ప్రపంచవ్యాప్తంగా గత రెండు సంవత్సరాల నుంచి ఎంతోమంది ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోగా, మరికొందరు వైరస్ నుంచి బయటపడ్డారు. ఈ వైరస్ నుంచి బయటపడినప్పటికీ కొందరిలో, వివిధ రకాల సమస్యలు తలెత్తుతున్నాయి. కరోనా వైరస్ బారిన పడితే దాని ప్రభావం కేవలం ఊపిరితిత్తుల పైన మాత్రమే కాకుండా, వైరస్ ప్రభావం మన శరీరంలోని అన్ని భాగాలు పై దాడి చేస్తుందని చెప్పవచ్చు. కొందరిలో ఎలాంటి లక్షణాలు లేకుండా కరోనా బారిన పడతారు. అదేవిధంగా మరికొందరు కరోనా నుంచి కోలుకున్న తరువాత అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు.
కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఎక్కువశాతం వృద్ధులు లేదా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, ఊబకాయం, మద్యం పొగ త్రాగే వారు అనేక సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కొందరు కరోనా నుంచి కోలుకున్న తర్వాత తీవ్రంగా ఆయాస పడుతూ ఉంటారు. ఇందుకు గల కారణం కరోనా వైరస్ ఊపిరితిత్తులపై అధిక ప్రభావం చూపడమే.ఈ విధంగా కుచించుకుపోయిన ఊపిరి తిత్తులు సాధారణ స్థితికి చేరుకునే శ్వాసక్రియకు ఏ విధమైనటువంటి ఆటంకం లేకుండా ఉండాలంటే పర్ఫెనిడోన్, నింటెడానిబ్ మందులు ఉపయోగపడతాయి.
కరోనా నుంచి కోలుకున్న మరి కొందరిలో గుండెదడ అధికంగా ఉంటుంది. మన శరీర స్థితి మార్పు జరిగినప్పుడు ఈ విధమైనటువంటి గుండెదడ మనలో ఏర్పడుతుంది. దీనినే ఆర్థోస్టాటిక్ పొష్చీరియల్ టాకీకార్డియా అంటారు. వీరిలో పడుకొని లేవగానే ఉన్నట్టుండి గుండె దడదడా కొట్టుకుంటుంది. ఈ విధమైనటువంటి సమస్యతో బాధపడేవారు బీటా బ్లాకర్లు ఉపయోగపడతాయి. ప్రత్యేకించి గుండె మీద పనిచేసే బ్లాకర్లే వాడుకోవాలి.
Advertisement
మరికొందరు వ్యాధి నుంచి బయట పడిన కూడా తీవ్రమైన దగ్గు సమస్యతో బాధపడుతుంటారు. మీరు మాట్లాడే ప్రతి మాటకు ముందు దగ్గు రావడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఈ విధమైన దగ్గు సమస్యతో బాధపడేవారు యాంటీ హిస్టమిన్ రకం మందులు ఉపయోగపడతాయి. అవసరమైతే ఎన్-అసిటైల్ సిస్టీన్ ఉపయోగించాలి. అదేవిధంగా మరికొందరిలో నీరసం, అలసట, వల్ల నొప్పులు కండరాల నొప్పులు కూడా అధికంగా ఉంటాయి. ఈ విధమైనటువంటి సమస్యలతో బాధపడేవారు పోషక విలువలతో కూడిన ఆహార పదార్థాలను తీసుకొని శరీర వ్యాయామాలు చేయాలని నిపుణులు తెలియజేస్తున్నారు.
Niharika: నిహారిక కొణిదెల పరిచయం అవసరం లేని పేరు. ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీలో నిర్మాతగా నటిగా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు. తన భర్త నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన నిహారిక తిరిగి కెరియర్ పై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే నిర్మాతగా కూడా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు.
ఇక నిహారిక నిర్మాణంలో తెరకెక్కిన కమిటీ కుర్రోళ్ళు సినిమా ఆగస్టు 9వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈమె ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆహాలో ప్రసారమవుతున్న సర్కార్ సక్సెస్ సెలబ్రేషన్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.
ఇక ఈ ప్రోమోలో భాగంగా నిహారిక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ నేను వచ్చేది ఎప్పుడు నెక్స్ట్ సీజనా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సుడిగాలి సుదీర్ రెస్పాండ్ అవుతూ మీకేంటండి మీరు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలూకా అంటూ మాట్లాడారు. అనంతరం పవన్ కళ్యాణ్ విజయం సాధించిన తర్వాత చిరంజీవి ఇంటికి వచ్చి ఆశీర్వాదం తీసుకున్న వీడియో ఎంతలా వైరల్ అయిందో మనకు తెలిసిందే .ఇక ఈ వీడియోని ప్లే చేశారు.
Advertisement
యుద్ధం గెలిచిన రాముడు… ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది అంటూ నిహారికను ప్రశ్నించారు. ఇక నిహారిక ఈ వీడియో గురించి మాట్లాడుతూ యుద్ధం గెలిచిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకు వచ్చినప్పుడు కూడా ఇలాగే ఉండేదేమో అనిపించింది అంటూ తన బాబాయ్ విజయం గురించి నిహారిక మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Anasuya: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు. ఈమె జబర్దస్త్ యాంకర్ గా బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ అందుకొని అనంతరం వెండి తెరపై సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా వెండితెరపై వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న అనసూయ తిరిగి బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఈమె స్టార్ మా లో ప్రసారమవుతున్న కిరాక్ బాయ్స్ కిలాడి లేడీస్ అనే కార్యక్రమంలో సందడి చేస్తున్నారు. ఇలా ఒక వైపు బుల్లితెర కార్యక్రమాలు మరోవైపు వెండితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్న అనసూయ త్వరలోనే సింబా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ఈమె మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఇటీవల కాలంలో మీరు చాలా సినిమాలను రిజెక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది కారణం ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ తాను సినిమాలు రిజెక్ట్ చేస్తున్న మాట నిజమేనని తెలిపారు. నేను ఒక సినిమాలో నటించిన పాత్ర హిట్ అవడంతో తదుపరి సినిమాలలో కూడా అలాంటి పాత్రలలో నటించే అవకాశం వస్తుందని తెలిపారు.
Advertisement
రంగమ్మత్త.. ఇలా ఒక పాత్రలో నటించిన తర్వాత తిరిగి అలాంటి పాత్రలలో నటించిన ప్రేక్షకులు పెద్దగా తీసుకోలేరు ఉదాహరణకు రంగమ్మత్త పాత్ర చాలా హైలెట్ అయింది. తదుపరి అలాంటి పాత్రలు వస్తే నేను చెయ్యను నేను అన్ని చాలా డిఫరెంట్ గా ఉండేలా చేయాలని భావిస్తున్నాను. ఇక ఎక్కువగా తాను గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా అనసూయ గ్లామర్ రోల్ చేయడానికి సై అంటూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Mahesh Babu: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా జరుగబోతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన కూడా తెలియజేయబోతున్నారు.
ఇక ఈ సినిమాలో మహేష్ బాబు చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు మొదటిసారి వర్క్ షాప్ లో కూడా పాల్గొనబోతున్నారని సమాచారం.
ఇప్పటివరకు మహేష్ బాబు ఏ సినిమా కోసం ఇలా వర్క్ షాప్ లో పాల్గొనలేదు మొదటిసారి రాజమౌళి సినిమా కోసం పాల్గొనబోతున్న నేపథ్యంలో ఈయన కూడా ఈ సినిమా విషయంలో చాలా ఆతృత కనబరుస్తున్నారు. ఇకపోతే తాజాగా మహేష్ బాబు రాజమౌళి సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Advertisement
గోల్డ్.. తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమాకు సంబంధించి ఓ టైటిల్ సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమా టైటిల్ కూడా అందుకు అనుగుణంగానే ఉండాలి. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం గోల్డ్ అనే టైటిల్ పెట్టబోతున్నారంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఈ సినిమా టైటిల్ గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం వైరల్ అవుతుంది.