Connect with us

Movie News

పద్మశ్రీ మోషన్ పోస్టర్ ని విడుదల చేసిన దర్శకులు..!!!

Published

on

వైఫ్ చిత్ర దర్శకులు, రచయిత, నటులు రావిపల్లి రాంబాబు గారి జన్మదినం సందర్భంగా ఆదివారం సాయంత్రం పద్మశ్రీ చిత్ర బృందం ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ సత్కరించింది. ఈ సందర్భంగా రాంబాబు గారు మాట్లాడుతూ “తన అభిమాన ఆత్మీయుడు, అయిన ఎస్. ఎస్. పట్నాయక్ చిత్ర దర్శకునిగా మారడమే కాకుండా సొంతంగా ఎస్.ఎస్.పిక్చర్స్ అంటూ ప్రొడక్షన్ హౌస్ ని స్థాపించడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించింది” అని… ఈ సందర్భంగా పద్మశ్రీ మోషన్ పోస్టర్ ని ఆవిష్కరించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శకులు శివ నాగేశ్వర రావు, దేవి ప్రసాద్, వీరశంకర్, మోహన్ గౌడ్, చిత్తరంజన్, వర్ధమాన నటుడు దినేష్ తదితరులు హాజరయ్యారు.
అందరికీ క్యాచీగా ఉండే పేరు పద్మశ్రీ అని పోస్టర్స్ కూడా ఇన్నోవేటివ్ గా ఉన్నాయని దర్శకులు శివ నాగేశ్వరావు గారు కొనియాడ గా… అంతా కొత్తవారితో చేసిన ప్రయత్నం సక్సెస్ అయితే ఎంతోమంది నూతన నటీనటులకు సాంకేతిక నిపుణులకు గుర్తింపు అవకాశాలు లభిస్తాయని దర్శకులు దేవి ప్రసాద్ గారు తన ఆశాభావాన్ని వ్యక్తపరిచారు! అయితే పద్మశ్రీ అనే టైటిల్ తోనే దర్శక నిర్మాతలు సగం సక్సెస్ సాధించేశారని దర్శకులు వీర శంకర్ గారు కొనియాడారు!

చిత్ర రచయిత, దర్శకుడు ఎస్ఎస్ పట్నాయక్ మాట్లాడుతూ సినిమా ప్రారంభం నుండి ప్రతి విషయానికి ఎందుకు ఏమిటి ఎలా అని ప్రశ్నించకుండా తనపై ఎంతో.. పూర్తి నమ్మకంతో వారి వారి సహాయ సహకారాలు అందిస్తు… ఈ కార్యక్రమానికి హాజరైన చిత్ర ఎడిటర్ కంబాల శ్రీనివాస రావు గారికి, కో ప్రొడ్యూసర్స్ మామిడి సాంబమూర్తి, కొత్తకోట బాలకృష్ణ గార్లకి తన కృతజ్ఞతలు తెలియజేశారు!

Advertisement

ఎస్.ఎస్.పిక్చర్స్ బ్యానర్ పై జ్యోతి, రావిపల్లి సంధ్య, కనిక ఖన్నా, రమ్య, కిషోర్, సతీష్, హర్ష, కాళీ చరణ్, చక్రి, ఫన్నీ రాజు, డా. ప్రవీణ్, జయశ్రీ, ఎస్ ఎస్ పట్నాయక్ ఇలా అంతా వర్ధమాన నటీనటులతో చేసిన ఈ యాక్షన్ ఓరియంటెడ్ హారర్ కామెడీ ఫిలిం పద్మశ్రీ కి నిర్మాత: సదాశివుని శిరీష, ఛాయాగ్రహణం: మేకల నర్సింగరావు, సంగీతం: జాన్ పోట్ల, ఆర్ట్: మణిపాత్రని, ఫైట్స్: దేవరాజు మాస్టర్, డాన్స్ తారక్, వెంకట్, గ్రాఫిక్స్: డాట్ యానిమేషన్ కంపెనీ. డిజిటల్ పబ్లిసిటీ: బి.ఆర్.కె అడ్వర్టైజింగ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ Pvt ltd.  పి ఆర్ ఓ: సతీష్ పాలకుర్తి, పర్వతనేని రాంబాబు

 

 

Advertisement

Continue Reading
Advertisement

Featured

Puri Jagannadh: పూరి జగన్నాథ్ కు పోకిరి కంటే ఆ సినిమా డైలాగ్స్ అంటే అంత ఇష్టమా?

Published

on

Puri Jagannadh: పూరి జగన్నాథ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇలా డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పూరి జగన్నాథ్ ఎన్నో అద్భుతమైన బ్లాక్ బస్టర్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారందరూ కూడా ఈయన డైరెక్షన్ లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న వాళ్ళే.

ఇక పూరి జగన్నాథ్ సినిమాలు చాలా భిన్నంగా ఉంటాయి ఈయన సినిమాలలో హీరోలకు ఇచ్చే ఎలివేషన్ కూడా చాలా భిన్నంగా ఉంటుంది. ఈయన సినిమాలలో హీరోలు అందరూ కూడా కాస్త పొగరుగా ఉండేలాగే చూపిస్తూ ఉంటారు. ఇక ఈయన సినిమాలలో డైలాగ్స్ కూడా భారీ స్థాయిలో పేలుతూ ఉంటాయి. ఇక ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాల ద్వారా ఈయన ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఈయన డైరెక్షన్ చేసిన సినిమాలలో పోకిరి సినిమా మరో లెవల్ అని చెప్పాలి.

ఈ సినిమాలో మహేష్ బాబు నటన ఆయన చెప్పిన డైలాగ్స్ భారీ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇలా ఇంత మంచి సక్సెస్ అందుకున్న ఈ సినిమాలోని డైలాగ్స్ అంటే తనకు పెద్దగా ఇష్టం లేదని పూరి ఓ సందర్భంలో వెల్లడించారు. తనకు పోకిరి సినిమా కంటే బిజినెస్ మాన్ సినిమాలో డైలాగ్స్ అంటే చాలా ఇష్టమని ఈయన తెలిపారు.

Advertisement

బిజినెస్ మాన్..
ఈ సినిమాలో నన్ను కన్ఫ్యూజ్ చేయకండి కన్ఫ్యూజన్లో ఎక్కువగా కొట్టేస్తా అని చెప్పే డైలాగ్స్, ముంబైకి ఉచ్చ పోయించడానికి వచ్చా అంటూ డైలాగ్స్ బారి స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి అయితే ఈ సినిమాలో డైలాగ్స్ అంటేనే తనకు ఇష్టం అంటూ పూరి జగన్నాథ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక పూరి విషయానికొస్తే ప్రస్తుతం ఈయన డబుల్ ఇస్మార్ట్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

Advertisement
Continue Reading

Featured

Tollywood: గన్నవరం చేరుకున్న టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్.. పవన్ తో కీలక భేటీ?

Published

on

Tollywood: టాలీవుడ్ కి సంబంధించిన పలువురు స్టార్ సెలబ్రిటీలందరూ కూడా ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్నారు. వీరంతా నేడు క్యాబినెట్ సమావేశం ముగిసిన తర్వాత ఉప ముఖ్యమంత్రి సినీ నటుడు పవన్ కళ్యాణ్ కలవబోతున్నట్లు తెలుస్తోంది. మరి కాసేపట్లో విజయవాడ క్యాంప్ ఆఫీసులో నిర్మాతలు అందరూ కూడా పవన్ కళ్యాణ్ తో భేటీ కాబోతున్నారు.

ఈ విధంగా టాలీవుడ్ నిర్మాతలు అందరూ కూడా పవన్ కళ్యాణ్ ని కలిసి సినిమా ఇండస్ట్రీలో ఎదురవుతున్న సమస్యలను వివరించబోతున్నారని తెలుస్తుంది. అంతేకాకుండా ఏపీలో ప్రస్తుతం సినిమా టికెట్ల రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి అలాగే స్పెషల్ షోస్ బెనిఫిట్ షోలకు కూడా పరిమితి లేదు. ఈ క్రమంలోనే ఈ అంశాలపై చర్చించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.

గత ప్రభుత్వం సినిమా టికెట్ల రేట్లు భారీగా తగ్గించడమే కాకుండా బెనిఫిట్ షోలకు కూడా అనుమతి లేకుండా చేసింది. ఈ క్రమంలోనే ఈసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో చిత్రపరిశ్రమ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఇక నేడు చిత్ర పరిశ్రమపై ఉన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కోసమే భేటీ కానున్నారని తెలుస్తోంది.

Advertisement

ఇండస్ట్రీ సమస్యలపై చర్చ..
ఇక ఈ భేటీలో భాగంగా ప్రముఖ నిర్మాతలైన దిల్ రాజు, అశ్వినీ దత్, అల్లు అరవింద్, నాగ వంశీ, యార్లగడ్డ సుప్రియ, టిజి విశ్వప్రసాద్, దగ్గుబాటి సురేష్ వంటి వారందరూ కూడా వెళ్లారని తెలుస్తోంది. మరొక మూడు రోజులలో అశ్వినీ దత్ నిర్మాణంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కల్కి సినిమా విడుదల కాబోతుంది అయితే ఈ సినిమా టికెట్ల రేట్లు పెంపు విషయంపై ఇప్పటివరకు ఏపీ ప్రభుత్వము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. ఈ భేటీ అనంతరం కల్కి సినిమా టికెట్ల విషయంలో కూడా క్లారిటీ రాబోతుందని తెలుస్తుంది.

Advertisement
Continue Reading

Featured

Nagarjuna: కొంచమైనా మానవత్వం ఉందా.. ట్రోల్స్ కి గురైన నాగార్జున.. క్షమాపణలు చెప్పిన హీరో!

Published

on

Nagarjuna: సినీ నటుడు అక్కినేని నాగార్జున ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇక నాగార్జున తన సినిమాల వరకు తాను బిజీగా ఉంటారు తప్ప ఇతర విషయాల గురించి పెద్దగా కల్పించుకోరు. అంతేకాకుండా ఈయన సోషల్ మీడియాకి కూడా చాలా దూరంగా ఉంటారు.

ఇలా సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉండే ఈయన అత్యవసరమైతే తప్ప ఆయా సంఘటనలపై స్పందించరు. అయితే తాజాగా సోషల్ మీడియా వేదికగా నాగార్జున భారీ స్థాయిలో ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు. ఇలా ట్రోల్స్ కి గురి కావడంతో వెంటనే నాగార్జున క్షమాపణలు చెబుతూ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

అసలు నాగార్జున క్షమాపణలు చెప్పడం ఏంటి? ఏం జరిగింది అనే విషయానికి వస్తే.. నాగార్జున ఇటీవల ఎయిర్ పోర్ట్ లో కనిపించారు సాధారణంగా సెలబ్రిటీలు ఎవరైనా కనిపిస్తే అభిమానులు వారితో సెల్ఫీ తీసుకోవడం కోసం వెళ్తారు. ఈ క్రమంలోనే ఓ అభిమాని సెల్ఫీ తీసుకోవడం కోసం వెళ్లగా అక్కడ ఉన్న సెక్యూరిటీ ఆయనని తోసేసారు దీంతో ఆ అభిమాని ఒక్కసారిగా కింద పడ్డారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

ఇకపై జరగవు.
ఇక ఈ వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ నాగార్జున పై ట్రోల్ చేశారు. ఇక ఈ వీడియో వైరల్ గా మారడంతో నాగార్జున స్పందించి క్లారిటీ ఇచ్చారు.. ఈ విషయం ఇప్పుడే నా దృష్టికి వచ్చింది అలా ఒక వ్యక్తిని తోయటం సరైంది కాదు ఆ వ్యక్తికి నేను క్షమాపణలు చెబుతున్నాను ఇకపై ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాము అంటూ నాగార్జున ఈ సందర్భంగా క్షమాపణలు చెబుతూ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!