చంద్రబాబు గజదొంగ ! టీడీపీ – జనసేన పొత్తుపై సీఎం వైఎస్‌ జగన్‌ సంచలన వ్యాఖ్యలు !

0
21

టీడీపీ-జనసేన పొత్తుపై సీఎం వైఎస్‌ జగన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్‌ కళ్యాణ్‌ ములాఖత్ లో మిలాఖత్ లు చేసుకున్నారంటూ మండి పడ్డారు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో వైఎస్సార్‌ కాపు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్‌.. కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన అర్హులైన 3,57,844 మందికి రూ.536.77 కోట్ల ఆర్థిక సాయం చేశారు. వైఎస్ఆర్ కాపు నేస్తం నిధులను బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు సీఎం జగన్‌.

చంద్రబాబు అరెస్ట్ పై మాట్లాడుతూ..

ఆపై అవినీతి కేసులో అరెస్టైన మహానుభావుడి గురించి నాలుగు మాటలు చెబుతా అంటూ మొదలు పెట్టిన ఆయన.. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయిడుని ఉద్దేశించి.. “ఇన్ని దొంగ తనాలు చేసినా, ఎన్ని వెన్నుపోట్లు పొడిచినా చంద్రబాబును రక్షించుకునేందుకు దొంగలా ముఠా ఉంది.. కానీ, చట్టం ఎవరికైనా ఒక్కటే.. సామాన్యుడికి ఎలాంటి శిక్ష పడుతుందో రాజకీయ నాయకులకు అదే వర్తిస్తుంది అని చెప్పేవాళ్లు చంద్రబాబుకు లేరు. ఆడియో, వీడియో టేపుల్లో చంద్రబాబు దొంగగా అడ్డంగా దొరికినా కూడా.. దోపిడీ సొమ్ము అని ప్రజలకు అర్థం అయినా కూడా బాబు చేసింది నేరమే కాదని వాదించే వాళ్లు సిద్ధం అయ్యారు.. నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి ఏ ఒక్కరూ రెడీగా లేరు.. చంద్రబాబు దోచిన దాంట్లో వాటదారులు కాబట్టే” అంటూ ఎద్దేవ సీఎం జగన్.

జనసేన, టీడీపీ పొత్తుపై స్పందిస్తూ..

మరో వైపు జనసేన, టీడీపీ పొత్తుపై స్పందిస్తూ.. సాక్ష్యాలు, ఆధారాలు చూసి కోర్టు రిమాండ్ కు పంపినా ప్రశ్నిస్తా, ప్రశ్నిస్తా అన్నవాడు ప్రశ్నించడు.. చంద్రబాబు చేసిన తప్పులు ప్రశ్నించకుండా నేరుగా జైలుకు వెళ్లి ములాఖత్‌లో మిలాఖత్ చేసుకుని పొత్తు పెట్టుకుంటారు.. వారి గురించి ప్రజలు ఆలోచించాలి అంటూ జనసేన, టీడీపీ పొత్తుపై వ్యాఖ్యానించారు సీఎం వైఎస్‌ జగన్‌