Tollywood : భాష, యాసలతో కూడుకున్న మొరటైన కథలను ఎక్కువగా మనం తమిళ చిత్రాలలో చూస్తుంటాం. ఎందుకో ఈమధ్య డైరెక్టర్ సుకుమార్ అలాంటి కథలకి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అలాంటి కథతో వచ్చిన సినిమాలే ఆయనకి సినీ పరిశ్రమలో పేరును తీసుకువచ్చాయి.
1985లో జరిగిన.. ఇతివృత్తంగా “రంగస్థలం” సినిమా కథని తీర్చిదిద్దారు. ఓ పాత కథ , ఏమాత్రం కొత్తదనం లేదు. కానీ కథ స్క్రీన్ ప్లే ఓ కొత్త తరహాలో వెళుతుంది. గోదావరి ప్రాంతాన్ని ఏ సినిమాలో తీసుకున్న నీటితో నిండిన గోదావరి పారుతుంటే.. సగటు ప్రేక్షకుడు ఎంతో ఆనందపడేవాడు. ఆ సినిమా కూడా అంతటి ఘన విజయాన్ని సాధించేది. అలా ఈ చిత్రానికి రామ్ చరణ్,సమంత లాంటి హీరో, హీరోయిన్స్ తోడవడంతో సూపర్ హిట్ గా నిలిచింది.
మొరటైన పచ్చి పల్లెటూరు కథతో వచ్చిన రంగస్థలం చిత్రాన్ని ప్రేక్షకులు హిట్ చేయడంతో.. డైరెక్టర్ సుకుమార్ మళ్ళీ ఓ మొరటైన కథ తో ఓ సినిమా రూపొందించాలనుకున్నారు. ఆ క్రమంలో.. ఈసారి ఆయన కొత్త ప్రాంతాన్ని అంటే రాయలసీమ నేపద్యంలో సినిమా రూపొందించాల అనుకున్నారు. దట్టమైన అటవీ ప్రాంతంలో కథ సాగేలా సుకుమార్ ఓ కథను రాసుకున్నాడు. తిరిగి మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో.. అల్లు అర్జున్, రష్మిక మందన హీరో, హీరోయిన్లుగా “పుష్ప” సినిమా విడుదలైంది. అల్లు అర్జున్ ని మునుపెన్నడూ చూడని విధంగా పూర్తిగా డిగ్లామరైజ్ చేస్తూ డైరెక్టర్ సుకుమార్ రాయలసీమ స్లాంగ్ తో కథని నడిపించిన తీరు తెలుగు ప్రేక్షకులే కాకుండా బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యేలా చేసింది. అలా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘనవిజయం సాధించింది.
తెలుగు రాష్ట్రాల్లోని రెండు ప్రాంతాలైన ఆంధ్ర, రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో రంగస్థలం, పుష్ప చిత్రాలు వచ్చాయి. ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో మరొక తెలంగాణ ప్రాంతం బ్యాక్ డ్రాప్ లో కూడా డైరెక్టర్ సుకుమార్ ఓ సినిమా రూపొందిస్తారని ఆసక్తిగా ప్రేక్షకులు ఎదురుచూసారు. ఆ సమయంలో.. ఆయన శిష్యుడైన శ్రీకాంత్ ఓదెల ఓ మొరటు కథ తయారు చేసుకున్నారు.ఆ కథకి తగిన విధంగా.. తెలంగాణ ప్రాంతం, సింగరేణి పరిసర ప్రాంతాలను ఎంచుకున్నారు.
అయితే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర బ్యానర్ లో శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో “దసరా” సినిమా విడుదలయింది. ఈ సినిమాలో నాని,కీర్తి సురేష్ హీరో, హీరోయిన్లుగా నటించారు. కథలో కొత్తదనం పెద్దగా లేనప్పటికీ హీరో నానిని ఇంతకుముందు డిగ్లామర్ గా ప్రేక్షకులు చూడలేదు. నాని అలా కొత్తగా కనిపించడంతో.. ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. అలా ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ మూడు తెలుగు ప్రాంతాల నేపథ్యంతో కూడుకొని వచ్చిన ఈ మూడు సినిమాలు విజయదుందుభి మోగించాయి.
Niharika: నిహారిక కొణిదెల పరిచయం అవసరం లేని పేరు. ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీలో నిర్మాతగా నటిగా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు. తన భర్త నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన నిహారిక తిరిగి కెరియర్ పై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే నిర్మాతగా కూడా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు.
ఇక నిహారిక నిర్మాణంలో తెరకెక్కిన కమిటీ కుర్రోళ్ళు సినిమా ఆగస్టు 9వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈమె ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆహాలో ప్రసారమవుతున్న సర్కార్ సక్సెస్ సెలబ్రేషన్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.
ఇక ఈ ప్రోమోలో భాగంగా నిహారిక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ నేను వచ్చేది ఎప్పుడు నెక్స్ట్ సీజనా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సుడిగాలి సుదీర్ రెస్పాండ్ అవుతూ మీకేంటండి మీరు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలూకా అంటూ మాట్లాడారు. అనంతరం పవన్ కళ్యాణ్ విజయం సాధించిన తర్వాత చిరంజీవి ఇంటికి వచ్చి ఆశీర్వాదం తీసుకున్న వీడియో ఎంతలా వైరల్ అయిందో మనకు తెలిసిందే .ఇక ఈ వీడియోని ప్లే చేశారు.
Advertisement
యుద్ధం గెలిచిన రాముడు… ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది అంటూ నిహారికను ప్రశ్నించారు. ఇక నిహారిక ఈ వీడియో గురించి మాట్లాడుతూ యుద్ధం గెలిచిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకు వచ్చినప్పుడు కూడా ఇలాగే ఉండేదేమో అనిపించింది అంటూ తన బాబాయ్ విజయం గురించి నిహారిక మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Anasuya: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు. ఈమె జబర్దస్త్ యాంకర్ గా బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ అందుకొని అనంతరం వెండి తెరపై సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా వెండితెరపై వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న అనసూయ తిరిగి బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఈమె స్టార్ మా లో ప్రసారమవుతున్న కిరాక్ బాయ్స్ కిలాడి లేడీస్ అనే కార్యక్రమంలో సందడి చేస్తున్నారు. ఇలా ఒక వైపు బుల్లితెర కార్యక్రమాలు మరోవైపు వెండితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్న అనసూయ త్వరలోనే సింబా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ఈమె మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఇటీవల కాలంలో మీరు చాలా సినిమాలను రిజెక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది కారణం ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ తాను సినిమాలు రిజెక్ట్ చేస్తున్న మాట నిజమేనని తెలిపారు. నేను ఒక సినిమాలో నటించిన పాత్ర హిట్ అవడంతో తదుపరి సినిమాలలో కూడా అలాంటి పాత్రలలో నటించే అవకాశం వస్తుందని తెలిపారు.
Advertisement
రంగమ్మత్త.. ఇలా ఒక పాత్రలో నటించిన తర్వాత తిరిగి అలాంటి పాత్రలలో నటించిన ప్రేక్షకులు పెద్దగా తీసుకోలేరు ఉదాహరణకు రంగమ్మత్త పాత్ర చాలా హైలెట్ అయింది. తదుపరి అలాంటి పాత్రలు వస్తే నేను చెయ్యను నేను అన్ని చాలా డిఫరెంట్ గా ఉండేలా చేయాలని భావిస్తున్నాను. ఇక ఎక్కువగా తాను గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా అనసూయ గ్లామర్ రోల్ చేయడానికి సై అంటూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Mahesh Babu: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా జరుగబోతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన కూడా తెలియజేయబోతున్నారు.
ఇక ఈ సినిమాలో మహేష్ బాబు చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు మొదటిసారి వర్క్ షాప్ లో కూడా పాల్గొనబోతున్నారని సమాచారం.
ఇప్పటివరకు మహేష్ బాబు ఏ సినిమా కోసం ఇలా వర్క్ షాప్ లో పాల్గొనలేదు మొదటిసారి రాజమౌళి సినిమా కోసం పాల్గొనబోతున్న నేపథ్యంలో ఈయన కూడా ఈ సినిమా విషయంలో చాలా ఆతృత కనబరుస్తున్నారు. ఇకపోతే తాజాగా మహేష్ బాబు రాజమౌళి సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Advertisement
గోల్డ్.. తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమాకు సంబంధించి ఓ టైటిల్ సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమా టైటిల్ కూడా అందుకు అనుగుణంగానే ఉండాలి. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం గోల్డ్ అనే టైటిల్ పెట్టబోతున్నారంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఈ సినిమా టైటిల్ గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం వైరల్ అవుతుంది.