Hero Suman: ఏపీ టిక్కెట్ల రేట్లపై సుమన్ షాకింగ్ కామెంట్స్… సీఎం మీటింగ్ కు నన్నెవరు ఆహ్వానించలేదు!
Hero Suman: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు సుమన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సుమన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొనీ ఎన్నో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
గత కొద్ది రోజులుగా సినిమా టికెట్ల విషయంపై ఏపీ ప్రభుత్వానికి చిత్రపరిశ్రమకు మధ్య పలు వివాదాలు తలెత్తిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు ముఖ్యమంత్రితో సమావేశమై ఈ విషయం గురించి చర్చించారు. అయితే ఈ సమావేశానికి ఆహ్వానం అందినా కొందరు ప్రముఖులు రాలేదని వార్తలు కూడా వినిపించాయి.
ఈ క్రమంలోనే ఈ విషయం గురించి సుమన్ మాట్లాడుతూ తనకు ఎలాంటి ఆహ్వానం రాలేదని ఈ సమావేశానికి ఎవరూ తనను ఆహ్వానించలేదని తెలిపారు. ఇకపోతే తాను సీఎం దగ్గరికి వెళ్లిన వెళ్లకపోయినా తానెప్పుడు బయ్యర్ల గురించి మాట్లాడతానని,వాళ్లు బాగున్నప్పుడే సినిమా ఇండస్ట్రీ కూడా బాగుంటుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఒకానొక సమయంలో ఖరీదైన కార్లలో తిరిగే బయ్యర్లు ప్రస్తుతం చాలా దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా విడుదలకు ముందు బయ్యర్లతో నిర్మాతలు చేసే హడావిడి ఎంతో ఉంటుంది. ఒకసారి సినిమా విడుదలైన తర్వాత ఆ సినిమా ఫ్లాప్ అయితే వారి గురించి పట్టించుకోవడమే మానేశారు.బయ్యర్లు లేకపోతే నిర్మాతలు ఓన్ రిలీజ్ చేసుకోవాల్సి ఉంటుందని.వారికి కూడా మూడు నాలుగు సినిమాలు వరుసగా ఫ్లాప్ అయితే వారి పరిస్థితి ఇదేనని వెల్లడించారు. ఒకవేళ సీఎం జగన్ తో సమావేశమైన ఇదే విషయమే చర్చిస్తానని సుమన్ వెల్లడించారు.
ఇరాన్ అణు కార్యక్రమం అంశంపై అమెరికా మరోసారి కఠిన స్వరాన్ని వినిపించింది. అమెరికా అధ్యక్షుడు Donald Trump తాజాగా చేసిన…
దక్షిణాదిలో ఒక కాలంలో స్టార్ హీరోయిన్గా వెలుగొందిన నటీమణుల్లో Meena ప్రత్యేక స్థానం సంపాదించారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టి,…
జుట్టు రాలడం ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న సమస్యగా మారింది. యువత నుంచి మధ్యవయసు వారిదాకా…
ఉమ్మడి మెదక్ జిల్లాలో వీధి కుక్కల సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా వరుసగా…
ఆస్పత్రి అంటే రోగి ప్రాణాలు కాపాడే స్థలం. కానీ కొన్నిసార్లు అక్కడే జరిగిన నిర్లక్ష్యం బాధితులకు జీవితాంతం మానని గాయాలు…
విశాఖ సాగరతీరంలో ఆదివారం జరిగిన నావికాదళ ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. RK Beach వేదికగా నిర్వహించిన ‘ఆపరేషనల్ డెమో’…