Connect with us

Featured

YSRCP Vs TDP : వైసీపీ రివెంజ్ డ్రామాకు తెరదీసిందా.. క్విడ్ ప్రోకో అంశంతో టీడీపీ ఇరుకున పడుతుందా..!?

Published

on

YSRCP Vs TDP : ఏపీ రాజకీయాల్లో కక్షలు, కార్పణ్యాలు కాసింత ఎక్కువే. గతంలో టీడీపీ చేసిందానికి కౌంటర్‌గా ప్రస్తుతం వైసీపీ రివెంజ్ తీర్చుకునే పనిలో ఉంది. మరోసారి క్విడ్ ప్రోకో అంశం ఏపీలో కలకలం రేపుతోంది. గతంలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఓ ఘటన పెద్ద సంచలనంగా మారింది. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకు, ప్రస్తుత సీఎం జగన్ అంతకు ముందు తండ్రి అధికారాన్ని అడ్డుగా పెట్టుకుని క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారంటూ కేంద్ర దర్యాప్తు బృందాలను రంగంలోకి దింపారు. సీబీఐ, ఈడీ కేసులు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నాయి. అయితే ఈ అంశాలేమీ గత ఎన్నికల్లో వైసీపీకి ఎలాంటి నష్టమూ చేకూర్చలేదు. మరి ఇప్పుడు వైసీపీ మరోసారి క్విడ్ ప్రోకో ఆరోపణలు చేస్తూ టీడీపీపై సీఐడీని ప్రయోగించింది. మరి ఇప్పుడు టీడీపీపై సీఐడీ దర్యాప్తు ప్రభావం చూపిస్తుందా? ఏం జరగనుంది? వంటి అంశాలపై ప్రత్యేక కథనం.

ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ..!
సీఐడీ విచారణపై హైకోర్టు స్టే విధించింది. దీంతో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించి మరీ స్టేను ఎత్తివేయించింది. మరోవైపు సుప్రీంకోర్టు స్టేను ఎత్తివేయడంతో ఆఘమేఘాల మీద ఆస్తులు జప్తు చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక టీడీపీ ప్రభుత్వ హయాంలో కక్ష సాధింపు ఆరోపణలు వచ్చినట్టే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంపై సైతం అవే ఆరోపణలు వస్తున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులను టీడీపీ ప్రస్తావిస్తోంది. పైగా జగన్.. ఢిల్లీకి ప్రతిసారి వెళ్లడం కేసుల బారి నుంచి బయట పడేందుకేనని అంటున్నారు. ప్రస్తుతం ఉండవల్లిలో చంద్రబాబు నివసిస్తున్న ఇంటి జప్తునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చంద్రబాబు నివసిస్తున్న ఇల్లు లింగమనేని రమేష్‌కు చెందినది కావడం గమనార్హం. దీని జప్తునకు కారణం ఏంటంటే.. రాజధాని ప్రణాళిక డిజైన్, ఇన్నర్ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్ వంటివి లింగమనేని ఇంటికి అనుకూలంగా మార్పులు చేశారనేది ప్రధాన అభియోగం.

ఎవరేం అంటున్నారు..!
లింగమనేని ఇంటికి అనుకూలంగా అన్ని మార్పులు చేర్పులు చేయడంతో ఆ ఇంటిని చంద్రబాబుకు ఉచితంగా నివాసముండేందుకు ఇచ్చేశారని సీఐడీ అధికారులు చెబుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న సీఐడీ అధికారులు చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణ, లింగమనేని రమేష్ సహా 14 మందిని నిందితులుగా చేర్చారు. అయితే ఇందులో కక్ష సాధింపు అంటూ ఏమీ లేదని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు. అమరావతి కుంభకోణం దేశంలోనే అతి పెద్దదని చెప్పుకొస్తున్నారు. మరోవైపు టీడీపీ నేతలు సైతం పెద్ద ఎత్తున విమర్శలకు దిగుతున్నారు. కావాలనే టీడీపీ నేతలపై కక్ష సాధింపునకు పాల్పడుతున్నారని చెబుతున్నారు. జగన్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని విమర్శిస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే ఇన్నర్ రింగ్ రోడ్డు అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని టీడీపీ నేతలు మండి పడుతున్నారు. మొత్తానికి ఈ వ్యవహారం ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Niharika: యుద్ధం గెలిచిన రాముడు అయోధ్యకు వచ్చినట్టు ఉంది… బాబాయ్ పై నిహారిక కామెంట్స్!

Published

on

Niharika: నిహారిక కొణిదెల పరిచయం అవసరం లేని పేరు. ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీలో నిర్మాతగా నటిగా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు. తన భర్త నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన నిహారిక తిరిగి కెరియర్ పై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే నిర్మాతగా కూడా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇక నిహారిక నిర్మాణంలో తెరకెక్కిన కమిటీ కుర్రోళ్ళు సినిమా ఆగస్టు 9వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈమె ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆహాలో ప్రసారమవుతున్న సర్కార్ సక్సెస్ సెలబ్రేషన్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.

ఇక ఈ ప్రోమోలో భాగంగా నిహారిక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ నేను వచ్చేది ఎప్పుడు నెక్స్ట్ సీజనా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సుడిగాలి సుదీర్ రెస్పాండ్ అవుతూ మీకేంటండి మీరు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలూకా అంటూ మాట్లాడారు. అనంతరం పవన్ కళ్యాణ్ విజయం సాధించిన తర్వాత చిరంజీవి ఇంటికి వచ్చి ఆశీర్వాదం తీసుకున్న వీడియో ఎంతలా వైరల్ అయిందో మనకు తెలిసిందే .ఇక ఈ వీడియోని ప్లే చేశారు.

Advertisement

యుద్ధం గెలిచిన రాముడు…
ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది అంటూ నిహారికను ప్రశ్నించారు. ఇక నిహారిక ఈ వీడియో గురించి మాట్లాడుతూ యుద్ధం గెలిచిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకు వచ్చినప్పుడు కూడా ఇలాగే ఉండేదేమో అనిపించింది అంటూ తన బాబాయ్ విజయం గురించి నిహారిక మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Anasuya: ఇకపై రంగమ్మత్త లాంటి పాత్రలు అసలు చేయను.. గ్లామర్ పాత్రలకు సై అంటున్న అనసూయ?

Published

on

Anasuya: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు. ఈమె జబర్దస్త్ యాంకర్ గా బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ అందుకొని అనంతరం వెండి తెరపై సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా వెండితెరపై వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న అనసూయ తిరిగి బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈమె స్టార్ మా లో ప్రసారమవుతున్న కిరాక్ బాయ్స్ కిలాడి లేడీస్ అనే కార్యక్రమంలో సందడి చేస్తున్నారు. ఇలా ఒక వైపు బుల్లితెర కార్యక్రమాలు మరోవైపు వెండితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్న అనసూయ త్వరలోనే సింబా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ఈమె మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఇటీవల కాలంలో మీరు చాలా సినిమాలను రిజెక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది కారణం ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ తాను సినిమాలు రిజెక్ట్ చేస్తున్న మాట నిజమేనని తెలిపారు. నేను ఒక సినిమాలో నటించిన పాత్ర హిట్ అవడంతో తదుపరి సినిమాలలో కూడా అలాంటి పాత్రలలో నటించే అవకాశం వస్తుందని తెలిపారు.

Advertisement

రంగమ్మత్త..
ఇలా ఒక పాత్రలో నటించిన తర్వాత తిరిగి అలాంటి పాత్రలలో నటించిన ప్రేక్షకులు పెద్దగా తీసుకోలేరు ఉదాహరణకు రంగమ్మత్త పాత్ర చాలా హైలెట్ అయింది. తదుపరి అలాంటి పాత్రలు వస్తే నేను చెయ్యను నేను అన్ని చాలా డిఫరెంట్ గా ఉండేలా చేయాలని భావిస్తున్నాను. ఇక ఎక్కువగా తాను గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా అనసూయ గ్లామర్ రోల్ చేయడానికి సై అంటూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Mahesh Babu: మహేష్ రాజమౌళి సినిమా టైటిల్ లీక్… సినిమా పేరు ఏంటో తెలుసా?

Published

on

Mahesh Babu: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా జరుగబోతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన కూడా తెలియజేయబోతున్నారు.

ఇక ఈ సినిమాలో మహేష్ బాబు చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు మొదటిసారి వర్క్ షాప్ లో కూడా పాల్గొనబోతున్నారని సమాచారం.

ఇప్పటివరకు మహేష్ బాబు ఏ సినిమా కోసం ఇలా వర్క్ షాప్ లో పాల్గొనలేదు మొదటిసారి రాజమౌళి సినిమా కోసం పాల్గొనబోతున్న నేపథ్యంలో ఈయన కూడా ఈ సినిమా విషయంలో చాలా ఆతృత కనబరుస్తున్నారు. ఇకపోతే తాజాగా మహేష్ బాబు రాజమౌళి సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

గోల్డ్..
తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమాకు సంబంధించి ఓ టైటిల్ సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమా టైటిల్ కూడా అందుకు అనుగుణంగానే ఉండాలి. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం గోల్డ్ అనే టైటిల్ పెట్టబోతున్నారంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఈ సినిమా టైటిల్ గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం వైరల్ అవుతుంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!