Connect with us

Featured

పిల్లల్లో ఇమ్యూనిటీ పెరగాలంటే తీసుకోవాల్సిన ఆహార పదార్థాలివే..!!

Published

on

సాధారణంగా పెద్దలతో పోలిస్తే పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది. అందువల్లే పిల్లలు నిత్యం జబ్బుల బారిన పడుతూ ఉంటారు. వర్షాకాలం, శీతాకాలంలో పిల్లలను జ్వరం, దగ్గు, జలుబు ఎక్కువగా వేధిస్తూ ఉంటాయి. అయితే పిల్లలు ప్రతిరోజూ ఇమ్యూనిటీని పెంచే ఆహార పదార్థాలను తీసుకుంటే తక్కువగా రోగాల బారిన పడతారు. పిల్లలకు ప్రతిరోజూ క్యారెట్లను తినిపించాలి. క్యారెట్ల ద్వారా విటమిన్ ఎ, జింక్ సమృద్ధిగా లభిస్తాయి.

బాదం, పిస్తాపప్పు, జీడిపప్పు, నట్స్ ఇమ్యూనిటీని పెంచి పిల్లలు బలంగా తయారయ్యేలా చేస్తాయి. జీడిపప్పు, పిస్తాపప్పు రోజూ తినే పిల్లలకు సంపూర్ణ పోషణ లభించడంతో పాటు వాళ్లు అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు తగ్గుతాయి. నిమ్మ జాతికి చెందిన పండ్లు సైతం పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ ను పెంచేందుకు ఎంతగానో సహాయపడతాయి. చిన్నారులు వారంలో ఒకసారైనా నారింజ, బత్తాయి లాంటి పండ్లను తీసుకోవాలి.

ఈ పండ్ల ద్వారా పిల్లలకు వాళ్ల శరీరానికి అవసరమైన సి విటమిన్ పుష్కలంగా లభిస్తుంది. దీంతో వాళ్లు జ్వరం, దగ్గు, జలుబుతో పాటు ఇతర ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు తగ్గుతాయి. పిల్లలకు ఖచ్చితంగా తినిపించాల్సిన ఆహార పదార్థాల్లో పెరుగు కూడా ఒకటి. శరీరంలోని చెడు బ్యాక్టీరియాను నాశనం చేయడంలో పెరుగు సహాయపడుతుంది.

Advertisement

పిల్లలకు ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ పుష్కంగా ఉండే ఆహారాన్ని అందించాలి. ఇడ్లీ, రాగి జావ, బ్రెడ్ లను బ్రేక్ ఫాస్ట్ గా ఇవ్వడంతో పాటు లంచ్ లో చపాతీ లేదా అన్నం, కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. పాలు, పల్లీలు, గుడ్లు, అరటిపండ్లు కూడా పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.

Advertisement

Featured

RRR Movie: ఆర్ఆర్ఆర్ సినిమాకి ఆగని అవార్డులు.. ఫిలింఫేర్ అవార్డులలో సత్తా?

Published

on

RRR Movie: దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ నటించిన సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎలాంటి సంచలనాలను అందుకుందో మనకు తెలిసిందే. ఈ సినిమాకు తెలుగు చిత్ర పరిశ్రమలో మాత్రమే కాకుండా ఏకంగా ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. ఈ సినిమాకు ఎంతో ప్రతిష్టాత్మకమైన అవార్డులు రావడంతో ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో మారుమోగిపోయింది.

ఇక ఈ సినిమా విడుదలై దాదాపు మూడు సంవత్సరాలు అవుతున్న ఇంకా ఈ సినిమాకు మాత్రం అవార్డులు రావడం ఆగలేదని చెప్పాలి. తాజాగా 2023వ సంవత్సరానికి గాను ఫిలింఫేర్ సౌత్ అవార్డులను ప్రకటించారు. ఈ అవార్డులలో భాగంగా పలు తెలుగు సినిమాలకు భారీ స్థాయిలో అవార్డులు రావటం విశేషం.

ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ సినిమాకు ఏకంగా ఏడో ఫిలింఫేర్ అవార్డులు రావడం విశేషం. మరి ఫిలింఫేర్ అవార్డులలో భాగంగా ఈ ఏడు అవార్డులు ఏ ఏ విభాగానికి వచ్చాయి ఎవరు అందుకోబోతున్నారు అనే విషయానికి వస్తే.. ఉత్తమ చిత్రంగా ఆర్ఆర్ఆర్, ఉత్తమ డైరెక్టర్ గా రాజమౌళి, ఉత్తమ నటులుగా ఎన్టీఆర్, రామ్ చరణ్. ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్, గా కీరవాణి ఈ అవార్డులను అందుకోబోతున్నారు.

Advertisement

ఏడు విభాగాలలో అవార్డులు..
వీరితోపాటు ఉత్తమ కొరియోగ్రాఫర్ గా ప్రేమ్ రక్షిత్, ఉత్తమ ప్రొడక్షన్ డివైన్ విభాగంలో సాబు సిరిల్, ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ గా కొమరం భీముడు సింగర్ కాలభైరవ ఈ అవార్డును అందుకోబోతున్నారు. ఇలా ఫిలింఫేర్ అవార్డులలో ఏకంగా ఏడు విభాగాలలో ఈ అవార్డులు ఈ సినిమాకు రావడంతో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Continue Reading

Featured

Ananth Ambani: వామ్మో అనంత్ అంబానీ పెళ్లి ఖర్చు ఎంతో తెలుసా… దిమ్మతిరిగి పోవాల్సిందే?

Published

on

Ananth Ambani: ప్రస్తుతం దేశవ్యాప్తంగా అనంత్ అంబానీ రాధిక మర్చంట్ వివాహ వేడుకలకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. భారతదేశంలోనే అత్యంత కుబేరుడుగా సంపన్నుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ముఖేష్ అంబానీ వారసుడిగా అనంత్ అంబానీ అందరికీ పరిచయమే. అయితే తాజాగా అనంత్ అంబానీ రాధిక మర్చంట్ వివాహపు వేడుకలు కన్నుల పండుగగా జరుపుతున్నాయి.

ఇక వీరి వివాహం నేడు జరుగుతుండగా వివాహ వేడుకలు గత 15 రోజుల నుంచి అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇదివరకే వీరు జాంనగర్లో ఘనంగా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే దాదాపు వారం రోజులపాటు ఈ వేడుకలు జరిగాయి. తాజాగా జియో వరల్డ్ లో వీరి వివాహ వేడుకలు జరుగుతున్నాయి.

ఈ వివాహానికి ఎంతోమంది సినీ రాజకీయ ప్రముఖులతో పాటు వ్యాపారవేత్తలు కూడా హాజరై సందడి చేస్తున్నారు. దాదాపు 15 రోజుల నుంచి వీరి వివాహ వేడుకలు జరుగుతున్న నేపథ్యంలో ఎంతోమంది సినిమా సెలబ్రిటీలు కూడా పాల్గొని సందడి చేశారు. అయితే తాజాగా ఈయన పెళ్లి వేడుకలకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

5000 కోట్లు..
అనంత్ అంబానీ రాధిక మర్చంట్ వివాహపు వేడుకలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ వివాహాన్ని చేయడం కోసం ఎంతవరకు ఖర్చు జరిగిందనే విషయంపై ఒక వార్త సంచలనంగా మారింది అనంత్ అంబానీ ఈ పెళ్లి వేడుకకు మాత్రమే సుమారు 5000 కోట్ల రూపాయల ఖర్చు అయిందని తెలుస్తోంది. ఒక పెళ్లి వేడుకకు 5000 కోట్లు అంటే సాధారణమైన విషయం కాదనే చెప్పాలి. అయితే ఈ ఖర్చు ముఖేష్ అంబానీ నికర ఆస్తులలో కేవలం 0.5% అని ఫోర్బ్స్ అంచనా వేసింది. ఇక మన టాలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి రామ్ చరణ్ దంపతులు మాత్రమే ఈ వివాహా వేడుకలో పాల్గొన్నారు.

Advertisement
Continue Reading

Featured

Lavanya: పవన్ మూడు పెళ్లిళ్ల పై లావణ్య షాకింగ్ కామెంట్స్.. ఆయన వద్దే తేల్చుకుంటా అంటూ?

Published

on

Lavanya: లావణ్య ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున మీడియా వార్తలలో నిలుస్తున్నారు. సినీ నటుడు రాజ్ తరుణ్ తనని మోసం చేశారని 11 సంవత్సరాల పాటు తనతో కలిసి ఉండి ఇప్పుడు తనని వదిలించుకుంటున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఈమె నర్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడమే కాకుండా ఆయనపై ఎన్నో ఆరోపణలు చేశారు.

రాజ్ తరుణ్ నన్ను పెళ్లి చేసుకొని ఆ పెళ్లి విషయాని రహస్యంగా ఉంచారు పలుసార్లు అబార్షన్ కూడా చేయించారని ఈమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈయనకు వేరే వారితో ఎఫైర్ ఉండటంవల్లే నన్ను వదిలించుకోవాలని చూస్తున్నారా అంటూ ఎన్నో విమర్శలు చేశారు అయితే తాజాగా నాకు న్యాయం జరగాలని న్యాయం కోసం తాను పవన్ కళ్యాణ్ వద్దకే వెళ్తానని ఈమె తెలిపారు.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా మాత్రమే కాకుండా ఇతర శాఖల మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తూ ఎంతో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే తనకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టమని అందుకే తనకు న్యాయం జరగాలని తన వద్దకే వెళ్లి న్యాయం కోరుతానని తెలిపారు.

Advertisement

పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు..
ఇకపోతే పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి కూడా ఈమె సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికీ రెండు పెళ్లిళ్లు చేసుకొని ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చారు. ప్రస్తుతం మూడో వివాహం కూడా చేసుకున్నారు.అయితే ఈయన తన మాజీ ఇద్దరు భార్యలతో ఉన్నప్పుడు వారిని చాలా ప్రేమగా చూసుకున్నారు కానీ రాజ్ తరుణ్ అలా కాదని నాకు తినడానికి కూడా డబ్బులు ఇచ్చేవాడు కాదు అంటూ ఈమె ఆవేదన వ్యక్తం చేస్తూ చేసిన ఈ కామెంట్స్ సంచలనంగా మారాయి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!