Connect with us

Featured

Shirish: శిరీష్ మరణ వార్త మెగా కుటుంబానికి చెప్పాము..కానీ: భరద్వాజ్ తల్లి

Published

on

Shirish: మెగా మాజీ అల్లుడు శిరీష్ భరద్వాజ్ ఇటీవల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించిన సంగతి మనకు తెలిసిందే. మెగాస్టార్ చిన్న కుమార్తె శ్రీజ మొదటి మాజీ భర్త ఆయన ఈయన ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ మరణించారు. 2007వ సంవత్సరంలో శ్రీజ శిరీష్ ఇంట్లో తెలియకుండా ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకున్నారు వీరిద్దరికి ఒక పాప జన్మించిన తర్వాత వారి మధ్య వచ్చిన విభేదాలు కారణంగా విడాకులు తీసుకొని విడిపోయారు.

ఇలా మొదటి భర్తకు విడాకులు ఇచ్చిన శిరీష్ తిరిగి రెండో పెళ్లి చేసుకున్నారు. అయితే ఇప్పుడు రెండో భర్తకు కూడా దూరంగా ఉంటున్నారని తెలుస్తుంది. ఇటీవల తన మొదటి మాజీ భర్త చనిపోవడంతో ఈ విషయం మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే తాజాగా శిరీష్ భరద్వాజ్ తల్లి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా శిరీష్ తల్లి మాట్లాడుతూ.. నా కొడుకు ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నట్లు వార్తలు వచ్చాయి అయితే అవన్నీ తప్పుడు వార్తలని తెలిపారు. తన పుట్టినరోజు మే 13వ తేదీ ఫారెన్ వెళ్లి సెలబ్రేషన్ జరుపుకున్నారు. తిరిగి వచ్చినప్పటి నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండగా అపోలో హాస్పిటల్లో చేర్పించామని, అయితే కార్డియాక్ అరెస్టు కారణంగా తన కుమారుడి చనిపోయినట్లు తెలిపారు.

Advertisement

ఇక శిరీష్ మరణ వార్తను మెగా కుటుంబానికి చెప్పాము కానీ వాళ్ళు ఎవరు రాలేదని ఈమె తెలియజేశారు. ఇక తన మనవరాలు నివృత్తి అచ్చం తన తండ్రి పోలికలతోనే ఉంటుందని తనని చూస్తే నాకు నా కొడుకే గుర్తుకు వస్తారని ఈమె తెలిపారు.. ఎవరికైనా వారి మనవరాలని కలుసుకోవాలని ఉంటుంది నాకు కూడా నివృత్తిని చూడాలని ఉందని ఈమె తెలిపారు.
కార్డియాక్ అరెస్ట్..
ఇక వారిద్దరు ఎందుకు విడిపోయారనే విషయం నాకు తెలియదు కానీ మెగా ఫ్యామిలీ మాకు 33 కోట్లు ఇచ్చిందంటూ కూడా వార్తలు వచ్చాయి . అది పూర్తిగా అవాస్తవమని కొందరు మాకు డబ్బులు ఇప్పిస్తామని చెప్పినా, మాకు వద్దు పాప కోసమే ఉపయోగించమని చెప్పామని ఈ సందర్భంగా శిరీష్ భరద్వాజ్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Chandra Babu: టీడీపీ విజయంలో తెలంగాణ శ్రేణుల కృషి ఎంతో ఉంది: చంద్రబాబు

Published

on

Chandra Babu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటిసారి సీఎం అయిన తర్వాత హైదరాబాద్ కి వెళ్లిన సంగతి మనకు తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీలో రాష్ట్ర విభజన సమయంలో రెండు రాష్ట్రాలకు రావాల్సిన అంశాల గురించి కీలక అంశాల గురించి ప్రస్తావించారు. దాదాపు రెండు గంటల పాటు ఈ భేటీ జరిగింది.

ఇలా చంద్రబాబునాయుడు హైదరాబాద్ కి రావడంతో పెద్ద ఎత్తున టిడిపి కార్యకర్తలు భారీ స్థాయిలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి భాగ్యనగరం మొత్తం పసుపు మయం చేశారు. ఇకపోతే హైదరాబాదులోనే ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు తాజాగా ఎన్టీఆర్ భవన్ కు వెళ్లారు. ఈ క్రమంలోనే అక్కడ పార్టీ నాయకులతో కీలక నేతలతో మాట్లాడి పలు విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. రెండు తెలుగు రాష్ట్రాలు నాకు రెండు కళ్ళతో సమానం అని తెలిపారు. తన విజయానికి టిడిపి శ్రేణులు పరోక్షంగా కృషి చేశారని చంద్రబాబు తెలిపారు. తెలంగాణలో టిడిపికి పూర్వ వైభవం వస్తుందని ఈయన తెలిపారు. రాష్ట్రంలో పార్టీ అధికారంలో లేకపోయినా ఎంతో మంది నాయకులు వేరొక పార్టీలోకి వెళ్లారు కాని కార్యకర్తలు మాత్రం వెళ్లలేదని తెలిపారు.

Advertisement

టీడీపీకి పూర్వ వైభవం..
ఇకపోతే నాలెడ్జ్ ఎకానమీగా హైదరాబాదును తీర్చిదిద్దిన ఘనత టీడీపీదని తెలిపారు. మా పార్టీ తర్వాత వచ్చిన ఇతర పార్టీలు దానిని కొనసాగించాయి తప్ప చెడగొట్టలేదని ఈ విషయంలో బిఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీని అభినందించాలని తెలిపారు .పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని సీఎంగా ఆ రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకు వెళ్తున్నారంటూ చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

YS Jagan: షాకింగ్ న్యూస్.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్న వైయస్ జగన్?

Published

on

YS Jagan: వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత పులివెందుల నియోజకవర్గ ఎమ్మెల్యే వైయస్ జగన్మోహన్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నారంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగిన జగన్మోహన్ రెడ్డి ఈసారి ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయారు.

2019 ఎన్నికలలో ఈయన ఏకంగా 151 స్థానాలలో విజయం సాధించారు. అయితే ఈసారి ఎన్నికలలో కూడా అదే స్థాయిలో తమ విజయం ఉంటుందని భావించిన వైఎస్ జగన్ కు చేదు అనుభవం ఎదురయింది. ఈసారి ఈయన కేవలం 11 అసెంబ్లీ స్థానాలకు మాత్రమే పరిమితం కావలసి వచ్చింది. ఇలా 11 స్థానాలు రావడంతో అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయిందని చెప్పాలి.

ఈ క్రమంలోనే వైయస్ జగన్మోహన్ రెడ్డి తమకు ప్రతిపక్ష హోదా కావాలి అంటూ స్పీకర్ కి లేఖ కూడా రాశారు. ఇక ఈ విషయంపై స్పీకర్ నుంచి ఏ విధమైనటువంటి సమాధానం రాలేదు అయితే ఇటీవల తండ్రి జయంతి ఉత్సవాల కోసం తాడేపల్లి నుంచి వైయస్ జగన్ పులివెందుల చేరుకున్నారు. ఇలా పులివెందులకు వెళ్లినటువంటి ఈయన తన తండ్రి జయంతి వేడుకల సందర్భంగా షాకింగ్ న్యూస్ తెలియజేయబోతున్నారని సమాచారం.

Advertisement

పార్లమెంటుకు వైయస్ జగన్..
కడప ఎంపీగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి తో రాజీనామా చేయించడమే కాకుండా ఈయన కూడా ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఎన్నికలను నిర్వహించి జగన్ ఎంపీగా పోటీ చేసి పార్లమెంటుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అయితే జగన్ ఉన్న ఫలంగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్న రాజకీయ వ్యూహం ఏంటి ఈయన ఎందుకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా పార్లమెంటులో అడుగు పెట్టాలనుకుంటున్నారు అనే విషయంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: బిగ్ బాస్ 8 లోకి మొగలిరేకులు నటుడు ఇంద్రనీల్… సీరియల్ బ్యాచ్ కి పెద్ద పీట!

Published

on

Bigg Boss 8: తెలుగు బుల్లితెరపై ప్రసారం కాబోయే బిగ్ బాస్ కార్యక్రమం కోసం పెద్ద ఎత్తున అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే తెలుగులో ఏడు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం త్వరలోనే ఎనిమిదవ సీజన్ ప్రారంభానికి సిద్ధమవుతుంది. ఈ సీజన్ అనుకున్న సమయాన్ని కంటే ముందుగానే అనగా ఆగస్టులోనే ప్రసారం కాబోతుందని సమాచారం.

ఇలా బిగ్ బాస్ కార్యక్రమం ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి సంబంధించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ సెట్ మొత్తం రెడీ చేస్తూ ఉండగానే మరోవైపు కంటెంట్ల ఎంపిక ప్రక్రియ కూడా జరుగుతోందని తెలుస్తోంది. అయితే ఈసారి సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ సొంతం చేసుకున్న వారితో పాటు ఎక్కువగా సీరియల్స్ వారికే ఛాన్స్ ఇస్తున్నట్టు తెలుస్తుంది.

ఇప్పటికే పలువురు సీరియల్ ఆర్టిస్టుల పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇకపోతే తాజాగా మరొక ఆర్టిస్ట్ పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మొగలిరేకులు వంటి బ్లాక్ బస్టర్ సీరియల్ ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు నటుడు ఇంద్రనీల్. ఈ సీరియల్ లో ఇంద్ర పాత్రలో నటించి పెద్ద ఎత్తున ప్రేక్షకులను మెప్పించారు.

Advertisement

బిగ్ బాస్ కంటెస్టెంట్..
ఇక ఈ సీరియల్ తర్వాత పలు సీరియల్స్ లో నటించిన పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయారు. అయితే ఈయన బిగ్ బాస్ 8 లో పాల్గొనబోతున్నారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. మరి ఇంద్ర బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారంటూ వస్తున్న వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త వైరల్ అవుతుంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!