Kadapa: ఏపీ ఎన్నికల సమరానికి కేవలం వారం రోజులు మాత్రమే గడుపు ఉంది. ఈ క్రమంలోనే ఏపీలో పెద్ద ఎత్తున రాజకీయ చర్చలు మొదలయ్యాయి ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అన్న ఆసక్తి కూడా అందరిలో చాలా నెలకొందని చెప్పాలి. ఇకపోతే కడపలో ఈ రాజకీయ ఆసక్తి మరి కాస్త పెరిగింది అని చెప్పాలి.
కడపలో ఈసారి త్రిముఖ పోటీ ఉండబోతుందని తెలుస్తోంది. కడప పార్లమెంటు నుంచి వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున అవినాష్ రెడ్డి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈయనకు పోటీగా కాంగ్రెస్ పార్టీ నుంచి వైయస్ షర్మిల పోటీకి సిద్ధమయ్యారు.మరో వైపు టీడీపీ అభ్యర్థి కూడా సీరియస్ గా ప్రయత్నం చేస్తున్నారు. అసలు వైఎస్ కుటుంబ పెత్తనం ఏంటి.. తరిమేద్దాం అన్న ఆలోచనలు చెబుతూ ప్రజల్లోకి వెళ్తున్నారు.
ఇక ఇప్పటికే ఎంపిక కొనసాగుతున్నటువంటి అవినాష్ రెడ్డిని ఒక హంతకుడిగా షర్మిల చిత్రీకరిస్తూ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలకు వెళ్తున్నారు అంతేకాకుండా ప్రస్తుతం ల్యాండ్ టైటిలింగ్ చట్టం కింద ప్రతి ఒక్క రైతు పాసు బుక్కుపై జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉండటంతో భూములను కొట్టయేడం కోసమే ఈ చట్టం అమలులోకి తీసుకువచ్చారని పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను చేస్తున్నారు. దీంతో కడపలో కాస్త వ్యతిరేకత కూడా ఏర్పడిందని చెప్పాలి.
Advertisement
ఈ విధంగా కడపలో వైయస్ కుటుంబానికి వ్యతిరేకత వస్తున్నటువంటి తరుణంలో మరోవైపు షర్మిల తన అన్నయ్యలను విమర్శించడమే కాకుండా వివేకానంద రెడ్డి హత్య కేసును తరచూ ప్రస్తావనకు తీసుకువస్తూ తనని ఆశీర్వదించాలని తాను గెలిస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకువస్తానని కేంద్రమంత్రి అవుతాం అంటూ షర్మిల ప్రచార కార్యక్రమాలలో తెలియజేస్తున్నారు.
షర్మిల జగన్ కి షాక్ ఇవ్వబోతోందా.. ఇకపోతే కడపలో తనకు ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని కొంగు చాచీ మీ అందరి ఆడబిడ్డగా అభ్యర్థిస్తున్నాను అంటూ ఈమె సెంటిమెంట్ డైలాగులు కూడా చెప్పారు. ఇలా కొంగుచాచి అభ్యర్థిస్తున్నాను అంటూ ఈమె మాట్లాడటంతో అక్కడ ఉన్నటువంటి మహిళ ఓటర్లందరూ కూడా ఆకర్షితులు అవుతున్నారు ఈ కొంగు సెంటిమెంట్ కనుక వర్క్ అవుట్ అయితే కడపలో అవినాష్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి భారీ షాక్ తప్పదని చెప్పాలి. మరి కొంగు సెంటిమెంట్ ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో తెలియాల్సి ఉంది.
Niharika: నిహారిక కొణిదెల పరిచయం అవసరం లేని పేరు. ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీలో నిర్మాతగా నటిగా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు. తన భర్త నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన నిహారిక తిరిగి కెరియర్ పై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే నిర్మాతగా కూడా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు.
ఇక నిహారిక నిర్మాణంలో తెరకెక్కిన కమిటీ కుర్రోళ్ళు సినిమా ఆగస్టు 9వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈమె ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆహాలో ప్రసారమవుతున్న సర్కార్ సక్సెస్ సెలబ్రేషన్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.
ఇక ఈ ప్రోమోలో భాగంగా నిహారిక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ నేను వచ్చేది ఎప్పుడు నెక్స్ట్ సీజనా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సుడిగాలి సుదీర్ రెస్పాండ్ అవుతూ మీకేంటండి మీరు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలూకా అంటూ మాట్లాడారు. అనంతరం పవన్ కళ్యాణ్ విజయం సాధించిన తర్వాత చిరంజీవి ఇంటికి వచ్చి ఆశీర్వాదం తీసుకున్న వీడియో ఎంతలా వైరల్ అయిందో మనకు తెలిసిందే .ఇక ఈ వీడియోని ప్లే చేశారు.
Advertisement
యుద్ధం గెలిచిన రాముడు… ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది అంటూ నిహారికను ప్రశ్నించారు. ఇక నిహారిక ఈ వీడియో గురించి మాట్లాడుతూ యుద్ధం గెలిచిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకు వచ్చినప్పుడు కూడా ఇలాగే ఉండేదేమో అనిపించింది అంటూ తన బాబాయ్ విజయం గురించి నిహారిక మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Anasuya: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు. ఈమె జబర్దస్త్ యాంకర్ గా బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ అందుకొని అనంతరం వెండి తెరపై సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా వెండితెరపై వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న అనసూయ తిరిగి బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఈమె స్టార్ మా లో ప్రసారమవుతున్న కిరాక్ బాయ్స్ కిలాడి లేడీస్ అనే కార్యక్రమంలో సందడి చేస్తున్నారు. ఇలా ఒక వైపు బుల్లితెర కార్యక్రమాలు మరోవైపు వెండితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్న అనసూయ త్వరలోనే సింబా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ఈమె మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఇటీవల కాలంలో మీరు చాలా సినిమాలను రిజెక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది కారణం ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ తాను సినిమాలు రిజెక్ట్ చేస్తున్న మాట నిజమేనని తెలిపారు. నేను ఒక సినిమాలో నటించిన పాత్ర హిట్ అవడంతో తదుపరి సినిమాలలో కూడా అలాంటి పాత్రలలో నటించే అవకాశం వస్తుందని తెలిపారు.
Advertisement
రంగమ్మత్త.. ఇలా ఒక పాత్రలో నటించిన తర్వాత తిరిగి అలాంటి పాత్రలలో నటించిన ప్రేక్షకులు పెద్దగా తీసుకోలేరు ఉదాహరణకు రంగమ్మత్త పాత్ర చాలా హైలెట్ అయింది. తదుపరి అలాంటి పాత్రలు వస్తే నేను చెయ్యను నేను అన్ని చాలా డిఫరెంట్ గా ఉండేలా చేయాలని భావిస్తున్నాను. ఇక ఎక్కువగా తాను గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా అనసూయ గ్లామర్ రోల్ చేయడానికి సై అంటూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Mahesh Babu: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా జరుగబోతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన కూడా తెలియజేయబోతున్నారు.
ఇక ఈ సినిమాలో మహేష్ బాబు చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు మొదటిసారి వర్క్ షాప్ లో కూడా పాల్గొనబోతున్నారని సమాచారం.
ఇప్పటివరకు మహేష్ బాబు ఏ సినిమా కోసం ఇలా వర్క్ షాప్ లో పాల్గొనలేదు మొదటిసారి రాజమౌళి సినిమా కోసం పాల్గొనబోతున్న నేపథ్యంలో ఈయన కూడా ఈ సినిమా విషయంలో చాలా ఆతృత కనబరుస్తున్నారు. ఇకపోతే తాజాగా మహేష్ బాబు రాజమౌళి సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Advertisement
గోల్డ్.. తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమాకు సంబంధించి ఓ టైటిల్ సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమా టైటిల్ కూడా అందుకు అనుగుణంగానే ఉండాలి. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం గోల్డ్ అనే టైటిల్ పెట్టబోతున్నారంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఈ సినిమా టైటిల్ గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం వైరల్ అవుతుంది.