీ ప్లాట్‌ఫామ్.

Advertisement

ఇందులో ఆ సంస్థకు సంబంధించిన పలు రకాలు ప్రొడక్ట్స్ డిస్ ప్లే అవుతూ ఉంటాయి. అందులో మనం స్నేహితులు, బంధువులకు రికమండ్ చేసి వాళ్లు అందులో ఏదైనా నచ్చినట్లు చెబితే దానిని ఆర్డర్ పెట్టి సింపుల్ గా డబ్బులను సంపాదించవచ్చు. ఇది కేవలం మెట్రో నగరాలకే పరిమితం కాకుండా ప్రతీ పట్టణానికి, నగరానికి చేరువ చేసేలా షాప్సీ ప్లాట్ ఫామ్ ను ప్రారంభించింది. 2.5 కోట్ల మంది ఆన్‌లైన్ ఆంట్రప్రెన్యూర్లను 2023 నాటికి దీనిలో చేర్చుకోవాలనే లక్షంగా పెట్టుకుంది ఫ్లిప్ కార్ట్. ఎవరైనా సరే ఇందులో రిజిస్టర్ అయి మన వ్యాపారాన్ని ప్రారంభించొచ్చు.

దీనిలో రిజిస్టర్ అవ్వాలంటే మన దగ్గర ఎలాంటి ప్రూప్స్ ఉండాల్సిన అవసరం లేదు. కేవలం ఫోన్ నెంబర్ ఉంటే చాలు. ఆ తర్వాత అందులో కనిపించే ప్రొడక్ట్స్‌ని వాట్సప్ లాంటి మెసేజింగ్ యాప్స్, ఫేస్‌బుక్ లాంటి సోషల్ మీడియా యాప్స్‌లో షేర్ చేస్తూ ఉండాలి. అందులో వారికి నచ్చిన ప్రొడక్ట్ ను మనం ఆర్డర్ ఇచ్చి లాభాలు పొందొచ్చు. ఒక ప్రొడక్ట్ ఆర్డర్ చేస్తే ఎంత కమిషన్ వస్తుందనేది ఆ ప్రొడక్ట్‌పై ఆధారపడి ఉంటుంది. కమీషన్ విషయానికి వస్తే లాప్ టాప్ లాంటి పెద్ద ప్రొడెక్ట్ ఆర్డర్ చేస్తే దాదపు రూ. 5వేలు కమీషన్ వస్తుంది. అదే స్మార్ట్ ఫోన్ చేస్తే రూ.50 వస్తాయి.

మనం ప్రొడక్ట్ ను ఓపెన్ చేయగానే కమీషన్ ఎంత అనేది మనకు కనిపిస్తుంది. మీరు ఆర్డర్ చేసేప్పుడు ఎవరి కోసం ఆర్డర్ చేస్తున్నారో వారి అడ్రస్ ఎంటర్ చేయాలి. ప్రొడక్ట్ ఫ్లిప్‌కార్ట్ ప్యాకేజింగ్‌తో వారి అడ్రస్‌కు వెళ్తుంది. రిటర్న్ గడువు ముగిసిన తర్వాత మీ అకౌంట్‌లోకి కమిషన్ వస్తుంది. ఇలా చేస్తూ ఆన్ లైన్ ఎంలాంటి రిస్క్ లేకుండా నెలకు రూ.30వేలు సంపాదించవచ్చు.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Niharika: యుద్ధం గెలిచిన రాముడు అయోధ్యకు వచ్చినట్టు ఉంది… బాబాయ్ పై నిహారిక కామెంట్స్!

Published

on

Niharika: నిహారిక కొణిదెల పరిచయం అవసరం లేని పేరు. ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీలో నిర్మాతగా నటిగా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు. తన భర్త నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన నిహారిక తిరిగి కెరియర్ పై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే నిర్మాతగా కూడా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇక నిహారిక నిర్మాణంలో తెరకెక్కిన కమిటీ కుర్రోళ్ళు సినిమా ఆగస్టు 9వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈమె ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆహాలో ప్రసారమవుతున్న సర్కార్ సక్సెస్ సెలబ్రేషన్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.

ఇక ఈ ప్రోమోలో భాగంగా నిహారిక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ నేను వచ్చేది ఎప్పుడు నెక్స్ట్ సీజనా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సుడిగాలి సుదీర్ రెస్పాండ్ అవుతూ మీకేంటండి మీరు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలూకా అంటూ మాట్లాడారు. అనంతరం పవన్ కళ్యాణ్ విజయం సాధించిన తర్వాత చిరంజీవి ఇంటికి వచ్చి ఆశీర్వాదం తీసుకున్న వీడియో ఎంతలా వైరల్ అయిందో మనకు తెలిసిందే .ఇక ఈ వీడియోని ప్లే చేశారు.

Advertisement

యుద్ధం గెలిచిన రాముడు…
ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది అంటూ నిహారికను ప్రశ్నించారు. ఇక నిహారిక ఈ వీడియో గురించి మాట్లాడుతూ యుద్ధం గెలిచిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకు వచ్చినప్పుడు కూడా ఇలాగే ఉండేదేమో అనిపించింది అంటూ తన బాబాయ్ విజయం గురించి నిహారిక మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Anasuya: ఇకపై రంగమ్మత్త లాంటి పాత్రలు అసలు చేయను.. గ్లామర్ పాత్రలకు సై అంటున్న అనసూయ?

Published

on

Anasuya: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు. ఈమె జబర్దస్త్ యాంకర్ గా బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ అందుకొని అనంతరం వెండి తెరపై సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా వెండితెరపై వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న అనసూయ తిరిగి బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈమె స్టార్ మా లో ప్రసారమవుతున్న కిరాక్ బాయ్స్ కిలాడి లేడీస్ అనే కార్యక్రమంలో సందడి చేస్తున్నారు. ఇలా ఒక వైపు బుల్లితెర కార్యక్రమాలు మరోవైపు వెండితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్న అనసూయ త్వరలోనే సింబా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ఈమె మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఇటీవల కాలంలో మీరు చాలా సినిమాలను రిజెక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది కారణం ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ తాను సినిమాలు రిజెక్ట్ చేస్తున్న మాట నిజమేనని తెలిపారు. నేను ఒక సినిమాలో నటించిన పాత్ర హిట్ అవడంతో తదుపరి సినిమాలలో కూడా అలాంటి పాత్రలలో నటించే అవకాశం వస్తుందని తెలిపారు.

Advertisement

రంగమ్మత్త..
ఇలా ఒక పాత్రలో నటించిన తర్వాత తిరిగి అలాంటి పాత్రలలో నటించిన ప్రేక్షకులు పెద్దగా తీసుకోలేరు ఉదాహరణకు రంగమ్మత్త పాత్ర చాలా హైలెట్ అయింది. తదుపరి అలాంటి పాత్రలు వస్తే నేను చెయ్యను నేను అన్ని చాలా డిఫరెంట్ గా ఉండేలా చేయాలని భావిస్తున్నాను. ఇక ఎక్కువగా తాను గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా అనసూయ గ్లామర్ రోల్ చేయడానికి సై అంటూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Mahesh Babu: మహేష్ రాజమౌళి సినిమా టైటిల్ లీక్… సినిమా పేరు ఏంటో తెలుసా?

Published

on

Mahesh Babu: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా జరుగబోతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన కూడా తెలియజేయబోతున్నారు.

ఇక ఈ సినిమాలో మహేష్ బాబు చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు మొదటిసారి వర్క్ షాప్ లో కూడా పాల్గొనబోతున్నారని సమాచారం.

ఇప్పటివరకు మహేష్ బాబు ఏ సినిమా కోసం ఇలా వర్క్ షాప్ లో పాల్గొనలేదు మొదటిసారి రాజమౌళి సినిమా కోసం పాల్గొనబోతున్న నేపథ్యంలో ఈయన కూడా ఈ సినిమా విషయంలో చాలా ఆతృత కనబరుస్తున్నారు. ఇకపోతే తాజాగా మహేష్ బాబు రాజమౌళి సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

గోల్డ్..
తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమాకు సంబంధించి ఓ టైటిల్ సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమా టైటిల్ కూడా అందుకు అనుగుణంగానే ఉండాలి. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం గోల్డ్ అనే టైటిల్ పెట్టబోతున్నారంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఈ సినిమా టైటిల్ గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం వైరల్ అవుతుంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!