Connect with us

Featured

Rajamouli: రాజమౌళిపై విమర్శల జల్లు.. జక్కన్న ఎంటి ఇలా చేస్తున్నాడంటూ..!

Rajamouli: దేశవ్యాప్తంగా ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్న సినిమా ట్రిపుల్ ఆర్. కోవిడ్ కారణాల వల్ల మళ్లీ వాయిదా పడింది. దీంతో సినిమాపై ఎన్నో ఆశలు

Published

on

Rajamouli: దేశవ్యాప్తంగా ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్న సినిమా ట్రిపుల్ ఆర్. కోవిడ్ కారణాల వల్ల మళ్లీ వాయిదా పడింది. దీంతో సినిమాపై ఎన్నో ఆశలు పట్టుకున్న అభిమానులు నిరాశకు లోనయ్యారు. సినిమాను వాయిదా వేస్తున్నట్లు ఇటీవల చిత్ర యూనిట్ అఫీషియల్ గా ప్రకటించింది.

Rajamouli: రాజమౌళిపై విమర్శల జల్లు.. జక్కన్న ఎంటి ఇలా చేస్తున్నాడంటూ..!
Rajamouli: రాజమౌళిపై విమర్శల జల్లు.. జక్కన్న ఎంటి ఇలా చేస్తున్నాడంటూ..!

దీంతో అభిమానులు రాజమౌళితో పాటు చిత్ర యూనిట్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నాలుగు సార్లు ట్రిపుల్ ఆర్ వాయిదా పడటంతో ఫ్యాన్స్ ఊరుకోవడం లేదు. సోషల్ మీడియా వేదికగా ట్రిపుల్ ఆర్ సినిమాపై తెగ ట్రోలింగ్స్, మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. 

Rajamouli: రాజమౌళిపై విమర్శల జల్లు.. జక్కన్న ఎంటి ఇలా చేస్తున్నాడంటూ..!

ఇదిలా ఉంటే ఇండస్ట్రీ పెద్దలు కూడా రాజమౌళిపై గుర్రుగా ఉన్నారు. రాజమౌళి ఎంతసేపు తన సినిమా, కలెక్షన్లు, లాభాల గురించి ఆలోచిస్తున్నారు తప్పితే ఇండస్ట్రీ మంచి కోసం, ఇతర ఇండస్ట్రీ వ్యక్తుల కోసం ఆలోచించడం లేదని ఫైర్ అవుతున్నట్లు సమాచారం. రామ్ చరణ్ తేజ్, ఎన్టీఆర్ లీడ్ క్యారెక్టర్లలో అలియాభట్, ఒలివియా మోరిస్ వీరికి జోడీగా నటిస్తున్న ట్రిపుల్ ఆర్ ను దాదాపు రూ. 450 కోట్లతో నిర్మించారు ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య.

మరోవైపు బాలీవుడ్ స్టార్ అజమ్ దేవ్ గన్ కీలక పాత్రలో నటిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా 14 భాషల్లో విడుదల చేద్దాం అని ముందుగా అనుకున్నప్పటికీ.. కరోనా మరోసారి దెబ్బ తీసింది. కరోనా కారణంగా పలు రాష్ట్రాల్లో థియేటర్లు మూతపడ్డాయి. కొన్ని రాష్ట్రాల్లో కేవలం 50 శాతం ఆక్యుపెన్సీతో నడపాల్సిన పరిస్థితి దీంతోొ సినిమాను మరోసారి వాయిదా వేశారు.

Advertisement

సమ్మర్ సీజన్ లో విడుదల చేద్దాం అని..

ఇప్పటికే ట్రిపుల్ ఆర్ సినిమా కోసం పవన్ భీమ్లానాయక్ విడుదల పోస్ట్ పోన్ అయింది. శివరాత్రి కానుకగా విడుదల చేద్దాం అని అనుకుంటున్నారు భీమ్లా నాయక్ టీం. అయితే ప్రస్తుతం వాయిదా పడిన ఆర్ ఆర్ఆర్ సినిమాను సమ్మర్ సీజన్ లో విడుదల చేద్దాం అని అనుకుంటున్నారు. అయితే సమ్మర్ లో రాజమౌళి సినిమా వస్తే మళ్లీ మూవీల షెడ్యూల్ మొత్తం డిస్ట్రబ్ అవుతుందని సినీ ఇండస్ట్రీ అనుకుంటుంది. ఆర్ ఆర్ఆర్ దెబ్బకు పలు మూవీలు వెనక్కి వెళ్లాల్సి వస్తుండటంతో ట్రిపుల్ ఆర్ టీం పై.. మొత్తం సినిమా ఇండస్ట్రీ కొంత అసహనంతో కనిపిస్తుంది. అయితే నార్త్ మాట ఎలా ఉన్నా.. తెలుగు, తమిళం భాషల్లో సంక్రాంతికి విడుదల అవుతుందనుకున్న ఫ్యాన్స్ కు మాత్రం నిరాశే ఎదురైంది. నార్త్ డిస్ట్రిబ్యూటర్లు సినిమా వాయిదా వేసుకోండని చెప్పడంతోనే మూవీ యూనిట్ తలొగ్గిందనే మాటలు కూడా వినిపిస్తున్నాయి.

Advertisement

Featured

Niharika: యుద్ధం గెలిచిన రాముడు అయోధ్యకు వచ్చినట్టు ఉంది… బాబాయ్ పై నిహారిక కామెంట్స్!

Published

on

Niharika: నిహారిక కొణిదెల పరిచయం అవసరం లేని పేరు. ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీలో నిర్మాతగా నటిగా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు. తన భర్త నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన నిహారిక తిరిగి కెరియర్ పై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే నిర్మాతగా కూడా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇక నిహారిక నిర్మాణంలో తెరకెక్కిన కమిటీ కుర్రోళ్ళు సినిమా ఆగస్టు 9వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈమె ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆహాలో ప్రసారమవుతున్న సర్కార్ సక్సెస్ సెలబ్రేషన్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.

ఇక ఈ ప్రోమోలో భాగంగా నిహారిక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ నేను వచ్చేది ఎప్పుడు నెక్స్ట్ సీజనా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సుడిగాలి సుదీర్ రెస్పాండ్ అవుతూ మీకేంటండి మీరు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలూకా అంటూ మాట్లాడారు. అనంతరం పవన్ కళ్యాణ్ విజయం సాధించిన తర్వాత చిరంజీవి ఇంటికి వచ్చి ఆశీర్వాదం తీసుకున్న వీడియో ఎంతలా వైరల్ అయిందో మనకు తెలిసిందే .ఇక ఈ వీడియోని ప్లే చేశారు.

Advertisement

యుద్ధం గెలిచిన రాముడు…
ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది అంటూ నిహారికను ప్రశ్నించారు. ఇక నిహారిక ఈ వీడియో గురించి మాట్లాడుతూ యుద్ధం గెలిచిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకు వచ్చినప్పుడు కూడా ఇలాగే ఉండేదేమో అనిపించింది అంటూ తన బాబాయ్ విజయం గురించి నిహారిక మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Anasuya: ఇకపై రంగమ్మత్త లాంటి పాత్రలు అసలు చేయను.. గ్లామర్ పాత్రలకు సై అంటున్న అనసూయ?

Published

on

Anasuya: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు. ఈమె జబర్దస్త్ యాంకర్ గా బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ అందుకొని అనంతరం వెండి తెరపై సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా వెండితెరపై వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న అనసూయ తిరిగి బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈమె స్టార్ మా లో ప్రసారమవుతున్న కిరాక్ బాయ్స్ కిలాడి లేడీస్ అనే కార్యక్రమంలో సందడి చేస్తున్నారు. ఇలా ఒక వైపు బుల్లితెర కార్యక్రమాలు మరోవైపు వెండితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్న అనసూయ త్వరలోనే సింబా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ఈమె మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఇటీవల కాలంలో మీరు చాలా సినిమాలను రిజెక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది కారణం ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ తాను సినిమాలు రిజెక్ట్ చేస్తున్న మాట నిజమేనని తెలిపారు. నేను ఒక సినిమాలో నటించిన పాత్ర హిట్ అవడంతో తదుపరి సినిమాలలో కూడా అలాంటి పాత్రలలో నటించే అవకాశం వస్తుందని తెలిపారు.

Advertisement

రంగమ్మత్త..
ఇలా ఒక పాత్రలో నటించిన తర్వాత తిరిగి అలాంటి పాత్రలలో నటించిన ప్రేక్షకులు పెద్దగా తీసుకోలేరు ఉదాహరణకు రంగమ్మత్త పాత్ర చాలా హైలెట్ అయింది. తదుపరి అలాంటి పాత్రలు వస్తే నేను చెయ్యను నేను అన్ని చాలా డిఫరెంట్ గా ఉండేలా చేయాలని భావిస్తున్నాను. ఇక ఎక్కువగా తాను గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా అనసూయ గ్లామర్ రోల్ చేయడానికి సై అంటూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Mahesh Babu: మహేష్ రాజమౌళి సినిమా టైటిల్ లీక్… సినిమా పేరు ఏంటో తెలుసా?

Published

on

Mahesh Babu: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా జరుగబోతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన కూడా తెలియజేయబోతున్నారు.

ఇక ఈ సినిమాలో మహేష్ బాబు చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు మొదటిసారి వర్క్ షాప్ లో కూడా పాల్గొనబోతున్నారని సమాచారం.

ఇప్పటివరకు మహేష్ బాబు ఏ సినిమా కోసం ఇలా వర్క్ షాప్ లో పాల్గొనలేదు మొదటిసారి రాజమౌళి సినిమా కోసం పాల్గొనబోతున్న నేపథ్యంలో ఈయన కూడా ఈ సినిమా విషయంలో చాలా ఆతృత కనబరుస్తున్నారు. ఇకపోతే తాజాగా మహేష్ బాబు రాజమౌళి సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

గోల్డ్..
తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమాకు సంబంధించి ఓ టైటిల్ సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమా టైటిల్ కూడా అందుకు అనుగుణంగానే ఉండాలి. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం గోల్డ్ అనే టైటిల్ పెట్టబోతున్నారంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఈ సినిమా టైటిల్ గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం వైరల్ అవుతుంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!