Actor Pradeep: టాలీవుడ్ ఇండస్ట్రీలో చిన్న సినిమాల్లో నటుడిగా అదేవిధంగా బుల్లితెర సీరియల్స్ లో స్టార్ నటుడిగా కొనసాగిన ప్రదీప్ ప్రస్తుతం బుల్లితెర సీరియల్స్ కి దూరమైనప్పటికీ వెండితెరపై పలు సినిమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. తాజాగా ఈయన ఎఫ్ 3 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నారు.Actor Pradeep: అచ్యుత్ చనిపోయే ముందు రోజు మా ఇంటికి వచ్చి నాతో అలా అన్నారు.. యాక్టర్ ప్రదీప్ కామెంట్స్ వైరల్!
కొత్తగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రదీప్ తన స్నేహితుడు, తన మిత్రుడు అచ్యుత్ మరణం గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అచ్యుత్ మరణం ఒక మిస్టరీగా ఉండిపోయింది. అసలు అచ్యుత్ మరణానికి కారణం ఏమిటి అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశకు ప్రదీప్ సమాధానం చెబుతూ అచ్యుత్ మరణం హిస్టరీ కాదు. అతని మరణానికి ప్రత్యక్ష సాక్షి నేనే అంటూ సమాధానం చెప్పారు.Actor Pradeep: అచ్యుత్ చనిపోయే ముందు రోజు మా ఇంటికి వచ్చి నాతో అలా అన్నారు.. యాక్టర్ ప్రదీప్ కామెంట్స్ వైరల్!
అచ్యుత్ ప్రాణం పోయే సమయంలో నేను అతని పక్కనే ఉన్నానని అతని మరణంలో ఎలాంటి హిస్టరీ లేదని, అతను సహజ మరణం పొందారని ప్రదీప్ తెలిపారు. అచ్యుత్ ఎక్కువగా నాన్ వెజ్ తినే వారు. అయితే ఆరోగ్యం బాగా లేకపోవడంతో నాన్ వెజ్ పూర్తిగా మానేశారు.ప్రతి రోజు షూటింగ్ ఉన్నా కూడా మా ఇంటికి వచ్చి పిల్లలతో కలిసి వదిన నాకు భోజనం పెట్టు అంటూ భోజనం చేసేవారు. మా ఇద్దరి జర్నీ సుమారు 14 సంవత్సరాలపాటు కొనసాగిందని అచ్యుత్ తెలిపారు.
అచ్యుత్ చనిపోయే ముందు రోజు రాత్రి మా ఇంటికి వచ్చారు. సాయంత్రం నాతో మాట్లాడుతూ రేపు అన్నయ్య సీరియల్ టీమ్ తో కలసి తిరుపతి వెళ్తున్నా అని చెప్పారు.సరే జాగ్రత్త అని చెప్పాను.ఆసమయంలో అచ్యుత్ కాస్త ఆయాస పడ్డారు.ఏమైంది అని అడిగితే ఇప్పుడే ఎండోస్కోపీ చేయించుకున్న కాస్త నోరు పూసినట్టు ఉంది అంటూ సమాధానం చెప్పగా కాస్త జాగ్రత్తగా ఉండని చెప్పాను.మరుసటి రోజు ఉదయం నేను అన్నపూర్ణ స్టూడియోకి షూటింగ్ కోసం వెళ్ళగా రైల్వే స్టేషన్ కు వెళ్లే సమయంలో అస్వస్థతకు గురై హాస్పిటల్ కి వెళ్ళాడని ఫోన్ వచ్చింది.
ఫోన్ కాగానే హుటాహుటిన తను హాస్పిటల్ కు వెళ్ళినట్టు ప్రదీప్ తెలిపారు. అక్కడి వెళ్తే ఆయనకు హార్ట్ ఎటాక్ అని చెప్పారు. డాక్టర్స్ తన గురించిహోప్స్ వదిలేసారు అదే సమయంలో తన భార్య రమ అక్కడే కూర్చుని ఏడుస్తున్నారు.చివరి ప్రయత్నంగా ఒక ఇంజక్షన్ ఉంది దాన్ని ట్రై చేద్దామని డాక్టర్ ట్రై చేశారు. ఇక అతని ప్రాణాలు కొట్టుమిట్టాడుతుండగా బయటకు వచ్చి నేనే తన భార్యకు కాస్తా తన నోట్లో నీళ్లు పోయమని చెప్పాను. ఇది జరిగినది అచ్యుత్ మరణం లో ఎలాంటి హిస్టరీ లేదు. ఆయన సహజంగా మరణించారని ప్రదీప్ తెలిపారు. ఇక ప్రస్తుతం హైదరాబాద్ లోనే అచ్యుత్ భార్య రమ పిల్లలిద్దరూ కూడా లైఫ్ లో సెటిల్ అయ్యారని పిల్లలకి మ్యాచ్ చూస్తున్నారని ప్రదీప్ తెలిపారు.
Rajamouli: తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు డైరెక్టర్ రాజమౌళి. ఈయన దర్శకుడిగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు. ఇక తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లిన ఘనత రాజమౌళికి దక్కుతుందని చెప్పాలి. ఇలా దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
రాజమౌళి కెరియర్ లో వచ్చిన మగధీర సినిమా ఎంతో ప్రత్యేకమైనదని చెప్పాలి. మొదటిసారి ఇలాంటి సినిమా ద్వారా ఈయన ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు అయితే ఈ సినిమా సమయంలో తాను ఎంతో కంగారు పడ్డానని అప్పటికే ఇది చాలా భారీ బడ్జెట్ కావడంతో ఒక రకమైన భయం ఉండేదని తెలిపారు.
ఇక తన సినిమాలలో అందరిలాగే స్టార్ హీరోయిన్లనే పెట్టుకోవాలని నేను అనుకుంటాను. కానీ నేను రాసుకున్న కథకు అనుగుణంగా ఏ హీరోయిన్ అయితే సెట్ అవుతుందో వారినే తీసుకుంటాను. ఆ హీరోయిన్ కు వరుసగా ప్లాపులు వచ్చిన ఆమె ఐరన్ లెగ్ అంటూ ట్రోల్స్ ఎదుర్కొన్న తాను వాటిని లెక్క చేయను. మగధీర..
Advertisement
ఇలా ఆ హీరోయిన్ హిస్టరీ గురించి నేను ఏమాత్రం ఆలోచించనని నా పాత్రకు సూట్ అయితే తప్పనిసరిగా వారికి అవకాశాలు ఇస్తాను అంటూ ఈ సందర్భంగా హీరోయిన్ల గురించి రాజమౌళి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం ఈయన మహేష్ బాబుతో సినిమా చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోతోంది.
Venu Swamy: బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్ బాస్ 8 కార్యక్రమంలో కంటెస్టెంట్లుగా వేణు స్వామి సందడి చేయబోతున్నారనే సంగతి మనకు తెలిసిందే. త్వరలోనే ఈ కార్యక్రమం ప్రసారం కాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి సంబంధించిన ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ కార్యక్రమం ఆగస్టులోనే ప్రారంభం కాబోతుందని తెలుస్తుంది.
ఇదిలా ఉండగా ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్లకు సంబంధించిన లిస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో వేణు స్వామి కూడా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ప్రముఖ ఆస్ట్రాలజర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వేణు స్వామి బిగ్ బాస్ 8 కార్యక్రమంలో పాల్గొనబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.
ఇలా ఆస్ట్రాలజర్ గా ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి ఈయన బిగ్ బాస్ కార్యక్రమంలోకి రాబోతున్నారని తెలియగానే ఈ కార్యక్రమం పై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇక ఈయన కారణంగా రేటింగ్స్ కూడా భారీగా వచ్చే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇకపోతే వేణు స్వామి బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొంటూ అందుకోబోయే రెమ్యూనరేషన్ గురించి కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
లక్షల్లో రెమ్యునరేషన్..
Advertisement
దేశ చరిత్రలోనే ఇప్పటివరకు ఏ కంటెస్టెంట్ తీసుకొని రెమ్యూనరేషన్ ఈయన అందుకోబోతున్నారని తెలుస్తోంది. వేణు స్వామి వారానికి లక్షల్లోనే రెమ్యూనరేషన్ అందుకునే విధంగా అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్టు సమాచారం. మరి వేణు స్వామి ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని ఆయన రెమ్యూనరేషన్ గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
Kumari Aunty: కుమారి ఆంటీ పరిచయం అవసరం లేని పేరు. ఈమె హైదరాబాదులో రోడ్డు పక్కన ఫుడ్ స్టాల్ బిజినెస్ చేసుకుంటూ జీవనం గడిపేది అయితే ఈమె చాలా తక్కువ ధరకే కడుపునిండా భోజనం పెట్టడంతో ఈమె గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఎంతోమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఆమె దగ్గరికి వెళ్లి తనతో ఇంటర్వ్యూ తీసుకోవడంతో ఒక్కసారిగా ఈమె పాపులర్ అయ్యారు.
ఇలా సోషల్ మీడియా వేదికగా ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్న ఈమె ప్రస్తుతం సెలబ్రిటీగా మారిపోయారని చెప్పాలి. ఎన్నో కార్యక్రమాలలో కూడా కుమారి ఆంటీ సందడి చేశారు. ఇక త్వరలోనే కుమారి ఆంటీ బిగ్ బాస్ కార్యక్రమంలో కూడా పాల్గొనబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు.
ఈ విధంగా కుమారి ఆంటీ రోజురోజుకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకోవడంతో ఎంతోమంది సెలబ్రిటీలు కూడా ఆమె వద్దకు వచ్చి ఆమె ఫుడ్ టేస్ట్ చేస్తున్నారు. ఇకపోతే తాజాగా కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ వద్దకు సినీ నటుడు సోను సూద్ వచ్చి ఒక్కసారిగా సర్ప్రైజ్ ఇచ్చారు. కుమారి ఆంటీని కలిసిన ఈయన ఆమెతో సరదాగా మాట్లాడి తన కుటుంబ సభ్యుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
Advertisement
మహిళా సాధికారత.. మహిళా సాధికారత కష్టపడే తత్వానికి కుమారి ఆంటీ నిదర్శనమని సోను సూద్ ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాకుండా తనకు ఎలాంటి కష్టం వచ్చినా నేనున్నానని వెంటనే నాకు తెలియజేయాలి అంటూ ఆమెకు ధైర్యం చెప్పారు. ఇక సోను సూద్ గురించి కుమారి ఆంటీ మాట్లాడుతూ.. ఎంతోమందికి సహాయం చేసిన సోను సూద్ కి ఏమిచ్చినా తక్కువే అంటూ కుమారి ఆంటీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.