SV Krishna Reddy : 1990 దశకంలో… ఆనాటి తెలుగు ప్రేక్షకులు చెప్పుకునే హాస్య దర్శకులలో.. ఒకరు ఈవివి సత్యనారాయణ, మరొకరు ఎస్ వి కృష్ణారెడ్డి. కుటుంబ కథలనే ప్రధానంగా ఎంచుకొని దాని చుట్టూ హాస్యాన్ని పండించే విధంగా స్క్రీన్ ప్లే రాసుకునేవారు. అలా తక్కువ కాలంలోనే ప్రేక్షకుల అభిమానాన్ని పొందారు. ఎస్వీ కృష్ణారెడ్డి మొదటగా రాజేంద్రప్రసాద్ తో రాజేంద్రుడు గజేంద్రుడు మాయలోడు, అలీతో యమలీల గన్ షాట్, శ్రీకాంత్ తో వినోదం, ఎగిరే పావురమా జగపతిబాబుతో శుభలగ్నం, మావిచిగురు లాంటి సినిమాలను రూపొందించి మంచి విజయాలను అందుకున్నారు. ఆ క్రమంలో ఆయనకు హాస్య దర్శకుడని పేరు వచ్చింది. అయితే ఆ సమయం లో ఎస్వీ కృష్ణారెడ్డి ఒక అడుగు ముందుకు వేసి అగ్ర హీరోలతో సినిమా చేయాలనుకున్నారు.
ఆ క్రమంలో.. ‘టాప్ హీరో ‘.. 1994లో విడుదలైన చిత్రం, శ్రీ చిత్ర క్రియేషన్స్ బ్యానర్పై ముల్పూరి వెంకట్రావు మరియు ఆచంట గోపీనాథ్ నిర్మించారు మరియు SV కృష్ణ రెడ్డి దర్శకత్వం వహించారు. ఇందులో బాలకృష్ణ, సౌందర్య హీరో హీరోయిన్లుగా నటించగా ఎస్వీ కృష్ణా రెడ్డి సంగీతం అందించారు.
“వజ్రం” 1996 లో ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో విడుదలైన సినిమా. నాగార్జున, రోజా ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. లక్ష్మి పద్మజా ఎంటర్ప్రైజెస్ పతకంపై సి. గౌతమ్ కుమార్ రెడ్డి నిర్మించాడు. ఇది 1995 లో వచ్చిన మలయాళ చిత్రం స్పాడికంకు రీమేక్. ఎస్.వి.కృష్ణారెడ్డి సంగీతం అందించాడు.. ఈమధ్య ఒక ఇంటర్వ్యూ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్.వి కృష్ణారెడ్డి మాట్లాడారు. ఒకప్పుడు దాసరి రాఘవేంద్రరావు.. ఆ తర్వాత మీరు, ఈవీవీ. సత్యనారాయణ గారు అలాంటి పేరే తెచ్చుకున్నారు. బాలయ్య, నాగార్జునతో తీసిన సినిమాలు పరాజయం పొందాయి. అలాగే చిరంజీవితో కూడా సినిమా చేయలేక పోవడానికి కారణం ఏమిటని యాంకర్ అడగగా.. ఎస్వీ కృష్ణారెడ్డి బదులిస్తూ..
అవును మీరు అన్నట్టుగా బాలకృష్ణ, నాగార్జునతో తీసిన సినిమాలు అంతగా వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత చిరంజీవితో ఒక సినిమా తీయాలనుకున్నాను. ఆయనతో సినిమా తీయాలంటే ఆయన ఇమేజ్ కి సరిపడా కథ దొరకాలి. అందుకోసం కొంత టైం వెయిట్ చేశాను. ఆ తర్వాత క్రమంలో ఒక కథ రాసుకొని చిరంజీవి దగ్గరికి వెళ్లాను. అయితే ఈ బడ్జెట్ నిర్మాత భరిస్తాడా? ఈ స్టోరీ ఎక్స్పెన్సివ్ తో కూడుకొని ఉన్నదనని చిరంజీవి అనడంతో.. నాకు కూడా అలానే అనిపించింది. మరో కథతో ఆయనతో తీయొచ్చు కదా అనుకున్నాను.కానీ ఆ తర్వాత ఎందుకో మా ఇద్దరి కాంబినేషన్ కుదరలేదని ఆ ఇంటర్వ్యూలో ఎస్.వి.కృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు.
Niharika: నిహారిక కొణిదెల పరిచయం అవసరం లేని పేరు. ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీలో నిర్మాతగా నటిగా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు. తన భర్త నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన నిహారిక తిరిగి కెరియర్ పై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే నిర్మాతగా కూడా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు.
ఇక నిహారిక నిర్మాణంలో తెరకెక్కిన కమిటీ కుర్రోళ్ళు సినిమా ఆగస్టు 9వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈమె ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆహాలో ప్రసారమవుతున్న సర్కార్ సక్సెస్ సెలబ్రేషన్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.
ఇక ఈ ప్రోమోలో భాగంగా నిహారిక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ నేను వచ్చేది ఎప్పుడు నెక్స్ట్ సీజనా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సుడిగాలి సుదీర్ రెస్పాండ్ అవుతూ మీకేంటండి మీరు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలూకా అంటూ మాట్లాడారు. అనంతరం పవన్ కళ్యాణ్ విజయం సాధించిన తర్వాత చిరంజీవి ఇంటికి వచ్చి ఆశీర్వాదం తీసుకున్న వీడియో ఎంతలా వైరల్ అయిందో మనకు తెలిసిందే .ఇక ఈ వీడియోని ప్లే చేశారు.
Advertisement
యుద్ధం గెలిచిన రాముడు… ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది అంటూ నిహారికను ప్రశ్నించారు. ఇక నిహారిక ఈ వీడియో గురించి మాట్లాడుతూ యుద్ధం గెలిచిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకు వచ్చినప్పుడు కూడా ఇలాగే ఉండేదేమో అనిపించింది అంటూ తన బాబాయ్ విజయం గురించి నిహారిక మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Anasuya: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు. ఈమె జబర్దస్త్ యాంకర్ గా బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ అందుకొని అనంతరం వెండి తెరపై సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా వెండితెరపై వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న అనసూయ తిరిగి బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఈమె స్టార్ మా లో ప్రసారమవుతున్న కిరాక్ బాయ్స్ కిలాడి లేడీస్ అనే కార్యక్రమంలో సందడి చేస్తున్నారు. ఇలా ఒక వైపు బుల్లితెర కార్యక్రమాలు మరోవైపు వెండితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్న అనసూయ త్వరలోనే సింబా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ఈమె మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఇటీవల కాలంలో మీరు చాలా సినిమాలను రిజెక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది కారణం ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ తాను సినిమాలు రిజెక్ట్ చేస్తున్న మాట నిజమేనని తెలిపారు. నేను ఒక సినిమాలో నటించిన పాత్ర హిట్ అవడంతో తదుపరి సినిమాలలో కూడా అలాంటి పాత్రలలో నటించే అవకాశం వస్తుందని తెలిపారు.
Advertisement
రంగమ్మత్త.. ఇలా ఒక పాత్రలో నటించిన తర్వాత తిరిగి అలాంటి పాత్రలలో నటించిన ప్రేక్షకులు పెద్దగా తీసుకోలేరు ఉదాహరణకు రంగమ్మత్త పాత్ర చాలా హైలెట్ అయింది. తదుపరి అలాంటి పాత్రలు వస్తే నేను చెయ్యను నేను అన్ని చాలా డిఫరెంట్ గా ఉండేలా చేయాలని భావిస్తున్నాను. ఇక ఎక్కువగా తాను గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా అనసూయ గ్లామర్ రోల్ చేయడానికి సై అంటూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Mahesh Babu: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా జరుగబోతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన కూడా తెలియజేయబోతున్నారు.
ఇక ఈ సినిమాలో మహేష్ బాబు చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు మొదటిసారి వర్క్ షాప్ లో కూడా పాల్గొనబోతున్నారని సమాచారం.
ఇప్పటివరకు మహేష్ బాబు ఏ సినిమా కోసం ఇలా వర్క్ షాప్ లో పాల్గొనలేదు మొదటిసారి రాజమౌళి సినిమా కోసం పాల్గొనబోతున్న నేపథ్యంలో ఈయన కూడా ఈ సినిమా విషయంలో చాలా ఆతృత కనబరుస్తున్నారు. ఇకపోతే తాజాగా మహేష్ బాబు రాజమౌళి సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Advertisement
గోల్డ్.. తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమాకు సంబంధించి ఓ టైటిల్ సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమా టైటిల్ కూడా అందుకు అనుగుణంగానే ఉండాలి. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం గోల్డ్ అనే టైటిల్ పెట్టబోతున్నారంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఈ సినిమా టైటిల్ గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం వైరల్ అవుతుంది.